పకడ్బందీ శిక్షణ.. ప్రజాస్వామ్యానికి రక్షణ
సార్వత్రిక సమరంలో అత్యంత కీలక ఘట్టమైన పోలింగ్ నిర్వహణకు అధికార యంత్రాంగం సిద్ధమవుతోంది. దేశ భవిష్యత్తు, అభ్యర్థుల గెలుపోటములను నిర్ణయించడంలో ప్రతి ఓటూ కీలకమవటంతో పోలింగ్ క్రతువులో అవకతవకలకు తావివ్వకుండా ఎన్నికల సంఘం జాగ్రత్తలు తీసుకుంటోంది.
ఈనాడు డిజిటల్, కొత్తగూడెం
సార్వత్రిక సమరంలో అత్యంత కీలక ఘట్టమైన పోలింగ్ నిర్వహణకు అధికార యంత్రాంగం సిద్ధమవుతోంది. దేశ భవిష్యత్తు, అభ్యర్థుల గెలుపోటములను నిర్ణయించడంలో ప్రతి ఓటూ కీలకమవటంతో పోలింగ్ క్రతువులో అవకతవకలకు తావివ్వకుండా ఎన్నికల సంఘం జాగ్రత్తలు తీసుకుంటోంది. ఇందుకోసం జిల్లా, శాసనసభ నియోజకవర్గ స్థాయి మాస్టర్ ట్రెయినీలను నియమించింది. ఖమ్మం, భద్రాద్రి జిల్లాల్లో పోలింగ్ సిబ్బందిని ఎంపిక చేసి శిక్షణ కార్యక్రమాలు నిర్వహించింది. పోలింగ్ సిబ్బంది శిక్షణ విధానం, పోలింగ్ రోజు చేయాల్సిన, చేయకూడని పనుల వివరాలతో సమగ్ర కథనం.
జిల్లాకు ఇద్దరి చొప్పున మాస్టర్ ట్రెయినీలు
జిల్లా ఎన్నికల అధికారి (కలెక్టర్) సంబంధిత జిల్లాకు ఇద్దరి చొప్పున మాస్టర్ ట్రెయినీ (డిస్ట్రిక్ట్ లెవెల్ మాస్టర్ ట్రెయినీ)లను నియమిస్తారు. వీరిలో ఒకరు ఈవీఎంల టెక్నికల్ అంశాలు బోధిస్తారు. మరొకరు పోలింగ్ ప్రక్రియలో సిబ్బంది తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పిస్తారు. శిక్షకులుగా పనిచేసిన అనుభవం, ఎన్నికల నిర్వహణపై అవగాహన ఆధారంగా మాస్టర్ ట్రెయినీల నియామకం జరుగుతుంది. పోలింగ్ సిబ్బందికి మొదటి విడత శిక్షణ తరగతులను డీఎల్ఎంటీలు నిర్వహిస్తారు. అనంతరం ఒక్కో శాసనసభ నియోజకవర్గానికి నియమించిన ఏఎల్ఎంటీ(అసెంబ్లీ లెవెల్ మాస్టర్ ట్రెయినీ)లకు తర్ఫీదు ఇస్తారు. ఏఎల్ఎంటీలను సైతం జిల్లా ఎన్నికల అధికారే నియమిస్తారు. ఎన్నికల ప్రక్రియలో వారికి ఉన్న అనుభవం ఆధారంగా నియామకం జరుగుతుంది.
ముగిసిన రెండో విడత శిక్షణ
పోలింగ్ సిబ్బంది ఎంపిక అనంతరం ఆయా శాసనసభ నియోజకవర్గాల్లో తొలి విడత శిక్షణ తరగతులను డీఎల్ఎంటీల ఆధ్వర్యంలో నిర్వహించారు. ఆతర్వాత చేపట్టిన తొలి విడత ర్యాండమైజేషన్ ద్వారా సిబ్బంది పోలింగ్ విధులు నిర్వర్తించబోయే నియోజకవర్గాలను ఖరారు చేశారు. సిబ్బందికి కేటాయించిన నియోజకవర్గాల్లో ఇటీవల రెండో విడత శిక్షణ తరగతులు సంబంధిత ఏఎల్ఎంటీల ఆధ్వర్యంలో జరిగాయి. శిక్షణ పూర్తిచేసుకున్న సిబ్బందికి పోలింగ్కు ఒకరోజు ముందు రెండో విడత ర్యాండమైజేషన్ ద్వారా పోలింగ్ కేంద్రాలు నిర్ణయించనున్నారు.
గత ఎన్నికల్లో సిబ్బంది చేసిన పొరపాట్లు
- మాక్ పోల్ సమయంలో 50 ఓట్లు వేశాక కంట్రోల్ యూనిట్లో మొత్తం ఓట్లు చూడకుండా పోల్ ముగించటం.
- వీవీప్యాట్లోని మాక్పోల్ స్లిప్స్ తీయకుండా డ్రాప్ బాక్స్ మూసేసి ఓటింగ్ ప్రక్రియ మొదలుపెట్టడం.
- ఏదైనా కారణంతో వీవీప్యాట్ మార్చి మాక్ పోల్ నిర్వహించటం.
- పోస్టల్ బ్యాలెట్ పేపర్ వినియోగించినవారి వివరాలు ఫాం-17సీలో అసంపూర్తిగా ఉండటం.
- ఫాం-17సీలో పోలింగ్ కేంద్రంలోని మొత్తం ఓట్లు అనే కాలమ్లో ఈవీఎంలో నమోదైన ఓట్ల సంఖ్య రాయటం.
- ఈవీఎంల నిర్వహణపై అవగాహన లేకపోవటంతో తరచూ వాటిని మార్చటం వల్ల సమయం వృథా కావటం.
- కంట్రోల్, బ్యాలెట్ యూనిట్ల గుర్తింపు ట్యాగ్లను ఒకదానికి బదులు మరొకటి కట్టడం.
పోలింగ్ కేంద్రంలో ప్రిసైడింగ్ అధికారి(పీఓ), అసిస్టెంట్ ప్రిసైడింగ్ అధికారి(ఏపీఓ), అదర్ పోలింగ్ ఆఫీసర్స్(ఓపీఓలు) బాధ్యతలు, గతంలో జరిగిన పొరపాట్లు పునరావృతం కాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించాం. బ్యాలెట్ యూనిట్లను కంట్రోల్ యూనిట్, వీవీప్యాట్కు అనుసంధానించి వాటిని ఉపయోగించటంపై తర్ఫీదునిచ్చాం. పోలింగ్ కంటే ముందు ఈసీ ఏమైనా మార్పులు చేస్తే ఆవివరాలను సిబ్బందికి సెక్టోరల్ అధికారులు తెలియజేస్తారు. కావాల్సిన దానికంటే 20 శాతం అదనంగా సిబ్బందిని ఎంపికచేసి శిక్షణ ఇచ్చాం.
పూసపాటి సాయికృష్ణ, డీఎల్ఎంటీ, భద్రాద్రి కొత్తగూడెం
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
సీతారామ ప్రాజెక్టు కాలువను వేగంగా పూర్తి చేయాలి
[ 19-05-2024]
సీతారామ ప్రాజెక్టు కాలువ పనులను వేగవంతంగా పూర్తి చేసి సాగు, తాగునీటిని సరఫరా చేయాలని తెలుగుదేశం పార్టీ లీగల్ సెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మల్లెం పాటి అప్పారావు అన్నారు. -
మేమేం పాపం చేశాం నాన్నా..!
[ 19-05-2024]
ఆస్తి కోసం ఓ కర్కశకుడు కన్నతల్లి, తన ఇద్దరు కూతుళ్లను హతమార్చిన సంఘటనతో.. ఎప్పుడూ ప్రశాంతంగా ఉండే ఖమ్మం జిల్లా తల్లాడ మండలం గోపాలపేటలో కలకలం రేగింది. గ్రామానికి చెందిన ట్రాక్టర్ డ్రైవర్ పిట్టల వెంకటేశ్వర్లు మొదటి భార్య మృతితో త్రివేణిని రెండో వివాహం చేసుకోవడం.. -
బాధిత మహిళలకు భరోసా..
[ 19-05-2024]
ప్రస్తుత సమాజంలో మహిళలు, చిన్నారులు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య.. లైంగిక వేధింపులు. జరిగే అన్యాయాన్ని పరువు కోసం బయటకు చెప్పుకోలేక కుమిలిపోతున్న వారెందరో ఉన్నారు. -
ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు 55 పోలింగ్ కేంద్రాలు: కలెక్టర్
[ 19-05-2024]
పూర్వ వరంగల్, ఖమ్మం, నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక ఏర్పాట్లు వేగవంతం చేయాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ప్రియాంక అల ఆదేశించారు. ఉప ఎన్నిక సిబ్బంది నియామకం, ఏర్పాట్లపై శనివారం కలెక్టరేట్లో సమీక్ష నిర్వహించారు. -
టీఎస్ఈఏపీ సెట్లో జిల్లా విద్యార్థుల ప్రతిభ
[ 19-05-2024]
2024-25 విద్యా సంవత్సరానికి ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించిన టీఎస్ ఈఏపీ సెట్ ఫలితాలు శనివారం విడుదలయ్యాయి. ఖమ్మం నగరానికి చెందిన పలు ప్రైవేటు జూనియర్ కళాశాలల విద్యార్థులు ప్రతిభ చూపారు. -
ఐటీఐ ప్రవేశాలకు వేళాయె..!
[ 19-05-2024]
పదో తరగతి ఫలితాల వెల్లడి నేపథ్యంలో ఐటీఐ కళాశాలల్లో ప్రవేశాలకు అధికారులు చర్యలు ప్రారంభించారు. ‘2024-25’ విద్యా సంవత్సరం ప్రవేశాలకు ఈ నెల 16 నుంచి జూన్ 10వ తేదీ వరకు ఆన్లైన్లో దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. -
పిడుగుపాటుతో రైతు మృతి
[ 19-05-2024]
పిడుగుపాటుకు పొలంలో ఓ రైతు మృతి చెందిన ఘటన శనివారం చోటు చేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం.. రామచంద్రాపురం గ్రామానికి చెందిన సంపసాల కృష్ణ(55) వ్యవసాయం చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నారు. -
ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్కు మద్దతు: తమ్మినేని
[ 19-05-2024]
పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి జరిగే ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థికి మద్దతు ఇవ్వాలని నిర్ణయించినట్లు సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం తెలిపారు. -
రామయ్యకు బంగారు తులసీ దళార్చన
[ 19-05-2024]
భద్రాచలం శ్రీసీతారామచంద్ర స్వామి ఆలయంలో శనివారం భక్తులు పోటెత్తారు. క్యూలైన్లతో పాటు ప్రసాదాల కౌంటర్లు కిటకిటలాడాయి. పసిడితో తయారు చేసిన తులసీ దళాలను సీతారాముడి పాదాల చెంత ఉంచి అర్చన చేశారు. -
‘మహస్వి’కి 102వ ర్యాంకు
[ 19-05-2024]
టీఎస్ ఈఏపీసెట్ ఫలితాల్లో ఖమ్మం న్యూవిజన్ జూనియర్ కళాశాలకు చెందిన విద్యార్థిని జి.మహస్వి రాష్ట్రస్థాయిలో 102వ ర్యాంకు సాధింది. జేఈఈ మెయిన్స్లో సైతం ఆలిండియా ఓపెన్ కేటగిరీలో 732వ ర్యాంకు సాధించటం విశేషం. -
ఉపకార వేతనానికి దరఖాస్తుల ఆహ్వానం
[ 19-05-2024]
2024-25 విద్యా సంవత్సరానికి ఖమ్మం జిల్లాకు చెందిన విదేశాల్లో చదివే గిరిజన విద్యార్థులు ఈనెల 31 లోపు ఉపకార వేతనానికి దరఖాస్తు చేసుకోవాలని జిల్లా గిరిజన అభివృద్ధి అధికారి ఎన్.విజయలక్ష్మి శనివారం తెలిపారు. -
రహదారుల పనులకు అనుమతి ఇవ్వండి: తుమ్మల
[ 19-05-2024]
ఆర్సీపీఎల్డబ్ల్యూఈఏ ఫేజ్-1, 3, ఎల్డబ్ల్యూఈ 2018-19, ఎస్సీఏ స్కీం కింద ప్రారంభించిన రహదారుల పనులకు అనుమతులు ఇవ్వాలని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అటవీశాఖ మంత్రి, పీసీసీఎఫ్లకు విజ్ఞప్తి చేశారు. -
గ్రూప్-1 ప్రిలిమ్స్కు ఏర్పాట్లు
[ 19-05-2024]
గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్ష నిర్వహణకు ఏర్పాట్లు చేయాలని టీఎస్పీఎస్సీ ఛైర్మన్ మహేందర్రెడ్డి అన్నారు. హైదరాబాద్ నుంచి శనివారం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్కు కలెక్టర్ గౌతమ్ హాజరయ్యారు.
తాజా వార్తలు (Latest News)
-
హిందీ ‘గజనీ’.. మురుగదాస్ ఫస్ట్ ఛాయిస్ సల్మాన్
-
అత్యంత పొట్టి మహిళతో ది గ్రేట్ ఖలీ.. వీడియో వైరల్
-
ధోనీ కొట్టిన ఆ భారీ సిక్సే ఆర్సీబీని గెలిపించిందా..?
-
వైకాపా ఆధ్వర్యంలో పోస్టల్ బ్యాలెట్ల తరలింపు.. కూటమి అభ్యర్థుల ఆందోళన
-
పార్లమెంటు భద్రత.. రంగంలోకి 3300 మంది ‘సీఐఎస్ఎఫ్’ సిబ్బంది
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM