చెంప చెళ్లుమనిపించిన డీకే
హుబ్బళ్లి కాంగ్రెస్ అభ్యర్థి వినోద్ అసోటి తరఫున సవణూరులో ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ శనివారం రాత్రి ప్రచారాన్ని చేపట్టారు.
హావేరి, న్యూస్టుడే : హుబ్బళ్లి కాంగ్రెస్ అభ్యర్థి వినోద్ అసోటి తరఫున సవణూరులో ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ శనివారం రాత్రి ప్రచారాన్ని చేపట్టారు. ఆయన కారులో నుంచి కిందకు దిగుతున్న డీకేపై స్థానిక పురసభ సభ్యుడు అల్లావుద్దీన్ మనియార్ చేయి వేశారు. కోపగించుకున్న ఉప ముఖ్యమంత్రి ఆయన చెంప చెళ్లుమనిపించి పక్కకు తోశారు. ఈ వీడియోను భాజపా నాయకుడు అమిత్ మాళవీయ తన సామాజిక మాధ్యమం ఖాతాలో వైరల్ చేయడంతో చర్చగా మారింది.
కలబురగి మాదే..
కలబురగి, న్యూస్టుడే : కలబురగి లోక్సభ కాంగ్రెస్ అభ్యర్థి రాధాకృష్ణ భారీ మెజార్టీతో గెలుస్తారని ఎమ్మెల్యే డాక్టర్ అజయ్సింగ్ ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆదివారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. తమ ప్రభుత్వం అమలు చేస్తున్న ఐదు గ్యారంటీ పథకాలే ఓట్లు తీసుకువస్తాయన్న నమ్మకం ఉందన్నారు. సిద్ధరామయ్య ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత కలబురగి విభాగంలో పలు అభివృద్ధి పనులు జోరందుకున్నాయని తెలిపారు.
ఒక అంకె.. దాటదు
బీదర్, న్యూస్టుడే : గత ఎన్నికల్లో పాతిక సీట్లు గెల్చుకున్న భాజపా ఇప్పుడు ఒక అంకె దాటదని రవాణాశాఖ మంత్రి రామలింగారెడ్డి జోస్యం చెప్పారు. తాము 28 స్థానాలు గెలుస్తామని భాజపా ప్రకటించుకోవడం మేకపోతు గాంభీర్యమేనని అన్నారు. ఆయన బీదర్లో ఆదివారం విలేకరులతో మాట్లాడుతూ, ఎన్నికలు వచ్చినప్పుడే మోదీ, షాలకు కర్ణాటక గుర్తుకు వస్తుందని ఎద్దేవా చేశారు. కర్ణాటకకు అన్యాయం జరిగిన ప్రతిసారీ ఇక్కడి నుంచి గెల్చిన ఎంపీలు పార్లమెంటులో గళం విప్పడంలో విఫలమయ్యారని దుయ్యబట్టారు. దేశంలో ప్రధానులు అందరూ కలిసి రూ.54 లక్షల కోట్ల అప్పు చేస్తే, మోదీ ఒక్కరే పదేళ్లలో రూ.130 లక్షల కోట్ల అప్పు చేశారని విమర్శించారు.
నాదే విజయం: ఈశ్వరప్ప
శివమొగ్గ, న్యూస్టుడే : శివమొగ్గలో కాంగ్రెస్ అభ్యర్థికి మద్దతుగా ఆ పార్టీ అగ్రనేత రాహుల్గాంధీ ప్రచారం చేసి వెళ్లినప్పటికీ నా విజయావకాశాలు క్షీణించవని భాజపా తిరుగుబాటు అభ్యర్థి కేఎస్ ఈశ్వరప్ప ధీమా వ్యక్తం చేశారు. ఈ ఎన్నికల్లో తనను ఓడించేందుకు కాంగ్రెస్, భాజపా మధ్య రహస్య ఒప్పందం కుదిరిందని ఆరోపించారు. తనను కలుసుకున్న విలేకరులతో ఆయన మాట్లాడుతూ తన కుమారునికి టికెట్ రాకుండా మాజీ ముఖ్యమంత్రి యడియూరప్ప కుటుంబమే అడ్డుకుందన్నారు. ఇప్పటి వరకు నిర్వహించిన ప్రచారంలో ఓటర్ల నుంచి చక్కని స్పందన లభించిందన్నారు.
అచ్ఛేదిన్ అంటే..
బెంగళూరు (శివాజీనగర), న్యూస్టుడే : అచ్ఛేదిన్ అంటే దుబారీ, మోదీ అంటే మఖ్మల్ టోపీ అని కర్ణాటక కాంగ్రెస్ ఎద్దేవా చేసింది. గత పదేళ్లలో పెరిగిన ధరల గ్రాఫుతో తన ఎక్స్కార్ప్ ఖాతాలో ఆయా వస్తువుల ధరలను పేర్కొంటూ భాజపా తీరును తూర్పారబట్టింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
సిట్ అదుపులో దేవరాజేగౌడ
[ 18-05-2024]
భాజపా నాయకుడు, న్యాయవాది దేవరాజేగౌడను ప్రత్యేక దర్యాప్తు దళం (సిట్) అదుపులోనికి తీసుకుంది. హొళెనరసీపుర ఠాణా పోలీసుల విచారణ పూర్తి కావడంతో ఆయనను న్యాయస్థానం ముందు హాజరు పరిచారు. దేవరాజేగౌడ నుంచి మరిన్ని వివరాలను రాబట్టాలని సిట్ తరఫు న్యాయవాది కోరడంతో శనివారం వరకు విచారించేందుకు న్యాయమూర్తి అనుమతించారు. -
అన్నదాతలకు వెన్నుదన్ను
[ 18-05-2024]
కరవు పరిస్థితులతో సమస్యలు ఎదుర్కొంటున్న రైతులకు ఈ ముంగారులో సహకారం అందించాలని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య అధికారులకు సూచించారు. ఎన్నికల నియమావళి జారీలో ఉండడంతో అధికారులతో సమావేశాలు నిర్వహించడానికి సాధ్యం కావడం లేదు. -
కొత్త చట్టాలకు పదును
[ 18-05-2024]
దేశవ్యాప్తంగా ఐపీసీ, సీఆర్పీసీతో పాటు పలు చట్టాల్లో మార్పులు వచ్చాయని నగర పోలీసు కమిషనర్ వి.దయానంద్ వెల్లడించారు. జులై ఒకటి నుంచి ఆ చట్టాలు అమలులోకి వస్తాయని వివరించారు. రాజధాని నగరంలోని ఆడుగోడి దక్షిణ సీఏఆర్ మైదానంలో సిబ్బంది నుంచి ఆయన శుక్రవారం గౌరవ వందనాన్ని అందుకున్నారు. -
ఫోన్ తీయట్లేదని.. చంపేశాడట
[ 18-05-2024]
తన ప్రేమను నిరాకరించిందంటూ హుబ్బళ్లిలో అంజలి (19) అనే యువతిని మూడు రోజుల కిందట హత్య చేసిన నిందితుడు విశ్వ అలియాస్ గిరీశ్ (21) మరో హత్య చేసేందుకు తెగించి.. దొరికిపోయాడు. -
అప్ప విచారణకు చర్యలు?
[ 18-05-2024]
మాజీ ముఖ్యమంత్రి యడియూరప్పను విచారించేందుకు అవకాశం ఇవ్వాలని న్యాయస్థానాన్ని కోరేందుకు కార్ప్స్ ఆఫ్ డిటెక్టివ్ (సీఓడీ) అధికారులు సన్నాహాలు చేసుకుంటున్నారు. -
ప్రజ్వల్ ఎక్కడున్నా రప్పిస్తాం..
[ 18-05-2024]
లైంగిక దౌర్జన్య సంఘటనలకు సంబంధించి హాసన ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణను విదేశాల నుంచి తీసుకొచ్చేందుకు అన్నిరకాల ప్రయత్నాలూ చేస్తున్నట్లు రాష్ట్ర హోం మంత్రి డాక్టర్ జి.పరమేశ్వర్ తెలిపారు. -
కవీంద్రుడి కలల తీరం!
[ 18-05-2024]
అపూర్వం.. అద్భుతం.. అమోఘం.. మహా సుందరం.. అనే పదాలన్నీ అచ్చుగుద్దినట్లు రవీంద్రనాథ్ఠాగూర్ తీరానికి సరిపోతాయి. కార్వార సమీపంలో విస్తరించిన అరేబియా సముద్ర తీరానికి మన కవీంద్రుడి పేరుపెట్టి.. ప్రస్తుతం చక్కగా విస్తరించి పర్యాటకులకు అనువుగా మార్చారు. -
పరిషత్ పోరుకు కూటమి ముందడుగు
[ 18-05-2024]
విధానపరిషత్తు ఎన్నికల్లో భాజపా, జనతాదళ్ కూటమి అభ్యర్థులను గెలిపించుకునేందుకు ఉన్న అన్ని అవకాశాలూ వినియోగించుకోవాలని ఎమ్మెల్సీ టీఏ శరవణ పిలుపునిచ్చారు. భాజపా, జనతాదళ్ నాయకులతో కలిసి జయనగరలోని ఒక హోటల్లో శుక్రవారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. -
తుమకూరు దిశగా మెట్రో చూపులు
[ 18-05-2024]
రాజధాని నగర నాజూకు ప్రయాణ వ్యవస్థ ‘నమ్మ మెట్రో’ ఉత్తర-దక్షిణ కారిడార్ మార్గం రూపుదాల్చుతోంది. ఈ మార్గం పరిధిలో కీలకమైన నాగసంద్ర- అంతర్జాతీయ వస్తు ప్రదర్శన శాల (బీఐఈసీ) మధ్య 3.7 కిలోమీటర్ల ఉపరితల వంతెనపై జులై ఆఖరు నాటికే రైలు పరుగులు తీయనుందని అధికారులు ప్రకటించారు. -
రౌడీషీటరుపై కాల్పులు
[ 18-05-2024]
పేరొందిన రౌడీషీటరు నరసింహమూర్తి అలియాస్ శ్రీనివాస్ అలియాస్ మిట్టెపై దొడ్డబళ్లాపుర పోలీసులు కాల్పులు జరిపి అరెస్టు చేశారు. హేమంత్ కుమార్ గౌడ (27) అనే వ్యక్తిని హత్య సేసి పరారీలో ఉన్న శ్రీనివాస్ యలహంక తాలూకా శ్రీరామనహళ్లి సమీపాన ఉన్నట్లు గుర్తించి పోలీసులు అక్కడికి వెళ్లారు.
తాజా వార్తలు (Latest News)
-
ఆ ముగ్గురిని జిల్లా దాటించారు!
-
తెదేపాకు ఓటేశామని.. ఉపాధి పనులు నిలిపివేశారు
-
నోటు తీసుకున్నోళ్లు బటన్ నొక్కలేదే!
-
పెళ్లికి నిరాకరించిందని పగ.. కాళ్లు పట్టుకున్నా కనికరించని కక్ష
-
10 నిమిషాలకో బస్సు.. మెట్రోలేని మార్గాల్లో నడిపేందుకు యోచన
-
శస్త్రచికిత్సలో అపశ్రుతి.. యువతి చనిపోయినా చెప్పకుండా దాచిన వైద్యులు