రవ్వలకొండ చరిత్రకు సమాధి
కాలజ్ఞానం చరిత్రను మట్టి మాఫియా ఖతం చేస్తోంది.. ‘అధికారం’ తోడుగా ఉండటం.. యంత్రాంగం పట్టించుకోకపోవడంతో రెచ్చిపోతోంది.. 2000 హెక్టార్లలో విస్తరించిన రవ్వలకొండను మట్టి మాఫియా తవ్వేస్తోంది.
మట్టిమాఫియా ఆగడాలు
అధికార అండదండలు
అనుమతులు లేకుండా ట్రాక్టర్లో మట్టి నింపుతున్న చోదకుడు
బనగానపల్లి, న్యూస్టుడే: కాలజ్ఞానం చరిత్రను మట్టి మాఫియా ఖతం చేస్తోంది.. ‘అధికారం’ తోడుగా ఉండటం.. యంత్రాంగం పట్టించుకోకపోవడంతో రెచ్చిపోతోంది.. 2000 హెక్టార్లలో విస్తరించిన రవ్వలకొండను మట్టి మాఫియా తవ్వేస్తోంది. పోతులూరి వీరబ్రహ్మంగారు కాలజ్ఞానం రాసిన వేదిక.. పర్యాటకులను ఆకట్టుకునే గుహలకు ప్రమాదం తెచ్చిపెడుతున్నారు.అక్రమంగా మట్టి తవ్వి పట్టపగలే ట్రాక్టర్లు, టిప్పర్లలో తీసుకెళ్తున్నా ఎవరూ పట్టించుకోవడం లేదు. నిత్యం టన్నుల కొద్ది మట్టి తవ్వి వందల వాహనాల్లో తరలిస్తున్నా మా పరిధి కాదంటే మాది కాదని రెవెన్యూ, అటవీ, గనుల శాఖలు కార్యాలయాలకే పరిమితమయ్యాయి. మట్టినంతా 60 కి.మీ దూరంలో ఉన్న నంద్యాల జిల్లా కేంద్రానికి తీసుకెళ్తున్నారు. ప్రస్తుతం రవ్వలకొండలో ఎక్కడ చూసిన గోతులే దర్శనమిస్తున్నాయి.
అటువైపు తొంగి చూడని అధికారులు
అటవీ, రెవెన్యూ, గనులశాఖ, పంచాయతీ అధికారుల మధ్య సమన్వయ లోపం అక్రమార్కులకు వరంగా మారింది. టన్నుల కొద్ది మట్టి అక్రమంగా తరలిపోతున్నా ఏ ఒక్క అధికారి ఇటువైపు తొంగి చూడటం లేదు. రవ్వలకొండపై అటవీశాఖ అధికారుల పర్యవేక్షణ ఎక్కువగా ఉండాలి. వారెక్కడ ఉంటారో ఎవరికీ తెలియని పరిస్థితి నెలకొంది. చాలామంది మామూళ్ల మత్తులో జోగుతున్నారనే విమర్శలు రేగుతున్నాయి. అప్పుడప్పుడూ చిన్నపాటి జరిమానాలతో సరిపెడుతున్నారు. ఎంతో చరిత్ర ఉన్న రవ్వకొండను పరిరక్షించుకోవాల్సిన అవసరం ఉంది.. తవ్వకాలు నిలిపివేయకుంటే చరిత్ర ఆనవాళ్లు సమాధి కావడం ఖాయమని స్థానికులు పేర్కొంటున్నారు. అధికారుల నిఘా పెంచాలని స్థానికులు కోరుతున్నారు.
కొండ నిండా ఎర్రమన్నే
రవ్వలకొండపై ఎర్రమట్టి ఎక్కువ దొరుకుతుంది. దీన్ని ఇళ్ల నిర్మాణానికి ఎక్కువగా వినియోగిస్తారు. మార్కెట్లో ఎర్రమట్టికి డిమాండు ఎక్కువగా ఉండటంతో అక్రమార్కులు సొమ్ము చేసుకుంటున్నారు. నిత్యం 50 టిప్పర్లు, 50 ట్రాక్టర్లలో మట్టి తరలివెళ్తోంది. ఒక టిప్పర్లో 3-4 టన్నులు, ట్రాక్టర్లో టన్ను వరకు మట్టి పడుతోంది. దూరాన్ని బట్టి టిప్పర్ మట్టిని రూ.3 వేలు- రూ.5 వేల వరకు, ట్రాక్టర్కు రూ.1000 నుంచి రూ.2000 వేల వరకు వసూలు చేస్తున్నారు. ఈ లెక్కన నిత్యం రూ.35 వేలు, ప్రతి నెల సుమారు రూ.10 లక్షల ఆదాయం అక్రమార్కుల పరమవుతోంది. ఏడాదికి రూ.1.20 కోట్ల ఆదాయానికి గండి పడుతోంది. మట్టిని తరలించే యజమానులు టిప్పర్కు రూ.3 వేలకు పైగా, ట్రాక్టర్లకు రూ.1000 వరకు బయట విక్రయించి ఆదాయం పొందుతున్నారు. దూరాన్ని బట్టి టిప్పర్, ట్రాక్టర్లకు ఇంకా ఆదాయం పెరిగే అవకాశం ఉంది.
గుత్తేదారులూ తీసుకెళ్తున్నారు
బనగానపల్లి చుట్టుపక్కల అభివృద్ధి పనులు చేపట్టే గుత్తేదారులు ఇక్కడి నుంచే మట్టిని తీసుకెళ్తున్నారు. నిబంధనల ప్రకారం వారు ముందస్తుగా దరఖాస్తు చేసుకోవాలి. గనులశాఖ వారి అనుమతి ఇస్తే రాయల్టీ చెల్లించి తీసుకెళ్లాల్సి ఉంటుంది. కానీ గుత్తేదారులకు అధికార పార్టీ అండదండలు ఉండటంతో ఎలాంటి అనుమతుల్లేకుండా తోడేస్తున్నారు. మట్టి కోసం ఇప్పటి వరకు మండల రెవెన్యూ అధికారులకు ఇప్పటి వరకు ఒక్క దరఖాస్తు రాలేదు. అధికారులు అనుమతులిచ్చిన దాఖలాలు లేవు. కానీ కొండ మాత్రం తరిగిపోతోంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
టిడ్కో ఇళ్లలో పోలీసుల సోదాలు
[ 19-05-2024]
పట్టణంలోని కోయిలకుంట్ల రోడ్డులో ఉన్న ప్రభుత్వ టిడ్కో ఇళ్ల సముదాయాల్లో పోలీసులు సోదాలు నిర్వహించారు. -
పుర జనం గొంతులో గరళం
[ 19-05-2024]
ఏటా నీటి పన్నుల కింద రూ.లక్షలు సమకూరుతున్నాయి. నీటి శుద్ధి పుర బడ్జెట్ కింద భారీగా వెచ్చిస్తున్నారు.. లీకేజీల నివారణకు రూ.లక్షలు ధారబోస్తున్నారు.. నీరు రంగు మారుతోంది.. దుర్వాసన వస్తోంది.. తాగలేకపోతున్నామని పుర ప్రజలు గగ్గోలు పెడుతున్నారు. -
ఆర్యూ.. అక్రమాల పుట్ట
[ 19-05-2024]
రాయలసీమ విశ్వవిద్యాలయంలో అక్రమాలు వెలుగులోకి వస్తున్నా అధికారులు పట్టించుకోవడం లేదు.. విచారణ సమగ్రంగా కొనసాగడం లేదు.. కొన్ని ఘటనల్లో విచారణలు పూర్తైనా చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు. -
పరీక్ష ప్రశ్నార్థకం
[ 19-05-2024]
రాయలసీమ విశ్వవిద్యాలయంలోని పరీక్షల విభాగానికి చెందిన ఓ ఉన్నతాధికారి నిర్లక్ష్యంతో వందల విద్యార్థుల జీవితాలు ఇబ్బందుల్లో పడ్డాయి. -
చిరుజల్లులకే ఛిద్రం
[ 19-05-2024]
కొత్తగా నిర్మిస్తున్న 340(బి) జాతీయ రహదారి చిరుజల్లులకే ఛిద్రమైంది.. మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలకు పగుల్లొచ్చాయి. హడావుడిగా పనులు చేయడంతోనే ఈ పరిస్థితి తలెత్తినట్లు ఆరోపణలు వస్తున్నాయి. -
బాక్సింగ్ కింగ్లు.. ఆదోని కుర్రాళ్లు
[ 19-05-2024]
ఆ కుర్రాళ్లు కొట్టే దెబ్బలకు దవడలు అదిరిపోతాయి.. మెదడులోని నరాల్లో కదలికలు పుడతాయి.. రింగులోకి ప్రత్యర్థి రావాలంటేనే భయపడే పరిస్థితి.. పతకాలు మాత్రం వచ్చి వాలిపోతాయి. -
స్ట్రాంగ్ రూమ్ల ఎదుట నిరంతర నిఘా: కలెక్టర్
[ 19-05-2024]
పార్లమెంట్, శాసనసభ నియోజకవర్గాలకు సంబంధించిన ఈవీఎంలను భద్రపరిచిన స్ట్రాంగ్ రూంల ఎదుట 24 గంటలు నిరంతర నిఘా ఉంచినట్లు కలెక్టర్ కె.శ్రీనివాసులు, ఎస్పీ రఘువీర్రెడ్డి పేర్కొన్నారు. -
ఓపీక పడితేనే వైద్యం
[ 19-05-2024]
నంద్యాల సర్వజన ఆసుపత్రిలో ఓపీ సేవలు ఉదయం 9 నుంచి సాయంత్రం 4 గంటల వరకు పెంచినా వైద్యులు మాత్రం గదుల్లో ఉండకపోవడంతో అరకొరగా సేవలు అందుతున్నాయనే విమర్శలు వస్తున్నాయి. -
లక్ష్య సాధనలోగెలుపు సందేశం
[ 19-05-2024]
తల్లిదండ్రుల ప్రోత్సాహం.. కష్టపడి చదవడం.. అనుకున్న లక్ష్యం చేరుకోవాలన్న కసి.. వెరసి ఆ విద్యార్థిని విజయం వైపు నడిపించాయి. పదో తరగతిలో పదికి పది.. ఇంటర్లో ఉత్తమ ఫలితాలతో ప్రశంసలు అందుకున్నాడు. -
బీఎల్వోలకు అందని భృతి
[ 19-05-2024]
ఎన్నికల విధులకు సంబంధించి బీఎల్వోలు నిరంతరం కష్టపడ్డారు. క్షేత్రస్థాయిలో వివరాలు సేకరించారు.. ఓటర్ల మార్పులు, చేర్పుల్లో కీలకపాత్ర పోషించారు. పైసా పారితోషికం అందడం లేదు. -
తెలంగాణ ఎంసెట్లో విద్యార్థుల ప్రతిభ
[ 19-05-2024]
తెలంగాణ ఎంసెట్ (అగ్రికల్చర్)లో కర్నూలు నారాయణ విద్యార్థులు ప్రతిభ చాటారని డీజీఎం గోవర్ధన్ తెలిపారు. -
మహానంది క్షేత్రంలో భక్తుల రద్దీ
[ 19-05-2024]
మహానంది పుణ్యక్షేత్రంలో శనివారం భక్తుల రద్దీతో సందడి నెలకొంది. వరుసగా సెలవులు రావడంతో రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన భక్తులే కాకుండా కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్ర నుంచి మహానందికి తరలివచ్చారు. -
నృసింహస్వామి జయంతి బ్రహ్మోత్సవాలు
[ 19-05-2024]
వైశాఖ మాస నృసింహ జయంతి బ్రహ్మోత్సవాల్లో నరహరుడు అహోబిలం లక్ష్మీనృసింహస్వామి వేణుగోపాల స్వామి అలంకరణలో శనివారం భక్తులకు దర్శనమిచ్చారు. అనంతరం స్వామివారు శ్రీదేవి, భూదేవి సమేతంగా పల్లకిపై కొలువుదీర్చి ఆలయ తిరువీధుల్లో మేళతాళాలతో ఊరేగించారు.
తాజా వార్తలు (Latest News)
-
అప్పుడు.. ఒక్కసారి కూడా స్కోరు బోర్డు చూడలేదు: యశ్ దయాళ్
-
సీసీ ఫుటేజీని, సాక్ష్యాలను బిభవ్ ధ్వంసం చేసుండొచ్చు: దిల్లీ పోలీసులు
-
ఆప్ అంతానికి భాజపా ‘ఆపరేషన్ ఝాడు’: కేజ్రీవాల్
-
ధోనీకి ఎప్పుడేం చేయాలో తెలుసు: చెన్నై కోచ్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
ఒకప్పుడు న్యాయం కోసం వీధుల్లోకి వచ్చాం.. ఇప్పుడు?.. ఆప్ నిరసనపై మాలీవాల్