ప్రతి గ్రామానికి సాగునీరందిస్తాం
సిద్ధాపురం చెరువు వద్ద ప్రత్యేక తూము ఏర్పాటుచేసి పక్కనున్న ఐదారు గ్రామాలకు సాగునీరందిస్తామని శ్రీశైలం నియోజకవర్గం తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థి బుడ్డా రాజశేఖర్రెడ్డి పేర్కొన్నారు.
బైర్లూటి గూడెంలో చెంచులతో మాట్లాడుతున్న బుడ్డా
ఆత్మకూరు, న్యూస్టుడే : సిద్ధాపురం చెరువు వద్ద ప్రత్యేక తూము ఏర్పాటుచేసి పక్కనున్న ఐదారు గ్రామాలకు సాగునీరందిస్తామని శ్రీశైలం నియోజకవర్గం తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థి బుడ్డా రాజశేఖర్రెడ్డి పేర్కొన్నారు. ఆత్మకూరు మండలంలోని వెంకటాపురం, బైర్లూటి గూడెం, సంజీవనగర్ తండా, సిద్ధాపురం గ్రామాల్లో శనివారం ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా బుడ్డా మాట్లాడుతూ తాను ఎమ్మెల్యేగా, చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు శ్రీశైలంలో రూ.70 కోట్లతో ఆరున్నర కి.మీలు రింగ్రోడ్డు నిర్మిస్తే దాన్ని శిల్పా చేసినట్లు తప్పుడు ప్రచారం చేసుకుంటున్నారన్నారు. శ్రీశైల దేవస్థాన మాన్యం భూమి 5,300 ఎకరాలు దేవస్థానానికి తానే ఇప్పించినట్లు శిల్పా చెప్పుకోవడం దారుణమన్నారు. గత తెదేపా హయంలో ఆత్మకూరులో తాగునీటి సమస్య పరిష్కారానికి రూ.116 కోట్ల మంజూరు చేయిస్తే దాన్ని ప్రస్తుత నాయకులు ఆపివేశారని చెప్పారు. తెల్లరేషన్ కార్డుదారులందరికి వివాహనికి రూ.లక్ష ఇస్తామన్నారు.
సారా మానేస్తే మీరు కోరినవన్నీ ఇస్తా
జగన్ ప్రభుత్వంలో రద్దు చేసిన ప్రత్యేక చెంచు ఉపాధి పథకం మళ్లీ తీసుకొస్తామని బుడ్డా అన్నారు. నాగలూటి గూడేనికి చెందిన బయ్యన్న మాట్లాడుతూ గూడేంలో రహదారి, తాగునీటి కుళాయిలతో పాటు గృహాలు ఏర్పాటు చేయాలని కోరారు. అలాగే జంగిల్ సఫారిలో చెంచులకు ఉద్యోగాలు ఇప్పించాలన్నారు. విషయంపై బుడ్డా మాట్లాడుతూ చెంచులకు ఇళ్లు, ఇంటింటికి నీటి కుళాయి ఏర్పాటు చేస్తామన్నారు. చంద్రబాబును అడిగి భూములు కూడా ఇచ్చేందుకు కృషి చేస్తామన్నారు. చెంచు యువకులు తాగుడు మానేస్తే ఉద్యోగాలు చేసుకోవచ్చన్నారు. యువతులకు ఉద్యోగాలు ఇస్తామన్నారు. సారా మానేల చూడాలని చెంచు మహిళలు కోరగా దానికి బుడ్డా సారా మానుకుంటామని మాట ఇస్తే మీరు కోరినవన్నీ తీరుస్తానని చెప్పారు.
మద్యం నిషేధంపై మాట తప్పిన జగన్: తెదేపా
కొలిమిగుండ్ల, న్యూస్టుడే: ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు జగన్మోహన్రెడ్డి పాదయాత్రలో అధికారం చేపట్టిన వెంటనే మద్యనిషేధం అమలు చేస్తానని మాటిచ్చి ప్రస్తుతం మాట తప్పారని బనగానపల్లి మాజీ ఎమ్మెల్యే బీసీ జనార్దన్రెడ్డి ఆరోపించారు. శనివారం ‘ప్రజాగళం’లో భాగంగా మండలంలోని బందార్లపల్లె, తుమ్మలపెంట, గొర్విమానుపల్లె గ్రామాల్లో రోడ్ షోలను నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతు నవరత్నాల పేరిట జగన్ నవమోసాలకు పాల్పడ్డారన్నారు. విద్యుత్తు, ఆర్టీసీ ఛార్జీలు పెంచి ప్రజల నడ్డి విరుస్తున్నారని తెలిపారు. మల్లారెడ్డి, కల్యాన్రెడ్డి, అమర్నాథ్రెడ్డి, నరసింహ్ముడు, బాలస్వామిరెడ్డి, రామేశ్వరెడ్డి, శివారెడ్డి, వుశేన్రెడ్డి, రాము పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఎన్నికల పారితోషికం.. ఎందుకింత వ్యత్యాసం
[ 18-05-2024]
సార్వత్రిక ఎన్నికల విధులు నిర్వహించిన ప్రిసైడింగ్, అసిస్టెంట్ ప్రిసైడింగ్ అధికారులు (పీవో, ఏపీవో), ఇతర పోలింగ్ సిబ్బందికి ఇవ్వాల్సిన పారితోషికాల్లో అధికారులు ఇష్టానుసారంగా వ్యవహరించారని ఉద్యోగులు మండిపడుతున్నారు. -
పత్తి విత్తనం.. నకిలీ పెత్తనం
[ 18-05-2024]
ఖరీఫ్ సీజన్ ముంచుకొస్తోంది.. ఇటీవల వరుసగా వర్షాలు కురుస్తున్నాయి.. నేల బాగా నానడంతో రైతులు దుక్కులు దున్నుతున్నారు.. విత్తన సేకరణలో నిమగ్నమయ్యారు. -
కాల్వల్లో మన్ను.. వీధుల్లో మడుగు
[ 18-05-2024]
పురపాలకాల్లో ఏటా ఇంటి పన్ను 15 శాతం పెంచుతున్నారు.. కుళాయి పన్ను చెల్లించకుంటే కనెక్షన్ తొలగిస్తున్నారు.. వీధుల్లోకి వరద వస్తే మాత్రం పట్టించుకోవడం లేదు. -
అవసరం 46,98,726 వచ్చింది 5,40,752
[ 18-05-2024]
నెల రోజుల్లో పాఠశాలలు పునఃప్రారంభంకానున్నాయి.. మొదటి రోజే విద్యార్థులందరికీ పుస్తకాలిస్తామని ప్రభుత్వం గొప్పలు చెబుతోంది. క్షేత్రస్థాయిలో ఆ పరిస్థితి కనిపించడం లేదు. -
అందని బియ్యం..పేదల ఆగ్రహం
[ 18-05-2024]
హొళగుంద మండల పరిధిలోని గజ్జహళ్లిలో 17 రోజులైనా రేషన్ బియ్యం ఇవ్వలేదని గ్రామ సచివాలయం ఎదుట శుక్రవారం ఆందోళన చేపట్టారు. రామలింగ, శేఖర్, మంజు, మల్లమ్మ మాట్లాడుతూ 50 కుటుంబాలకు బియ్యం అందలేదన్నారు. -
ఇసుకను తోడేస్తున్నారా? ఫోన్ చేయండి
[ 18-05-2024]
తుంగభద్ర నదిలో జరుగుతున్న ఇసుక తవ్వకాలపై ‘‘మా రీచ్లపై కన్నేయండి’’ శీర్షికన ‘ఈనాడు’లో శుక్రవారం కథనం ప్రచురితమైంది.. గనులు, భూగర్భశాఖ అధికారులు స్పందించారు. -
రాబోయే ఐదు రోజులు తేలికపాటి వర్షాలు
[ 18-05-2024]
ఉమ్మడి కర్నూలు జిల్లాలో రాబోయే ఐదు రోజుల్లో చిరు జల్లుల నుంచి తేలికపాటి వర్ష సూచన ఉందని శుక్రవారం బనవాసి ఫారం కృషి విజ్ఞాన కేంద్రం సమన్వయకర్త అశోక్కుమార్ తెలిపారు. -
మోహినీ రూపంలో జ్వాలా నృసింహుడు
[ 18-05-2024]
అహోబిలం జ్వాలా నృసింహస్వామి మోహినీ అలంకృతులై భక్తులకు దర్శనమిచ్చారు. వైశాఖ మాస నృసింహ జయంతి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఎగువ అహోబిలంలో స్వామికి మోహినీ అలంకారం చేశారు. -
చంద్రబాబును కలిసిన టీజీ భరత్
[ 18-05-2024]
కర్నూలు అసెంబ్లీ నియోజకవర్గ తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థి టీజీ భరత్ శుక్రవారం హైదరాబాద్లో తెదేపా అధినేత నారా చంద్రబాబునాయుడును మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛాలు అందించారు. -
అధునాతన సౌకర్యాలు.. ఆదర్శ ఫలితాలు
[ 18-05-2024]
ఉమ్మడి జిల్లాలోని ఆదర్శ కళాశాలల్లో ఇంటర్మీడియట్లో చేరేందుకు పదోతరగతి ఉత్తీర్ణులైన వారి నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నారు. -
శ్రీమఠంలో అదనపు జిల్లా కోర్టు న్యాయమూర్తి
[ 18-05-2024]
రాఘవేంద్రస్వామి దర్శనార్థం కర్నూలు అదనపు జిల్లా కోర్టు న్యాయమూర్తి జి.భూపాల్రెడ్డి కుటుంబ సభ్యులతో శుక్రవారం మంత్రాలయం వచ్చారు. -
పెద్దాస్పత్రిలో పిచ్చికుక్క స్వైరవిహారం
[ 18-05-2024]
కర్నూలు నగరంలోని సర్వజన వైద్యశాలలో పిచ్చికుక్క శుక్రవారం ఉదయం స్వైరవిహారం చేసింది. దీంతో రోగులు పరుగులు తీశారు. -
బాధిత కుటుంబానికి రూ.25 లక్షలు చెల్లించండి
[ 18-05-2024]
రహదారి ప్రమాదంలో మృతి చెందిన వ్యక్తికి సంబంధించి ఆ కుటుంబానికి బీమా పరిహారం చెల్లించాల్సిందేనని ఆదిత్య బిర్లా సంస్థను జిల్లా వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్ ఆదేశించింది.