ఐదేళ్ల అధికారం.. 2కి.మీ కాల్వ నిర్మించలేదు
శ్రీశైలం ఎగువన (ఫోర్ షోర్) సుమారు 4.8 కి.మీ. దూరంపాటు అప్రోచ్ కాలువ నిర్మించి 40 టీఎంసీల కృష్ణా జలాలను మల్యాల ఎత్తిపోతల పథకం వరకు తరలించి అక్కడ నీటిని ఎత్తిపోస్తున్నారు.
ముచ్చుమర్రి అప్రోచ్ కెనాల్ నిర్మాణాన్ని వదిలేసిన జగన్
గుర్తించిన తెదేపా
మల్యాల వద్ద హంద్రీనీవా సుజల స్రవంతి (హెచ్.ఎన్.ఎస్.ఎస్) ఎత్తిపోతల పథకాన్ని నిర్మించి రాయలసీమలోని నాలుగు ఉమ్మడి జిల్లాల పరిధిలో సుమారు 6.03 లక్షల ఎకరాలకు సాగునీరు, 33 లక్షల మందికి తాగునీరు అందించాలని తెదేపా హయాంలో ప్రణాళిక రూపొందించారు.
వదిలేసిన వైకాపా
ముచ్చుమర్రి ఎత్తిపోతల.. రాయలసీమ జీవనాడి.. గత ప్రభుత్వ హయాంలో కేవలం 15 నెలల సమయంలో పూర్తి చేసింది.. ఐదేళ్లు అధికారంలో ఉన్న జగన్ కేవలం రెండు కిలోమీటర్లలోపు అప్రోచ్ కాలువ నిర్మాణాన్ని పూర్తి చేయలేకపోయింది. ఫలితంగా ఆ పథకాన్ని పూర్తిస్థాయిలో వినియోగించుకోలేని పరిస్థితి నెలకొంది.
నందికొట్కూరు, న్యూస్టుడే: శ్రీశైలం ఎగువన (ఫోర్ షోర్) సుమారు 4.8 కి.మీ. దూరంపాటు అప్రోచ్ కాలువ నిర్మించి 40 టీఎంసీల కృష్ణా జలాలను మల్యాల ఎత్తిపోతల పథకం వరకు తరలించి అక్కడ నీటిని ఎత్తిపోస్తున్నారు. 565 కి.మీ. పొడవైన కాలువ నిర్మించి ఆ నీటిని రాయలసీమలోని నాలుగు ఉమ్మడి జిల్లాలకు తరలిస్తున్నారు. ఈ పథకం పనిచేయాలంటే శ్రీశైలంలో నీటిమట్టం 834 అడుగులు ఉండాలి. ఈ నేపథ్యంలో ముచ్చుమర్రి దగ్గర మరో ఎత్తిపోతల పథకాన్ని నిర్మించారు. ఇక్కడ శ్రీశైలం నీటిమట్టం 798 అడుగులు ఉన్నా నీటిని ఎత్తిపోసేలా ప్రణాళికలు రూపొందించారు. ఆ మేరకు ఎత్తిపోతల పథకం నిర్మాణం పూర్తైనా శ్రీశైలం జలాశయం నీటిమట్టం 810 అడుగుల వరకు ఉన్నప్పుడు మాత్రమే నీటిని ఎత్తిపోయగలుగుతున్నారు. ముందుగా ప్రతిపాదించిన విధంగా శ్రీశైలం నీటిమట్టం 798 అడుగులు ఉన్న సమయంలో నీటిని ఎత్తిపోయాలంటే ప్రస్తుతం ఉన్న సుమారు 5.5 కి.మీ. పొడవైన అప్రోచ్ కాలువను కొంత వెడల్పు, మరికొంత లోతు చేయాలి.
