ప్రతి ఇంటికి తాగునీరు అందిస్తా
ఆదోని పట్టణంతో పాటు పల్లెలు తాగునీటి సమస్యతో తల్లడిల్లుతున్నాయి. ప్రతి ఇంటికి కుళాయి నీటిని అందిస్తానని ఆదోని భాజపా అభ్యర్థి డాక్టర్ పార్థసారథి హామీ ఇచ్చారు.
ఆదోనిలో రాజ్నాథ్ సింగ్ పర్యటన
భాజపా శ్రేణుల్లో నూతనోత్సాహం
ఈనాడు, కర్నూలు, ఆదోని పాతపట్టణం, న్యూస్టుడే: ఆదోని పట్టణంతో పాటు పల్లెలు తాగునీటి సమస్యతో తల్లడిల్లుతున్నాయి. ప్రతి ఇంటికి కుళాయి నీటిని అందిస్తానని ఆదోని భాజపా అభ్యర్థి డాక్టర్ పార్థసారథి హామీ ఇచ్చారు.
ఆదోనిలో ఆదివారం జరిగిన కేంద్ర రక్షణశాఖ మంత్రి సభలో ఆయన మాట్లాడారు. ఆదోని నియోజకవర్గ ప్రజలకు తాగునీటి కోసం కేంద్రం రూ.400కోట్లు కేటాయిస్తే... ఆ నిధులు ఖర్చు పెట్టలేక వెనక్కి పంపించిన విషయం వాస్తవమా? కాదా? అని ప్రశ్నించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి వచ్చే నిధులు కాజేసి స్థానిక ఎమ్మెల్యే ప్రజల్ని మోసం చేశారన్నారు. కూటమి తరఫున భాజపా అభ్యర్థిగా పోటీచేస్తున్న తనను గెలిపిస్తే కేంద్రం నుంచి నిధుల వరద పారిస్తానన్నారు. ఆదోని నియోజకవర్గంలో గత పదేళ్లుగా రౌడీయిజం రాజ్యమేలుతోందని, కబ్జాలు, దౌర్జన్యాలు జరుగుతున్నాయని గుర్తుచేశారు. రాష్ట్రంలో ప్రభుత్వం మారబోతోందని కబ్జాలు, దౌర్జన్యాలు మానుకోకపోతే కఠినచర్యలు తప్పవని హెచ్చరించారు. కర్నూలు పార్లమెంటు అభ్యర్థి బస్తిపాటి నాగరాజు మాట్లాడుతూ.. కర్నూలు నియోజకవర్గం నుంచి ఏటా లక్షలాది మంది వలస వెళ్తున్నారని, ఆ సమస్యను పరిష్కరించాలని కేంద్రమంత్రికి విజ్ఞప్తి చేశారు. కేంద్రం సాయంతో గుండ్రేవుల, వేదవతి ప్రాజెక్టులు పూర్తిచేస్తామన్నారు. కార్యక్రమంలో భాజపా మాజీ ఎంపీ టి.జి.వెంకటేశ్, తెదేపా కర్నూలు పార్లమెంట్ నియోజకవర్గ అధ్యక్షుడు తిక్కారెడ్డి, తెదేపా ఆదోని నియోజకవర్గ ఇన్ఛార్జి, రాష్ట్ర ఉపాధ్యక్షుడు మీనాక్షినాయుడు, ఆదోని నియోజకవర్గ జనసేన ఇన్ఛార్జి మల్లప్ప తదితరులు పాల్గొన్నారు.
తరలివచ్చిన జనం..
కేంద్రమంత్రి రాజ్నాథ్సింగ్కు ఆదోని భాజపా, తెదేపా, జనసేన శ్రేణులతో పాటు స్థానిక ప్రజలు సైతం బ్రహ్మరథం పట్టారు. మధ్యాహ్నం మూడు గంటలకు సభ నిర్వహిస్తామని చెప్పడంతో పలువురు ఆ సమయానికి భీమాస్ సర్కిల్కు చేరుకుని మండుటెండను సైతం లెక్కచేయకుండా వేచిచూశారు. సభ విజయవంతం అయినట్లు ఆయా పార్టీల శ్రేణులు తెలిపాయి.
ఆదోని అభివృద్ధికి నిధులు
ఆదోని భాజపా అభ్యర్థి డాక్టర్ పార్థసారథిని తానే పార్టీలోకి తీసుకొచ్చి, ఎమ్మెల్యేగా నిలబెట్టామని... ఆయనను గెలిపిస్తే ఒక సీనియర్ మంత్రిగా కేంద్రం నుంచి నియోజకవర్గ అభివృద్ధికి భారీగా నిధులు కేటాయించే బాధ్యత తీసుకుంటానని రాజ్నాథ్సింగ్ సభాముఖంగా ప్రకటించారు. కర్నూలు పార్లమెంటు అభ్యర్థి బస్తిపాటి నాగరాజును భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. ముందుగా రాజ్నాథ్సింగ్కు భాజపా, తెదేపా, జనసేన నేతలు హెలిప్యాడ్ దగ్గర ఘనంగా స్వాగతం పలికారు. కూటమి పార్టీల నేతలు, శ్రేణులతో పాటు పోలీసు కంట్రోల్ రూం నుంచి ర్యాలీగా బయల్దేరి భీమాస్ సర్కిల్ వరకు ప్రజలకు అభివాదం చేసుకుంటూ వెళ్లారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఎన్నికల పారితోషికం.. ఎందుకింత వ్యత్యాసం
[ 18-05-2024]
సార్వత్రిక ఎన్నికల విధులు నిర్వహించిన ప్రిసైడింగ్, అసిస్టెంట్ ప్రిసైడింగ్ అధికారులు (పీవో, ఏపీవో), ఇతర పోలింగ్ సిబ్బందికి ఇవ్వాల్సిన పారితోషికాల్లో అధికారులు ఇష్టానుసారంగా వ్యవహరించారని ఉద్యోగులు మండిపడుతున్నారు. -
పత్తి విత్తనం.. నకిలీ పెత్తనం
[ 18-05-2024]
ఖరీఫ్ సీజన్ ముంచుకొస్తోంది.. ఇటీవల వరుసగా వర్షాలు కురుస్తున్నాయి.. నేల బాగా నానడంతో రైతులు దుక్కులు దున్నుతున్నారు.. విత్తన సేకరణలో నిమగ్నమయ్యారు. -
కాల్వల్లో మన్ను.. వీధుల్లో మడుగు
[ 18-05-2024]
పురపాలకాల్లో ఏటా ఇంటి పన్ను 15 శాతం పెంచుతున్నారు.. కుళాయి పన్ను చెల్లించకుంటే కనెక్షన్ తొలగిస్తున్నారు.. వీధుల్లోకి వరద వస్తే మాత్రం పట్టించుకోవడం లేదు. -
అవసరం 46,98,726 వచ్చింది 5,40,752
[ 18-05-2024]
నెల రోజుల్లో పాఠశాలలు పునఃప్రారంభంకానున్నాయి.. మొదటి రోజే విద్యార్థులందరికీ పుస్తకాలిస్తామని ప్రభుత్వం గొప్పలు చెబుతోంది. క్షేత్రస్థాయిలో ఆ పరిస్థితి కనిపించడం లేదు. -
అందని బియ్యం..పేదల ఆగ్రహం
[ 18-05-2024]
హొళగుంద మండల పరిధిలోని గజ్జహళ్లిలో 17 రోజులైనా రేషన్ బియ్యం ఇవ్వలేదని గ్రామ సచివాలయం ఎదుట శుక్రవారం ఆందోళన చేపట్టారు. రామలింగ, శేఖర్, మంజు, మల్లమ్మ మాట్లాడుతూ 50 కుటుంబాలకు బియ్యం అందలేదన్నారు. -
ఇసుకను తోడేస్తున్నారా? ఫోన్ చేయండి
[ 18-05-2024]
తుంగభద్ర నదిలో జరుగుతున్న ఇసుక తవ్వకాలపై ‘‘మా రీచ్లపై కన్నేయండి’’ శీర్షికన ‘ఈనాడు’లో శుక్రవారం కథనం ప్రచురితమైంది.. గనులు, భూగర్భశాఖ అధికారులు స్పందించారు. -
