గనినాడులో ప్రచార రాజసం
బళ్లారి లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా మైసూరు లోక్సభ అభ్యర్థి యదువీర్ కృష్ణదత్త చామరాజ ఒడెయర్ బళ్లారిలో దళిత మహిళ ఇంటిని సందర్శించారు.
బళ్లారిలో మైసూరు లోక్సభ అభ్యర్థి ప్రచారం
దళిత మహిళ దుర్గమ్మ నివాసంలో కొబ్బరి నీళ్లు తాగుతున్న భాజపా మైసూరు లోక్సభ అభ్యర్థి యదువీర్ కృష్ణదత్త ఒడెయర్
బళ్లారి, న్యూస్టుడే: బళ్లారి లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా మైసూరు లోక్సభ అభ్యర్థి యదువీర్ కృష్ణదత్త చామరాజ ఒడెయర్ బళ్లారిలో దళిత మహిళ ఇంటిని సందర్శించారు. లోక్సభ ఎన్నికల ప్రచారం నిమిత్తం బళ్లారికి వచ్చిన ఒడెయర్కు మాజీ ఎమ్మెల్యే గాలి సోమశేఖర్రెడ్డి, హనుమంతప్ప, తదితరులు స్వాగతం పలికారు. అక్కడి నుంచి నగరంలోని గోనాళ్లోని దళిత మహిళ దుర్గమ్మ ఇంటికి వెళ్లారు. తొలుత ఒడెయర్ రాజ్యాంగ నిర్మాత డా.బి.ఆర్.అంబేడ్కర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. దళిత మహిళ దుర్గమ్మ ఆయనకు కొబ్బరి నీళ్లు ఇచ్చారు. అనంతరం యదువీర్ విలేకరులతో మాట్లాడారు. హంపీ విరూపాక్షేశ్వర దర్శనం కోసం పలుమార్లు హంపీకి వస్తుంటాను. పాఠశాల రోజుల్లో బళ్లారికీ చాలాసార్లు వచ్చాను. ప్రస్తుతం లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా భాజపా అభ్యర్థి బి.శ్రీరాములు తరఫున ఇక్కడి వచ్చానన్నారు. దళితుల ఇంట కొబ్బరి నీళ్లు తాగడం సంతోషంగా ఉందన్నారు. బి.ఆర్.అంబేడ్కర్ రాసిన రాజ్యాంగాన్ని ప్రతి ఒక్కరూ గౌరవించాలన్నారు. మైసూరు మహారాజ కాలంలో రిజర్వేషన్లు తొలగించినట్లు తెలిపారు. నేను అన్ని వర్గాల ప్రజలతో కలిసి ఉంటాను. మన అందరం కన్నడిగులు, భారతీయులం.. ఐకమత్యంగా దేశాభివృధ్ధికి పాటుపడాలన్నారు. మైసూరుతో పాటు రాష్ట్రంలో 28 లోక్సభ నియోజకవర్గాల్లో భాజపా అభ్యర్థులు గెలుపొందుతారన్న విశ్వాసం ఉందన్నారు. దళిత మహిళ దుర్గమ్మ మాట్లాడుతూ మైసూరు రాజవంశీకుడు యదువీర్ మా ఇంటికి రావడం సంతోషంగా ఉందన్నారు. అనంతరం జైన్ మార్కెట్లోని రాజస్థానీ సముదాయ ప్రజలతో ఒడెయర్ సమావేశం నిర్వహించారు.
‘ఈ ఎన్నికలు రాహుల్గాంధీ మనుగడకే’
హొసపేటె: రాహుల్ గాంధీ మనుగడ కోసం ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఈ ఎన్నికలను ఎదుర్కొంటున్నారు. వారికి యువరాజు సంక్షేమం తప్పితే, దేశ సంక్షేమం పట్టదని భారతీయ జనతాపార్టీ యువమోర్చా జాతీయ అధ్యక్షుడు, బెంగళూరు దక్షిణ నియోజకవర్గం అభ్యర్థి తేజస్వీ సూర్య పేర్కొన్నారు. శనివారం సాయంత్రం హొసపేటెలో ఏర్పాటు చేసిన యువసంకల్ప సమావేశాన్ని మైసూరు రాజు యదువీర్ ఒడెయార్తో కలిసి ప్రారంభించి అనంతరం మాట్లాడారు. మరో ఐదేళ్లలో రాహుల్గాంధీ సీనియర్ సిటిజన్గా మారుతారు. అసలే రాజకీయ అనుభవంలేని ఆయన్ను ప్రధాని చేయటానికి నాయకులు, కార్యకర్తలు ఉబలాటపడటం ఆశ్చర్యంగా ఉందని వ్యంగమాడారు. మైసూరు రాజు యదువీర్ ఒడెయార్ మాట్లాడుతూ..మన ధర్మ, సంస్కృతి, వారసత్వాలు కలకాలం ఉండాలంటే అది భాజపాతోనే సాధ్యమని అన్నారు. కార్యక్రమంలో హడగలి ఎమ్మెల్యే కృష్ణానాయక్, జిల్లాధ్యక్షుడు చెన్నబసవనగౌడ, యువమోర్చ రాష్ట్ర కోశాధ్యక్షుడు సిద్ధార్థసింగ్, జిల్లాధ్యక్షుడు కిచిడి కొట్రేశ్ పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
సిట్ అదుపులో దేవరాజేగౌడ
[ 18-05-2024]
భాజపా నాయకుడు, న్యాయవాది దేవరాజేగౌడను ప్రత్యేక దర్యాప్తు దళం (సిట్) అదుపులోనికి తీసుకుంది. హొళెనరసీపుర ఠాణా పోలీసుల విచారణ పూర్తి కావడంతో ఆయనను న్యాయస్థానం ముందు హాజరు పరిచారు. దేవరాజేగౌడ నుంచి మరిన్ని వివరాలను రాబట్టాలని సిట్ తరఫు న్యాయవాది కోరడంతో శనివారం వరకు విచారించేందుకు న్యాయమూర్తి అనుమతించారు. -
అన్నదాతలకు వెన్నుదన్ను
[ 18-05-2024]
కరవు పరిస్థితులతో సమస్యలు ఎదుర్కొంటున్న రైతులకు ఈ ముంగారులో సహకారం అందించాలని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య అధికారులకు సూచించారు. ఎన్నికల నియమావళి జారీలో ఉండడంతో అధికారులతో సమావేశాలు నిర్వహించడానికి సాధ్యం కావడం లేదు. -
కొత్త చట్టాలకు పదును
[ 18-05-2024]
దేశవ్యాప్తంగా ఐపీసీ, సీఆర్పీసీతో పాటు పలు చట్టాల్లో మార్పులు వచ్చాయని నగర పోలీసు కమిషనర్ వి.దయానంద్ వెల్లడించారు. జులై ఒకటి నుంచి ఆ చట్టాలు అమలులోకి వస్తాయని వివరించారు. రాజధాని నగరంలోని ఆడుగోడి దక్షిణ సీఏఆర్ మైదానంలో సిబ్బంది నుంచి ఆయన శుక్రవారం గౌరవ వందనాన్ని అందుకున్నారు. -
ఫోన్ తీయట్లేదని.. చంపేశాడట
[ 18-05-2024]
తన ప్రేమను నిరాకరించిందంటూ హుబ్బళ్లిలో అంజలి (19) అనే యువతిని మూడు రోజుల కిందట హత్య చేసిన నిందితుడు విశ్వ అలియాస్ గిరీశ్ (21) మరో హత్య చేసేందుకు తెగించి.. దొరికిపోయాడు. -
అప్ప విచారణకు చర్యలు?
[ 18-05-2024]
మాజీ ముఖ్యమంత్రి యడియూరప్పను విచారించేందుకు అవకాశం ఇవ్వాలని న్యాయస్థానాన్ని కోరేందుకు కార్ప్స్ ఆఫ్ డిటెక్టివ్ (సీఓడీ) అధికారులు సన్నాహాలు చేసుకుంటున్నారు. -
ప్రజ్వల్ ఎక్కడున్నా రప్పిస్తాం..
[ 18-05-2024]
లైంగిక దౌర్జన్య సంఘటనలకు సంబంధించి హాసన ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణను విదేశాల నుంచి తీసుకొచ్చేందుకు అన్నిరకాల ప్రయత్నాలూ చేస్తున్నట్లు రాష్ట్ర హోం మంత్రి డాక్టర్ జి.పరమేశ్వర్ తెలిపారు. -
కవీంద్రుడి కలల తీరం!
[ 18-05-2024]
అపూర్వం.. అద్భుతం.. అమోఘం.. మహా సుందరం.. అనే పదాలన్నీ అచ్చుగుద్దినట్లు రవీంద్రనాథ్ఠాగూర్ తీరానికి సరిపోతాయి. కార్వార సమీపంలో విస్తరించిన అరేబియా సముద్ర తీరానికి మన కవీంద్రుడి పేరుపెట్టి.. ప్రస్తుతం చక్కగా విస్తరించి పర్యాటకులకు అనువుగా మార్చారు. -
పరిషత్ పోరుకు కూటమి ముందడుగు
[ 18-05-2024]
విధానపరిషత్తు ఎన్నికల్లో భాజపా, జనతాదళ్ కూటమి అభ్యర్థులను గెలిపించుకునేందుకు ఉన్న అన్ని అవకాశాలూ వినియోగించుకోవాలని ఎమ్మెల్సీ టీఏ శరవణ పిలుపునిచ్చారు. భాజపా, జనతాదళ్ నాయకులతో కలిసి జయనగరలోని ఒక హోటల్లో శుక్రవారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. -
తుమకూరు దిశగా మెట్రో చూపులు
[ 18-05-2024]
రాజధాని నగర నాజూకు ప్రయాణ వ్యవస్థ ‘నమ్మ మెట్రో’ ఉత్తర-దక్షిణ కారిడార్ మార్గం రూపుదాల్చుతోంది. ఈ మార్గం పరిధిలో కీలకమైన నాగసంద్ర- అంతర్జాతీయ వస్తు ప్రదర్శన శాల (బీఐఈసీ) మధ్య 3.7 కిలోమీటర్ల ఉపరితల వంతెనపై జులై ఆఖరు నాటికే రైలు పరుగులు తీయనుందని అధికారులు ప్రకటించారు. -
రౌడీషీటరుపై కాల్పులు
[ 18-05-2024]
పేరొందిన రౌడీషీటరు నరసింహమూర్తి అలియాస్ శ్రీనివాస్ అలియాస్ మిట్టెపై దొడ్డబళ్లాపుర పోలీసులు కాల్పులు జరిపి అరెస్టు చేశారు. హేమంత్ కుమార్ గౌడ (27) అనే వ్యక్తిని హత్య సేసి పరారీలో ఉన్న శ్రీనివాస్ యలహంక తాలూకా శ్రీరామనహళ్లి సమీపాన ఉన్నట్లు గుర్తించి పోలీసులు అక్కడికి వెళ్లారు.
తాజా వార్తలు (Latest News)
-
నా మనవడు తప్పు చేస్తే..: ప్రజ్వల్ లైంగిక దౌర్జన్యం కేసుపై దేవెగౌడ స్పందన
-
10 ఏళ్లలో 31వేల కి.మీ రైల్వే మార్గం నిర్మాణం: అశ్వినీ వైష్ణవ్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
తిరుపతి చేరుకున్న సిట్ బృందం.. విచారణ ప్రారంభం
-
ప్రత్యేక ట్రేడింగ్ సెషన్.. సెన్సెక్స్ 88+, నిఫ్టీ @ 22,500
-
సినిమాల కంటే ఎన్నికల ప్రచారమే చాలా కష్టం: కంగనా రనౌత్ ఆసక్తికర పోస్ట్