రక్తహీనత.. బాధితులకు చేయూత
థలసీమియా.. చిన్నారులకు ఒక శాపం. వంశపారంపర్యంగా, మేనరికం వివాహాల వల్ల ఇది సంక్రమిస్తుందని వైద్యులు చెబుతున్నారు. వ్యాధి బయటపడిన చిన్నారులు నెలకోసారి రక్తం ఎక్కించుకుంటూ జీవితకాలాన్ని పొడిగించుకుంటూ నరకయాతన అనుభవిస్తున్నారు.
న్యూస్టుడే, ఖమ్మం వైద్యవిభాగం
థలసీమియా.. చిన్నారులకు ఒక శాపం. వంశపారంపర్యంగా, మేనరికం వివాహాల వల్ల ఇది సంక్రమిస్తుందని వైద్యులు చెబుతున్నారు. వ్యాధి బయటపడిన చిన్నారులు నెలకోసారి రక్తం ఎక్కించుకుంటూ జీవితకాలాన్ని పొడిగించుకుంటూ నరకయాతన అనుభవిస్తున్నారు. ఇటువంటి చిన్నారులకు కొన్ని సంస్థలు చేయూత ఇస్తున్నాయి. ఉచితంగా రక్తం ఎక్కించడంతోపాటు అవసరమైన చికిత్సను ఉచితంగా అందజేస్తున్నాయి. బ్లడ్ గ్రూపు సరిపోయే దాతలు ఎముక మజ్జ దానం చేయడానికి ముందుకొస్తే దాని మార్పిడి ద్వారా బాధిత చిన్నారులు శాశ్వతంగా వ్యాధి నుంచి బయట పడవచ్చు. ఖమ్మం జిల్లాలో 600 మందికి పైగా బాధితులు ఉండగా.. పలువురికి ఎముక మజ్జ మార్పిడి చికిత్స అందించి ప్రాణాలు నిలబెట్టారు. నేడు ‘ప్రపంచ థలసీమియా దినం’ సందర్భంగా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో బాధితులు, స్వచ్ఛంద సంస్థల సేవలు, జాగ్రత్తలపై ‘న్యూస్టుడే’ ప్రత్యేక కథనం..
వ్యాధి లక్షణాలు
థలసీమియా బాధితుల్లో ఎర్ర రక్తకణాలు వృద్ధి చెందవు. హిమోగ్లోబిన్ తగినంత లేక గుండె వేగంగా కొట్టుకుంటుంది. ఆయాసం, తలనొప్పి, ఏకాగ్రత లోపం, చర్మం పాలిపోవటం వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఫలితంగా జీవితకాలం తగ్గిపోతుంది. బాధితులకు సమస్య తీవ్రతను బట్టి పదిహేను/నెల రోజులకోసారి రక్తం ఎక్కించాలి. ఏజెన్సీ ప్రాంతాల్లో ఎక్కువ మంది సమస్యను ఎదుర్కొంటున్నారు. వివాహానికి ముందు సంబంధిత జన్యు పరీక్షలు చేయించుకొని వ్యాధిని అరికట్టవచ్చు.
శాశ్వత పరిష్కారం
వ్యాధి పూర్తిగా నయం కావడానికి ఎముక మజ్జ(మూలిగ) మార్పిడి దోహదపడుతుంది. దాతలు మజ్జ ఇచ్చేందుకు ముందుకు రావాలి. చికిత్స ఖరీదైంది. ప్రభుత్వాలు ఆరోగ్యశ్రీలో చేర్చినా పూర్తిగా సేవలు లభించడం లేదు. దీంతో బాధితులు స్వచ్ఛంద సంస్థల సాయంపైన ఆధారపడాల్సి వస్తోంది. కుటుంబంలో ఒకరికి థలసీమియా ఉందని తేలితే మొత్తం సభ్యులు పరీక్షలు చేయించుకోవాలి. మేనరికం థలసీమియాకు ఓ కారణమని వైద్య పరీక్షల్లో నిర్ధారించారు.
జిల్లాలో సంస్థల సహకారం..
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో స్వచ్ఛంద సంస్థలు, సొసైటీలు బాధితులకు అండగా నిలుస్తున్నాయి. ఉచితంగా రక్తదానం, మందులు పంపిణీ చేస్తున్నాయి. మూలకణ పరీక్షలు చేయిస్తూ ఖరీదైన ఎముక మజ్జ మార్పిడి చికిత్సలకు సహకరిస్తున్నాయి.
సంకల్ప స్వచ్ఛంద సంస్థ..
సంకల్ప స్వచ్ఛంద సంస్థ రితన్య డేకేర్ సెంటర్లో 250 మంది బాధితులు తమ వివరాలను నమోదు చేసుకున్నారు. ఇప్పటి వరకు 100 కుటుంబాలకు మూలకణ(హెచ్ఎల్ఏ) పరీక్షలు చేయించారు. దాతల సాయంతో మందులు, రక్తాన్ని సేకరించి ఉచితంగా అందిస్తున్నారు. బాధిత చిన్నారుల్లో 12 మందికి బోన్మ్యారో(ఎముక మజ్జ మార్పిడి) చికిత్సలు ఇప్పించగా 8 మంది వ్యాధి నుంచి విముక్తి పొందారు. ఆర్టీసీ కండక్టర్గా పని చేస్తున్న అనిత తన కుటుంబ సభ్యులతో కలిసి ఈ సంస్థ నిర్వహణ బాధ్యతలను చూస్తున్నారు.
సికిల్ సెల్ సొసైటీ..
హైదరాబాద్ కేంద్రంగా నిర్వహిస్తున్న థలసీమియా సికిల్ సెల్ సొసైటీ ఖమ్మంలో బ్రాంచిని ఏర్పాటు చేసింది. ప్రముఖ పిల్లల వైద్య నిపుణులు కూరపాటి ప్రదీప్కుమార్ ఈ కేంద్రాన్ని పర్యవేక్షిస్తున్నారు. ఖమ్మంతో పాటు పరిసర జిల్లాలకు చెందిన 300 మంది పిల్లలు ఇక్కడ ఉచిత సేవలు పొందుతున్నారు. ఇప్పటివరకు 12 మందికి బోన్మ్యారో చికిత్సలు చేయించగా ఒకరు మినహా అందరూ వ్యాధి బారి నుంచి బయటపడ్డారు.
నయం చేసే మందులు లేవు..
- నెట్టెం సింధూర, పిల్లల వైద్య నిపుణురాలు
పుట్టిన ఆరు నెలల తర్వాత వ్యాధి లక్షణాలు బయటపడతాయి. దీన్ని పూర్తిగా నయం చేసే మందులు లేవు. బోన్మ్యారో చికిత్సతోనే నిర్మూలన సాధ్యం. బాధితులకు శరీరంలో రక్తం తగ్గిపోతుంటుంది. వైద్యుల సలహా మేరకు దాతల నుంచి సేకరించిన ఆరోగ్యకరమైన రక్తాన్ని ఎక్కించాలి. బరువు ప్రకారం తగిన మోతాదుతో అందించాలి. దీనివల్ల దుష్ప్రభావాలు కూడా ఉంటాయి. వాటిని తగ్గించడానికి మందులు వాడాలి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
సీతారామ ప్రాజెక్టు కాలువను వేగంగా పూర్తి చేయాలి
[ 19-05-2024]
సీతారామ ప్రాజెక్టు కాలువ పనులను వేగవంతంగా పూర్తి చేసి సాగు, తాగునీటిని సరఫరా చేయాలని తెలుగుదేశం పార్టీ లీగల్ సెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మల్లెం పాటి అప్పారావు అన్నారు. -
మేమేం పాపం చేశాం నాన్నా..!
[ 19-05-2024]
ఆస్తి కోసం ఓ కర్కశకుడు కన్నతల్లి, తన ఇద్దరు కూతుళ్లను హతమార్చిన సంఘటనతో.. ఎప్పుడూ ప్రశాంతంగా ఉండే ఖమ్మం జిల్లా తల్లాడ మండలం గోపాలపేటలో కలకలం రేగింది. గ్రామానికి చెందిన ట్రాక్టర్ డ్రైవర్ పిట్టల వెంకటేశ్వర్లు మొదటి భార్య మృతితో త్రివేణిని రెండో వివాహం చేసుకోవడం.. -
బాధిత మహిళలకు భరోసా..
[ 19-05-2024]
ప్రస్తుత సమాజంలో మహిళలు, చిన్నారులు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య.. లైంగిక వేధింపులు. జరిగే అన్యాయాన్ని పరువు కోసం బయటకు చెప్పుకోలేక కుమిలిపోతున్న వారెందరో ఉన్నారు. -
ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు 55 పోలింగ్ కేంద్రాలు: కలెక్టర్
[ 19-05-2024]
పూర్వ వరంగల్, ఖమ్మం, నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక ఏర్పాట్లు వేగవంతం చేయాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ప్రియాంక అల ఆదేశించారు. ఉప ఎన్నిక సిబ్బంది నియామకం, ఏర్పాట్లపై శనివారం కలెక్టరేట్లో సమీక్ష నిర్వహించారు. -
టీఎస్ఈఏపీ సెట్లో జిల్లా విద్యార్థుల ప్రతిభ
[ 19-05-2024]
2024-25 విద్యా సంవత్సరానికి ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించిన టీఎస్ ఈఏపీ సెట్ ఫలితాలు శనివారం విడుదలయ్యాయి. ఖమ్మం నగరానికి చెందిన పలు ప్రైవేటు జూనియర్ కళాశాలల విద్యార్థులు ప్రతిభ చూపారు. -
ఐటీఐ ప్రవేశాలకు వేళాయె..!
[ 19-05-2024]
పదో తరగతి ఫలితాల వెల్లడి నేపథ్యంలో ఐటీఐ కళాశాలల్లో ప్రవేశాలకు అధికారులు చర్యలు ప్రారంభించారు. ‘2024-25’ విద్యా సంవత్సరం ప్రవేశాలకు ఈ నెల 16 నుంచి జూన్ 10వ తేదీ వరకు ఆన్లైన్లో దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. -
పిడుగుపాటుతో రైతు మృతి
[ 19-05-2024]
పిడుగుపాటుకు పొలంలో ఓ రైతు మృతి చెందిన ఘటన శనివారం చోటు చేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం.. రామచంద్రాపురం గ్రామానికి చెందిన సంపసాల కృష్ణ(55) వ్యవసాయం చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నారు. -
ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్కు మద్దతు: తమ్మినేని
[ 19-05-2024]
పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి జరిగే ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థికి మద్దతు ఇవ్వాలని నిర్ణయించినట్లు సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం తెలిపారు. -
రామయ్యకు బంగారు తులసీ దళార్చన
[ 19-05-2024]
భద్రాచలం శ్రీసీతారామచంద్ర స్వామి ఆలయంలో శనివారం భక్తులు పోటెత్తారు. క్యూలైన్లతో పాటు ప్రసాదాల కౌంటర్లు కిటకిటలాడాయి. పసిడితో తయారు చేసిన తులసీ దళాలను సీతారాముడి పాదాల చెంత ఉంచి అర్చన చేశారు. -
‘మహస్వి’కి 102వ ర్యాంకు
[ 19-05-2024]
టీఎస్ ఈఏపీసెట్ ఫలితాల్లో ఖమ్మం న్యూవిజన్ జూనియర్ కళాశాలకు చెందిన విద్యార్థిని జి.మహస్వి రాష్ట్రస్థాయిలో 102వ ర్యాంకు సాధింది. జేఈఈ మెయిన్స్లో సైతం ఆలిండియా ఓపెన్ కేటగిరీలో 732వ ర్యాంకు సాధించటం విశేషం. -
ఉపకార వేతనానికి దరఖాస్తుల ఆహ్వానం
[ 19-05-2024]
2024-25 విద్యా సంవత్సరానికి ఖమ్మం జిల్లాకు చెందిన విదేశాల్లో చదివే గిరిజన విద్యార్థులు ఈనెల 31 లోపు ఉపకార వేతనానికి దరఖాస్తు చేసుకోవాలని జిల్లా గిరిజన అభివృద్ధి అధికారి ఎన్.విజయలక్ష్మి శనివారం తెలిపారు. -
రహదారుల పనులకు అనుమతి ఇవ్వండి: తుమ్మల
[ 19-05-2024]
ఆర్సీపీఎల్డబ్ల్యూఈఏ ఫేజ్-1, 3, ఎల్డబ్ల్యూఈ 2018-19, ఎస్సీఏ స్కీం కింద ప్రారంభించిన రహదారుల పనులకు అనుమతులు ఇవ్వాలని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అటవీశాఖ మంత్రి, పీసీసీఎఫ్లకు విజ్ఞప్తి చేశారు. -
గ్రూప్-1 ప్రిలిమ్స్కు ఏర్పాట్లు
[ 19-05-2024]
గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్ష నిర్వహణకు ఏర్పాట్లు చేయాలని టీఎస్పీఎస్సీ ఛైర్మన్ మహేందర్రెడ్డి అన్నారు. హైదరాబాద్ నుంచి శనివారం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్కు కలెక్టర్ గౌతమ్ హాజరయ్యారు.
తాజా వార్తలు (Latest News)
-
పీర్జాదిగూడ మేయర్, కార్పొరేటర్ల కిడ్నాప్నకు కాంగ్రెస్ యత్నం: హరీశ్రావు
-
కిల్లర్ టైగర్ కోసం 150 కెమెరాలతో నిఘా.. 36 గ్రామాల్లో రెడ్ అలర్ట్!
-
బహిరంగ సభ మధ్యలోనే వెనుదిరిగిన రాహుల్.. కారణమిదే..
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
నిలిచిపోయిన కాగజ్నగర్, నవజీవన్ ఎక్స్ప్రెస్ రైళ్లు .. ప్రయాణికుల ఆందోళన
-
భార్య, కుమారుడు వేధిస్తున్నారు, భరణం ఇప్పించండి - మాజీ మంత్రి వేడుకోలు