వనమాకు ఝలక్..!
శాసనసభ ఎన్నికలకు సమయం సమీపిస్తున్న వేళ.. కొత్తగూడెం రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. సిట్టింగ్ సీటు తనకే దక్కుతుందంటూ ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు ధీమాతో ఉండగా..
ఈటీవీ - ఖమ్మం : శాసనసభ ఎన్నికలకు సమయం సమీపిస్తున్న వేళ.. కొత్తగూడెం రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. సిట్టింగ్ సీటు తనకే దక్కుతుందంటూ ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు ధీమాతో ఉండగా.. భారాస అధిష్ఠానం తనవైపే మొగ్గు చూపుతుందని మాజీ ఎమ్మెల్యే జలగం వెంకట్రావు ఆశాభావం వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో హైకోర్టు మంగళవారం ఇచ్చిన సంచలన తీర్పు చర్చనీయాంశంగా మారింది. ఎన్నికల అఫిడవిట్లో తప్పుడు వివరాలు పొందుపరిచిన వనమా వెంకటేశ్వరరావుపై అనర్హత వేటు వేసి.. తనను ఎమ్మెల్యేగా ప్రకటించాలన్న జలగం వెంకట్రావు అభ్యర్థనను హైకోర్టు అంగీకరించి వనమాను అనర్హుడిగా ప్రకటించడమే కాకుండా 2018 నుంచి జలగం వెంకట్రావునే ఎమ్మెల్యేగా గుర్తిస్తున్నట్లు తీర్పు ఇవ్వటంతో సరికొత్త రాజకీయాలకు కొత్తగూడెం నియోజకవర్గం వేదిక కాబోతోంది.
వెంకట్రావుకు ఊరట..
హైకోర్టు తీర్పుతో కొత్తగూడెంలో రాజకీయ సమీకరణాలు ఆసక్తికరంగా మారాయి. నాలుగైదు నెలల్లోనే అసెంబ్లీ ఎన్నికలు రాబోతున్నాయి. ఈ పరిస్థితుల్లో హైకోర్టు తీర్పుతో వనమా వెంకటేశ్వరరావుకు గట్టి ఎదురుదెబ్బ తగలగా జలగం వెంకట్రావుకు ఊరట దక్కింది. తెరాస నుంచి పోటీ చేసిన జలగం వెంకట్రావు.. ఓటమి తర్వాతా అదే పార్టీ (ప్రస్తుత భారాస)లో కొనసాగుతూ వస్తున్నారు. నియోజకవర్గ రాజకీయాలకు దూరంగా ఉన్నప్పటికీ అనుచరులు, కార్యకర్తలను తరచూ కలుస్తున్నారు. రాబోయే ఎన్నికల్లో సిట్టింగులకే మళ్లీ సీటు ఇస్తామని భారాస అధినేత కేసీఆర్ ప్రకటించారు. ఇద్దరు నేతలూ ప్రస్తుతం భారాసలోనే ఉండటంతో కొత్తగూడెం నియోజకవర్గంలో అధికార పార్టీ రాజకీయాలు ఉత్కంఠ రేపుతున్నాయి. రాబోయే ఎన్నికల్లో అధిష్ఠానం ఎవరి అభ్యర్థిత్వంపై మొగ్గుచూపుతుందన్న అంశంపై అధికార పార్టీలో జోరుగా చర్చలు సాగుతున్నాయి. హైకోర్టు తీర్పుతో కొత్తగూడెం నియోజకవర్గంలో జలగం వర్గీయులు, భారాస కార్యకర్తలు సంబరాలు చేసుకున్నారు. హైకోర్టు తీర్పుపై వనమా వర్గీయులు, భారాస ముఖ్యనాయకులు కొత్తగూడెంలో సమావేశమై సమాలోచనలు జరిపారు. కార్యకర్తలెవరూ అధైర్యపడొద్దని, తీర్పుపై సుప్రీంకోర్టులో అప్పీల్ చేద్దామని చెప్పారు.
ఇదీ నేపథ్యం..
2018 అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్ర సమితి అభ్యర్థిగా జలగం వెంకట్రావు బరిలోకి దిగారు. కాంగ్రెస్ అభ్యర్థిగా వనమా వెంకటేశ్వరరావు పోటీ చేశారు. వనమాకు 81,118 ఓట్లు, వెంకట్రావుకు 76,979 ఓట్లు దక్కాయి. జలగంపై 4,139 మెజారిటీతో వనమా గెలుపొందారు. రెండో స్థానంలో జలగం నిలిచారు. ఎన్నికలు జరిగిన కొద్దిరోజులకే 2019 జనవరిలో హైకోర్టును వెంకట్రావు ఆశ్రయించారు. ఎన్నికల అఫిడవిట్లో వనమా తప్పుడు సమాచారమిచ్చారని.. కొంత సమాచారాన్ని ఉద్దేశపూర్వకంగా దాచిపెట్టారని పేర్కొన్నారు. ఆ తర్వాత జరిగిన రాజకీయ పరిణామాలతో వనమా వెంకటేశ్వరరావు ముఖ్యమంత్రి కేసీఆర్ సమక్షంలో అధికార పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. అయినా జలగం వెంకట్రావు న్యాయపోరాటం ఆపలేదు. 2019 మార్చి 18న జలగం పిటిషన్ను విచారణకు హైకోర్టు స్వీకరించింది. అప్పటి నుంచి వాద, ప్రతివాదనలు కొనసాగుతూనే ఉన్నాయి. సుదీర్ఘంగా పోరాటం చేస్తున్నా తుది తీర్పు రాకపోవడంతో జలగం వెంకట్రావు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. అత్యున్నత న్యాయస్థానం జోక్యం చేసుకుని త్వరితగతిన తీర్పు ఇవ్వాలని హైకోర్టును ఆదేశించింది. దాదాపు నాలుగున్నరేళ్ల తర్వాత హైకోర్టు తీర్పు వెలువరించింది. వనమా వెంకటేశ్వరావును ఎమ్మెల్యేగా అనర్హుడిగా తేల్చుతూ రెండోస్థానంలో ఉన్న జలగం వెంకట్రావును విజేతగా ప్రకటించడంతో సుదీర్ఘ నిరీక్షణకు తెరపడింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
దోపిడీ, సామాజిక వివక్షపై ఉద్యమించాలి: తమ్మినేని
[ 20-05-2024]
సుందరయ్య స్ఫూర్తితో సామాజిక వివక్ష, దోపిడీ నిర్మూలనపై ఉద్యమించాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. సుజాతనగర్ సీపీఎం పార్టీ కార్యాలయం సత్యం భవన్లో సుందరయ్య వర్ధంతి సభ నిర్వహించారు. -
ఒక ఉపకేంద్రం 20 నియంత్రికల ధ్వంసం
[ 20-05-2024]
కొందరు దొంగలు సొత్తు కోసం వ్యవసాయ పొలాల్లోని విద్యుత్తు నియంత్రికలనూ వదలడం లదు. ఇలాంటి ఘటనలు నిత్యకృత్యమయ్యాయి. -
చికిత్స పొందుతూ యువకుడి మృతి
[ 20-05-2024]
ప్రమాదంలో తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతూ యువకుడు మృతి చెందిన సంఘటనపై రఘునాథపాలెం పోలీసు స్టేషన్లో ఆదివారం కేసు నమోదైంది. -
లాభాల లహరి
[ 20-05-2024]
టీఎస్ ఆర్టీసీ ప్రయాణికులకు మెరుగైన, సౌకర్యవంతమైన సేవలు అందిస్తూనే సంస్థ అభివృద్ధిపై దృష్టి సారిస్తోంది. ప్రైవేటుతో పోటీపడుతూ అధునాతన సదుపాయాలను తీసుకొస్తోంది. -
భూసార పరీక్షలు కొందరికే
[ 20-05-2024]
ఇష్టారీతి రసాయనిక ఎరువుల వినియోగంతో సాగు భూమి సారం కోల్పోయి నిర్జీవంగా మారుతుంది. పంట భూమిలో నత్రజని, భాస్వరం, సేంద్రియ కర్బనాల్లాంటి పోషకాలు ఎంత మోతాదులో ఉన్నాయో భూసార పరీక్షల ద్వారా తెలుసుకుని -
ప్రభుత్వ కళాశాలల్లో ప్రవేశాల పెంపుపై దృష్టి
[ 20-05-2024]
ప్రభుత్వ, ప్రైవేటు జూనియర్ కళాశాలల్లో ప్రవేశాలకు ఇంటర్మీడియట్ బోర్డు నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇప్పటికే దరఖాస్తుల స్వీకరణ ప్రారంభించారు. ఈ నేపథ్యంలో ప్రవేశాల సంఖ్య పెంపుపై జిల్లా అధికారులు దృష్టిపెట్టారు. -
బతుకుజీవుడా..
[ 20-05-2024]
జాతీయ, రాష్ట్రీయ రహదారులపై వాహనాలు వేగంగా దూసుకెళ్తుంటాయి. ప్రధాన మార్గాల్లో రాత్రివేళల్లోనూ రద్దీ ఎక్కువగా ఉంటుంది. ఈ క్రమంలో వేసవిలో రోడ్లపై కొనసాగుతున్న పశు సంచారం రోడ్డు ప్రమాదాలకు కారణమవుతోంది. -
పేదల కష్టసుఖాల్లో పాలుపంచుకుంటా: మంత్రి పొంగులేటి
[ 20-05-2024]
ప్రతి పేదింటి కష్టసుఖాలను పంచుకుంటానని, అభివృద్ధిని చేతల్లో చూపుతానని రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. -
కమ్యూనిస్టులతోనే సామాజిక న్యాయం: శైలజ టీచర్
[ 20-05-2024]
దేశంలో కమ్యూనిస్టులతోనే సామాజిక న్యాయం సాధ్యమైందని కేరళ ఆరోగ్య శాఖ మాజీ మంత్రి, ఎమ్మెల్యే శైలజ టీచర్ అన్నారు. -
మెలికలు తిరుగుతూ.. మెరికలుగా మారుతూ..
[ 20-05-2024]
జిమ్నాస్టిక్స్లో ప్రావీణ్యం సాధించాలంటే ఖమ్మం సర్దార్ పటేల్ స్టేడియానికి రావాల్సిందే. సాధన చేసే క్రీడాకారులపై ఆర్థిక భారం ఉండదు. సాధన కేంద్రమైన జిమ్నాజియం ఏర్పాటు రూ.కోట్ల ఖర్చుతో కూడుకున్నది. -
రాములోరికి పసిడి పుష్పార్చన
[ 20-05-2024]
భద్రాచలం రామాలయంలో ఆదివారం భక్తుల రద్దీ నెలకొంది. కోవెల పరిసరాలు కిక్కిరిసిపోయాయి. మూలవిరాట్కు అర్చకులు సుప్రభాతం పలికి ఆరాధించారు. -
‘భాజపాతో ప్రజాస్వామ్య వ్యవస్థకే ప్రమాదం’
[ 20-05-2024]
భాజపాతో ప్రజాస్వామ్య వ్యవస్థకే ప్రమాదమని సీపీఐఎంఎల్ మాస్లైన్ రాష్ట్ర కార్యదర్శి పోటు రంగారావు ఆరోపించారు. సీపీఐఎంఎల్ మాస్లైన్ జిల్లా స్థాయి రాజకీయ శిక్షణ తరగతులు ఆదివారం వైరాలోని అమరవీరుల నగర్లో నిర్వహించారు.
తాజా వార్తలు (Latest News)
-
ఒక్కోసారి ‘వన్ పర్సెంట్’ ఛాన్స్ ఉన్నా చాలు..: విరాట్ కోహ్లీ
-
ఈ వారం థియేటర్/ఓటీటీలో అలరించే చిత్రాలివే!
-
రసకందాయంలో పీర్జాదిగూడ రాజకీయం
-
ప్రారంభమైన ‘టెట్’ ఎగ్జామ్.. పరీక్షా కేంద్రాల వద్ద రద్దీ
-
ఇదీ స్ట్రాంగ్రూమే.. టార్పాలిన్ కప్పి ఉంచిన గదిలో పోస్టల్ బ్యాలట్ పెట్టెలు
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM