నమూనా కేంద్రం.. ఆకర్షణీయం
ఓటు వేసేందుకు వచ్చేవారిని ఆకట్టుకునే నమూనా పోలింగ్ కేంద్రాలను తీర్చిదిద్దనున్నారు. ఈ మేరకు 15 నమూనా కేంద్రాలను ఖమ్మం కలెక్టర్ గౌతమ్ ఎంపిక చేశారు.
ఖమ్మం నగరం, న్యూస్టుడే: ఓటు వేసేందుకు వచ్చేవారిని ఆకట్టుకునే నమూనా పోలింగ్ కేంద్రాలను తీర్చిదిద్దనున్నారు. ఈ మేరకు 15 నమూనా కేంద్రాలను ఖమ్మం కలెక్టర్ గౌతమ్ ఎంపిక చేశారు. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో మహిళలు, దివ్యాంగులు, యువత విభాగాల్లో వీటిని ఏర్పాటు చేయనున్నారు. మహిళా కేంద్రంలో సిబ్బంది అంతా మహిళలే ఉంటారు. యువ కేంద్రంలో యువత, దివ్యాంగుల విభాగంలో అందుబాటులో ఉన్న మేరకు దివ్యాంగులను పోలింగ్ సిబ్బందిగా నియమించనున్నారు. ఎంపిక చేసిన కేంద్రాలను ప్రత్యేకంగా అలంకరించనున్నారు. నమూనా కేంద్రాల్లో కూలర్లు, రంగురంగుల బెలూన్లు అమర్చటం, ఓటర్లు కేంద్రంలోని చేరే వరకు తివాచీ(కార్పెట్) పరవడం, వరుసలో నిలబడకుండా కూర్చునేందుకు వీలుగా కుర్చీల ఏర్పాటు, నీడకోసం షామియానాలు, తాగునీరు, చక్రాల కుర్చీలు ఏర్పాటు చేశారు. సెల్ఫీ పాయింట్స్ ఏర్పాటు చేయనున్నారు. వివాహ వేడుకల్లో చేసినట్లు ఆహూతులపై సుగంధ ద్రవ్యాలు చల్లుతూ, పువ్వులు అందించి లోనికి ఆహ్వానిస్తారు. ఓటర్లతో వచ్చే పిల్లలు ఆడుకునేందుకు సదుపాయాలు కల్పించనున్నారు.
దివ్యాంగుల విభాగంలో.....
ఖమ్మం: రాజేంద్రనగర్లోని ప్రభుత్వ హైస్కూల్లోని నెం.317 పోలింగ్ కేంద్రం
పాలేరు: ఖమ్మం రూరల్ మండలం గోళ్లపాడు జడ్పీ హైస్కూల్ పోలింగ్ కేంద్రం నెం.80
మధిర: జానకీపురంలోని జడ్పీ సెకండరీ స్కూల్లో నెం.130 పోలింగ్ కేంద్రం
వైరా: ప్రభుత్వ జూనియర్ కళాశాలలోని నెం.207 పోలింగ్ కేంద్రం
సత్తుపల్లి: కిష్టారం జడ్పీ హై స్కూల్ నెం.203 పోలింగ్ కేంద్రం
యువత విభాగంలో....
ఖమ్మం: ఎస్ఆర్బీజీఎన్నార్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో నెం.156 పోలింగ్ కేంద్రం
పాలేరు: ఖమ్మం రూరల్ మండలం పెద్దతండాలోని మండల పరిషత్ ప్రైమరీ పాఠశాలలో నెం.129 పోలింగ్ కేంద్రం
మధిర: సుందరయ్య నగర్లోని మండల పరిషత్ ప్రైమరీ స్కూల్లో నం.178 కేంద్రం
వైరా: గుట్టబడి మండల పరిషత్ ప్రైమరీ స్కూల్లో నెం.204 పోలింగ్ కేంద్రం
సత్తుపల్లి: గౌరిగూడెంలోని మండల పరిషత్ పాఠశాలలో నెం.216 పోలింగ్ కేంద్రం.
మహిళా విభాగంలో...
ఖమ్మం: ఎన్నెస్పీ క్యాంపులోని ప్రభుత్వ హైస్కూల్ నెం.110 పోలింగ్ కేంద్రం
పాలేరు: పాలేరు జడ్పీ హై స్కూల్లోని నెం.177 పోలింగ్ కేంద్రం
మధిర: జడ్పీ గర్ల్స్ సెకండరీ స్కూల్ నెం.187 పోలింగ్ కేంద్రం
వైరా: ప్రభుత్వ హైస్కూల్లో నెం.201 పోలింగ్ కేంద్రం
సత్తుపల్లి: తల్లాడ జడ్పీ హైస్కూల్లోని నెం.18 పోలింగ్ కేంద్రం
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మేమేం పాపం చేశాం నాన్నా..!
[ 19-05-2024]
ఆస్తి కోసం ఓ కర్కశకుడు కన్నతల్లి, తన ఇద్దరు కూతుళ్లను హతమార్చిన సంఘటనతో.. ఎప్పుడూ ప్రశాంతంగా ఉండే ఖమ్మం జిల్లా తల్లాడ మండలం గోపాలపేటలో కలకలం రేగింది. గ్రామానికి చెందిన ట్రాక్టర్ డ్రైవర్ పిట్టల వెంకటేశ్వర్లు మొదటి భార్య మృతితో త్రివేణిని రెండో వివాహం చేసుకోవడం.. -
బాధిత మహిళలకు భరోసా..
[ 19-05-2024]
ప్రస్తుత సమాజంలో మహిళలు, చిన్నారులు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య.. లైంగిక వేధింపులు. జరిగే అన్యాయాన్ని పరువు కోసం బయటకు చెప్పుకోలేక కుమిలిపోతున్న వారెందరో ఉన్నారు. -
ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు 55 పోలింగ్ కేంద్రాలు: కలెక్టర్
[ 19-05-2024]
పూర్వ వరంగల్, ఖమ్మం, నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక ఏర్పాట్లు వేగవంతం చేయాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ప్రియాంక అల ఆదేశించారు. ఉప ఎన్నిక సిబ్బంది నియామకం, ఏర్పాట్లపై శనివారం కలెక్టరేట్లో సమీక్ష నిర్వహించారు. -
టీఎస్ఈఏపీ సెట్లో జిల్లా విద్యార్థుల ప్రతిభ
[ 19-05-2024]
2024-25 విద్యా సంవత్సరానికి ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించిన టీఎస్ ఈఏపీ సెట్ ఫలితాలు శనివారం విడుదలయ్యాయి. ఖమ్మం నగరానికి చెందిన పలు ప్రైవేటు జూనియర్ కళాశాలల విద్యార్థులు ప్రతిభ చూపారు. -
ఐటీఐ ప్రవేశాలకు వేళాయె..!
[ 19-05-2024]
పదో తరగతి ఫలితాల వెల్లడి నేపథ్యంలో ఐటీఐ కళాశాలల్లో ప్రవేశాలకు అధికారులు చర్యలు ప్రారంభించారు. ‘2024-25’ విద్యా సంవత్సరం ప్రవేశాలకు ఈ నెల 16 నుంచి జూన్ 10వ తేదీ వరకు ఆన్లైన్లో దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. -
పిడుగుపాటుతో రైతు మృతి
[ 19-05-2024]
పిడుగుపాటుకు పొలంలో ఓ రైతు మృతి చెందిన ఘటన శనివారం చోటు చేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం.. రామచంద్రాపురం గ్రామానికి చెందిన సంపసాల కృష్ణ(55) వ్యవసాయం చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నారు. -
ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్కు మద్దతు: తమ్మినేని
[ 19-05-2024]
పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి జరిగే ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థికి మద్దతు ఇవ్వాలని నిర్ణయించినట్లు సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం తెలిపారు. -
రామయ్యకు బంగారు తులసీ దళార్చన
[ 19-05-2024]
భద్రాచలం శ్రీసీతారామచంద్ర స్వామి ఆలయంలో శనివారం భక్తులు పోటెత్తారు. క్యూలైన్లతో పాటు ప్రసాదాల కౌంటర్లు కిటకిటలాడాయి. పసిడితో తయారు చేసిన తులసీ దళాలను సీతారాముడి పాదాల చెంత ఉంచి అర్చన చేశారు. -
‘మహస్వి’కి 102వ ర్యాంకు
[ 19-05-2024]
టీఎస్ ఈఏపీసెట్ ఫలితాల్లో ఖమ్మం న్యూవిజన్ జూనియర్ కళాశాలకు చెందిన విద్యార్థిని జి.మహస్వి రాష్ట్రస్థాయిలో 102వ ర్యాంకు సాధింది. జేఈఈ మెయిన్స్లో సైతం ఆలిండియా ఓపెన్ కేటగిరీలో 732వ ర్యాంకు సాధించటం విశేషం. -
ఉపకార వేతనానికి దరఖాస్తుల ఆహ్వానం
[ 19-05-2024]
2024-25 విద్యా సంవత్సరానికి ఖమ్మం జిల్లాకు చెందిన విదేశాల్లో చదివే గిరిజన విద్యార్థులు ఈనెల 31 లోపు ఉపకార వేతనానికి దరఖాస్తు చేసుకోవాలని జిల్లా గిరిజన అభివృద్ధి అధికారి ఎన్.విజయలక్ష్మి శనివారం తెలిపారు. -
రహదారుల పనులకు అనుమతి ఇవ్వండి: తుమ్మల
[ 19-05-2024]
ఆర్సీపీఎల్డబ్ల్యూఈఏ ఫేజ్-1, 3, ఎల్డబ్ల్యూఈ 2018-19, ఎస్సీఏ స్కీం కింద ప్రారంభించిన రహదారుల పనులకు అనుమతులు ఇవ్వాలని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అటవీశాఖ మంత్రి, పీసీసీఎఫ్లకు విజ్ఞప్తి చేశారు. -
గ్రూప్-1 ప్రిలిమ్స్కు ఏర్పాట్లు
[ 19-05-2024]
గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్ష నిర్వహణకు ఏర్పాట్లు చేయాలని టీఎస్పీఎస్సీ ఛైర్మన్ మహేందర్రెడ్డి అన్నారు. హైదరాబాద్ నుంచి శనివారం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్కు కలెక్టర్ గౌతమ్ హాజరయ్యారు.
తాజా వార్తలు (Latest News)
-
మార్కెట్ కేంద్రంగా మొబైల్ దొంగతనాలు.. పిల్లలైతే అనుమానించరని..!
-
చాట్ జీపీటీ కంటే మెరుగైన తెలుగు సాఫ్ట్వేర్ తీసుకొస్తాం
-
ఆసక్తికరం.. 1.75 కోట్ల పందెం
-
పెట్టుబడి అంటే పట్టుబడినట్టే.. లాభాల పేరుతో సైబర్ నేరగాళ్ల దందా
-
4 నెలల్లో 1,300 ఫోన్ల ట్యాపింగ్!
-
పెళ్లిచూపులకు వస్తూ రోడ్డు ప్రమాదంలో యువకుడి దుర్మరణం