logo

తెదేపాను గెలిపిస్తే రుణాలు.. పింఛన్లు ఇంటి వద్దకే..

రాష్ట్రంలో రానున్న సార్వత్రిక ఎన్నికల్లో తెదేపాను గెలిపిస్తే  రుణాలు, పింఛన్లను ఇంటి వద్దకే పంపిస్తామని ఆ పార్టీ అభ్యర్థి బీవీ జయ నాగేశ్వరరెడ్డి అన్నారు.

Published : 04 May 2024 10:52 IST

ఎమ్మిగనూరు: రాష్ట్రంలో రానున్న సార్వత్రిక ఎన్నికల్లో తెదేపాను గెలిపిస్తే  రుణాలు, పింఛన్లను ఇంటి వద్దకే పంపిస్తామని ఆ పార్టీ అభ్యర్థి బీవీ జయ నాగేశ్వరరెడ్డి అన్నారు. శనివారం పట్టణంలోని 34 వ వార్డులో  ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ  రాష్ట్రంలో  రాక్షస పాలన సాగిస్తున్న సీఎం జగన్‌ను రానున్న ఎన్నికల్లో ఓడించాలని కోరారు. ఎమ్మినూర్,  పిఠాపురంలో శాశ్వత తాగునీటి సమస్య పరిష్కారం కోసం రూ.146 కోట్లు మంజూరు చేస్తే పనులు చేపట్టకుండా వదిలేశారని  ఆరోపించారు. వైకాపా పాలనలో అభివృద్ధి శూన్యమన్నారు. ఈ కార్యక్రమంలో తెదేపా నాయకులు  కొండయ్య చౌదరి, సాబీర్, సిరబుద్దిన్, తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని