కేంద్రం తాటాకు చప్పుళ్లకు భయపడం: భట్టి
కేంద్రం తాటాకు చప్పుళ్లకు రాష్ట్రంలోని ఏ ఒక్క కాంగ్రెస్ కార్యకర్త భయపడబోరని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క అన్నారు. చింతకానిలో సోమవారం నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు.
చింతకానిలో అభివాదం చేస్తున్న డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్క, మంత్రి పొంగులేటి,
అభ్యర్థి రఘురాంరెడ్డి, పక్కన పోతినేని, బాలసాని తదితరులు
చింతకాని, న్యూస్టుడే: కేంద్రం తాటాకు చప్పుళ్లకు రాష్ట్రంలోని ఏ ఒక్క కాంగ్రెస్ కార్యకర్త భయపడబోరని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క అన్నారు. చింతకానిలో సోమవారం నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. లోక్సభ ఎన్నికల్లో ఇండియా కూటమి అధికారంలోకి వస్తుందని, రాహుల్గాంధీ ప్రధానమంత్రి కావటం ఖాయమని జోస్యం చెప్పారు. భారాసకు ఓటేస్తే వృథా అవుతుందన్నారు. ఎన్నికల కోడ్ ముగియగానే అర్హులకు ఇందిరమ్మ ఇళ్లు ఇస్తామని చెప్పారు. ఆగస్టు 15 నాటికి రైతుల రుణాలను రూ.2లక్షల చొప్పున మాఫీ చేస్తామని పునరుద్ఘాటించారు. ఖమ్మం లోక్సభ స్థానంలో కాంగ్రెస్ అభ్యర్థి రఘురాంరెడ్డిని గెలిపించాలని కోరారు. తనను గెలిపిస్తే అందుబాటులో ఉంటూ ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని రఘురాంరెడ్డి తెలిపారు. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, మాజీ ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, డీసీసీ అధ్యక్షుడు పువ్వాళ్ల దుర్గాప్రసాద్, సీపీఐ, సీపీఎం నాయకులు బాగం హేమంతరావు, పోతినేని సుదర్శన్, కాంగ్రెస్ నాయకుడు అంబటి వెంకటేశ్వరరావు, ఎంపీపీ కోపూరి పూర్ణయ్య పాల్గొన్నారు.
ఖమ్మం కమాన్బజార్, న్యూస్టుడే: కాంగ్రెస్ ప్రభుత్వం ఆడపడుచులకు ప్రాధాన్యమిస్తోందని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. ఖమ్మం నగరంలో జరిగిన మహిళా కాంగ్రెస్ ఆత్మీయ సమావేశంలో మాట్లాడారు. అతివలకు ఉచిత బస్సు ప్రయాణం, గ్యాస్ రాయితీ, విద్యుత్ బిల్లులు వంటి సంక్షేమ పథకాలు అమలుచేస్తున్నామని చెప్పారు. భాజపా అధికారంలోకి వస్తే రాజ్యాంగాన్ని మార్చుతుందని ఆరోపించారు. కేంద్రంలో ఇండియా కూటమి అధికారంలోకి వస్తేనే పేదలకు మేలు జరుగుతుందన్నారు. హస్తం గుర్తుపై ఓటేసి రఘురాంరెడ్డిని గెలిపించాలని కోరారు. మహిళా కాంగ్రెస్ జిల్లా అధ్యక్షురాలు దొబ్బల సౌజన్య, నగర కాంగ్రెస్ అధ్యక్షుడు మహ్మద్ జావేద్, డిప్యూటీ మేయర్ ఫాతిమా జోహ్రా, మాజీ ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, మద్దినేని స్వర్ణకుమారి, విజయాబాయి, పగడాల మంజుల పాల్గొన్నారు. తుమ్మలగడ్డ సెంటర్ లో మైనార్టీల ఆత్మీయ సమ్మేళనంలో మంత్రి పొంగులేటి మాట్లాడారు.
ఖమ్మం కమాన్బజార్: కాంగ్రెస్కు ఓటేసి ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని ఆపార్టీ అభ్యర్థి రఘురాంరెడ్డి కోరారు. ఖమ్మంలోని ప్రసాద్ హైట్స్ అసోసియేషన్ ఆత్మీయ సమావేశంలో మాట్లాడారు. ఎన్నికల వేళ రాములోరు, అయోధ్య అంటూ మత విద్వేషాలు రెచ్చగొట్టడం బాధాకరమన్నారు. డాక్టర్ కేశవరావు, మాజీ ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, నూకల నరేశ్రెడ్డి, దగ్గుబాటి ఆశ్రిత, మద్దినేని స్వర్ణకుమారి, ముదిరెడ్డి నిరంజన్రెడ్డి, మానుకొండ రాధాకిశోర్, కిలారు వెంకటేశ్వరరావు, కార్పొరేటర్ మిక్కిలినేని మంజుల పాల్గొన్నారు.
కాంగ్రెస్తోనే అణగారిన వర్గాలకు న్యాయం: సీతక్క
సమావేశంలో మాట్లాడుతున్న మంత్రి సీతక్క, వేదికపై ఎమ్మెల్యే
కోరం కనకయ్య, మంత్రి తుమ్మల, ఎంపీ అభ్యర్థి బలరాం నాయక్
కామేపల్లి: పేదల హక్కుల పరిరక్షణకు కాంగ్రెస్ పార్టీ గెలవాలని మంత్రి సీతక్క అన్నారు. మహబూబాబాద్ లోక్సభ స్థానం కాంగ్రెస్ అభ్యర్థి పోరిక బలరాంనాయక్ గెలుపును కాంక్షిస్తూ కొత్తలింగాలలో నిర్వహించిన బహిరంగ సభలో ఆమె మాట్లాడారు. పదేళ్లపాటు భారాస, భాజపా చేసింది శూన్యమన్నారు. యువతకు ఉద్యోగాలు ఇవ్వకుండా దేశ సంపదను ప్రైవేటుపరం చేస్తున్న ఘనత ప్రధాని మోదీకే దక్కుతుందన్నారు. భారత రాజ్యాంగాన్ని మార్చే ప్రయత్నం చేస్తున్న భాజపాకు ఓటు ద్వారా గుణపాఠం చెప్పాలన్నారు. ఇక తానున్నప్పుడు రాష్ట్రం బాగున్నట్టు, కాంగ్రెస్ పాలనలో ఆగమైనట్టు మాజీ సీఎం కేసీఆర్ మాట్లాడుతున్నారని దెప్పిపొడిచారు. ఏ పదవి లేకున్నా దేశం ఐక్యత కోసం కష్టపడుతున్న రాహుల్గాంధీని ప్రధానిని చేయడమే లక్ష్యమన్నారు. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ జిల్లా అభివృద్ధే లక్ష్యంగా పనిచేసేందుకు తనకు అవకాశం వచ్చిందన్నారు. సీఎం రేవంత్రెడ్డితో మాట్లాడి సీతారామ ప్రాజెక్టు మోటార్లను స్వాతంత్య్ర దినోత్సవం నాడు ప్రారంభించేలా బాధ్యత తీసుకుంటానన్నారు. భారాసకు చెందిన ఎంపీపీ సునీత, మాజీ సర్పంచి రాందాస్నాయక్తోపాటు పలువురు కాంగ్రెస్లో చేరారు. ఎమ్మెల్యే కోరం కనకయ్య వారికి పార్టీ కండువాలు కప్పారు. మండల కాంగ్రెస్ అధ్యక్షుడు నర్సింహారెడ్డి, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి రాంరెడ్డి గోపాల్రెడ్డి, శ్రీచరణ్రెడ్డి, శ్రీకాంత్రెడ్డి, మంజుల, మల్లిబాబు యాదవ్, తదితరులు పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
సీతారామ ప్రాజెక్టు కాలువను వేగంగా పూర్తి చేయాలి
[ 19-05-2024]
సీతారామ ప్రాజెక్టు కాలువ పనులను వేగవంతంగా పూర్తి చేసి సాగు, తాగునీటిని సరఫరా చేయాలని తెలుగుదేశం పార్టీ లీగల్ సెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మల్లెం పాటి అప్పారావు అన్నారు. -
మేమేం పాపం చేశాం నాన్నా..!
[ 19-05-2024]
ఆస్తి కోసం ఓ కర్కశకుడు కన్నతల్లి, తన ఇద్దరు కూతుళ్లను హతమార్చిన సంఘటనతో.. ఎప్పుడూ ప్రశాంతంగా ఉండే ఖమ్మం జిల్లా తల్లాడ మండలం గోపాలపేటలో కలకలం రేగింది. గ్రామానికి చెందిన ట్రాక్టర్ డ్రైవర్ పిట్టల వెంకటేశ్వర్లు మొదటి భార్య మృతితో త్రివేణిని రెండో వివాహం చేసుకోవడం.. -
బాధిత మహిళలకు భరోసా..
[ 19-05-2024]
ప్రస్తుత సమాజంలో మహిళలు, చిన్నారులు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య.. లైంగిక వేధింపులు. జరిగే అన్యాయాన్ని పరువు కోసం బయటకు చెప్పుకోలేక కుమిలిపోతున్న వారెందరో ఉన్నారు. -
ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు 55 పోలింగ్ కేంద్రాలు: కలెక్టర్
[ 19-05-2024]
పూర్వ వరంగల్, ఖమ్మం, నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక ఏర్పాట్లు వేగవంతం చేయాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ప్రియాంక అల ఆదేశించారు. ఉప ఎన్నిక సిబ్బంది నియామకం, ఏర్పాట్లపై శనివారం కలెక్టరేట్లో సమీక్ష నిర్వహించారు. -
టీఎస్ఈఏపీ సెట్లో జిల్లా విద్యార్థుల ప్రతిభ
[ 19-05-2024]
2024-25 విద్యా సంవత్సరానికి ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించిన టీఎస్ ఈఏపీ సెట్ ఫలితాలు శనివారం విడుదలయ్యాయి. ఖమ్మం నగరానికి చెందిన పలు ప్రైవేటు జూనియర్ కళాశాలల విద్యార్థులు ప్రతిభ చూపారు. -
ఐటీఐ ప్రవేశాలకు వేళాయె..!
[ 19-05-2024]
పదో తరగతి ఫలితాల వెల్లడి నేపథ్యంలో ఐటీఐ కళాశాలల్లో ప్రవేశాలకు అధికారులు చర్యలు ప్రారంభించారు. ‘2024-25’ విద్యా సంవత్సరం ప్రవేశాలకు ఈ నెల 16 నుంచి జూన్ 10వ తేదీ వరకు ఆన్లైన్లో దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. -
పిడుగుపాటుతో రైతు మృతి
[ 19-05-2024]
పిడుగుపాటుకు పొలంలో ఓ రైతు మృతి చెందిన ఘటన శనివారం చోటు చేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం.. రామచంద్రాపురం గ్రామానికి చెందిన సంపసాల కృష్ణ(55) వ్యవసాయం చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నారు. -
ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్కు మద్దతు: తమ్మినేని
[ 19-05-2024]
పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి జరిగే ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థికి మద్దతు ఇవ్వాలని నిర్ణయించినట్లు సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం తెలిపారు. -
రామయ్యకు బంగారు తులసీ దళార్చన
[ 19-05-2024]
భద్రాచలం శ్రీసీతారామచంద్ర స్వామి ఆలయంలో శనివారం భక్తులు పోటెత్తారు. క్యూలైన్లతో పాటు ప్రసాదాల కౌంటర్లు కిటకిటలాడాయి. పసిడితో తయారు చేసిన తులసీ దళాలను సీతారాముడి పాదాల చెంత ఉంచి అర్చన చేశారు. -
‘మహస్వి’కి 102వ ర్యాంకు
[ 19-05-2024]
టీఎస్ ఈఏపీసెట్ ఫలితాల్లో ఖమ్మం న్యూవిజన్ జూనియర్ కళాశాలకు చెందిన విద్యార్థిని జి.మహస్వి రాష్ట్రస్థాయిలో 102వ ర్యాంకు సాధింది. జేఈఈ మెయిన్స్లో సైతం ఆలిండియా ఓపెన్ కేటగిరీలో 732వ ర్యాంకు సాధించటం విశేషం. -
ఉపకార వేతనానికి దరఖాస్తుల ఆహ్వానం
[ 19-05-2024]
2024-25 విద్యా సంవత్సరానికి ఖమ్మం జిల్లాకు చెందిన విదేశాల్లో చదివే గిరిజన విద్యార్థులు ఈనెల 31 లోపు ఉపకార వేతనానికి దరఖాస్తు చేసుకోవాలని జిల్లా గిరిజన అభివృద్ధి అధికారి ఎన్.విజయలక్ష్మి శనివారం తెలిపారు. -
రహదారుల పనులకు అనుమతి ఇవ్వండి: తుమ్మల
[ 19-05-2024]
ఆర్సీపీఎల్డబ్ల్యూఈఏ ఫేజ్-1, 3, ఎల్డబ్ల్యూఈ 2018-19, ఎస్సీఏ స్కీం కింద ప్రారంభించిన రహదారుల పనులకు అనుమతులు ఇవ్వాలని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అటవీశాఖ మంత్రి, పీసీసీఎఫ్లకు విజ్ఞప్తి చేశారు. -
గ్రూప్-1 ప్రిలిమ్స్కు ఏర్పాట్లు
[ 19-05-2024]
గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్ష నిర్వహణకు ఏర్పాట్లు చేయాలని టీఎస్పీఎస్సీ ఛైర్మన్ మహేందర్రెడ్డి అన్నారు. హైదరాబాద్ నుంచి శనివారం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్కు కలెక్టర్ గౌతమ్ హాజరయ్యారు.
తాజా వార్తలు (Latest News)
-
అత్యంత పొట్టి మహిళతో ది గ్రేట్ ఖలీ.. వీడియో వైరల్
-
ధోనీ కొట్టిన ఆ భారీ సిక్సే ఆర్సీబీని గెలిపించిందా..?
-
వైకాపా ఆధ్వర్యంలో పోస్టల్ బ్యాలెట్ల తరలింపు.. కూటమి అభ్యర్థుల ఆందోళన
-
పార్లమెంటు భద్రత.. రంగంలోకి 3300 మంది ‘సీఐఎస్ఎఫ్’ సిబ్బంది
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
-
రాయ్బరేలీలో రాహుల్ పోటీ.. సోనియాపై ప్రధాని విమర్శలు