ఆధ్యాత్మిక వారధి.. అవకాశాల పెన్నిధి
కరీంనగర్ లోక్సభ నియోజకవర్గం అంటేనే ఆధ్యాత్మిక, పర్యాటక ప్రాంతాలకు నెలవు. వేములవాడ రాజన్న, కొండగట్టు అంజన్నను ప్రజలు ఇలవేల్పుగా కొలుస్తారు. అందుకే ఏ గ్రామానికి వెళ్లినా అంజన్న, రాజన్న పేర్లు సాధారణంగా వినిపిస్తుంటాయి.
ప్రత్యేకతల నిలయం కరీంనగర్ లోక్సభ నియోజకవర్గం
భక్తులతో రాజన్న ఆలయ ప్రాంగణం
ఈనాడు డిజిటల్, సిరిసిల్ల: కరీంనగర్ లోక్సభ నియోజకవర్గం అంటేనే ఆధ్యాత్మిక, పర్యాటక ప్రాంతాలకు నెలవు. వేములవాడ రాజన్న, కొండగట్టు అంజన్నను ప్రజలు ఇలవేల్పుగా కొలుస్తారు. అందుకే ఏ గ్రామానికి వెళ్లినా అంజన్న, రాజన్న పేర్లు సాధారణంగా వినిపిస్తుంటాయి. దశాబ్ద కాలంలో నిర్మాణమైన జలాశయాలతో పర్యాటకంగానూ ఈ ప్రాంతం ఆకట్టుకుంటోంది. అభివృద్ధికి ప్రణాళికలు రూపొందించడమే కానీ, పనుల్లో పెద్దగా పురోగతి ఉండటం లేదన్న విమర్శలున్నాయి. కొత్తగా ఎన్నికయ్యే ఎంపీ కేంద్ర ప్రభుత్వం చొరవతో పరిధిలోని ఆధ్యాత్మిక, పర్యాటక ప్రాంతాల అభివృద్ధికి కృషి చేయాల్సిన అవసరం ఉంది. ఈ నేపథ్యంలో నియోజకవర్గ పరిధిలోని ఆయా ప్రాంతాల విశిష్టతలు, అభివృద్ధికి చేపట్టాల్సిన పనులపై కథనం.
కొండగట్టు అంజన్న
అంజన్న ఆలయం ఆధ్యాత్మికంగా, పర్యాటకంగా ఎంతో అభివృద్ధి చెందాల్సి ఉంది. సమీపంలో రైల్వే స్టేషన్ ఉన్నా పెద్దగా రైళ్లు అందుబాటులో లేవు. గత ప్రభుత్వంలో ముఖ్యమంత్రి రూ.100 కోట్లు ప్రకటించడంతో యంత్రాంగం అభివృద్ధికి ప్రతిపాదనలు సిద్ధం చేసే పనిలో ఉండగా, ఇంతలోనే ఎన్నికలు రావడం, ప్రభుత్వం మారడంతో అటకెక్కాయి. గుట్టపై విడిది కేంద్రాల నిర్మాణం చేపట్టాలి. మౌలిక వసతులు మెరుగుపడాల్సి ఉంది. హనుమాన్ చిన్న, పెద్ద జయంతి ఉత్సవాల సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా లక్షలాది మంది భక్తులు వస్తారు. వీరికోసం ప్రత్యేకంగా మాల విరమణ మండపం నిర్మించాల్సి ఉంది. గుట్టపైకి వెళ్లే మెట్ల మార్గం మరమ్మతులు చేయాలి. ఘాట్ రోడ్డును రెండు వరుసలుగా విస్తరించాలి.
కారిడార్ జాడెక్కడ..
