గెలిచే వరకు.. ఆపకు పరుగు
‘జీవితమంతా ఉరుకులు పరుగులు’ అన్నది నానుడి. మాట వరుసకు కాకుండా నిజంగా ఓ లక్ష్యం కోసం పరుగునే ఆయుధంగా మలుచుకున్న వారి శ్రమ వృథా కాలేదు.
ఖమ్మం క్రీడలు, న్యూస్టుడే: ‘జీవితమంతా ఉరుకులు పరుగులు’ అన్నది నానుడి. మాట వరుసకు కాకుండా నిజంగా ఓ లక్ష్యం కోసం పరుగునే ఆయుధంగా మలుచుకున్న వారి శ్రమ వృథా కాలేదు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో అథ్లెటిక్స్ రంగంలో సాధన చేసిన వారు పతకాలతోపాటు ఉద్యోగాలు సాధించారు. ఇలా కొలువులు పొందిన వారి సంఖ్య వంద వరకు ఉంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ శాఖలు, రక్షణ దళాలు, పోలీసు శాఖల్లో చేరారు. ఆరోగ్యంతోపాటు దాదాపు ఏదో ఓ ఉద్యోగం సాధించిన వారిలో అథ్లెట్ల సంఖ్యే ఎక్కువ. జాతీయ, అంతర్జాతీయ స్థాయిల్లో ఈ అంశానికున్న ప్రాధాన్యం వివరించేందుకు అంతర్జాతీయ సమాఖ్య ఏటా మే నెలలో అంతర్జాతీయ అథ్లెటిక్స్ దినోత్సవాన్ని జరుపుతోంది. ఈ సందర్భంగా ఈ ఏడాది ‘అథ్లెటిక్స్ ఫర్ బెటర్ వరల్డ్’ నినాదాన్ని విస్తృతంగా ప్రచారంలో తెచ్చారు.
2004లో అకాడమి...
2004లో ఖమ్మం నగరంలోని సర్దార్ పటేల్ స్టేడియం కేంద్రంగా విలువిద్య, ఫుట్బాల్, బ్యాడ్మింటన్, కబడ్డీ అకాడమీలను నాటి రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఒక్కోటి జారిపోగా అథ్లెటిక్స్ అకాడమి మాత్రం కొనసాగుతోంది. ఇక్కడ సాధన చేసిన క్రీడాకారులు నజీబ్, సుధాకర్, పవన్కుమార్ అంతర్జాతీయ పోటీల వేదికపై నిలిచారు. రాష్ట్రంలో హైదరాబాద్లోని స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా స్పోర్ట్స్ ట్రైనింగ్ సెంటర్ తర్వాత ఆ స్థాయి ఫలితాలు సాధిస్తున్నది ఖమ్మం అథ్లెటిక్స్ అకాడమీనే.
స్టేడియంలో ఎనిమిది లైన్ల 400 మీటర్ల సింథటిక్ ట్రాక్ ఏర్పాటు చేస్తే జాతీయ, అంతర్జాతీయ క్రీడాకారులు తయారవుతారని శిక్షకులు, క్రీడాకారులు, వారి తల్లిదండ్రులు కోరుతున్నారు.
మంచి ఆరోగ్యం
అథ్లెటిక్స్ సాధన చేస్తున్న చిన్నారులు
అథ్లెటిక్స్ రన్స్, త్రోస్, జంప్స్ అంశాల సమూహం. ఇందులో ఏదో ఓ అంశాన్ని ఎంచుకొని సాధన చేసిన వారు మంచి ఆరోగ్యం, కీర్తి పతాకాలు, ఉద్యోగాలను అందుకున్నారు. సక్సెస్ రేట్ ఎక్కువగా ఉన్న క్రీడాంశం కూడా ఇదే అంటున్నారు. ఇటీవల జిల్లాలో ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీ నిర్వహించారు. ఉద్యోగాలు సాధించిన వారిలో అత్యధికులు అథ్లెట్లు ఉన్నారు. తాజాగా కానిస్టేబుల్ పరీక్ష ఫలితాలు వచ్చాయి. 11 మంది ఉద్యోగాలు పొందారు. రైల్వే, బీఎస్ఎన్ఎల్, సీఐఎస్ఎఫ్, నేవీ, పోస్టల్, ఆదాయపన్ను శాఖల్లో జిల్లాకు చెందినవారు ఉద్యోగాలు పొందారు. ముగ్గురు శిక్షకులుగా స్థిరపడ్డారు. 15 మంది పీఈటీలు ఉద్యోగాలు చేస్తున్నారు. వీరిలో తొంబైశాతం మంది అథ్లెటిక్స్నే నమ్ముకొని స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగాలు సాధించారు. వీరిలో ముగ్గురు అంతర్జాతీయ స్థాయి వరకు రాణించిన క్రీడాకారులు ఉన్నారు.
క్రీడా కోటాలో ఉద్యోగం పొందాలంటే..
సునీల్, సీనియర్ క్రీడాకారుడు
నేను స్పోర్ట్స్ కోటాలోనే బీఎస్ఎన్ఎల్ శాఖలో ఉద్యోగం సాధించా. మా అన్నయ్య సీనియర్ అథ్లెట్. ఆయన ఇదే కోటాలో రైల్వే ఉద్యోగం సాధించారు. ఉన్నత లక్ష్యంతో సాధన చేయాలి. సీనియర్స్, అండర్ 20 విభాగానికి వచ్చే వరకు పట్టుదల వీడకుండా ఉండాలి. అక్కడ వచ్చే పతకం, ఫలితమే క్రీడా కోటాలో ఉద్యోగానికి మార్గం సుగమం చేస్తుంది. సబ్ జూనియర్, జూనియర్ స్థాయిలో జాతీయ పతకాలు సాధించి అండర్-20 రాకముందే వదిలేస్తే చేసిన సాధన, శ్రమ వృథా అవుతుంది.
క్రీడాకారులు ఒలింపిక్స్లో మెరవాలి
గౌస్, అకాడమి శిక్షకుడు
ఇక్కడి అకాడమి నుంచి క్రీడాకారులను ఒలింపిక్స్కు తీర్చిదిద్దాలనే గట్టి సంకల్పంతోనే సింథటిక్ ట్రాక్ ఏర్పాటు చేయాలని కోరుతున్నాం. సదుపాయాలు ఉంటే ఆ స్థాయి క్రీడాకారులను తీర్చిదిద్దగలమనే నమ్మకం ఉంది. ఇప్పటికే ఆసియా స్థాయి పోటీలకు బాలికలను సిద్ధం చేస్తున్నాం. నేను జిల్లా అథ్లెటిక్స్ రంగం నుంచే వచ్చా. తగిన అనుభవం, ప్రణాళిక ఉంది కాబట్టే సదుపాయాలను కోరుతున్నాం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ప్రకటన.. నియంత్రణ నటన
[ 18-05-2024]
వర్షాకాలం ఈదురుగాలుల సమయంలో హోర్డింగులు, ఫ్లెక్సీల నిర్మాణాలు ఎక్కడ కూలి మీద పడతాయోనన్న భయం పట్టణ, నగరప్రాంత ప్రజలను వెంటాడుతోంది. ఇటీవల ముంబయిలో అక్రమంగా ఏర్పాటు చేసిన భారీ హోర్డింగ్ కూలి 16 మంది ప్రాణాలు కోల్పోయిన ఉదంతం సమస్య తీవ్రతకు అద్దం పడుతోంది. -
బీమాతోనే రైతుకు ధీమా
[ 18-05-2024]
ఆరుగాలం కష్టపడి పండించిన పంటలు చేతికందే సమయంలో అకాల వర్షాలు నిండా ముంచుతున్నాయి. అన్నదాతలకు తీవ్ర నష్టాలను మిగుల్చుతున్నాయి. నష్ట వివరాలపై వ్యవసాయ అధికారులు నివేదిస్తున్నా పరిహారం అందని బాధితులెందరో. -
ఉద్యోగుల పిల్లల ఉన్నత విద్యకు.. సంగరేణి సహకారం
[ 18-05-2024]
ఉద్యోగుల పిల్లల ఉన్నత చదువులకు సింగరేణి ఊతమిస్తోంది. సంక్షేమ కార్యక్రమాల్లో భాగంగా ప్రోత్సాహాన్ని అందించాలని యాజమాన్యం 2017లో నిర్ణయం తీసుకొంది. 2017-18 నుంచి 2022-23 విద్యాసంవత్సరం 40 మందికి రూ.76,06,760 సాయాన్ని విడుదల చేశారు. -
తాలిపేరుకు సాంకేతిక సొబగులు
[ 18-05-2024]
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలంలోని తాలిపేరు మధ్యతరహా ప్రాజెక్టు ప్రత్యేక సాంకేతికను అందిపుచ్చుకోనుంది. ఈ ప్రాజెక్టును నేషనల్ హైడ్రాలజీ ప్రాజెక్టు (ఎన్హెచ్పీ) కింద స్కడా (సూపర్వైజరీ కంట్రోల్ అండ్ డాటా అక్విజేషన్) సిస్టంతో అనుసంధానించనున్నారు. -
ఉచిత వసతి.. కార్పొరేట్ విద్య
[ 18-05-2024]
ఉచిత వసతి.. కార్పొరేట్ బోధన.. వ్యవసాయ నేపథ్యం, వెనకబడిన తరగతుల వారికి ప్రవేశాల్లో ప్రాధాన్యం.. వెరసి ‘బెస్ట్ అవైలబుల్ స్కూల్’ పథకానికి ఏటా ఆదరణ లభిస్తోంది. ఒకటో తరగతి నుంచే ఎస్సీ విద్యార్థులకు కార్పొరేట్ విద్యను సద్వినియోగం చేసుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం అవకాశం కల్పిస్తోంది. -
పచ్చడి మామిడి మరింత ప్రియం
[ 18-05-2024]
ఆవకాయ పచ్చడి ముందు పేద, ధనిక వర్గాలనే తేడా ఉండదు. ప్రతి సీజన్లో తమ కుటుంబాలకు తగిన మోతాదులో ఇంటి వద్ద తయారు చేసుకుంటారు. అత్యధిక ఇళ్లల్లో సంవత్సరం పొడవునా సిద్ధంగా ఉంటుంది. ఇలా అందరూ ఇష్టపడే పచ్చడి ప్రియం అవుతోంది. -
మౌలిక వసతుల కల్పనలో పురోగతి: కలెక్టర్
[ 18-05-2024]
జిల్లాలోని అమ్మ ఆదర్శ పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కల్పన పనులు పురోగతిలో ఉన్నట్లు జిల్లా కలెక్టర్ ప్రియాంక అల పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి అమ్మ ఆదర్శ కమిటీల అభివృద్ధి పనులపై హైదరాబాద్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ను శుక్రవారం నిర్వహించారు. -
ఒక్క అవకాశమిస్తే ప్రజల పక్షాన నిలబడతా: గుజ్జుల
[ 18-05-2024]
ప్రాధాన్య క్రమంలో మొదటి ఓటు వేసి తనను గెలిపించాలని భాజపా ఎమ్మెల్సీ అభ్యర్థి గుజ్జుల ప్రేమేందర్రెడ్డి పట్టభద్రులకు విజ్ఞప్తి చేశారు. ఖమ్మంలో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ 27 జరిగే ఉప ఎన్నిక పోలింగ్లో భాజపాకు ఓటేయాలని కోరారు. -
అవినీతి ఘటనపై సీఎండీ ఆగ్రహం
[ 18-05-2024]
రైతు పంటపొలానికి విద్యుత్తు లైను, నియంత్రిక ఏర్పాటుకు లంచం తీసుకుంటూ అవినీతి నిరోధక శాఖ(ఏసీబీ) అధికారులకు ఏఈ పట్టుబడిన నేపథ్యంలో టీఎస్ఎన్పీడీసీఎల్ సీఎండీ కర్నాటి వరుణ్రెడ్డి సిబ్బంది తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. -
ఓటరు చిట్టీలను వంద శాతం పంపిణీ చేయాలి
[ 18-05-2024]
పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికలకు సంబంధించి ఓటరు చిట్టీలను వంద శాతం పంపిణీ చేయాలని కలెక్టర్ గౌతమ్ ఆదేశించారు. కలెక్టరేట్ నుంచి జిల్లాలోని తహసీల్దార్లు, ఆర్డీఓలతో శుక్రవారం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో ఆయన మాట్లాడుతూ ప్రతి ఓటరుకు బీఎల్వోల ద్వారా ఓటరు చిట్టీలు అందించాలన్నారు. -
అధికారి తీరుపై గుర్రు!
[ 18-05-2024]
ప్రజాసంబంధాలు, పౌర సేవలను పల్లెల వరకు విస్తరించాల్సిన శాఖకు ఆయన జిల్లా స్థాయి అధికారి. తన పరిధిలో వందల సంఖ్యలో ఉద్యోగులుంటారు. గ్రామస్థాయి కార్యాలయాల ద్వారా నిరంతర సేవలు కొనసాగుతుంటాయి. -
రాములోరి వెండి లెక్కలపై గందరగోళం వీడేనా?
[ 18-05-2024]
భద్రాచలం రామాలయంలో స్వామివారికి ఉన్న ఆభరణలలో వెండి లెక్కపై గందరగోళం వీడడం లేదు. సుమారు 68కిలోల బంగారం, 980 కిలోల వెండి నిల్వలు ఉన్నాయి.
తాజా వార్తలు (Latest News)
-
మోదీ వ్యాఖ్యలపై ఈసీ చర్యలు తీసుకోవాలి: మల్లికార్జున్ ఖర్గే
-
రీడర్స్ డైజెస్ట్.. యూకేలో ముగిసిన 86 ఏళ్ల ప్రయాణం
-
చైనా సైబర్ ముఠా చేతిలో ఏపీ వాసులు.. ఉద్యోగాల పేరుతో ఏజెంట్ల మోసం
-
బెంగళూరు vs చెన్నై: వర్షం కారణంగా మ్యాచ్ రద్దయితే పరిస్థితి ఏంటి?
-
ఈసీ అనుమతి నిరాకరణ.. తెలంగాణ కేబినెట్ భేటీ వాయిదా
-
భారత బలగాలకు ద్రోహం చేసిన చరిత్ర కాంగ్రెస్ది: ప్రధాని మోదీ