రఘురాంరెడ్డిని గెలిపిస్తే.. ‘ఖమ్మం’ను అగ్రస్థానంలో నిలబెడతారు
కాంగ్రెస్ అభ్యర్థి రామసహాయం రఘురాంరెడ్డిని గెలిపిస్తే ఖమ్మం లోక్సభ స్థానాన్ని అభివృద్ధిలో రాష్ట్రంలోనే మొదటి స్థానంలో నిలబెడతారని సినీనటుడు విక్టరీ వెంకటేశ్ అన్నారు. పట్టణ ప్రముఖులు, వైద్యులతో కొత్తగూడెం క్లబ్లో కాంగ్రెస్ ఆధ్వర్యంలో మంగళవారం రాత్రి నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనంలో ఆయన మాట్లాడారు.
ఆత్మీయ సమ్మేళనంలో సినీనటుడు విక్టరీ వెంకటేశ్
ఆత్మీయ సమ్మేళనంలో ప్రసంగిస్తున్న సినీనటుడు వెంకటేశ్, వేదికపై మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి, రాజ్యసభ సభ్యురాలు రేణుకాచౌదరి, అభ్యర్థి రఘురాంరెడ్డి, ఎమ్మెల్యే రాందాస్నాయక్, కాంగ్రెస్ నాయకులు కోనేరు చిన్ని, నాగసీతారాములు, సీపీఐ జిల్లా కార్యదర్శి సాబీర్పాషా, జడ్పీ ఛైర్మన్ కె.చంద్రశేఖర్రావు, మువ్వా విజయ్బాబు
కొత్తగూడెం పట్టణం, న్యూస్టుడే: కాంగ్రెస్ అభ్యర్థి రామసహాయం రఘురాంరెడ్డిని గెలిపిస్తే ఖమ్మం లోక్సభ స్థానాన్ని అభివృద్ధిలో రాష్ట్రంలోనే మొదటి స్థానంలో నిలబెడతారని సినీనటుడు విక్టరీ వెంకటేశ్ అన్నారు. పట్టణ ప్రముఖులు, వైద్యులతో కొత్తగూడెం క్లబ్లో కాంగ్రెస్ ఆధ్వర్యంలో మంగళవారం రాత్రి నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనంలో ఆయన మాట్లాడారు. ‘రఘురాంరెడ్డి కుటుంబం చాలా మంచిది. వారి నడవడిక నచ్చే నా కుమార్తెను కోడలిగా పంపించా. ఆయన్ను ఎంపీగా గెలిపిస్తే ఖమ్మం లోక్సభ స్థానంలోని ప్రజలు, నాయకులు, కార్యకర్తలను కూడా తన కుమార్తె మాదిరి జాగ్రత్తగా చూసుకుంటారన్న నమ్మకం ఉంది. ఈనెల 13న జరిగే పోలింగ్లో హస్తం గుర్తుపై ఓటేసి భారీ మెజార్టీతో రఘురాంరెడ్డిని గెలిపించాలి’ అని వెంకటేశ్ కోరారు. కార్యక్రమానికి హాజరైనవారు డైలాగ్ చెప్పాలని కోరగా, ‘డైలాగ్లు సినిమాలకే పరిమితం. ఇప్పుడంతా ఒకటే డైలాగ్. 13న పోలింగ్ కేంద్రాలకు వెళ్లాలి. హస్తం గుర్తుపై ఓటెయ్యాలి. అంతే..!’ అని తనదైన శైలిలో స్పందించారు. 18 ఏళ్లు నిండిన వారంతా ఓటుహక్కును సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఓటుహక్కు మనందరి చేతుల్లో ఆయుధం వంటిదని చెప్పారు. కార్యక్రమంలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి, రాజ్యసభ సభ్యురాలు రేణుకా చౌదరి, వైరా ఎమ్మెల్యే మాలోతు రాందాస్నాయక్ తదితరులు పాల్గొన్నారు.
కొత్తగూడెం సింగరేణి: గడిచిన పదేళ్లలో భాజపా భారాస.. కార్మికులకు తీరని అన్యాయం చేశాయని కాంగ్రెస్ అభ్యర్థి రామసహాయం రఘురాంరెడ్డి ఆరోపించారు. కొత్తగూడెంలోని శేషగిరిభవన్లో సీపీఐ అనుబంధ కార్మిక సంఘం సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ మంగళవారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. కార్మిక చట్టాలను భాజపా ప్రభుత్వం కాలరాసిందన్నారు. దక్షిణ భారత అతిపెద్ద సంస్థ సింగరేణి ప్రైవేటీకరణకు కుట్రలు పన్నుతోందని విమర్శించారు. సీపీఐ జిల్లా కార్యదర్శి సాబీర్పాషా, యూనియన్ నాయకులు వంగా వెంకట్, క్రిస్టోఫర్, వట్టికొండ మల్లికార్జున్, రమణమూర్తి, వీరాస్వామి, నగేష్, కాంగ్రెస్ నాయకులు ఆళ్లమురళి, నాగేంద్ర త్రివేది, శివప్రసాద్ పాల్గొన్నారు.
ఇద్దరూ కలిశారు.. భారీ మెజారిటీ సాధించాలి: మంత్రి తుమ్మల
వాజేడు, ఏటూరునాగారం, మంగపేట, న్యూస్టుడే: ‘శాసనసభ ఎన్నికల్లో భద్రాచలం నియోజకవర్గంలో పోటీపడిన ఇద్దరు కలిశారు. ఆ ఎన్నికల్లో ఇద్దరికి పోలైన ఓట్లు లోక్సభ ఎన్నికల్లో సాధించి భారీ మెజారిటీతో కాంగ్రెస్ అభ్యర్థి బలరాంనాయక్ను గెలిపించాలి’ అని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. ములుగు జిల్లా మంగపేట, ఏటూరునాగారం, వాజేడు మండలాల్లో పంచాయతీరాజ్శాఖ మంత్రి సీతక్కతో కలిసి మంగళవారం పర్యటించారు. వాజేడులో వాజేడు, వెంకటాపురం, చర్ల మండలాల ముఖ్య కార్యకర్తల సమావేశంలో తుమ్మల మాట్లాడారు. గోదావరి పరివాహక ప్రాంతంలో భద్రాచలం నియోజకవర్గ అభివృద్ధికి తాను బాధ్యత తీసుకుంటానని హామీ ఇచ్చారు. భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు, కాంగ్రెస్ అభ్యర్థి పోరిక బలరాంనాయక్, భద్రాద్రి కొత్తగూడెం డీసీసీ అధ్యక్షుడు పొదెం వీరయ్య తదితరులు పాల్గొన్నారు.
మహబూబాబాద్: కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారంటీ పథకాల్లో ఇప్పటికే అయిదింటిని అమలుచేసిందని రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జి దీపాదాస్ మున్షీ అన్నారు. రాష్ట్రంలో అధిక స్థానాల్లో కాంగ్రెస్ విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. మహబూబాబాద్లోని డీసీసీ కార్యాలయంలో మాట్లాడారు.ఏఐసీసీ కార్యదర్శి రోహిత్చౌదరి, మహబూబాబాద్, డోర్నకల్, ఇల్లెందు, పినపాక ఎమ్మెల్యేలు మురళీనాయక్, రాంచంద్రునాయక్, కోరం కనకయ్య, పాయం వెంకటేశ్వర్లు, లోక్సభ స్థానం కాంగ్రెస్ అభ్యర్థి పోరిక బలరాంనాయక్ తదితరులు పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
సీతారామ ప్రాజెక్టు కాలువను వేగంగా పూర్తి చేయాలి
[ 19-05-2024]
సీతారామ ప్రాజెక్టు కాలువ పనులను వేగవంతంగా పూర్తి చేసి సాగు, తాగునీటిని సరఫరా చేయాలని తెలుగుదేశం పార్టీ లీగల్ సెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మల్లెం పాటి అప్పారావు అన్నారు. -
మేమేం పాపం చేశాం నాన్నా..!
[ 19-05-2024]
ఆస్తి కోసం ఓ కర్కశకుడు కన్నతల్లి, తన ఇద్దరు కూతుళ్లను హతమార్చిన సంఘటనతో.. ఎప్పుడూ ప్రశాంతంగా ఉండే ఖమ్మం జిల్లా తల్లాడ మండలం గోపాలపేటలో కలకలం రేగింది. గ్రామానికి చెందిన ట్రాక్టర్ డ్రైవర్ పిట్టల వెంకటేశ్వర్లు మొదటి భార్య మృతితో త్రివేణిని రెండో వివాహం చేసుకోవడం.. -
బాధిత మహిళలకు భరోసా..
[ 19-05-2024]
ప్రస్తుత సమాజంలో మహిళలు, చిన్నారులు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య.. లైంగిక వేధింపులు. జరిగే అన్యాయాన్ని పరువు కోసం బయటకు చెప్పుకోలేక కుమిలిపోతున్న వారెందరో ఉన్నారు. -
ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు 55 పోలింగ్ కేంద్రాలు: కలెక్టర్
[ 19-05-2024]
పూర్వ వరంగల్, ఖమ్మం, నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక ఏర్పాట్లు వేగవంతం చేయాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ప్రియాంక అల ఆదేశించారు. ఉప ఎన్నిక సిబ్బంది నియామకం, ఏర్పాట్లపై శనివారం కలెక్టరేట్లో సమీక్ష నిర్వహించారు. -
టీఎస్ఈఏపీ సెట్లో జిల్లా విద్యార్థుల ప్రతిభ
[ 19-05-2024]
2024-25 విద్యా సంవత్సరానికి ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించిన టీఎస్ ఈఏపీ సెట్ ఫలితాలు శనివారం విడుదలయ్యాయి. ఖమ్మం నగరానికి చెందిన పలు ప్రైవేటు జూనియర్ కళాశాలల విద్యార్థులు ప్రతిభ చూపారు. -
ఐటీఐ ప్రవేశాలకు వేళాయె..!
[ 19-05-2024]
పదో తరగతి ఫలితాల వెల్లడి నేపథ్యంలో ఐటీఐ కళాశాలల్లో ప్రవేశాలకు అధికారులు చర్యలు ప్రారంభించారు. ‘2024-25’ విద్యా సంవత్సరం ప్రవేశాలకు ఈ నెల 16 నుంచి జూన్ 10వ తేదీ వరకు ఆన్లైన్లో దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. -
పిడుగుపాటుతో రైతు మృతి
[ 19-05-2024]
పిడుగుపాటుకు పొలంలో ఓ రైతు మృతి చెందిన ఘటన శనివారం చోటు చేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం.. రామచంద్రాపురం గ్రామానికి చెందిన సంపసాల కృష్ణ(55) వ్యవసాయం చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నారు. -
ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్కు మద్దతు: తమ్మినేని
[ 19-05-2024]
పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి జరిగే ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థికి మద్దతు ఇవ్వాలని నిర్ణయించినట్లు సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం తెలిపారు. -
రామయ్యకు బంగారు తులసీ దళార్చన
[ 19-05-2024]
భద్రాచలం శ్రీసీతారామచంద్ర స్వామి ఆలయంలో శనివారం భక్తులు పోటెత్తారు. క్యూలైన్లతో పాటు ప్రసాదాల కౌంటర్లు కిటకిటలాడాయి. పసిడితో తయారు చేసిన తులసీ దళాలను సీతారాముడి పాదాల చెంత ఉంచి అర్చన చేశారు. -
‘మహస్వి’కి 102వ ర్యాంకు
[ 19-05-2024]
టీఎస్ ఈఏపీసెట్ ఫలితాల్లో ఖమ్మం న్యూవిజన్ జూనియర్ కళాశాలకు చెందిన విద్యార్థిని జి.మహస్వి రాష్ట్రస్థాయిలో 102వ ర్యాంకు సాధింది. జేఈఈ మెయిన్స్లో సైతం ఆలిండియా ఓపెన్ కేటగిరీలో 732వ ర్యాంకు సాధించటం విశేషం. -
ఉపకార వేతనానికి దరఖాస్తుల ఆహ్వానం
[ 19-05-2024]
2024-25 విద్యా సంవత్సరానికి ఖమ్మం జిల్లాకు చెందిన విదేశాల్లో చదివే గిరిజన విద్యార్థులు ఈనెల 31 లోపు ఉపకార వేతనానికి దరఖాస్తు చేసుకోవాలని జిల్లా గిరిజన అభివృద్ధి అధికారి ఎన్.విజయలక్ష్మి శనివారం తెలిపారు. -
రహదారుల పనులకు అనుమతి ఇవ్వండి: తుమ్మల
[ 19-05-2024]
ఆర్సీపీఎల్డబ్ల్యూఈఏ ఫేజ్-1, 3, ఎల్డబ్ల్యూఈ 2018-19, ఎస్సీఏ స్కీం కింద ప్రారంభించిన రహదారుల పనులకు అనుమతులు ఇవ్వాలని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అటవీశాఖ మంత్రి, పీసీసీఎఫ్లకు విజ్ఞప్తి చేశారు. -
గ్రూప్-1 ప్రిలిమ్స్కు ఏర్పాట్లు
[ 19-05-2024]
గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్ష నిర్వహణకు ఏర్పాట్లు చేయాలని టీఎస్పీఎస్సీ ఛైర్మన్ మహేందర్రెడ్డి అన్నారు. హైదరాబాద్ నుంచి శనివారం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్కు కలెక్టర్ గౌతమ్ హాజరయ్యారు.
తాజా వార్తలు (Latest News)
-
కిల్లర్ టైగర్ కోసం 150 కెమెరాలతో నిఘా.. 36 గ్రామాల్లో రెడ్ అలర్ట్!
-
బహిరంగ సభ మధ్యలోనే వెనుదిరిగిన రాహుల్.. కారణమిదే..
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
నిలిచిపోయిన కాగజ్నగర్, నవజీవన్ ఎక్స్ప్రెస్ రైళ్లు .. ప్రయాణికుల ఆందోళన
-
భార్య, కుమారుడు వేధిస్తున్నారు, భరణం ఇప్పించండి - మాజీ మంత్రి వేడుకోలు
-
రాజస్థాన్, కోల్కతా మ్యాచ్కు వరుణుడి ఆటంకం.. మ్యాచ్ రద్దయితే హైదరాబాద్కు లాభం..