ప్రచార ఉపాధి
జెండాలు వేరైనా జిందాబాద్ పలికే గొంతులు అవే.. కండువాల రంగు వేరైనా అక్కడా, ఇక్కడా ప్రదర్శనగా వెళ్లేది వాళ్లే.. ఒకచోట సభ.. మరో చోట రోడ్షో.. ఇంకో చోట కూడలి సమావేశం.. ఇలా పార్టీ ఏదైనా, పేరేదైనా ప్రచారంలో వాళ్లే ముందుంటున్నారు.
న్యూస్టుడే, కరీంనగర్ పట్టణం, సుభాష్నగర్
జెండాలు వేరైనా జిందాబాద్ పలికే గొంతులు అవే.. కండువాల రంగు వేరైనా అక్కడా, ఇక్కడా ప్రదర్శనగా వెళ్లేది వాళ్లే.. ఒకచోట సభ.. మరో చోట రోడ్షో.. ఇంకో చోట కూడలి సమావేశం.. ఇలా పార్టీ ఏదైనా, పేరేదైనా ప్రచారంలో వాళ్లే ముందుంటున్నారు. ‘ఫలానా అభ్యర్థికి ఓటేయమ’ంటూ నినదిస్తారు. లోక్సభ ఎన్నికల ప్రచారంలో పార్టీ కార్యకర్తల కంటే మహిళలే ఎక్కువగా కనిపిస్తున్నారు. మండుటెండలను సైతం లెక్క చేయకుండా ప్రచార కార్యక్రమాల్లో ముందుంటూ ఉపాధి పొందుతున్నారు.
అతివలే అధికం
రోడ్షోలు, కార్నర్ సమావేశాలు, బహిరంగ సభలు, ఇంటింటి ప్రచారం, పోల్ చీటీల పంపిణీ.. కార్యక్రమాల్లో ఎక్కువగా మహిళలే పాల్గొంటున్నారు. కొద్ది రోజులుగా ఎండలు మండుతుండటంతో ఉదయం 7 గంటల నుంచి 10 గంటల వరకు, సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు అన్ని పార్టీలు ఇంటింటి ప్రచారానికి ప్రాధాన్యమిస్తున్నాయి. బూత్ల వారీగా నిధులతో పాటు ప్రచార సామగ్రి సమకూరుస్తున్నారు. ప్రతి బూత్ పరిధిలో స్వశక్తి సంఘాల ప్రతినిధుల ద్వారా మహిళలను ప్రచారానికి రప్పిస్తున్నారు. ఇంటింటి ప్రచారానికి ఉదయం, సాయంత్రం వేర్వేరుగా డబ్బులు చెల్లిస్తున్నారు.
ఇంటి ఖర్చులకు పనికొస్తాయని..
ఒక్కోసారి ప్రచారానికి రూ.200 నుంచి రూ.300 చెల్లిస్తున్నారు. పార్టీ ముఖ్య నేతలు వచ్చినపుడు మంగళహారతితో స్వాగతం పలికితే రూ.1500 నుంచి రూ.2 వేలు చెల్లిస్తున్నట్లు సమాచారం. ఇక రోడ్షోలకు రూ.300, బహిరంగ సభలకు వెళ్తే రూ.400, వాహనంతో పాటు భోజనం, తాగునీటి వసతి, తిరిగి ఇళ్ల వద్దకు చేర్చడం వంటి సౌకర్యాలు కల్పిస్తున్నారు. ఇళ్లలో పని చేసుకునే మహిళలతో పాటు నిరుపేదలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటున్నారు. ‘వేసవి సెలవుల్లో పిల్లలు ఇంట్లో ఉన్నందున వారి ఖర్చుల కోసం ఉపయోగపడతాయని, ఎండ పెరగకముందే వెళ్లి వస్తున్నా’మని మహిళలు ‘న్యూస్టుడే’కు తెలిపారు. సాధారణంగా కొందరు ఉదయం ఒక పార్టీ తరఫున, సాయంత్రం మరో పార్టీకి మద్దతుగా ప్రచారానికి వెళ్తున్నట్లు వివరించారు.
సభలకు, ర్యాలీలకు పురుషులు
ఎన్నికల ప్రచారంలో భాగంగా పార్టీల అగ్ర నేతలు హాజరయ్యే బహిరంగ సభలకు మాత్రం పురుషులను తీసుకెళ్తున్నారు. బైక్ ర్యాలీలు వంటి వాటికి యువతకు ప్రాధాన్యమిస్తున్నారు. వీరికి కూడా తగినంత చెల్లిస్తున్నారు. బైక్ ర్యాలీకి వెళ్లే వాహనాల్లో పెట్రోల్ కూడా ప్రచార బాధ్యులే పోయిస్తున్నారు. మొత్తం మీద ప్రచార ‘ఉపాధి’ ఈ నెల 11 వరకు కొనసాగనుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కనిపిస్తే కరుస్తున్నాయ్!
[ 20-05-2024]
జిల్లాలో వీధి కుక్కలు బెంబేలేత్తిస్తున్నాయి. వివిధ పనుల నిమిత్తం బయటకు వచ్చేవారిపై దాడికి పాల్పడుతున్నాయి. పగలు, రాత్రి తేడా లేకుండా వీధుల్లో గుంపులుగా తిరుగుతూ బయట ఆడుకునే చిన్నారులతో పాటు వృద్ధులపై దాడులు చేస్తున్నాయి. రాయికల్ పట్టణంలోని ఓ కాలనీలో ఒకే రోజు 11 మందిపై కుక్కలు దాడి చేశాయి. -
సా..గుతున్న అభివృద్ధి పనులు
[ 20-05-2024]
రోజు రోజుకు జనాభా పెరుగుతుండటంతో మేజర్ గ్రామ పంచాయతీగా ఉన్న రాయికల్ను గత ప్రభుత్వం పురపాలక సంఘం హోదా కల్పించి అభివృద్ధి కోసం రూ.25 కోట్లు కేటాయించింది. ఈ నిధుల్లోంచి పెద్ద చెరువుపై మినీ ట్యాంక్బండ్, సమీపంలో ఉద్యానవనం ఏర్పాటుకు రూ.1.5 కోట్లు కేటాయించింది. -
పాఠ్య పుస్తకాలు వస్తున్నాయ్!
[ 20-05-2024]
వచ్చే విద్యా సంవత్సరంలో ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు ఉచిత పాఠ్యపుస్తకాలు త్వరగా అందించేలా ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. గతేడాది పంపిణీలో కొంత జాప్యం జరిగింది. -
పెరిగిన మామిడి దిగుబడి.. తగ్గిన ధర
[ 20-05-2024]
రెండు రోజులుగా కురుస్తున్న అకాల వర్షాలు, ఈదురుగాలులకు మామిడి ధర తగ్గింది. ఏడాది పొడవునా కంటికి రెప్పలా చూసుకునే చెట్లు... సంవత్సరంలో ఒక్కసారి వచ్చే కాతకు సైతం ధర పడిపోవడంతో రైతులు దిగాలు చెందుతున్నారు. -
పేరుకే పెద్ద ఆసుపత్రి!
[ 20-05-2024]
వైద్య విధాన పరిషత్లో నడుస్తున్న కరీంనగర్ జిల్లా ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిని వైద్య కళాశాలకు అనుసంధానం చేసి ఆరు నెలలైంది. ఇప్పటికీ బడ్జెట్ మంజూరు చేయకపోవడంతో పాలనపరమైన ఇబ్బందులు ఎదురవుతున్నాయి. -
నాణ్యతే ప్రామాణికం.. అవగాహనే కీలకం
[ 20-05-2024]
రోజువారీ జీవితంలో లెక్కలు, కొలతలకు ఎంతో ప్రాధాన్యం ఉంది. ఉదయం లేచిన వెంటనే తాగే నీటి నుంచి రాత్రి నిద్రకు ఉపక్రమించే వరకు తీసుకునే ఆహార పదార్థాలు, వినియోగించే పరికరాల నాణ్యతపైనే మన కార్యకలాపాలు ఆధారపడి ఉంటాయి. -
అరచేతిలో వాతావరణ సమాచారం
[ 20-05-2024]
వాతావరణంలోని మార్పులను ఎప్పటికప్పుడు ప్రజలకు చేరవేసేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక యాప్లను రూపొందించింది. ప్రధానంగా వర్షాకాలంలో వీటి ఉపయోగం ఎక్కువగా ఉండనుంది. -
సమయం సమీపిస్తున్నా ఏర్పాట్లేవీ!
[ 20-05-2024]
కొండగట్టులో ఈ నెల 29 నుంచి మూడు రోజుల పాటు హనుమాన్ పెద్ద జయంతి ఉత్సవాలు నిర్వహించనున్నారు. జూన్ 1న హనుమాన్ పెద్ద జయంతి సందర్భంగా రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి దీక్షాపరులు అధిక సంఖ్యలో తరలివస్తారు. మరో పది రోజుల్లో ఉత్సవాలు ప్రారంభంకానున్నా ఆలయంలో ఇంకా ఏర్పాట్లు ప్రారంభంకాలేదు. -
మహిళలకు రక్షణ... వేధింపులకు అడ్డుకట్ట
[ 20-05-2024]
‘ఇటీవల ఓ జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి వైద్యాధికారిణీలపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్నాడన్న ఆరోపణలపై ఫిర్యాదులు రావడంతో విచారణ జరిపిన పోలీసులు ఆయన్ను అరెస్టు చేసి బెయిల్పై విడుదల చేశారు. -
మహాలక్ష్ములతో ఆర్టీసీ కళకళ
[ 20-05-2024]
తెలంగాణలో కాంగ్రెస్ అధికారం చేపట్టిన తర్వాత మహాలక్ష్మి పేరుతో ఆర్టీసీ ఎక్స్ప్రెస్, పల్లెవెలుగు బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం కల్పించింది. గతంలో ఎన్నడూ లేని విధంగా ప్రయాణికుల సంఖ్య గణనీయంగా పెరిగింది. బస్సులన్నీ కళకళలాడుతుండటంతో ఆదాయమూ పెరిగింది. మహాలక్ష్మి పథకం అమల్లోకి వచ్చిన తర్వాత అయిదు నెలల పరిస్థితిపై ‘న్యూస్టుడే’ కథనం. -
కొత్త రేషన్ కార్డులపై ఆశలు
[ 20-05-2024]
‘రేషన్ దుకాణాలు కేవలం దొడ్డు బియ్యం పంపిణీకే పరిమితమయ్యాయి. ఇకపై రాష్ట్రవ్యాప్తంగా సన్నబియ్యంతో సహా నిత్యావసరాలను పేదలకు తక్కువ ధరలకే అందిస్తాం. రైతుల నుంచి పంటలను గిట్టుబాటు ధరకు కొనుగోలు చేసి సహ ఉత్పత్తులు తయారు చేసి పేదలకు పంపిణీ చేస్తాం. -
ప్రధాన రహదారి.. ప్రమాదాలకు నెలవు
[ 20-05-2024]
గౌతమినగర్ నుంచి రాజీవ్ రహదారిని కలిపే ప్రధాన రహదారి నిర్మాణంపై అధికారుల పర్యవేక్షణ కొరవడింది. వెరసి ప్రమాదానికి నెలవుగా మారింది. రామగుండం ఎరువుల కర్మాగారం నుంచి ఎరువులను తీసుకెళ్లే భారీ వాహనాలతో పాటు గోదావరిఖని ప్రాంతం నుంచి ఎన్టీపీసీ తదితర ప్రాంతాలకు వెళ్లే వారికి దగ్గరి దారి కావడంతో ఈ రోడ్డు నిత్యం రద్దీగా ఉంటుంది. -
అర్బన్ బ్యాంక్ ఎన్నికల సన్నాహక సమావేశం
[ 20-05-2024]
సిరిసిల్ల పట్టణంలోని అర్బన్ బ్యాంక్ ఎన్నికల నోటిఫికేషన్ జారీ అయిన నేపథ్యంలో ఎన్నికల్లో గెలుపు కోసం భాజపా జిల్లా కార్యాలయంలో ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు ప్రతాప రామకృష్ణ అధ్యక్షతన నాయకులు ఆదివారం సన్నాహక సమావేశం నిర్వహించారు. -
మద్యం అమ్మకాలపై ఎన్నికల ప్రభావం అంతంతే
[ 20-05-2024]
పార్లమెంటు ఎన్నికల్లో మద్యం విక్రయాలు ప్రభావం చూపలేకపోయాయి. ఎన్నికలు అనగానే మద్యం ఏరులై పారుతుంది. కానీ లోక్సభ ఎన్నికల్లో మాత్రం సాధారణంగా జరిగాయి. ఇందుకు ఆబ్కారీశాఖ అధికారుల లెక్కలే ఉదాహరణ. ఎన్నికల కోడ్ మార్చి 16న ప్రారంభమైంది.
తాజా వార్తలు (Latest News)
-
ఒక్కోసారి ‘వన్ పర్సెంట్’ ఛాన్స్ ఉన్నా చాలు..: విరాట్ కోహ్లీ
-
ఈ వారం థియేటర్/ఓటీటీలో అలరించే చిత్రాలివే!
-
రసకందాయంలో పీర్జాదిగూడ రాజకీయం
-
ప్రారంభమైన ‘టెట్’ ఎగ్జామ్.. పరీక్షా కేంద్రాల వద్ద రద్దీ
-
ఇదీ స్ట్రాంగ్రూమే.. టార్పాలిన్ కప్పి ఉంచిన గదిలో పోస్టల్ బ్యాలట్ పెట్టెలు
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM