గంజాయి పేరెత్తకుండా
ఏపీ సరిహద్దునున్న మన్యం జిల్లా భద్రాద్రి కొత్తగూడెంలో కొంతకాలంగా గంజాయి ఎక్కువగా పట్టుబడుతోంది. రవాణా, విక్రయ ఘటనల్లో చిక్కే నిందితుల్లో ఎక్కువ మంది యువతే కావడం ఆందోళనకరం.
గంజాయిని దహనం చేస్తున్న పోలీసులు
కొత్తగూడెం నేరవిభాగం, న్యూస్టుడే: ఏపీ సరిహద్దునున్న మన్యం జిల్లా భద్రాద్రి కొత్తగూడెంలో కొంతకాలంగా గంజాయి ఎక్కువగా పట్టుబడుతోంది. రవాణా, విక్రయ ఘటనల్లో చిక్కే నిందితుల్లో ఎక్కువ మంది యువతే కావడం ఆందోళనకరం. కొందరు విద్యార్థులు సైతం పోలీసులకు పట్టుబడుతున్నారు. ఓ వైపు ఎన్నికలు, ఐపీఎల్ మ్యాచ్లు జరుగుతుండటం, ఇంకోవైపు వేసవి సెలవులు కావడంతో చాపకింద నీరులా గంజాయి ముఠా రెచ్చిపోయే అవకాశం ఉంది. అక్రమార్కులను కట్టడి చేసేందుకు.. మత్తు పదార్థాల రహిత జిల్లా లక్ష్యం చేరేందుకు ఎస్పీ బి.రోహిత్రాజు తాజాగా ప్రత్యేక కార్యాచరణ రూపొందించారు. గంజాయి తరలించేందుకు అక్రమార్కులు ఎంచుకున్న మార్గాలు, సాధనాలు, బ్లాక్స్పాట్స్ను గుర్తించేందుకు ఇప్పటికే బృందాలు రంగంలోకి దిగాయి. మొత్తం 28 పోలీస్ స్టేషన్లలోని అడ్డాల నిర్మూలనే వీటి ప్రధాన లక్ష్యం. ఇప్పటికే జిల్లాలోని హాట్స్పాట్లను గుర్తించి తనిఖీలు విస్తృతం చేసిన పోలీసు బృందాలు, వీలైతే పీడీ యాక్టు అస్త్రం ప్రయోగించనున్నాయి.
రవాణా మార్గాలపై నిఘా కన్ను
హైదరాబాద్, మహారాష్ట్ర, బిహార్ ప్రాంతాలకు ఏపీ వైపు నుంచి గంజాయి తరలించేందుకు ఖమ్మం, ఇల్లెందు, కొత్తగూడెం మార్గాలను ముఠాలు ఎంచుకుంటున్నాయి. చాలామంది యువత స్పోర్ట్స్ బైక్లు, ప్రైవేటు కార్లు, ప్రైవేటు ట్రావెల్స్, ఆర్టీసీ బస్సుల్లో సరకును చాకచక్యంగా తరలిస్తున్నారు. పొట్టకూటికి అంటూ నిత్యావసరాల మాటున ఎండు గంజాయి దాటిస్తున్నారు. జిల్లాలోని ప్రాంతాల్లో విద్యార్థులు, 20 ఏళ్ల లోపు యువత గంజాయి బానిసలుగా మారుతుండటంతో ఉన్నతాధికారులు ప్రత్యేక దృష్టి సారించారు. తల్లిదండ్రులకు కూడా కౌన్సెలింగ్ ఇస్తున్నారు.
ఆ మాటెత్తితే భవిష్యత్తు అంధకారమే
బి.రోహిత్రాజు, ఎస్పీ, భద్రాద్రి కొత్తగూడెం
మా శాఖ తీసుకునే చర్యలతో జిల్లాలో యువత, ఇంకెవరూ గంజాయి మాట ఎత్తాలంటే భయపడాలి.ఎవరైనా హద్దు మీరితే కఠిన చర్యలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఎవరినీ ఉపేక్షించేది లేదు. అక్రమార్జనకు ఆశపడిన కొందరు.. యువత ఆరోగ్యం, కుటుంబాలను ఛిన్నాభిన్నం చేస్తున్నారు. మాఫియాగా మారాలనుకునే నేరగాళ్లకు ముకుతాడు వేస్తాం. మత్తు పదార్థాన్ని సేవించినా, విక్రయించినా, రవాణా చేసినా కఠినంగా వ్యవహరిస్తాం. మాదక ద్రవ్యాలకు బానిసై కొందరు రోడ్లపై తగాదాలకు పాల్పడుతున్నారు. తొలిసారి కౌన్సెలింగ్ ఇస్తాం. అయినా మారకుంటే కఠిన చర్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. తల్లిదండ్రులు కూడా పిల్లల ప్రవర్తనపై కన్నేసి ఉంచాలి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
భాజపాకు చరమగీతం పాడాలి
[ 04-05-2024]
పార్లమెంట్ ఎన్నికల్లో భాజపాకు చరమగీతం పాడాలని సీపీఎం జిల్లా కార్యదర్శి నున్న నాగేశ్వరావు అన్నారు. -
జన జాతరకు సర్వం సిద్ధం
[ 04-05-2024]
లోక్సభ ఎన్నికల ప్రచారాన్ని కాంగ్రెస్ పార్టీ ఉద్ధృతం చేస్తోంది. ఖమ్మం లోక్సభ స్థానంలో పార్టీ అభ్యర్థి రామసహాయం రఘురాంరెడ్డి గెలుపే లక్ష్యంగా ఇప్పటికే ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క, మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి సభలు, సమావేశాలు నిర్వహిస్తున్నారు. -
ఓట్ల పండుగ.. బాధ్యతలు మెండుగా!
[ 04-05-2024]
ప్రజాస్వామ్య వ్యవస్థలో ఎన్నికల నిర్వహణ అత్యంత కీలకమైన అంశం. పౌరులు తమకు నచ్చిన నాయకులను ఎన్నుకునే ప్రక్రియలో ఓటరు నమోదు నుంచి ఓట్ల లెక్కింపు పూర్తయ్యే వరకు అధికార యంత్రాంగం కీలకంగా వ్యవహరిస్తుంది. -
ప్రభుత్వాన్ని కూల్చే దమ్ము ఎవరికీ లేదు: తుమ్మల
[ 04-05-2024]
కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చే దమ్ము ఎవరికీ లేదని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ అభ్యర్థి రఘురాంరెడ్డి విజయాన్ని కాంక్షిస్తూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డితో కలిసి ఖమ్మం నగరంలో శుక్రవారం నిర్వహించిన రోడ్షోలో తుమ్మల మాట్లాడారు. -
‘ప్రజాదరణను ఓటుబ్యాంకుగా మల్చుకోవాలి’
[ 04-05-2024]
భారాసపై ప్రజల్లో ఉన్న ఆదరణను ఓటుబ్యాంకుగా మల్చుకోవాలని మాజీ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ అన్నారు. ఖమ్మంలోని భారాస జిల్లా కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన బూత్ కమిటీ సభ్యుల సమావేశంలో ఆయన మాట్లాడారు. -
భారాసలో కుదుపు
[ 04-05-2024]
లోక్సభ ఎన్నికల సమయంలో ఖమ్మంలో వలసలు భారాసను కుదిపేస్తున్నాయి. ఖమ్మం కార్పొరేషన్ పరిధిలో కార్పొరేటర్లు కాంగ్రెస్లోకి వరుస కట్టడం ఆ పార్టీకి మింగుడు పడటం లేదు. -
భాజపా గెలిస్తేనే ఖమ్మం అభివృద్ధి: తాండ్ర
[ 04-05-2024]
ఖమ్మం లోక్సభ స్థానంలో భాజపా గెలిస్తేనే నగరం సమగ్రంగా అభివృద్ధి చెందుతుందని ఆపార్టీ అభ్యర్థి తాండ్ర వినోద్రావు అన్నారు. ఖమ్మం టూటౌన్లో శుక్రవారం నిర్వహించిన రోడ్షోలో ఆయన మాట్లాడారు. -
టేబుల్ టెన్నిస్లో పేట విద్యార్థుల సత్తా
[ 04-05-2024]
‘క్రీడలు ఏవైనా పతకాలు మనకే’ అన్నట్లు కొంతకాలంగా అత్యుత్తమ ప్రతిభ కనబరుస్తున్నారు అశ్వారావుపేట వ్యవసాయ కళాశాల విద్యార్థులు. తాజాగా రాష్ట్రస్థాయి టేబుల్ టెన్నిస్లో ‘పేట’ విద్యార్థులు ఛాంపియన్లుగా నిలిచారు. -
నీటిసంపులో పడి బాలుడు మృతి
[ 04-05-2024]
ప్రమాదవశాత్తు నీటి సంపులో పడి మూడేళ్ల బాలుడు దుర్మరణం పాలయ్యాడు. ఈ ఘటన పెనుబల్లి మండలం లంకాసాగర్ గ్రామంలో శుక్రవారం చోటుచేసుకుంది. -
కేంద్రంలో ఇండియా కూటమిదే అధికారం: తుమ్మల
[ 04-05-2024]
‘రాష్ట్రంలో గత ప్రభుత్వం స్కీముల పేరిట అన్ని పథకాలను స్కాములుగా మార్చి ఆర్థికంగా విధ్వంసం సృష్టించింది.. దేశసమైక్యతను దెబ్బతీసిన భాజపా ఈ ఎన్నికల్లో ఓడిపోతుంది.. -
దేశ సుభిక్షానికి మోదీ పాలన అవసరం
[ 04-05-2024]
దేశ సుభిక్షానికి మోదీ పాలన మళ్లీ అవసరమని మహబూబాబాద్ లోక్సభ స్థానం భాజపా అభ్యర్థి సీతారాంనాయక్ తెలిపారు. మణుగూరు, అశ్వాపురంలో శుక్రవారం ప్రచారం చేశారు. -
రెప్పపాటు నిర్లక్ష్యంతో ప్రాణాలు గాలిలో!
[ 04-05-2024]
చిన్నపాటి నిర్లక్ష్యంతో క్షణాల్లో సంభవించే విద్యుత్తు ప్రమాదాలు ఏకంగా ప్రాణనష్టాన్ని తెచ్చిపెడతాయి. విద్యుదాఘాతాలు నిండు నూరేళ్ల జీవితాన్ని ఎలా బలితీసుకుంటాయి? దానివల్ల బాధిత కుటుంబాలు ఎలా నష్టపోతున్నాయో గుర్తించేందుకు ఎన్నో ఘటనలు సాక్ష్యంగా నిలుస్తున్నాయి. -
మోసపూరిత హామీలతో అధికారంలోకి కాంగ్రెస్: నామా
[ 04-05-2024]
అసెంబ్లీ ఎన్నికల్లో మోసపూరిత హామీలతో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందని ఖమ్మం లోక్సభ స్థానం భారాస అభ్యర్థి నామా నాగేశ్వరరావు అన్నారు.
తాజా వార్తలు (Latest News)
-
లైంగిక దౌర్జన్యం కేసు.. ప్రజ్వల్ రేవణ్ణ ఇంటికి సిట్
-
రింకుకు అందుకే చోటు దక్కలేదు.. బెస్ట్ టీమ్ సెలక్షన్: గంగూలీ
-
విరాట్ స్ట్రైక్రేట్పై విమర్శల్లో వారిది ద్వంద్వ వైఖరి: భారత మాజీ క్రికెటర్లు
-
ఉల్లి ఎగుమతులపై ఆంక్షలు ఎత్తివేత.. ఎన్నికల వేళ కేంద్రం నిర్ణయం
-
17మంది రోగులను హత్య చేసిన నర్సు..700 ఏళ్ల జైలు శిక్ష
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM