అందరూ రావాల్సిందే.. నిబంధనలు పాటించాల్సిందే
సార్వత్రిక ఎన్నికల పోలింగ్ నిర్వహణకు అధికారులు సమాయత్తమవుతున్నారు. ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో ఇప్పటికే ఈవీఎంలు, సిబ్బందిని సిద్ధం చేసి ఆయా శాసనసభ నియోజకవర్గాలకు కేటాయించారు.
ఈనాడు డిజిటల్, కొత్తగూడెం: సార్వత్రిక ఎన్నికల పోలింగ్ నిర్వహణకు అధికారులు సమాయత్తమవుతున్నారు. ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో ఇప్పటికే ఈవీఎంలు, సిబ్బందిని సిద్ధం చేసి ఆయా శాసనసభ నియోజకవర్గాలకు కేటాయించారు. పోలింగ్కు రెండు రోజుల ముందు (ఈనెల 11న) తుది ర్యాండమైజేషన్ ద్వారా సిబ్బందికి పోలింగ్ కేంద్రాలను నిర్ణయించనున్నారు. ఆదివారం ఉదయం పోలింగ్ సామగ్రి పంపిణీ చేసి అదేరోజు సాయంత్రం సిబ్బందిని పోలింగ్ కేంద్రాలకు తరలిస్తారు. పోలింగ్ సామగ్రి పంపిణీ, సిబ్బంది తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సమగ్ర కథనం.
సెక్టార్ల వారీగా టేబుళ్ల ఏర్పాటు
శాసనసభ నియోజకవర్గాల్లోని పోలింగ్ సామగ్రి పంపిణీ కేంద్రాల్లో సెక్టార్ల వారీగా టేబుళ్లు ఏర్పాటు చేస్తారు. అంతకుముందే నియోజకవర్గాన్ని సెక్టార్లుగా విభజిస్తారు. ఏ సెక్టార్ పరిధిలో ఏఏ పోలింగ్ కేంద్రాలు వస్తాయనేది టేబుల్ ముందుంచుతారు. దీని ఆధారంగా ఆయా పోలింగ్ కేంద్రాలకు కేటాయించిన పీఓ, ఏపీఓ, ఓపీఓలు టేబుల్ వద్దకు వెళ్లి పోలింగ్ సామగ్రి తీసుకోవాలి. వాటిలో అన్ని రకాల వస్తువులు ఉన్నాయా? లేదా తనిఖీ చేసుకోవటానికి సమయమిస్తారు. అన్ని సరిగ్గా ఉంటే ఏఆర్ఓ ఇచ్చే ఫాంపై పీఓ సంతకం చేయాలి. పోలింగ్ ముగిసిన తర్వాత తిరిగి వాటిని అప్పగించే వరకు పూర్తి బాధ్యత ప్రిసైడింగ్ అధికారి(పీఓ)దే.
ఏఆర్ఓలకు సహాయకులుగా రెవెన్యూ అధికారులు
పోలింగ్ సామగ్రి పంపిణీ బాధ్యత సహాయ రిటర్నింగ్ అధికారి(ఏఆర్ఓ)దే. అయినప్పటికీ ఆయా నియోజకవర్గాల్లోని మండలాల్లో విధులు నిర్వర్తించే తహసీల్దారు, డిప్యూటీ తహసీల్దారు, రెవెన్యూ ఇన్స్పెక్టర్లు ఏఆర్ఓకు సహాయకులుగా వ్యవహరిస్తారు. పోలింగ్ సిబ్బందికి సామగ్రి పంపిణీ సమయంలో సహకరిస్తారు. ఈక్రతువుకు సెక్టోరల్ అధికారులు, శాసనసభ నియోజకవర్గ మాస్టర్ ట్రెయినీలు హాజరవుతారు. పోలింగ్ నిర్వహణపై సిబ్బందికి ఎలాంటి సందేహాలున్నా మాస్టర్ ట్రెయినీలు నివృత్తి చేస్తారు. అక్కడే భోజన సదుపాయం ఏర్పాటుచేసి సిబ్బంది, సెక్టోరల్ అధికారులను వాహనాల్లో పోలింగ్ కేంద్రాలకు పంపిస్తారు.
ఒక్కో రూట్కు ఒక్కో వాహనం
సిబ్బందిని తరలించటానికి సౌలభ్యంగా ఉండేందుకు సెక్టార్లను రూట్లుగా విభజిస్తారు. ఒక్కో రూట్కు ఒక్కో వాహనాన్ని కేటాయిస్తారు. ఇలా కేటాయించిన ప్రతి వాహనానికి ఒక్కో రూట్ అధికారిని నియమిస్తారు. సిబ్బందిని తరలించటం, పోలింగ్ అనంతరం తిరిగి తీసుకురావటం వీరి బాధ్యత. ఆయా పోలింగ్ కేంద్రాలకు ఎంపిక చేసిన సిబ్బంది హాజరును నమోదుచేసుకుని పోలింగ్ కేంద్రాలకు తరలిస్తారు. ఆయా శాసనసభ నియోజకవర్గాల్లో విధులు నిర్వర్తించే సిబ్బందిని సంబంధిత ఏఆర్ఓలు పర్యవేక్షిస్తుంటారు.
ఇలా చేస్తే క్రిమినల్ చర్యలే..
పోలింగ్ సమయంలో సిబ్బంది అప్రమత్తంగా విధులు నిర్వర్తించాలి. అదే సమయంలో ఎన్నికల నిబంధనలనూ పాటించాలి. ఎన్నికల సామగ్రి తీసుకెళ్లే సమయంలో పీఓ, ఏపీఓ, ఓపీఓలు తప్పనిసరిగా ఎన్నికల అధికారులు ఏర్పాటు చేసిన వాహనాల్లోనే ప్రయాణించాల్సి ఉంటుంది. సొంత వాహనాల్లో వెళ్లటానికి వీల్లేదు. అతి ముఖ్యమైన పోలింగ్ సామగ్రిని ఎక్కడైనా మరిచిపోయినా, తిరిగి అధికారులకు అప్పగించకపోయినా సంబంధిత సిబ్బందిపై క్రిమినల్ చర్యలు తప్పవు. ఒకవేళ ఎవరైనా పీఓ.. ఈవీఎంను తిరిగి అప్పగించకపోతే జిల్లా ఎన్నికల అధికార యంత్రాంగమంతా బాధ్యత వహించాల్సి ఉంటుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కాంగ్రెస్ అరచేతిలో వైకుంఠం చూపించి అధికారంలోకి వచ్చింది: కేటీఆర్
[ 20-05-2024]
కాంగ్రెస్ అరచేతిలో వైకుంఠం చూపించి అధికారంలోకి వచ్చిందని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ అన్నారు. -
దోపిడీ, సామాజిక వివక్షపై ఉద్యమించాలి: తమ్మినేని
[ 20-05-2024]
సుందరయ్య స్ఫూర్తితో సామాజిక వివక్ష, దోపిడీ నిర్మూలనపై ఉద్యమించాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. సుజాతనగర్ సీపీఎం పార్టీ కార్యాలయం సత్యం భవన్లో సుందరయ్య వర్ధంతి సభ నిర్వహించారు. -
ఒక ఉపకేంద్రం 20 నియంత్రికల ధ్వంసం
[ 20-05-2024]
కొందరు దొంగలు సొత్తు కోసం వ్యవసాయ పొలాల్లోని విద్యుత్తు నియంత్రికలనూ వదలడం లదు. ఇలాంటి ఘటనలు నిత్యకృత్యమయ్యాయి. -
చికిత్స పొందుతూ యువకుడి మృతి
[ 20-05-2024]
ప్రమాదంలో తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతూ యువకుడు మృతి చెందిన సంఘటనపై రఘునాథపాలెం పోలీసు స్టేషన్లో ఆదివారం కేసు నమోదైంది. -
లాభాల లహరి
[ 20-05-2024]
టీఎస్ ఆర్టీసీ ప్రయాణికులకు మెరుగైన, సౌకర్యవంతమైన సేవలు అందిస్తూనే సంస్థ అభివృద్ధిపై దృష్టి సారిస్తోంది. ప్రైవేటుతో పోటీపడుతూ అధునాతన సదుపాయాలను తీసుకొస్తోంది. -
భూసార పరీక్షలు కొందరికే
[ 20-05-2024]
ఇష్టారీతి రసాయనిక ఎరువుల వినియోగంతో సాగు భూమి సారం కోల్పోయి నిర్జీవంగా మారుతుంది. పంట భూమిలో నత్రజని, భాస్వరం, సేంద్రియ కర్బనాల్లాంటి పోషకాలు ఎంత మోతాదులో ఉన్నాయో భూసార పరీక్షల ద్వారా తెలుసుకుని -
ప్రభుత్వ కళాశాలల్లో ప్రవేశాల పెంపుపై దృష్టి
[ 20-05-2024]
ప్రభుత్వ, ప్రైవేటు జూనియర్ కళాశాలల్లో ప్రవేశాలకు ఇంటర్మీడియట్ బోర్డు నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇప్పటికే దరఖాస్తుల స్వీకరణ ప్రారంభించారు. ఈ నేపథ్యంలో ప్రవేశాల సంఖ్య పెంపుపై జిల్లా అధికారులు దృష్టిపెట్టారు. -
బతుకుజీవుడా..
[ 20-05-2024]
జాతీయ, రాష్ట్రీయ రహదారులపై వాహనాలు వేగంగా దూసుకెళ్తుంటాయి. ప్రధాన మార్గాల్లో రాత్రివేళల్లోనూ రద్దీ ఎక్కువగా ఉంటుంది. ఈ క్రమంలో వేసవిలో రోడ్లపై కొనసాగుతున్న పశు సంచారం రోడ్డు ప్రమాదాలకు కారణమవుతోంది. -
పేదల కష్టసుఖాల్లో పాలుపంచుకుంటా: మంత్రి పొంగులేటి
[ 20-05-2024]
ప్రతి పేదింటి కష్టసుఖాలను పంచుకుంటానని, అభివృద్ధిని చేతల్లో చూపుతానని రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. -
కమ్యూనిస్టులతోనే సామాజిక న్యాయం: శైలజ టీచర్
[ 20-05-2024]
దేశంలో కమ్యూనిస్టులతోనే సామాజిక న్యాయం సాధ్యమైందని కేరళ ఆరోగ్య శాఖ మాజీ మంత్రి, ఎమ్మెల్యే శైలజ టీచర్ అన్నారు. -
మెలికలు తిరుగుతూ.. మెరికలుగా మారుతూ..
[ 20-05-2024]
జిమ్నాస్టిక్స్లో ప్రావీణ్యం సాధించాలంటే ఖమ్మం సర్దార్ పటేల్ స్టేడియానికి రావాల్సిందే. సాధన చేసే క్రీడాకారులపై ఆర్థిక భారం ఉండదు. సాధన కేంద్రమైన జిమ్నాజియం ఏర్పాటు రూ.కోట్ల ఖర్చుతో కూడుకున్నది. -
రాములోరికి పసిడి పుష్పార్చన
[ 20-05-2024]
భద్రాచలం రామాలయంలో ఆదివారం భక్తుల రద్దీ నెలకొంది. కోవెల పరిసరాలు కిక్కిరిసిపోయాయి. మూలవిరాట్కు అర్చకులు సుప్రభాతం పలికి ఆరాధించారు. -
‘భాజపాతో ప్రజాస్వామ్య వ్యవస్థకే ప్రమాదం’
[ 20-05-2024]
భాజపాతో ప్రజాస్వామ్య వ్యవస్థకే ప్రమాదమని సీపీఐఎంఎల్ మాస్లైన్ రాష్ట్ర కార్యదర్శి పోటు రంగారావు ఆరోపించారు. సీపీఐఎంఎల్ మాస్లైన్ జిల్లా స్థాయి రాజకీయ శిక్షణ తరగతులు ఆదివారం వైరాలోని అమరవీరుల నగర్లో నిర్వహించారు.
తాజా వార్తలు (Latest News)
-
‘ఇండియా’ కూటమి విచ్ఛిన్నానికి కౌంట్డౌన్ షురూ..: ప్రధాని మోదీ
-
ఇక ఉబర్ బస్సులు.. తొలుత ఈ నగరంలోనే సేవలు
-
అషు ‘సెక్సీ’ క్యాప్షన్.. రీతూ వర్మ ‘బ్లాక్ మ్యాజిక్’!
-
వారి సంభాషణలు రికార్డు చేయలేదు.. రోహిత్ ఆరోపణలను ఖండించిన స్టార్స్పోర్ట్స్
-
అయిదో దశ ఎన్నికలు.. ముగిసిన పోలింగ్!
-
మళ్లీ వచ్చేది మోదీ సర్కార్.. పీవోకే విలీనం పక్కా: అమిత్ షా