logo

తెదేపాను నమ్ముకుంటేనే భవిష్యత్తు

తెదేపాను నమ్ముకుంటేనే భవిష్యత్తు ఉంటుందని ఎంపీ డా.సంజీవ్‌కుమార్‌ పేర్కొన్నారు. కోడుమూరులో సోమవారం కూటమి ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు.

Published : 16 Apr 2024 07:38 IST

మాట్లాడుతున్న ఎంపీ డా.సంజీవ్‌కుమార్‌

కోడుమూరు గ్రామీణం: తెదేపాను నమ్ముకుంటేనే భవిష్యత్తు ఉంటుందని ఎంపీ డా.సంజీవ్‌కుమార్‌ పేర్కొన్నారు. కోడుమూరులో సోమవారం కూటమి ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. ఎంపీ మాట్లాడుతూ.. తాగు, సాగు నీటి సమస్య పరిష్కరించాలని సీఎం జగన్‌ దృష్టికి దస్త్రాలతో వెళ్తే ఏ మాత్రం పట్టించుకోలేదన్నారు. నేతన్న నేస్తం 3 లక్షల మందికి ఇవ్వాలని కోరితే కేవలం 25 వేల మందికే ఇచ్చారన్నారు. వాల్మీకులను ఎస్టీల్లో చేర్చాలంటే తెదేపాను గెలిపించాలన్నారు. ఎంపీ అభ్యర్థి పంచలింగాల నాగరాజు, ఎమ్మెల్యే అభ్యర్థి బొగ్గుల దస్తగిరిని గెలిపించాలని కోరారు. ముందుగా  ద్విచక్ర వాహన ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఎంపీ అభ్యర్థి నాగరాజు, విష్ణువర్ధన్‌రెడ్డిలు మాట్లాడారు. కేఈ మల్లికార్జునగౌడ్‌, అమడగుంట్ల కృష్ణారెడ్డి, సురేష్‌, రవీంద్రగౌడ్‌, ఎల్లప్పనాయుడు, బలరాం, ఇంతియాజ్‌బాషా, పట్టెకృష్ణ, శ్రీనివాసనాయుడు, భాస్కర్‌ పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని