logo

నర్సాపురంలో తెదేపా ఎన్నికల ప్రచారం

నరసాపురం, తిమ్మాపురం గ్రామాల్లో మండల తెదేపా నాయకులు బలరాం గౌడ్, రమాకాంత్ రెడ్డి శనివారం ఎన్నికల ప్రచారం...

Updated : 04 May 2024 11:41 IST

వెల్దుర్తి: మండలంలోని నరసాపురం,  తిమ్మాపురం గ్రామాల్లో మండల తెదేపా నాయకులు బలరాం గౌడ్, రమాకాంత్ రెడ్డి శనివారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. తెదేపా పత్తికొండ ఎమ్మెల్యే అభ్యర్థి కేఈ శ్యాంబాబు, తెదేపా కర్నూలు ఎంపీ అభ్యర్థి నాగరాజుకు ఓటు వేయాలని ప్రజలను అభ్యర్థించారు. తెదేపా సూపర్ సిక్స్ పథకాలతో ప్రతి ఒక్కరికి లబ్ధి చేకూరుతుందని, ఉద్యోగ అవకాశాలు ఉంటాయని వారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో తెదేపా నాయకులు రాజేశ్వర్ రెడ్డి, రాముడు, రామచంద్ర నాయుడు, సూర్య నాయుడు, రాఘవేంద్ర గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని