logo

ఐదేళ్ల వైకాపా పాలనలో అభివృద్ధి కుంటు పడింది

ఐదేళ్ల వైకాపా పాలనలో అభివృద్ధి అన్ని రంగాల్లో కుంటుపడిందని కూటమి అభ్యర్థి బీవీ జయనాగేశ్వరరెడ్డి అన్నారు.

Published : 26 Apr 2024 10:19 IST

ఎమ్మిగనూరు వ్యవసాయం: ఐదేళ్ల వైకాపా పాలనలో అభివృద్ధి అన్ని రంగాల్లో కుంటుపడిందని కూటమి అభ్యర్థి బీవీ జయనాగేశ్వరరెడ్డి అన్నారు. శుక్రవారం పట్టణంలోని 24వార్డులో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. తెదేపా అమలు చేయనున్న సూపర్ సిక్స్ పథకాలను వివరించారు. కాలనీవాసులతో సమావేశమై మాట్లాడారు. వైకాపా ప్రభుత్వం ప్రజలకు తాగునీరు, అంతర్గత రహదారులు వంటి కనీస వసతులు కల్పించలేక పోయిందన్నారు. భూగర్భ మురుగు కాల్వ పనులు పూర్తి చేయడంలో విఫలమైందని ఆరోపించారు. నిత్యావసర ధరలు, చెత్త, విద్యుత్తు బిల్లులు పెంచి ప్రజలపై భారం మోపిందన్నారు. ప్రచారంలో కొండయ్య చౌదరి, సుందరరాజు, ఈశ్వర్ తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని