నిఘా నేత్రం.. పర్యవేక్షణ సులభం
సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో 50 శాతం పోలింగ్ కేంద్రాల్లో నిఘా నేత్రాలు అమర్చాలని ఎన్నికల సంఘం సూచించింది.
ఖమ్మం నగరం, న్యూస్టుడే: సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో 50 శాతం పోలింగ్ కేంద్రాల్లో నిఘా నేత్రాలు అమర్చాలని ఎన్నికల సంఘం సూచించింది. ఖమ్మం లోక్సభ స్థానంలో మాత్రం అన్ని పోలింగ్ కేంద్రాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటుచేయాలని రిటర్నింగ్ అధికారి గౌతమ్ నిర్ణయించారు. 2023 నవంబర్లో జరిగిన శాసనసభ ఎన్నికల సమయంలో ఖమ్మం జిల్లాలో అయిదు నియోజకవర్గాల్లోని అన్ని పోలింగ్ కేంద్రాల్లో నిఘానేత్రాలు అమర్చారు. తాజాగా ఖమ్మం లోక్సభ స్థానం పరిధిలోని భద్రాద్రి జిల్లా కొత్తగూడెం, అశ్వారావుపేట నియోజకవర్గాల్లోని ప్రతి పోలింగ్ కేంద్రంలో సీసీ కెమెరాలు బిగించాలని ఆర్ఓ ఆదేశించారు. ఈ పనులు శుక్రవారం నాటికి పూర్తికానున్నాయి.
ఖమ్మం కలెక్టరేట్, ఎన్నికల సంఘం కార్యాలయాలకు అనుసంధానం
పోలింగ్ కేంద్రాల్లో అమర్చిన నిఘానేత్రాలను ఖమ్మం కలెక్టరేట్లోని కంప్యూటర్లకు అనుసంధానిస్తారు. ఇక్కడి నుంచి హైదరాబాద్, దిల్లీలోని ఎన్నికల సంఘం కార్యాలయాలకు కలుపుతారు. పోలింగ్ కేంద్రాల్లో పోలింగ్ ప్రక్రియను ఉన్నతాధికారులు వీక్షించే అవకాశం కలుగుతుంది. పోలింగ్ రోజు ఏవైనా సమస్యలు ఉత్పన్నమైతే వాటిని సంబంధిత సెక్టార్ అధికారులకు తెలియజేస్తారు. గత శాసనసభ ఎన్నికల్లో కొన్ని పోలింగ్ కేంద్రాల్లో తలెత్తిన సమస్యలను అక్కడి పోలింగ్ సిబ్బంది ఉన్నతాధికారులకు తెలిపేలోగా ఖమ్మం కలెక్టరేట్లో అధికారులు సీసీ కెమెరాల ద్వారా తెలుసుకొని పరిష్కార మార్గాలు సూచించారు. పోలింగ్ కేంద్రంలో సీసీకెమెరాలు అమర్చిన గదిలో రాత్రిపూట నిద్రించవద్దని ఇటీవల పోలింగ్ సిబ్బందికి నిర్వహించిన రెండోవిడత శిక్షణ కార్యక్రమంలో స్పష్టం చేశారు. భవనంలోని వేరే గదుల్లో బసచేయాలని తెలిపారు.
మొత్తమ్మీద 1,896 పోలింగ్ కేంద్రాల్లో సీసీ కెమెరాలు బిగిస్తున్నారు. పోలింగ్ కేంద్రాల వెలుపల మరో 620 నిఘానేత్రాలు అమర్చుతున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
దోపిడీ, సామాజిక వివక్షపై ఉద్యమించాలి: తమ్మినేని
[ 20-05-2024]
సుందరయ్య స్ఫూర్తితో సామాజిక వివక్ష, దోపిడీ నిర్మూలనపై ఉద్యమించాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. సుజాతనగర్ సీపీఎం పార్టీ కార్యాలయం సత్యం భవన్లో సుందరయ్య వర్ధంతి సభ నిర్వహించారు. -
ఒక ఉపకేంద్రం 20 నియంత్రికల ధ్వంసం
[ 20-05-2024]
కొందరు దొంగలు సొత్తు కోసం వ్యవసాయ పొలాల్లోని విద్యుత్తు నియంత్రికలనూ వదలడం లదు. ఇలాంటి ఘటనలు నిత్యకృత్యమయ్యాయి. -
చికిత్స పొందుతూ యువకుడి మృతి
[ 20-05-2024]
ప్రమాదంలో తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతూ యువకుడు మృతి చెందిన సంఘటనపై రఘునాథపాలెం పోలీసు స్టేషన్లో ఆదివారం కేసు నమోదైంది. -
లాభాల లహరి
[ 20-05-2024]
టీఎస్ ఆర్టీసీ ప్రయాణికులకు మెరుగైన, సౌకర్యవంతమైన సేవలు అందిస్తూనే సంస్థ అభివృద్ధిపై దృష్టి సారిస్తోంది. ప్రైవేటుతో పోటీపడుతూ అధునాతన సదుపాయాలను తీసుకొస్తోంది. -
భూసార పరీక్షలు కొందరికే
[ 20-05-2024]
ఇష్టారీతి రసాయనిక ఎరువుల వినియోగంతో సాగు భూమి సారం కోల్పోయి నిర్జీవంగా మారుతుంది. పంట భూమిలో నత్రజని, భాస్వరం, సేంద్రియ కర్బనాల్లాంటి పోషకాలు ఎంత మోతాదులో ఉన్నాయో భూసార పరీక్షల ద్వారా తెలుసుకుని -
ప్రభుత్వ కళాశాలల్లో ప్రవేశాల పెంపుపై దృష్టి
[ 20-05-2024]
ప్రభుత్వ, ప్రైవేటు జూనియర్ కళాశాలల్లో ప్రవేశాలకు ఇంటర్మీడియట్ బోర్డు నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇప్పటికే దరఖాస్తుల స్వీకరణ ప్రారంభించారు. ఈ నేపథ్యంలో ప్రవేశాల సంఖ్య పెంపుపై జిల్లా అధికారులు దృష్టిపెట్టారు. -
బతుకుజీవుడా..
[ 20-05-2024]
జాతీయ, రాష్ట్రీయ రహదారులపై వాహనాలు వేగంగా దూసుకెళ్తుంటాయి. ప్రధాన మార్గాల్లో రాత్రివేళల్లోనూ రద్దీ ఎక్కువగా ఉంటుంది. ఈ క్రమంలో వేసవిలో రోడ్లపై కొనసాగుతున్న పశు సంచారం రోడ్డు ప్రమాదాలకు కారణమవుతోంది. -
పేదల కష్టసుఖాల్లో పాలుపంచుకుంటా: మంత్రి పొంగులేటి
[ 20-05-2024]
ప్రతి పేదింటి కష్టసుఖాలను పంచుకుంటానని, అభివృద్ధిని చేతల్లో చూపుతానని రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. -
కమ్యూనిస్టులతోనే సామాజిక న్యాయం: శైలజ టీచర్
[ 20-05-2024]
దేశంలో కమ్యూనిస్టులతోనే సామాజిక న్యాయం సాధ్యమైందని కేరళ ఆరోగ్య శాఖ మాజీ మంత్రి, ఎమ్మెల్యే శైలజ టీచర్ అన్నారు. -
మెలికలు తిరుగుతూ.. మెరికలుగా మారుతూ..
[ 20-05-2024]
జిమ్నాస్టిక్స్లో ప్రావీణ్యం సాధించాలంటే ఖమ్మం సర్దార్ పటేల్ స్టేడియానికి రావాల్సిందే. సాధన చేసే క్రీడాకారులపై ఆర్థిక భారం ఉండదు. సాధన కేంద్రమైన జిమ్నాజియం ఏర్పాటు రూ.కోట్ల ఖర్చుతో కూడుకున్నది. -
రాములోరికి పసిడి పుష్పార్చన
[ 20-05-2024]
భద్రాచలం రామాలయంలో ఆదివారం భక్తుల రద్దీ నెలకొంది. కోవెల పరిసరాలు కిక్కిరిసిపోయాయి. మూలవిరాట్కు అర్చకులు సుప్రభాతం పలికి ఆరాధించారు. -
‘భాజపాతో ప్రజాస్వామ్య వ్యవస్థకే ప్రమాదం’
[ 20-05-2024]
భాజపాతో ప్రజాస్వామ్య వ్యవస్థకే ప్రమాదమని సీపీఐఎంఎల్ మాస్లైన్ రాష్ట్ర కార్యదర్శి పోటు రంగారావు ఆరోపించారు. సీపీఐఎంఎల్ మాస్లైన్ జిల్లా స్థాయి రాజకీయ శిక్షణ తరగతులు ఆదివారం వైరాలోని అమరవీరుల నగర్లో నిర్వహించారు.
తాజా వార్తలు (Latest News)
-
కొనసాగుతోన్న ఐదో విడత పోలింగ్.. ఓటేసిన ప్రముఖులు
-
ఆ లోటు ఎప్పటికీ ఉంటుంది: ఎన్టీఆర్ గురించి ఈ సంగతులు తెలుసా?
-
మల్లారెడ్డి ఆస్తులపై విచారణ కోరతాం: ప్రభుత్వ విప్ లక్ష్మణ్కుమార్
-
ఒక్కోసారి ‘వన్ పర్సెంట్’ ఛాన్స్ ఉన్నా చాలు..: విరాట్ కోహ్లీ
-
ఈ వారం థియేటర్/ఓటీటీలో అలరించే చిత్రాలివే!
-
రసకందాయంలో పీర్జాదిగూడ రాజకీయం