logo

ల్యాండ్.. సాండ్ మాఫియాను అరికడదాం: రాజ్‌నాథ్‌ సింగ్‌

రాష్ట్రంలో ల్యాండ్, సాండ్, వైన్ మాఫియాను తుది ముట్టిద్దామని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్ పిలుపునిచ్చారు.

Published : 05 May 2024 18:30 IST

ఆదోని మార్కెట్: రాష్ట్రంలో ల్యాండ్, సాండ్, వైన్ మాఫియాను తుది ముట్టిద్దామని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్ పిలుపునిచ్చారు. ఆదివారం మధ్యాహ్నం ఆదోని పట్టణంలో ఎన్డీఏ భాగస్వామ్యంలో భాగంగా ఆయన ఎన్నికల ప్రచారం నిమిత్తం వచ్చారు. ఈ సందర్భంగా భీమాస్ కూడలిలో ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడారు. రాష్ట్రం అవినీతి అక్రమాలు పెరిగిపోయాయి అన్నారు. ఇక్కడ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ల్యాండ్, సాండ్, వైన్ మాఫీ అని పెంచి పోషిస్తున్నారు అన్నారు. ఈ ప్రభుత్వాన్ని నిర్మూలించేందుకే ఎన్‌డీఏ జతకట్టిందన్నారు. దేశంలో.. రాష్ట్రంలో డబుల్ ఇంజిన్ సర్కార్‌తోనే అభివృద్ధి సాధ్యమవుతుందన్నారు. ముచ్చటగా మూడోసారి కేంద్రంలో నరేంద్ర మోదీ ప్రధానిగా, రాష్ట్రంలో చంద్రబాబు ముఖ్యమంత్రి అవుతారన్నారు. ఆదోని అసెంబ్లీని నుంచి భాజపా అభ్యర్థి డాక్టర్ పార్థసారధి, కర్నూల్ పార్లమెంటు నుంచి తెదేపా అభ్యర్థి నాగరాజును ఆశీర్వదించి గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో మాజీ రాజ్యసభ సభ్యుడు టీ. వెంకటేష్ , తెదేపా మాజీ ఎమ్మెల్యే మీనాక్షి నాయుడు, జనసేన బాధ్యుడు మల్లప్ప, విట్ట రమేష్, తెలుగుదేశం పార్టీ, భాజపా, జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. అంతకుముందు ఆయన ఆదోని ఆర్సన్ సైన్స్ కళాశాల మైదానంలో హెలికాఫ్టర్ ద్వారా చేరుకొని అక్కడి నుంచి భీమా సర్కిల్ వరకు రాజనాథ్ సింగ్ రోడ్ షో ద్వారా చేరుకున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని