దోస్త్కు వేళాయె..!
ఇంటర్మీడియట్ పూర్తిచేసిన విద్యార్థులకు పుష్కలమైన అవకాశాలు ఉన్నప్పటికీ చాలామంది డిగ్రీ కోర్సులనే ప్రధానంగా ఎంపిక చేసుకుంటారు.
ప్రవేశాల కోసం ప్రచారం చేస్తున్న అధ్యాపకులు
పాల్వంచ, ఖమ్మం విద్యావిభాగం, న్యూస్టుడే: ఇంటర్మీడియట్ పూర్తిచేసిన విద్యార్థులకు పుష్కలమైన అవకాశాలు ఉన్నప్పటికీ చాలామంది డిగ్రీ కోర్సులనే ప్రధానంగా ఎంపిక చేసుకుంటారు. విద్యార్థులే నేరుగా తమకు ఇష్టమైన కళాశాలలను ఎంచుకునేందుకు డిగ్రీ ఆన్లైన్ సర్వీసెస్ తెలంగాణ(దోస్త్) వైబ్సైట్ను ప్రభుత్వం అందుబాటులోకి తీసుకొచ్చింది. 2024-25 విద్యాసంవత్సరానికి మొదటి దశకు సంబంధించి దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు తాజాగా వెల్లడించింది. మొదటి విడతలో సోమవారం నుంచి ఈ నెల 25 వరకు ఆన్లైన్లో దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. రెండో దశ జూన్ 4 నుంచి 13 వరకు, మూడో దశ జూన్ 19 నుంచి 25 వరకు రిజిస్ట్రేషన్ల ప్రక్రియ కొనసాగనుంది. మొత్తం మూడు విడతల్లో సీట్ల కేటాయింపు ఉంటుంది. ఇంటర్ ఉత్తీర్ణులైనవారు, ఇతర కోర్సుల్లో ప్రవేశాలు పొందని విద్యార్థులతోపాటు సప్లిమెంటరీ పరీక్షలు రాసేవారు, సార్వత్రిక ఇంటర్మీడియట్లో ఉత్తీర్ణత సాధించిన వారితో పాటు నీట్, ఎంసెట్ సీట్లు రాని విద్యార్థులు డిగ్రీలో చేరే అవకాశముంటుంది.
అందుబాటులోకి సరికొత్త కోర్సులు
బీఏలో పబ్లిక్ పాలసీ/గవర్నెన్స్, బీఎస్సీలో లైఫ్సైన్స్లో బయోమెడికల్ సైన్సెస్, బీకాంలో ఫైనాన్స్ కోర్సులతో పాటు బీఏ, బీకాం, బీఎస్సీ, బీజడ్సీ కోర్సుల్లో ఈ ఏడాది కొత్తగా అప్రెంటిస్షిప్ కోర్సులు అందుబాటులోకి రానున్నాయి. బీఏ కోర్సుల్లో కొత్తగా టూరిజం/ట్రావెల్స్, రిటైల్ ఆపరేషన్, బీఎస్సీలో హెల్త్కేర్ మేనేజ్మెంట్ కోర్సులు ఉంటాయి. ఆయా కోర్సులకు ఉపకార వేతనం సైతం ప్రభుత్వం అందించి ప్రోత్సహించనుంది. కోర్సు పూర్తవగానే ఉపాధి మార్గం లభించేలా చర్యలు తీసుకోనుంది. అంతర్జాలంలో దరఖాస్తు, వెబ్ ఆప్షన్, రూ.200 రుసుము చెల్లింపు వంటి అంశాలపై అవగాహన ఉంటే సెల్ఫోన్లోనే విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. లేకుంటే సమీపంలోని మీసేవ కేంద్రాలు, ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లోని హెల్ప్లైన్ను ఆశ్రయించాలి. ఆధార్ అనుసంధానం కాకుంటే సమీపంలోని మీసేవ కేంద్రంలో సంప్రందించాలి. సెల్ఫోన్ నంబరుకు ఆధార్ అనుసంధానమైతేనే దరఖాస్తు చేయటం సాధ్యమవుతుంది. సెల్ఫోన్, కంప్యూటర్లో దరఖాస్తు చేసుకోవడం సులభం. దరఖాస్తు చేసుకొని ‘దోస్త్’ ఐడీ, పిన్ పొందాక అది ఎవరికీ ఇవ్వొద్దు. విద్యార్థి సాధ్యమైనంత మేరకు ఎక్కువ వెబ్ ఆప్షన్లు నమోదు చేయాలి. ఆప్షన్లకు ముందుగా ఏ కళాశాలల్లో ఏ కోర్సు ఉంది. రెగ్యులర్, సెల్ఫ్ ఫైనాన్స్, ఇన్టెక్ ఎంత అనే విషయానికి సైట్లోని ‘సెర్చ్ బై కాలేజ్ కోర్సు’పై క్లిక్ చేయాలి.
దరఖాస్తు చేసుకునే సమయంలో విద్యార్థులు సొంతం లేదా కుటుంబ సభ్యుల ఫోన్ నంబర్లు ఇవ్వాలి. ఓటీపీలు, పిన్లను ఇతరులతో పంచుకోవద్దు. రిజిస్ట్రేషన్ సమయంలో ఇచ్చిన ఫోన్ నంబర్ ప్రవేశాల ప్రక్రియ ముగిసే వరకు ఉండాలి. ఇతర వివరాలకు సమీపంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లోని సహాయ కేంద్రాలను సంప్రదించాలి.
డాక్టర్ ఎం.సుబ్రహ్మణ్యం, ‘దోస్త్’ సమన్వయకర్త
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ప్రకటన.. నియంత్రణ నటన
[ 18-05-2024]
వర్షాకాలం ఈదురుగాలుల సమయంలో హోర్డింగులు, ఫ్లెక్సీల నిర్మాణాలు ఎక్కడ కూలి మీద పడతాయోనన్న భయం పట్టణ, నగరప్రాంత ప్రజలను వెంటాడుతోంది. ఇటీవల ముంబయిలో అక్రమంగా ఏర్పాటు చేసిన భారీ హోర్డింగ్ కూలి 16 మంది ప్రాణాలు కోల్పోయిన ఉదంతం సమస్య తీవ్రతకు అద్దం పడుతోంది. -
బీమాతోనే రైతుకు ధీమా
[ 18-05-2024]
ఆరుగాలం కష్టపడి పండించిన పంటలు చేతికందే సమయంలో అకాల వర్షాలు నిండా ముంచుతున్నాయి. అన్నదాతలకు తీవ్ర నష్టాలను మిగుల్చుతున్నాయి. నష్ట వివరాలపై వ్యవసాయ అధికారులు నివేదిస్తున్నా పరిహారం అందని బాధితులెందరో. -
ఉద్యోగుల పిల్లల ఉన్నత విద్యకు.. సంగరేణి సహకారం
[ 18-05-2024]
ఉద్యోగుల పిల్లల ఉన్నత చదువులకు సింగరేణి ఊతమిస్తోంది. సంక్షేమ కార్యక్రమాల్లో భాగంగా ప్రోత్సాహాన్ని అందించాలని యాజమాన్యం 2017లో నిర్ణయం తీసుకొంది. 2017-18 నుంచి 2022-23 విద్యాసంవత్సరం 40 మందికి రూ.76,06,760 సాయాన్ని విడుదల చేశారు. -
తాలిపేరుకు సాంకేతిక సొబగులు
[ 18-05-2024]
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలంలోని తాలిపేరు మధ్యతరహా ప్రాజెక్టు ప్రత్యేక సాంకేతికను అందిపుచ్చుకోనుంది. ఈ ప్రాజెక్టును నేషనల్ హైడ్రాలజీ ప్రాజెక్టు (ఎన్హెచ్పీ) కింద స్కడా (సూపర్వైజరీ కంట్రోల్ అండ్ డాటా అక్విజేషన్) సిస్టంతో అనుసంధానించనున్నారు. -
ఉచిత వసతి.. కార్పొరేట్ విద్య
[ 18-05-2024]
ఉచిత వసతి.. కార్పొరేట్ బోధన.. వ్యవసాయ నేపథ్యం, వెనకబడిన తరగతుల వారికి ప్రవేశాల్లో ప్రాధాన్యం.. వెరసి ‘బెస్ట్ అవైలబుల్ స్కూల్’ పథకానికి ఏటా ఆదరణ లభిస్తోంది. ఒకటో తరగతి నుంచే ఎస్సీ విద్యార్థులకు కార్పొరేట్ విద్యను సద్వినియోగం చేసుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం అవకాశం కల్పిస్తోంది. -
పచ్చడి మామిడి మరింత ప్రియం
[ 18-05-2024]
ఆవకాయ పచ్చడి ముందు పేద, ధనిక వర్గాలనే తేడా ఉండదు. ప్రతి సీజన్లో తమ కుటుంబాలకు తగిన మోతాదులో ఇంటి వద్ద తయారు చేసుకుంటారు. అత్యధిక ఇళ్లల్లో సంవత్సరం పొడవునా సిద్ధంగా ఉంటుంది. ఇలా అందరూ ఇష్టపడే పచ్చడి ప్రియం అవుతోంది. -
మౌలిక వసతుల కల్పనలో పురోగతి: కలెక్టర్
[ 18-05-2024]
జిల్లాలోని అమ్మ ఆదర్శ పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కల్పన పనులు పురోగతిలో ఉన్నట్లు జిల్లా కలెక్టర్ ప్రియాంక అల పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి అమ్మ ఆదర్శ కమిటీల అభివృద్ధి పనులపై హైదరాబాద్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ను శుక్రవారం నిర్వహించారు. -
ఒక్క అవకాశమిస్తే ప్రజల పక్షాన నిలబడతా: గుజ్జుల
[ 18-05-2024]
ప్రాధాన్య క్రమంలో మొదటి ఓటు వేసి తనను గెలిపించాలని భాజపా ఎమ్మెల్సీ అభ్యర్థి గుజ్జుల ప్రేమేందర్రెడ్డి పట్టభద్రులకు విజ్ఞప్తి చేశారు. ఖమ్మంలో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ 27 జరిగే ఉప ఎన్నిక పోలింగ్లో భాజపాకు ఓటేయాలని కోరారు. -
అవినీతి ఘటనపై సీఎండీ ఆగ్రహం
[ 18-05-2024]
రైతు పంటపొలానికి విద్యుత్తు లైను, నియంత్రిక ఏర్పాటుకు లంచం తీసుకుంటూ అవినీతి నిరోధక శాఖ(ఏసీబీ) అధికారులకు ఏఈ పట్టుబడిన నేపథ్యంలో టీఎస్ఎన్పీడీసీఎల్ సీఎండీ కర్నాటి వరుణ్రెడ్డి సిబ్బంది తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. -
ఓటరు చిట్టీలను వంద శాతం పంపిణీ చేయాలి
[ 18-05-2024]
పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికలకు సంబంధించి ఓటరు చిట్టీలను వంద శాతం పంపిణీ చేయాలని కలెక్టర్ గౌతమ్ ఆదేశించారు. కలెక్టరేట్ నుంచి జిల్లాలోని తహసీల్దార్లు, ఆర్డీఓలతో శుక్రవారం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో ఆయన మాట్లాడుతూ ప్రతి ఓటరుకు బీఎల్వోల ద్వారా ఓటరు చిట్టీలు అందించాలన్నారు. -
అధికారి తీరుపై గుర్రు!
[ 18-05-2024]
ప్రజాసంబంధాలు, పౌర సేవలను పల్లెల వరకు విస్తరించాల్సిన శాఖకు ఆయన జిల్లా స్థాయి అధికారి. తన పరిధిలో వందల సంఖ్యలో ఉద్యోగులుంటారు. గ్రామస్థాయి కార్యాలయాల ద్వారా నిరంతర సేవలు కొనసాగుతుంటాయి. -
రాములోరి వెండి లెక్కలపై గందరగోళం వీడేనా?
[ 18-05-2024]
భద్రాచలం రామాలయంలో స్వామివారికి ఉన్న ఆభరణలలో వెండి లెక్కపై గందరగోళం వీడడం లేదు. సుమారు 68కిలోల బంగారం, 980 కిలోల వెండి నిల్వలు ఉన్నాయి.