రాబోయే ఐదు రోజులు తేలికపాటి వర్షాలు
[ 18-05-2024]
ఉమ్మడి కర్నూలు జిల్లాలో రాబోయే ఐదు రోజుల్లో చిరు జల్లుల నుంచి తేలికపాటి వర్ష సూచన ఉందని శుక్రవారం బనవాసి ఫారం కృషి విజ్ఞాన కేంద్రం సమన్వయకర్త అశోక్కుమార్ తెలిపారు. -
మోహినీ రూపంలో జ్వాలా నృసింహుడు
[ 18-05-2024]
అహోబిలం జ్వాలా నృసింహస్వామి మోహినీ అలంకృతులై భక్తులకు దర్శనమిచ్చారు. వైశాఖ మాస నృసింహ జయంతి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఎగువ అహోబిలంలో స్వామికి మోహినీ అలంకారం చేశారు. -
చంద్రబాబును కలిసిన టీజీ భరత్
[ 18-05-2024]
కర్నూలు అసెంబ్లీ నియోజకవర్గ తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థి టీజీ భరత్ శుక్రవారం హైదరాబాద్లో తెదేపా అధినేత నారా చంద్రబాబునాయుడును మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛాలు అందించారు. -
అధునాతన సౌకర్యాలు.. ఆదర్శ ఫలితాలు
[ 18-05-2024]
ఉమ్మడి జిల్లాలోని ఆదర్శ కళాశాలల్లో ఇంటర్మీడియట్లో చేరేందుకు పదోతరగతి ఉత్తీర్ణులైన వారి నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నారు. -
శ్రీమఠంలో అదనపు జిల్లా కోర్టు న్యాయమూర్తి
[ 18-05-2024]
రాఘవేంద్రస్వామి దర్శనార్థం కర్నూలు అదనపు జిల్లా కోర్టు న్యాయమూర్తి జి.భూపాల్రెడ్డి కుటుంబ సభ్యులతో శుక్రవారం మంత్రాలయం వచ్చారు. -
పెద్దాస్పత్రిలో పిచ్చికుక్క స్వైరవిహారం
[ 18-05-2024]
కర్నూలు నగరంలోని సర్వజన వైద్యశాలలో పిచ్చికుక్క శుక్రవారం ఉదయం స్వైరవిహారం చేసింది. దీంతో రోగులు పరుగులు తీశారు. -
బాధిత కుటుంబానికి రూ.25 లక్షలు చెల్లించండి
[ 18-05-2024]
రహదారి ప్రమాదంలో మృతి చెందిన వ్యక్తికి సంబంధించి ఆ కుటుంబానికి బీమా పరిహారం చెల్లించాల్సిందేనని ఆదిత్య బిర్లా సంస్థను జిల్లా వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్ ఆదేశించింది.
తాజా వార్తలు (Latest News)
-
తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ..
-
బస్సులో చెలరేగిన మంటలు.. 8 మంది సజీవ దహనం
-
మనీషా కొయిరాలకు క్షమాపణలు చెప్పిన సోనాక్షి సిన్హా.. ఎందుకంటే!
-
కెమెరామన్.. ప్లీజ్ ఆడియో ఆన్ చేయొద్దు: రోహిత్ శర్మ
-
కిర్గిస్థాన్లో అల్లర్లు.. భారత విద్యార్థులకు కేంద్రం అలర్ట్
-
నేడు స్టాక్మార్కెట్ ప్రత్యేక సెషన్.. దూసుకెళ్లిన సూచీలు