ఈ శోకం తీర్చలేనిది
ఆ ఇద్దరు తల్లుల శోకం తీర్చలేనిది. అందులో ఓ మాతృమూర్తి తన భర్త చనిపోయాక పొట్టచేత పట్టుకుని ఇద్దరు పిల్లలతో కలిసి నగరానికి వచ్చింది. గురుకులంలో చదువుతూ వేసవి సెలవుల్లో ఇంటికొచ్చిన చిన్న కొడుకు కానరాని లోకాలకు వెళ్లిపోవటాన్ని చూసి స్పృహతప్పి పడిపోయింది.
మున్నేరులో వంతెన కోసం తీసిన గోతిలో మునిగి ముగ్గురు విద్యార్థుల మృతి
లోకేశ్, హరీశ్ మృతదేహాలపై పడి రోదిస్తున్న తల్లి లక్ష్మి, బంధువులు
ఖమ్మం గ్రామీణం, ఖమ్మం నేరవిభాగం, న్యూస్టుడే: ఆ ఇద్దరు తల్లుల శోకం తీర్చలేనిది. అందులో ఓ మాతృమూర్తి తన భర్త చనిపోయాక పొట్టచేత పట్టుకుని ఇద్దరు పిల్లలతో కలిసి నగరానికి వచ్చింది. గురుకులంలో చదువుతూ వేసవి సెలవుల్లో ఇంటికొచ్చిన చిన్న కొడుకు కానరాని లోకాలకు వెళ్లిపోవటాన్ని చూసి స్పృహతప్పి పడిపోయింది. ఇంకో తల్లిది ఎవరూ తీర్చలేని గర్భశోకం. తన ఇద్దరు పిల్లల్నీ మున్నేరు మింగేయటంతో గుండెలు బాదుకుంటోంది. మూగబోయిన గొంతుల కోసం గొంతు మూగబోయేలా రోదిస్తోంది.
ఖమ్మం నగరం మమతారోడ్డులోని రామచంద్రయ్య నగర్లో గుడిసె వేసుకొని నివాసం ఉంటున్న ఆముదాల చిరంజీవి ఆటో డ్రైవర్గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నారు. చిరంజీవి, లక్ష్మి దంపతులకు ఇద్దరు కుమారులు. లోకేశ్(14), హరీశ్(12).. వారి ఇంటి పక్కనే నివాసం ఉంటున్న బానోత్ కళావతికి ఇద్దరు కుమారులు. రఘునాథపాలెం మండలం రాంక్యాతండా స్వస్థలం. భర్త చనిపోవటంతో నగరానికి వచ్చి రోడ్డుపక్కనే రాగి జావ విక్రయిస్తూ ఇద్దరు కుమారులను పోషిస్తున్నారు. బానోత్ గణేశ్ (14) ఈమె చిన్నకొడుకు. గురువారం సాయంత్రం మున్నేరులో ఈతకోసం వెళ్లిన చిరంజీవి ఇద్దరు కొడుకులు, పొరుగున ఉన్న గణేశ్ ముగ్గురూ మృత్యువాతపడటంతో రామచంద్రయ్యనగర్లో విషాదం అలుముకుంది.
జాగ్రత్త చర్యలేవి..!
ఖమ్మం-దేవరపల్లి గ్రీన్ఫీల్డ్ జాతీయ రహదారి నిర్మాణంలో భాగంగా గుదిమళ్ల సమీపంలో మున్నేరుపై వంతెన నిర్మాణ ప్రదేశంలో జాగ్రత్త చర్యలు తీసుకోకపోవడం వల్లే ప్రమాదం చోటుచేసుకుందని స్థానికులు ఆరోపిస్తున్నారు. వాస్తవంగా వంతెన నిర్మాణ సమయంలో పనుల ప్రారంభం వద్ద, చివరలో పని జరుగుతున్నట్లు బోర్డులు ఏర్పాటు చేయాలి. అటుగా ఎవరూ రాకుండా చూడాలి. ఒకవేళ నిర్మాణ ప్రదేశంలో రహదారి మార్గం ఉంటే దానికి ప్రత్యామ్నాయం ఏర్పాటు చేయాలి. పిల్లర్ల కోసం లోతైన గుంతలు తవ్వినప్పుడు హెచ్చరిక బోర్డులతోపాటు ఆ గుంత చుట్టూ రిబ్బన్ లేదా రక్షిత గోడలు ఏర్పాటు చేయాలి. ఒకవేళ నిర్మాణ పనులు ఆగిపోతే అక్కడ హెచ్చరిక బోర్డులతో పాటు కాపలాదారు ఉండాలి. ఘటన చోటుచేసుకున్న గుదిమళ్ల వద్ద ఇవేమీ కనిపించలేదు.
చిన్నారుల కోసం గాలిస్తున్న వ్యక్తులు, గుమిగూడిన స్థానికులు
స్వచ్ఛందంగా గాలింపు
ముగ్గురు పిల్లలు మునిగిపోతుండగా, చిరంజీవి సమీపంలో చేపలు పట్టుకుంటున్న వారిని అప్రమత్తం చేశారు. గుదిమళ్లకు చెందిన బాణోతు రఘురాం, ఖమ్మం మంచికంటినగర్కు చెందిన మక్కల నరసింహారావు వెంటనే గాలింపు చర్యలు చేపట్టారు. మృతదేహాలు దొరికే వరకు పోలీసులు, అగ్నిమాపక సిబ్బందితో కలిసి రెండు గంటలకుపైగా వెతికారు. అగ్నిమాపక ఎస్ఎఫ్ఓ రాజేశ్వరరావు, ఏఎల్ఎఫ్ రమేశ్, సిబ్బంది సేవలందించారు.
- ప్రమాదం విషయం తెలుసుకున్న నాయకులు ఆళ్ల అంజిరెడ్డి, బిక్కసాని జశ్వంత్ సహాయ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. కాంగ్రెస్ నాయకుడు గుత్తా వెంకటేశ్వరరావు, సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు బాగం హేమంతరావు, జిల్లా కార్యదర్శి పోటు ప్రసాద్, షేక్ జానీమియా ఘటనా స్థలిని సందర్శించారు. శవపరీక్ష అనంతరం మృతదేహాలను బాధిత కుటుంబాలకు అప్పగించారు.
శిక్షణ ఐపీఎస్ భావోద్వేగం..
మృతుల బంధువుల రోదనలతో ఘటనా స్థలిలో శిక్షణ ఐపీఎస్ మౌనిక భావోద్వేగానికి గురయ్యారు. కొంతసేపు కన్నీరు పెట్టుకున్నారు. ఘటనా స్థలికి ఆమెతోపాటు రూరల్ సీఐ రాజిరెడ్డి, ఖానాపురం హవేలి ఇన్స్పెక్టర్ భానుప్రకాశ్, రూరల్ ఎస్ఐ రామారావు, సిబ్బంది వెళ్లారు. గణేశ్ తల్లి కళావతి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ రామారావు తెలిపారు.
- బాధిత కుటుంబాలకు రూ.10లక్షల చొప్పున పరిహారం చెల్లించాలని సీపీఐ జాతీయ నాయకుడు బాగం హేమంతరావు డిమాండ్ చేశారు. విద్యార్థుల మృతదేహాలకు ఖమ్మం ప్రభుత్వాసుపత్రిలో నివాళి అర్పించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
సీతారామ ప్రాజెక్టు కాలువను వేగంగా పూర్తి చేయాలి
[ 19-05-2024]
సీతారామ ప్రాజెక్టు కాలువ పనులను వేగవంతంగా పూర్తి చేసి సాగు, తాగునీటిని సరఫరా చేయాలని తెలుగుదేశం పార్టీ లీగల్ సెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మల్లెం పాటి అప్పారావు అన్నారు. -
మేమేం పాపం చేశాం నాన్నా..!
[ 19-05-2024]
ఆస్తి కోసం ఓ కర్కశకుడు కన్నతల్లి, తన ఇద్దరు కూతుళ్లను హతమార్చిన సంఘటనతో.. ఎప్పుడూ ప్రశాంతంగా ఉండే ఖమ్మం జిల్లా తల్లాడ మండలం గోపాలపేటలో కలకలం రేగింది. గ్రామానికి చెందిన ట్రాక్టర్ డ్రైవర్ పిట్టల వెంకటేశ్వర్లు మొదటి భార్య మృతితో త్రివేణిని రెండో వివాహం చేసుకోవడం.. -
బాధిత మహిళలకు భరోసా..
[ 19-05-2024]
ప్రస్తుత సమాజంలో మహిళలు, చిన్నారులు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య.. లైంగిక వేధింపులు. జరిగే అన్యాయాన్ని పరువు కోసం బయటకు చెప్పుకోలేక కుమిలిపోతున్న వారెందరో ఉన్నారు. -
ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు 55 పోలింగ్ కేంద్రాలు: కలెక్టర్
[ 19-05-2024]
పూర్వ వరంగల్, ఖమ్మం, నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక ఏర్పాట్లు వేగవంతం చేయాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ప్రియాంక అల ఆదేశించారు. ఉప ఎన్నిక సిబ్బంది నియామకం, ఏర్పాట్లపై శనివారం కలెక్టరేట్లో సమీక్ష నిర్వహించారు. -
టీఎస్ఈఏపీ సెట్లో జిల్లా విద్యార్థుల ప్రతిభ
[ 19-05-2024]
2024-25 విద్యా సంవత్సరానికి ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించిన టీఎస్ ఈఏపీ సెట్ ఫలితాలు శనివారం విడుదలయ్యాయి. ఖమ్మం నగరానికి చెందిన పలు ప్రైవేటు జూనియర్ కళాశాలల విద్యార్థులు ప్రతిభ చూపారు. -
ఐటీఐ ప్రవేశాలకు వేళాయె..!
[ 19-05-2024]
పదో తరగతి ఫలితాల వెల్లడి నేపథ్యంలో ఐటీఐ కళాశాలల్లో ప్రవేశాలకు అధికారులు చర్యలు ప్రారంభించారు. ‘2024-25’ విద్యా సంవత్సరం ప్రవేశాలకు ఈ నెల 16 నుంచి జూన్ 10వ తేదీ వరకు ఆన్లైన్లో దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. -
పిడుగుపాటుతో రైతు మృతి
[ 19-05-2024]
పిడుగుపాటుకు పొలంలో ఓ రైతు మృతి చెందిన ఘటన శనివారం చోటు చేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం.. రామచంద్రాపురం గ్రామానికి చెందిన సంపసాల కృష్ణ(55) వ్యవసాయం చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నారు. -
ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్కు మద్దతు: తమ్మినేని
[ 19-05-2024]
పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి జరిగే ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థికి మద్దతు ఇవ్వాలని నిర్ణయించినట్లు సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం తెలిపారు. -
రామయ్యకు బంగారు తులసీ దళార్చన
[ 19-05-2024]
భద్రాచలం శ్రీసీతారామచంద్ర స్వామి ఆలయంలో శనివారం భక్తులు పోటెత్తారు. క్యూలైన్లతో పాటు ప్రసాదాల కౌంటర్లు కిటకిటలాడాయి. పసిడితో తయారు చేసిన తులసీ దళాలను సీతారాముడి పాదాల చెంత ఉంచి అర్చన చేశారు. -
‘మహస్వి’కి 102వ ర్యాంకు
[ 19-05-2024]
టీఎస్ ఈఏపీసెట్ ఫలితాల్లో ఖమ్మం న్యూవిజన్ జూనియర్ కళాశాలకు చెందిన విద్యార్థిని జి.మహస్వి రాష్ట్రస్థాయిలో 102వ ర్యాంకు సాధింది. జేఈఈ మెయిన్స్లో సైతం ఆలిండియా ఓపెన్ కేటగిరీలో 732వ ర్యాంకు సాధించటం విశేషం. -
ఉపకార వేతనానికి దరఖాస్తుల ఆహ్వానం
[ 19-05-2024]
2024-25 విద్యా సంవత్సరానికి ఖమ్మం జిల్లాకు చెందిన విదేశాల్లో చదివే గిరిజన విద్యార్థులు ఈనెల 31 లోపు ఉపకార వేతనానికి దరఖాస్తు చేసుకోవాలని జిల్లా గిరిజన అభివృద్ధి అధికారి ఎన్.విజయలక్ష్మి శనివారం తెలిపారు. -
రహదారుల పనులకు అనుమతి ఇవ్వండి: తుమ్మల
[ 19-05-2024]
ఆర్సీపీఎల్డబ్ల్యూఈఏ ఫేజ్-1, 3, ఎల్డబ్ల్యూఈ 2018-19, ఎస్సీఏ స్కీం కింద ప్రారంభించిన రహదారుల పనులకు అనుమతులు ఇవ్వాలని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అటవీశాఖ మంత్రి, పీసీసీఎఫ్లకు విజ్ఞప్తి చేశారు. -
గ్రూప్-1 ప్రిలిమ్స్కు ఏర్పాట్లు
[ 19-05-2024]
గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్ష నిర్వహణకు ఏర్పాట్లు చేయాలని టీఎస్పీఎస్సీ ఛైర్మన్ మహేందర్రెడ్డి అన్నారు. హైదరాబాద్ నుంచి శనివారం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్కు కలెక్టర్ గౌతమ్ హాజరయ్యారు.
తాజా వార్తలు (Latest News)
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
నిలిచిపోయిన కాగజ్నగర్, నవజీవన్ ఎక్స్ప్రెస్ రైళ్లు .. ప్రయాణికుల ఆందోళన
-
భార్య, కుమారుడు వేధిస్తున్నారు, భరణం ఇప్పించండి - మాజీ మంత్రి వేడుకోలు
-
రాజస్థాన్, కోల్కతా మ్యాచ్కు వరుణుడి ఆటంకం.. మ్యాచ్ రద్దయితే హైదరాబాద్కు లాభం..
-
మీరు డౌన్లోడ్ చేసే యాప్స్ సురక్షితమైనవేనా? తెలుసుకోండిలా..
-
కార్పొరేటర్ శ్రవణ్ అరెస్టు అప్రజాస్వామికం: కేంద్రమంత్రి కిషన్రెడ్డి