కలగా విస్తరణ పనులు
ముచ్చుమర్రి అప్రోచ్ కాలువ నిర్మాణ పనులు సుమారు 3.5 కి.మీ. దూరంపాటు తెదేపా హయాంలోనే పూర్తయ్యాయి. కేవలం రెండు కి.మీ.లోపు మాత్రమే విస్తరణ పనులు పూర్తి చేయాల్సి ఉంది. గుత్తేదారుకు బిల్లులు చెల్లించలేకపోవడం.. ధరలు పెరిగినప్పటికీ అంచనాలు పెంచకపోవడంతో పనులు ఆగిపోయాయి. . దీని నిర్మాణానికి సుమారు రూ.30 కోట్లు ఖర్చవుతుందని అంచనా .వేశారు. 80శాతం పనులు పూర్తైనప్పటికీ మిగిలినవి ఎప్పటికీ పూర్తవుతాయన్నది ప్రశ్నార్థకంగా మారింది.ఫలితంగా శ్రీశైలం నీటిమట్టం 798 అడుగులు ఉన్నప్పుడు నీటిని ఎత్తిపోయాలన్న కల సాకారం కావడం లేదు.
అనుసంధానం ఆగింది
ముచ్చుమర్రి నుంచి 17.7 కి.మీ. దూరంలోని మల్యాల వరకు లింక్ కాలువ నిర్మించారు. ముచ్చుమర్రి ఎత్తిపోతల పథకం దగ్గర ఎత్తిపోసిన నీటిని మల్యాలలోని హెచ్.ఎన్.ఎస్.ఎస్ వద్దకు తీసుకెళ్లేందుకు లింక్ కాలువ అత్యంత కీలకం. దీని విస్తరణ పనులు సైతం ఆగిపోవడంతో ముచ్చుమర్రి ఎత్తిపోతల పథకాన్ని పూర్తిస్థాయిలో ఉపయోగించుకోలేని దుస్థితి తలెత్తింది
50శాతం సామర్థ్యంతోనే వినియోగం
ముచ్చుమర్రి దగ్గర హెచ్.ఎన్.ఎస్.ఎస్ కోసం మొత్తం 12 మోటార్లు, పంపులు ఏర్పాటు చేయగా ప్రస్తుతం ఆరింటిని మాత్రమే ఉపయోగించగలుగుతున్నారు. అప్రోచ్ ఛానెల్, లింక్ ఛానెల్ నిర్మాణాలు పూర్తయితే శ్రీశైలం నీటిమట్టం 798 అడుగులు ఉన్నప్పుడు సైతం తాగు, సాగునీటి అవసరాలకు వినియోగించుకునే అవకాశం ఉన్నా ఆ మేరకు పూర్తిస్థాయిలో వాడుకోవడం నేటికీ సాధ్యంకాని దుస్థితి తలెత్తింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అతుల్ కుమార్ మరణం పార్టీకి తీరని లోటు
[ 03-05-2024]
రైతు ఉద్యమ నేత, సీపీఐ పార్టీ మాజీ పార్లమెంట్ సభ్యుడు అతులకుమార్ అంజన్ మరణం సీపీఐ పార్టీకి తీరనిలోటని ఆ పార్టీ జిల్లా సహాయ కార్యదర్శి బాబాఫకృద్దీన్ అన్నారు. -
గుండెపోటుతో ఉపాధి కూలీ మృతి
[ 03-05-2024]
గుండె పోటుతో ఉపాధి కూలీ మృతి చెందిన సంఘటన మండలంలోని సింగరాజుపల్లి గ్రామంలో శుక్రవారం చోటుచేసుకుంది. -
రైతు సంక్షేమం తెదేపాతోనే సాధ్యం
[ 03-05-2024]
రైతు సంక్షేమం తెదేపాతోనే సాధ్యమని నంద్యాల పార్లమెంట్ తెదేపా బాధ్యుడుమాండ్ర శివానందరెడ్డి, ఎమ్మెల్యే అభ్యర్థి జయసూర్య అన్నారు. -
ఇండియా కూటమి అభ్యర్థులను గెలిపించండి
[ 03-05-2024]
ఇండియా కూటమి పత్తికొండ సీపీఐ అభ్యర్థి రామచంద్రయ్యను గెలిపించాలని సీపీఐ మండల కార్యదర్శి కృష్ణ కోరారు. -
తెదేపాలో చేరికలు
[ 03-05-2024]
స్థానిక తెదేపా కార్యాలయంలో నికిలేశ్, సుబ్బరాయుడు, జ్ఞానేశ్వర్ గౌడ్ ఆధ్వర్యంలో పలువురు వైకాపా నాయకులు తెదేపాలో చేరారు. -
వైకాపాను సాగనంపుదాం
[ 03-05-2024]
రానున్న ఎన్నికల్లో వైకాపాను సాగనంపుదామని మండల తెదేపా నాయకులు కేఈ నిఖిలేష్, సుబ్బరాయుడు అన్నారు. -
తెదేపాలోకి భారీగా చేరికలు
[ 03-05-2024]
పట్టణంలోని 31వ వార్డు సోమప్ప నగర్కు చెందిన 400 కుటుంబాలు తెదేపాలో చేరారు. -
జగన్ నాటకాలను ప్రజలు నమ్మరు
[ 03-05-2024]
సీఎం జగన్మోహన్ రెడ్డికి వృద్ధుల శాపం తప్పదని, పెన్షన్ బ్యాంకుల్లో వేసి వారిని బ్యాంకులు చుట్టూ తిప్పుతున్నారని జడ్పీటీసీల రాష్ట్ర సంఘం మాజీ అధ్యక్షుడు మీనాక్షి నాయుడు అన్నారు. -
కూటమి గెలుపుతోనే రాష్ట్రాభివృద్ధి సాధ్యం
[ 03-05-2024]
సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ప్రధాన పార్టీలు ఎన్నికల ప్రచారం ముమ్మరం చేశాయి. -
జగనాసురుడి రాజ్యం.. ఐసీయూలో ఆరోగ్యశ్రీ
[ 03-05-2024]
ఉమ్మడి కర్నూలు జిల్లాలోని పలు నెట్వర్క్ ఆసుపత్రుల్లో ఆరోగ్యశ్రీ కింద చేరిన రోగులకు తిప్పలు తప్పడం లేదు. నెట్వర్క్ ఆసుపత్రులకు ఇవ్వాల్సిన సొమ్ము గురించి ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. -
జగన్ కుట్ర ఎండలో పండుటాకుల విలవిల
[ 03-05-2024]
నడవలేనివారు.. మంచానికే పరిమితమైనవారు.. దివ్యాంగులకు ఇంటివద్ద సొమ్ము పంపిణీ చేయాలని ఆదేశాలున్నా సుమారు 50 శాతం సచివాలయ సిబ్బంది గ్రామ, వార్డు సచివాలయాల్లో కూర్చొని పంపిణీ చేయడం గమనార్హం. -
ఉమ్మడి జిల్లా ఓటర్లు 34,48,38211
[ 03-05-2024]
ఉమ్మడి జిల్లాలో 14 నియోజకవర్గాలు 34,48,382 మంది ఓటర్లు ఉన్నట్లు ఎన్నికల సంఘం గురువారం వెల్లడించింది. అందులో పురుషులు 16,98,607, మహిళలు 17,49,199, ఇతరులు 576 మంది ఉన్నారు. -
విపణి వేదికపై విఫల పాలన
[ 03-05-2024]
అన్నదాతకు అండగా నిలిచి వారికి.. వారికి ఆర్థిక చేయూత ఇచ్చేందుకు మార్కెట్ యార్డులు ఏర్పాటు చేశారు. యార్డుల్లో చేపట్టిన పనులు అసంపూర్తిగానే మిగిలిపోయాయి. -
జగన్ పాలనలో రైతుల పరిస్థితి దారుణం
[ 03-05-2024]
తెదేపా ప్రవేశ పెట్టిన మేనిఫెస్టో జనరంజకంగా ఉందని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు తిక్కారెడ్డి పేర్కొన్నారు. ఆలూరులోని పార్టీ కార్యాలయంలో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. -
ప్రచార భేరి
[ 03-05-2024]
ఆదోనిలోని 8, 9 వార్డుల్లో ఆదోని నియోజకవర్గ భాజపా అభ్యర్థి డా.పార్థసారథి గురువారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. కార్యక్రమంలో జనసేన బాధ్యుడు మల్లప్ప, తెదేపా, ఎమ్మార్పీఎస్, నాయకులు పాల్గొన్నారు. -
జగన్ ఆరాచకం.. తెలుగు గంగకు శోకం
[ 03-05-2024]
నాడు ఎన్టీఆర్ ప్రారంభించిన తెలుగు గంగ ప్రాజెక్టుపై ప్రస్తుత వైకాపా ప్రభుత్వం నిర్లక్ష్యం ప్రదర్శించడం రైతులకు శాపంగా పరిణమించింది. అయిదేళ్లలో జగనన్న ప్రభుత్వం ఈ ప్రాజెక్టుపై ఎటువంటి శ్రద్ధ చూపకపోవడంతో తాగు, సాగునీటికి కష్టాలేర్పడ్డాయి. -
చంద్రబాబుతోనే రాష్ట్రాభివృద్ధి సాధ్యం
[ 03-05-2024]
చంద్రబాబుతోనే రాష్ట్రాభివృద్ధి సాధ్యమని నంద్యాల తెదేపా ఎంపీ అభ్యర్థి బైరెడ్డి శబరి, శ్రీశైలం నియోజకవర్గం తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థి బుడ్డా రాజశేఖర్రెడ్డి స్పష్టం చేశారు. -
సైకో పార్టీకి డిపాజిట్ కూడా రాదు
[ 03-05-2024]
ప్రజల్లో ఉత్సాహం చూస్తుంటే ఈసారి సైకో పార్టీకి డిపాజిట్ కూడా రాదని అర్థమవుతోందని నంద్యాల తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థి ఎన్ఎండీ ఫరూక్ పేర్కొన్నారు. రాష్ట్రానికి రాజధాని లేకుండా చేసిన ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి అని ధ్వజమెత్తారు. -
స్వచ్ఛందంగా తెదేపాలోకి చేరికలు: బీసీ
[ 03-05-2024]
ప్రజలు అభివృద్ధిని కోరి స్వచ్ఛందంగా తెదేపాలోకి వస్తున్నారని తెదేపా అభ్యర్థి బీసీ జనార్దన్రెడ్డి పేర్కొన్నారు. గురువారం సంజామల మండలం కానాలకు చెందిన 60 కుటుంబాలు, ఆకుమళ్లకు చెందిన మైనార్టీ నాయకులు పార్టీలో చేరారు. -
తెదేపాలో చేరిన ఐఎంఏ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు
[ 03-05-2024]
నంద్యాలకు చెందిన ఇండియన్ మెడికల్ అసోసియేషన్ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు, ప్రస్తుత ఐఎంఏ యాక్షన్ కమిటీ ఛైర్మన్ డా.గుర్రాల రవికృష్ణ వైకాపాను వీడి తెదేపాలో చేరారు. -
కోట్ల, కేఈ కుటుంబాలతోనే అభివృద్ధి
[ 03-05-2024]
డోన్ నియోజకవర్గంలో కోట్ల, కేఈ కుటుంబాల పాలనలోనే అభివృద్ధి జరిగిందని తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థి కోట్ల జయసూర్యప్రకాశ్రెడ్డి, మాజీ మంత్రి కేఈ ప్రభాకర్ పేర్కొన్నారు. -
5వ తేదీన నీట్
[ 03-05-2024]
వైద్య కళాశాలల్లో ప్రవేశాలకుగాను 5వ తేదీన ఎన్టీఏ ఆధ్వర్యంలో ‘నీట్’ నిర్వహించనున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
‘తుపాకీతో బెదిరించి.. అత్యాచారం చేసి..’ - ప్రజ్వల్పై మహిళ ఫిర్యాదు
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
‘అప్రమత్తంగా ఉండండి’ : ఇజ్రాయెల్, ఇరాన్ వెళ్లే భారతీయులకు విదేశాంగ సూచన
-
ఎన్నికల వేళ.. ‘సూపర్ సీఎం’ సతీమణిపై బదిలీ వేటు
-
ఫేక్ యాప్స్కు గూగుల్ చెక్.. ప్రభుత్వ అప్లికేషన్లకు ఇకపై లేబుల్స్
-
ఉగ్రదాడులకు కుట్ర.. ఉక్రెయిన్ ‘ఏజెంట్’ను చంపిన రష్యా