వేగ గణనకు వేదగణితం
తెలంగాణ కమిషనర్ ఆఫ్ కాలేజియేట్ ఆధ్వర్యంలో ప్రభుత్వ డిగ్రీ కళాశాలలకు రాష్ట్ర స్థాయిలో ‘జిజ్ఞాస’ విద్యార్థి కేంద్రక అధ్యయన ప్రాజెక్టు పోటీలు నిర్వహించారు.
‘జిజ్ఞాస’ పోటీల్లో రాష్ట్ర స్థాయిలో ప్రథమ బహుమతి
ఎస్ఆర్బీజీఎన్ఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థుల ప్రతిభ
పి.అనూరాధతో కలిసి ప్రశంస పత్రాలు చూపుతున్న విద్యార్థులు
ఖమ్మం విద్యావిభాగం, న్యూస్టుడే: ఇటీవల తెలంగాణ కమిషనర్ ఆఫ్ కాలేజియేట్ ఆధ్వర్యంలో ప్రభుత్వ డిగ్రీ కళాశాలలకు రాష్ట్ర స్థాయిలో ‘జిజ్ఞాస’ విద్యార్థి కేంద్రక అధ్యయన ప్రాజెక్టు పోటీలు నిర్వహించారు. హైదరాబాద్లో నిర్వహించిన ఈ పోటీల్లో ఖమ్మం ఎస్ఆర్బీజీఎన్ఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల గణిత విభాగం నుంచి ‘పారామౌంట్ వాల్యూ ఆఫ్ వేదిక్ మేథమెటిక్స్ ఇన్ కంప్యూటర్ ఇరా’ అనే అంశంపై గణిత సహాయ ఆచార్యురాలు పి.అనూరాధ పర్యవేక్షణలో సమర్పించిన నివేదికకు రాష్ట్ర స్థాయి ప్రథమ బహుమతి లభించింది. మొత్తం 132 ప్రభుత్వ డిగ్రీ కళాశాలలు పోటీల్లో పాల్గొన్నాయి. విజేతగా నిలిచినందుకు రూ.30 వేల నగదు బహుమతి అందుకున్నారు. ప్రాజెక్టులో విద్యార్థులు ఎస్.రక్షిత, పి.రిషిక, కె.మనీషా, బి.లలిత, జి.చందు పాల్గొన్నారు.
అధర్వణ వేదంలో...
భారత దేశం ప్రపంచానికి అందించిన అద్భుత బహుమతి వేద గణితం. వేదం అంటే జ్ఞానం. వేద గణితం నాలుగు వేదాల్లో ఒకటైన అధర్వణ వేదంలో పొందుపరిచారు. 1911 నుంచి 1918 సంవత్సరాల మధ్య కాలంలో స్వామి భారతీకృష్ణతీర్థ చేసిన కృషి ద్వారా 16 సూత్రాలు, 13 ఉప సూత్రాల రూపంలో వేదగణితం అందుబాటులోకి వచ్చింది. దీని సాధన ద్వారా అమోఘమైన ఏకాగ్రత, జ్ఞాపకశక్తి, గ్రహణశక్తి వస్తాయి.
‘వేగ’ గణనకు...
వేద గణితం ముఖ్య లక్షణం చాలా తక్కువ సమయంలో, అత్యంత వేగం, కచ్చితత్వంతో సులువైన పద్ధతిలో గణిత సమస్యలను సాధించటం. ముఖ్య సూత్రాల ద్వారా అంకశాస్త్రం, బీజగణితం, జ్యామితి, కాలిక్యులస్, త్రికోణమితి తదితర సమస్యలు సాధించే అవకాశం ఉంటుంది. ఇంతటి అద్భుత లక్షణాలున్న వేద గణిత సూత్రాలను ప్రస్తుతం కంప్యూటర్ ప్రోగ్రామింగ్లో(ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్), స్పేస్ ఇంజినీరింగ్లో, ‘నాసా’ వంటి సంస్థల్లో అంతరిక్ష పరిశోధనల్లో, రాకెట్లు, ఉపగ్రహాలు ప్రవేశ పెట్టేందుకు, సుదీర్ఘ గణనలను చేసే విభాగాల్లో ఉపయోగిస్తున్నారు.
రీ రోబోటిక్స్, బ్యాంకింగ్, ఫైనాన్స్, స్టాక్ ఎక్స్ఛేంజి రంగాల్లో దీన్ని ఉపయోగించేందుకు తయారుచేసిన ప్రాజెక్టే ‘పారామౌంట్ వాల్యూ ఆఫ్ వేదిక్ మేథమెటిక్స్’ రోజూ లక్షల సంఖ్యల్లో గణనలను ఉపయోగించే బ్యాంకింగ్, ఫైనాన్స్, స్టాక్ ఎక్ఛేంజ్ తదితర రంగాల్లో ఉపయోగించే కంప్యూటర్లు ఎంతో వేగంగా పని చేయాలి. సంప్రదాయ కంప్యూటర్ ప్రోగ్రామింగ్స్ వల్ల ఎక్కువ మెమరీ, ఎక్కువ విద్యుత్తు, సమయం అవసరమవుతాయి. కంప్యూటర్ ప్రాసెసర్ వేగాన్ని పెంచేందుకు వెరీ లార్జ్ స్కేల్ ఇంటిగ్రేటెడ్ చిప్స్ను వేద గణిత సూత్రాల ద్వారా నిర్మిస్తున్నారు. దీనినే ‘వేదిక్ మల్టిప్లయర్స్’ అంటారు. వీటితో పనిచేసే కంప్యూటర్లు ఎక్కువ వేగంగా, తక్కువ పవర్, మెమొరీని ఉపయోగించుకుని సమర్థంగా పని చేస్తున్నాయి. ఈ ప్రాజెక్టుకు రాష్ట్ర స్థాయి బహుమతి లభించింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
దోపిడీ, సామాజిక వివక్షపై ఉద్యమించాలి: తమ్మినేని
[ 20-05-2024]
సుందరయ్య స్ఫూర్తితో సామాజిక వివక్ష, దోపిడీ నిర్మూలనపై ఉద్యమించాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. సుజాతనగర్ సీపీఎం పార్టీ కార్యాలయం సత్యం భవన్లో సుందరయ్య వర్ధంతి సభ నిర్వహించారు. -
ఒక ఉపకేంద్రం 20 నియంత్రికల ధ్వంసం
[ 20-05-2024]
కొందరు దొంగలు సొత్తు కోసం వ్యవసాయ పొలాల్లోని విద్యుత్తు నియంత్రికలనూ వదలడం లదు. ఇలాంటి ఘటనలు నిత్యకృత్యమయ్యాయి. -
చికిత్స పొందుతూ యువకుడి మృతి
[ 20-05-2024]
ప్రమాదంలో తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతూ యువకుడు మృతి చెందిన సంఘటనపై రఘునాథపాలెం పోలీసు స్టేషన్లో ఆదివారం కేసు నమోదైంది. -
లాభాల లహరి
[ 20-05-2024]
టీఎస్ ఆర్టీసీ ప్రయాణికులకు మెరుగైన, సౌకర్యవంతమైన సేవలు అందిస్తూనే సంస్థ అభివృద్ధిపై దృష్టి సారిస్తోంది. ప్రైవేటుతో పోటీపడుతూ అధునాతన సదుపాయాలను తీసుకొస్తోంది. -
భూసార పరీక్షలు కొందరికే
[ 20-05-2024]
ఇష్టారీతి రసాయనిక ఎరువుల వినియోగంతో సాగు భూమి సారం కోల్పోయి నిర్జీవంగా మారుతుంది. పంట భూమిలో నత్రజని, భాస్వరం, సేంద్రియ కర్బనాల్లాంటి పోషకాలు ఎంత మోతాదులో ఉన్నాయో భూసార పరీక్షల ద్వారా తెలుసుకుని -
ప్రభుత్వ కళాశాలల్లో ప్రవేశాల పెంపుపై దృష్టి
[ 20-05-2024]
ప్రభుత్వ, ప్రైవేటు జూనియర్ కళాశాలల్లో ప్రవేశాలకు ఇంటర్మీడియట్ బోర్డు నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇప్పటికే దరఖాస్తుల స్వీకరణ ప్రారంభించారు. ఈ నేపథ్యంలో ప్రవేశాల సంఖ్య పెంపుపై జిల్లా అధికారులు దృష్టిపెట్టారు. -
బతుకుజీవుడా..
[ 20-05-2024]
జాతీయ, రాష్ట్రీయ రహదారులపై వాహనాలు వేగంగా దూసుకెళ్తుంటాయి. ప్రధాన మార్గాల్లో రాత్రివేళల్లోనూ రద్దీ ఎక్కువగా ఉంటుంది. ఈ క్రమంలో వేసవిలో రోడ్లపై కొనసాగుతున్న పశు సంచారం రోడ్డు ప్రమాదాలకు కారణమవుతోంది. -
పేదల కష్టసుఖాల్లో పాలుపంచుకుంటా: మంత్రి పొంగులేటి
[ 20-05-2024]
ప్రతి పేదింటి కష్టసుఖాలను పంచుకుంటానని, అభివృద్ధిని చేతల్లో చూపుతానని రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. -
కమ్యూనిస్టులతోనే సామాజిక న్యాయం: శైలజ టీచర్
[ 20-05-2024]
దేశంలో కమ్యూనిస్టులతోనే సామాజిక న్యాయం సాధ్యమైందని కేరళ ఆరోగ్య శాఖ మాజీ మంత్రి, ఎమ్మెల్యే శైలజ టీచర్ అన్నారు. -
మెలికలు తిరుగుతూ.. మెరికలుగా మారుతూ..
[ 20-05-2024]
జిమ్నాస్టిక్స్లో ప్రావీణ్యం సాధించాలంటే ఖమ్మం సర్దార్ పటేల్ స్టేడియానికి రావాల్సిందే. సాధన చేసే క్రీడాకారులపై ఆర్థిక భారం ఉండదు. సాధన కేంద్రమైన జిమ్నాజియం ఏర్పాటు రూ.కోట్ల ఖర్చుతో కూడుకున్నది. -
రాములోరికి పసిడి పుష్పార్చన
[ 20-05-2024]
భద్రాచలం రామాలయంలో ఆదివారం భక్తుల రద్దీ నెలకొంది. కోవెల పరిసరాలు కిక్కిరిసిపోయాయి. మూలవిరాట్కు అర్చకులు సుప్రభాతం పలికి ఆరాధించారు. -
‘భాజపాతో ప్రజాస్వామ్య వ్యవస్థకే ప్రమాదం’
[ 20-05-2024]
భాజపాతో ప్రజాస్వామ్య వ్యవస్థకే ప్రమాదమని సీపీఐఎంఎల్ మాస్లైన్ రాష్ట్ర కార్యదర్శి పోటు రంగారావు ఆరోపించారు. సీపీఐఎంఎల్ మాస్లైన్ జిల్లా స్థాయి రాజకీయ శిక్షణ తరగతులు ఆదివారం వైరాలోని అమరవీరుల నగర్లో నిర్వహించారు.
తాజా వార్తలు (Latest News)
-
కొనసాగుతోన్న ఐదో విడత పోలింగ్.. ఓటేసిన ప్రముఖులు
-
ఆ లోటు ఎప్పటికీ ఉంటుంది: ఎన్టీఆర్ గురించి ఈ సంగతులు తెలుసా?
-
మల్లారెడ్డి ఆస్తులపై విచారణ కోరతాం: ప్రభుత్వ విప్ లక్ష్మణ్కుమార్
-
ఒక్కోసారి ‘వన్ పర్సెంట్’ ఛాన్స్ ఉన్నా చాలు..: విరాట్ కోహ్లీ
-
ఈ వారం థియేటర్/ఓటీటీలో అలరించే చిత్రాలివే!
-
రసకందాయంలో పీర్జాదిగూడ రాజకీయం