రాష్ట్ర ప్రభుత్వం ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలను కలుపుతూ ప్రత్యేక ఆధ్యాత్మిక, పర్యాటక కారిడార్ అభివృద్ధి చేయాలనే ప్రతిపాదన చేసింది. దీనికి కేంద్ర ప్రభుత్వ సాయం తోడైతేనే పూర్తి స్థాయిలో అమలు జరుగుతుంది. దీనిలో ప్రధానంగా ఉమ్మడి మెదక్, కరీంనగర్ జిల్లాలను కలిపే 151.36 కిలోమీటర్ల మనోహరాబాద్-కొత్తపల్లి రైల్వే మార్గం ఉంది. ప్రస్తుతం సిద్దిపేట వరకు రైల్వే మార్గం పూర్తికావడంతో ఇక్కడి వరకు రోజూ ప్యాసింజర్ రైలు పరుగులు తీస్తోంది. ప్రస్తుతం సిద్దిపేట-సిరిసిల్ల మధ్య రైల్వేలైను నిర్మాణ పనులు జరుగుతున్నాయి. ఈ మార్గంలోని కొమురవెల్లి, వేములవాడ, కొండగట్టు పుణ్యక్షేత్రాలను కలుపుతూ ప్రత్యేక కారిడార్ ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదన ఉంది. ఈ రైల్వే మార్గం పూర్తయితే రాష్ట్రం నలుమూలల నుంచి వచ్చేవారు ఈ మూడు ప్రసిద్ధ ఆలయాలతోపాటు బాసర సరస్వతీ, ధర్మపురి లక్ష్మీనర్సింహస్వామి క్షేత్రాలకు వెళ్లడం సులభం అవుతుంది.
వేములవాడ రాజన్న
వేములవాడ చాళుక్యుల కాలం నుంచి వైభవాన్ని సంతరించుకున్న శ్రీరాజరాజేశ్వర దేవస్థానానికి ప్రత్యేక పర్వదినాలు, మేడారం జాతర, శివరాత్రి, శ్రీరామనవమి సమయాల్లో భక్తులు లక్షల్లో వస్తుంటారు. రాష్ట్ర ఆవిర్భావం తర్వాత ఆలయ అభివృద్ధికి ప్రత్యేక అథారిటీని ఏర్పాటు చేశారు. బడ్జెట్లో ప్రత్యేకంగా నిధులు కేటాయిస్తున్నట్లు అప్పటి ప్రభుత్వం ప్రకటించింది. పట్టణానికి రెండువైపులా బాహ్యవలయ రహదారులు, గుడిచెరువు విస్తరణ జరిగింది. అభివృద్ధి పనులు మాత్రం అసంపూర్తిగానే ఉన్నాయి. బద్దిపోచమ్మ ఆలయ విస్తరణకు భూ సేకరణ జరిగినా సౌకర్యాలు కల్పించాల్సి ఉంది. గతేడాదే హైదరాబాద్లోని వీటీఏడీఏ కార్యాలయాన్ని వేములవాడకు మార్చారు. 2019 ఎన్నికల సమయంలో పునరుజ్జీవం, ఆధ్యాత్మిక వారసత్వ వృద్ధి పథకం (ప్రసాద్)లో చేర్చేందుకు హామీలు ఇచ్చినా అమలుకు నోచుకోలేదు. భక్తులు పెరగడంతో ప్రస్తుతం ఉన్న వసతి సదుపాయాలు సరిపోవడం లేదు. సత్రాలు చాలా వరకు శిథిలావస్థకు చేరుకున్నాయి. వీటి మరమ్మతు దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. నాంపల్లిలోని లక్ష్మీనర్సింహస్వామి ఆలయ పరిధిలో విడిది కేంద్రాల ఏర్పాటు కార్యరూపం దాల్చలేదు.
విహార కేంద్రాలుగా జలాశయాలు
ఈ నియోజకవర్గ పరిధిలోనే ఎల్ఎండీ, ఎంఎండీ జలాశయాలు తాగు, సాగు నీటి అవసరాలు తీరుస్తున్నాయి. ఇటు అన్నపూర్ణ జలాశయం పూర్తిగా గుట్టల మధ్యలో ఉండటంతో నీరు నిండుగా ఉన్నప్పుడు పాపికొండలను తలపిస్తోంది. ఈ మూడు జలాశయాలను పర్యాటకంగా, బోటింగ్తో విహార యాత్రలకు కేంద్రాలుగా తీర్చిదిద్దాలి. ఇప్పటికే ఈ జలాశయాల పరిసరాలు లఘు, కొన్ని మధ్య స్థాయి చిత్రాల నిర్మాణాలకు నెలవుగా మారాయి. కేంద్ర ప్రభుత్వ ప్రత్యేక పథకాల్లో వీటిని చేర్చి అభివృద్ధికి కృషి చేయాల్సిన అవసరం ఉంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
విద్యుత్తు సరఫరాలో అంతరాయం
[ 19-05-2024]
మండలంలోని అన్ని గ్రామాల్లో ఆదివారం విద్యుత్తు సరఫరాలో అంతరాయం ఉంటుందని ట్రాన్స్ కో ఏఈ రాజేంద్ర కుమార్ ఓ ప్రకటనలో తెలిపారు. -
వైభవంగా నారసింహుడి చందనోత్సవం
[ 19-05-2024]
ధర్మపురి శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలో జరుగుతున్న శ్రీనృసింహ నవరాత్రి ఉత్సవాల్లో శనివారం స్వామి వారికి చందనోత్సవాన్ని అత్యంత వైభవంగా నిర్వహించారు. -
గ్రూప్-1 పరీక్ష నిర్వహణకు సన్నద్ధం
[ 19-05-2024]
గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్ష ఏర్పాట్లను పకడ్బందీగా చేపట్టాలని, ఎట్టి పరిస్థితుల్లో ఎలక్ట్రానిక్ వస్తువులను పరీక్ష కేంద్రాల్లోకి అనుమతించొద్దని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి అధికారులను ఆదేశించారు. శనివారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో గ్రూప్-1 పరీక్షల ఏర్పాట్లపై అధికారులతో సమీక్షించారు. -
కోడ్ ముగిస్తేనే ప్రగతి వేగిరం
[ 19-05-2024]
లోక్సభ ఎన్నికల కోడ్ అమలులో ఉండటంతో ఉమ్మడి జిల్లాలో అభివృద్ధి పనులు నిలిచిపోయాయి. కరీంనగర్, పెద్దపల్లి ఎంపీ స్థానాల పరిధిలో కలెక్టర్ మొదలు కింది స్థాయి ఉద్యోగి వరకు లోక్సభ ఎన్నికల విధుల్లోనే నిమగ్నం కావడంతో ప్రజా సమస్యలు పేరుకుపోయాయి. -
ముగ్గురు ఉపాధ్యాయుల సస్పెన్షన్
[ 19-05-2024]
చిగురుమామిడి మండలం నవాబుపేట, సైదాపూర్ మండలంలోని తండా ప్రాథమిక పాఠశాలల్లో ఇతరులు నివసిస్తున్న విషయం ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లడంతో ఆ పాఠశాలల్లోని ఎస్జీటీలు ఎ.మంగ, బి.సునీతను సస్పెండ్ చేసినట్లు డీఈవో జనార్దన్రావు శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. -
అర చేతిలోనే కథలు చదివేద్దాం!
[ 19-05-2024]
వేసవి సెలవులను పిల్లలు ఆనందంగా గడుపుతుంటారు. రోజులో కొంత సమయాన్ని నైపుణ్య పెంపు, లేదా వికాస వృద్ధికి కేటాయిస్తే వారి భవిష్యత్తులో ఉపయోగపడుతుంది. ఈ రోజుల్లో ఇంటింటా కంప్యూటర్, ట్యాబ్, స్మార్ట్ఫోన్ ఏదో ఒకటి ఉంటున్న నేపథ్యంలో పఠనా నైపుణ్యాలు పెంచే వెబ్సైట్లు రూపుదిద్దుకున్నాయి. -
జేఎన్టీయూ నాచుపల్లి కళాశాలకు ఐఎస్వో గుర్తింపు
[ 19-05-2024]
కొడిమ్యాల మండలంలోని జేఎన్టీయూ నాచుపల్లి కళాశాల ఐఎస్వో గుర్తింపు పొందినట్లు ప్రిన్సిపల్ డాక్టర్ కామాక్షి ప్రసాద్ తెలిపారు. హైదరాబాద్కు చెందిన హైదరాబాద్ ఇంటర్నేషనల్ సర్టిఫికేషన్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ వారు ఈనెల 15న జేఎన్టీయూ నాచుపల్లి కళాశాలను సందర్శించి సర్టిఫికేషన్ కోసం అవసరమైన రికార్డులను పరిశీలించారు. -
ఎప్సెట్లో మెరిశారు
[ 19-05-2024]
ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ ప్రవేశ పరీక్ష ఫలితాల్లో జిల్లాకు చెందిన విద్యార్థులు మెరిశారు. ఉత్తమ ర్యాంకులు సాధించి తల్లిదండ్రులకు, ఆ ప్రాంతానికి పేరు తీసుకొచ్చారు. -
ప్రేమ పేరుతో మోసం చేసిన యువతిపై కేసు
[ 19-05-2024]
ప్రేమ పేరుతో డబ్బులు దండుకుని మోసం చేసిందని ఓ యువతిపై ఎల్ఎండీ ఠాణాలో కేసు నమోదైంది. పోలీసులు, బాధితుడి తండ్రి వివరాల ప్రకారం.. -
పీహెచ్సీ వైద్య సేవలకు నిరీక్షణ
[ 19-05-2024]
చందుర్తి మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఆసుపత్రి సిబ్బంది అందుబాటులో ఉండటం లేదు. పేరుకు 24 గంటల ఆసుపత్రి అయినా.. కనీసం పగటిపూట కూడా ఎవరూ ఉండటం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. -
రాజన్న క్షేత్రానికి భక్తుల తాకిడి
[ 19-05-2024]
ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన వేములవాడలోని శ్రీ రాజరాజేశ్వరస్వామివారి క్షేత్రానికి శనివారం భక్తుల తాకిడి నెలకొంది. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి భక్తులు స్వామివారి దర్శనానికి తరలి వచ్చారు. -
ఎల్లంపల్లిలో తగ్గిన నీటి మట్టం
[ 19-05-2024]
ఎల్లంపల్లి శ్రీపాదసాగర్ నీటిమట్టం పడిపోయింది. డెడ్ స్టోరేజీకి చేరువైంది. రానున్న కాలంలో తాగునీటికి ముప్పు పొంచి ఉంది. ఇన్ఫ్లో పెద్దగా లేకపోగా ప్రతిరోజు తాగునీటితో పాటు ఎన్టీపీసీకి నీటిని సరఫరా చేయాల్సి ఉండటంతో ఉన్న నిల్వ కొద్ది రోజుల్లోనే ఆవిరయ్యే అవకాశం ఉంది. -
స్కాన్ చేయండి.. నమోదు చేసుకోండి
[ 19-05-2024]
ప్రభుత్వ ఆసుపత్రుల్లో సదుపాయాలు మెరుగుపడటం, వివిధ రకాల వైద్య సేవలు అందుబాటులోకి రావడంతో రోజురోజుకు చికిత్సకు వచ్చే వారి సంఖ్య పెరుగుతోంది. దీంతో ఓపీ నమోదు కోసమే గంటల తరబడి వేచి చూడాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. -
వానాకాలం సాగు ప్రణాళిక ఖరారు
[ 19-05-2024]
జిల్లాలో వానాకాలం పంటల సాగు ప్రణాళికలు రూపుదిద్దుకున్నాయి. నీటి వనరుల ఆధారంగా క్షేత్ర స్థాయిలో వ్యవసాయ అధికారులు రైతుల నుంచి పంటల వివరాలు సేకరించారు. ఏ రకమైన పంటలు, ఎన్ని ఎకరాల్లో సాగు చేస్తారనే అంచనాతో జాబితా సిద్ధం చేశారు. -
మధుర ఫలం.. సమస్యలతో సతమతం
[ 19-05-2024]
మధుర ఫలమైన మామిడిని పండిస్తున్న రైతులకు చేదుఫలితాలే మిగులుతున్నాయి. మన మామిడికాయలకు దేశవ్యాప్తంగా మంచి డిమాండున్నా ఏటికేడు పెరుగుతున్న చీడపీడలకు తోడుగా కాయల విక్రయంలోని సమస్యలను ప్రభుత్వం పరిష్కరించనందున అసంపూర్తిగానే మామిడిసాగును కొనసాగిస్తున్నారు. -
హైరిస్క్లో 52 శాతం మంది
[ 19-05-2024]
జీవనశైలిలో మార్పులతో కుటుంబంలో ఎవరూ ఏ వ్యాధితో బాధపడుతున్నారో తెలియని పరిస్థితి. దీనికి ప్రధాన కారణం మానసిక ఒత్తిడి, ఆరోగ్యంపై శ్రద్ధ చూపకపోవడం. ఆహారపు అలవాట్లలో మార్పులు ప్రజల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి.
తాజా వార్తలు (Latest News)
-
‘బ్లూ ఆరిజిన్’ ప్రయోగం విజయవంతం.. అంతరిక్షయానం చేసిన తొలి తెలుగు వ్యక్తి
-
‘భారతీయుడు 2’ రిలీజ్ డేట్ ఫిక్స్.. ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ లుక్తో అజిత్
-
పీర్జాదిగూడ మేయర్, కార్పొరేటర్ల కిడ్నాప్నకు కాంగ్రెస్ యత్నం: హరీశ్రావు
-
కిల్లర్ టైగర్ కోసం 150 కెమెరాలతో నిఘా.. 36 గ్రామాల్లో రెడ్ అలర్ట్!
-
బహిరంగ సభ మధ్యలోనే వెనుదిరిగిన రాహుల్.. కారణమిదే..
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM