పేలుడు కేసులో నిందితుడి అరెస్టు
బ్రూక్ఫీల్డ్ పరిధి రామేశ్వరం కెఫేలో బాంబు పేలుడు నిందితుడు ముజామిల్ షరీఫ్ను అరెస్టు చేశామని జాతీయ తనిఖీ దళం గురువారం రాత్రి ప్రకటించింది.
శకలాల సేకరణలో ఎన్ఐఏ (పాతచిత్రం)
బెంగళూరు (శివాజీనగర), న్యూస్టుడే : బ్రూక్ఫీల్డ్ పరిధి రామేశ్వరం కెఫేలో బాంబు పేలుడు నిందితుడు ముజామిల్ షరీఫ్ను అరెస్టు చేశామని జాతీయ తనిఖీ దళం గురువారం రాత్రి ప్రకటించింది. ఇతనికి సహకరించిన అబ్దుల్ మతీన్ తాహా, మున్సవీర్ షాజిబ్ హుసేన్ల కోసం గాలింపు కొనసాగిస్తున్నట్లు ట్వీట్ చేసింది. ప్రధాన నిందితుడు పేలుడు పదార్థాలను సరఫరా చేసేవాడని అధికారులు పేర్కొన్నారు. భారీ స్థాయిలో పేలుడుకు ప్రణాళిక రూపొందించుకున్నాడని అనుమానిస్తున్నారు. పేలుడు అనంతరం కర్ణాటకలో 12 చోట్ల, తమిళనాడులోని ఐదు చోట్ల, ఉత్తర ప్రదేశ్లోని ఒక చోట ఎన్ఐఏ సోదాలు నిర్వహించింది. కొందరు అనుమానితులు, ప్రధాన నిందితుడికి సహకారం అందించిన వారిని అదుపునకు తీసుకుని విచారణ కొనసాగించింది. కొందరి నివాసాల నుంచి నగదు, డిజిటల్ పరికరాలను ఎన్ఐఏ జప్తు చేసుకుంది.
మరో ఇద్దరి విచారణ: బ్రూక్ఫీల్డులోని రామేశ్వరం కేఫ్లో బాంబు పేలుడుకు సంబంధించి మరో ఇద్దరు అనుమానితులను జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) అధికారులు గురువారం అదుపులోనికి తీసుకున్నారు. పేలుడుకు కారకుడైన నిందితునితో వీరిద్దరికీ ప్రత్యక్ష సంబంధాలు ఉన్నాయని దర్యాప్తు దళం అధికారులు గుర్తించారు. అనుమానిత తీవ్రవాదులతో ప్రత్యక్షంగా, పరోక్షంగా సంబంధాలు ఉన్న వారిపై, టెలిఫోన్ సంభాషణలు, వాట్సప్ చాటింగ్ చేసిన వారిపై నిఘా ఉంచి, దర్యాప్తు కొనసాగించారు. ఇప్పటికే అదుపులోనికి తీసుకుని విచారణ చేస్తున్న వారిలో ఎక్కువ మంది నిషేధిత పీఎఫ్ఐ, ఇతర సంఘాల్లో క్రియాశీలక పాత్రను పోషించారని అధికారులు తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఓటరన్న దిగ్విజయ యాత్ర
[ 27-04-2024]
ప్రజాస్వామ్య పండగలో ఓటర్లు తమ బాధ్యతను విజయవంతంగా నిర్వర్తించారు. -
పోలింగ్.. శాంతియుతం
[ 27-04-2024]
చెదురుమదురు ఘటనలు మినహా 14 లోక్సభ నియోజకవర్గాల్లో పోలింగ్ శాంతియుతంగా ముగిసింది. -
భాజపాది ఖాళీ చెంబు పార్టీ
[ 27-04-2024]
భాజపా ఖాళీ చెంబు పార్టీ. ఖాళీ చెంబుతో రాష్ట్రానికి వచ్చిన ప్రధాని నరేంద్ర మోదీకి ఈ ఎన్నికల్లో తగిన గుణపాఠం చెప్పాలని కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్గాంధీ ఓటర్లకు పిలుపునిచ్చారు. -
పెట్టుబడిదారులకే మోదీ ఊతం
[ 27-04-2024]
రైతుల రుణాలు మాఫీˆ చేయడం కన్నా, శ్రీమంతులు, పారిశ్రామికవేత్తల రుణాలను రద్దు చేయడంపైనే ప్రధానమంత్రి నరేంద్రమోదీకి ఆసక్తి ఎక్కువని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య విమర్శించారు. -
ప్చ్.. నగరం.. తీరు మారలేదు
[ 27-04-2024]
విద్యావంతులు అధికంగా ఉండే బెంగళూరు నగరవాసులు ఆశించిన స్థాయిలో ఓటు హక్కు వినియోగించుకోలేదు. -
సకుటుంబ సమేతంగా..!
[ 27-04-2024]
రాష్ట్రంలో తొలి విడత లోక్సభ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకునేందుకు కీలక నాయకులు తమ కుటుంబ సభ్యులతో కలిసి పోలింగ్ కేంద్రాలకు తరలి వచ్చి సందడి చేయడం ఆసక్తికరంగా సాగింది. -
బౌండరీ దాటిన ఓటు బంతి!
[ 27-04-2024]
లోకసభ ఎన్నికల పోలింగ్ ఘట్టాన్ని క్రీడాకారులు ఆసక్తికరంగా మార్చారు. -
ఎందరో మహానుభావులు..
[ 27-04-2024]
ఎండ తీవ్రత పెరగకనే ఓటేయాలని బెంగళూరు వాసులు ఉత్సాహంగా కదలడం శుక్రవారం ఉదయమే కనిపించింది. -
విధి నిర్వహణలోనే తుదిశ్వాస వదిలి..
[ 27-04-2024]
లోక్సభ ఎన్నికల విధులు నిర్వహిస్తూ ఓ అధికారిణి మృతి చెందిన ఘటన చెళ్లకెర తాలూకాలో శుక్రవారం జరిగింది. -
వేర్వేరు ప్రాంతాల్లో బాలికలపై లైంగికదాడి
[ 27-04-2024]
రాష్ట్రంలోని రెండు వేర్వేరు ప్రాంతాల్లో ఇద్దరు బాలికలపై లైంగిక దాడి దిగ్భ్రాంతి కలిగించింది.
తాజా వార్తలు (Latest News)
-
హెలికాప్టర్లో తూలి పడిపోయిన మమతా బెనర్జీ
-
ట్విటర్ (ఎక్స్)లో అడుగుపెట్టిన కేసీఆర్
-
జైల్లో కేజ్రీవాల్ ఆరోగ్యంగానే..: ఎయిమ్స్ మెడికల్ బోర్డు..!
-
దాదాపు 900 రన్స్ చేశా.. చోటు దక్కకపోతే చాలా బాధపడతా: గిల్
-
ఆలిన్ హెర్బల్ పరిశ్రమలో మళ్లీ వ్యాపించిన మంటలు
-
కారు పల్టీలు కొట్టి, చెట్టుపై ఇరుక్కుపోయి: రోడ్డు ప్రమాదంలో ముగ్గురు భారతీయులు మృతి