ఆదాయమున్నా నిర్లక్ష్యమే!
కోస్గి పట్టణంలో ప్రతి ఆదివారం నిర్వహించే వారాంతపు సంత ద్వారా ఏటా రూ.కోటికి పైగా ఆదాయం వస్తోంది. అయినా సదుపాయాలు కల్పించడంలో అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారు. సంతకు మండలంలోని గ్రామాల నుంచే కాకుండా
కోస్గిలో రోడ్డుపైనే వార సంత
తరచూ ట్రాఫిక్ జాంతో ఇబ్బందులు
కోస్గి శివాజీ కూడలిలో రోడ్డుపైనే దుకాణాలు పెట్టుకున్న వ్యాపారులు
న్యూస్టుడే, కోస్గి న్యూటౌన్: కోస్గి పట్టణంలో ప్రతి ఆదివారం నిర్వహించే వారాంతపు సంత ద్వారా ఏటా రూ.కోటికి పైగా ఆదాయం వస్తోంది. అయినా సదుపాయాలు కల్పించడంలో అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారు. సంతకు మండలంలోని గ్రామాల నుంచే కాకుండా ఇతర మండలాలు, జిల్లాల నుంచి కూడా వ్యాపారులు వస్తుంటారు. ప్రతి వారం కనీసం రూ.అరకోటికి పైగా వ్యాపారం సాగుతుంది. తాజా కూరగాయలు, ఆకు కూరలు, పండ్లు, తినుబండారాలు, వంట సామగ్రి, దినుసులు, దుస్తులు, వ్యవసాయ పరికరాలు, నిర్మాణ సామగ్రి ఇతరాత్ర అన్నీ లభిస్తాయి. వీటిని కొనుగోలు చేసేందుకు నియోజకవర్గ ప్రజలతో పాటు సమీపాన ఉన్న వికారాబాద్ జిల్లా, కర్ణాటక రాష్ట్రంలోని గుల్బర్గా, యాద్గీర్ జిల్లాల నుంచి కూడా ప్రజలు వేలాదిగా వస్తుంటారు. కూరగాయలు, పశువుల సంతతో కోస్గి పురపాలికకు ఏడాదికి రూ.1.20 కోట్లకు పైగా ఆదాయం సమకూరుతోంది. కానీ సంతలో కనీస వసతులు కల్పించకపోవడం వ్యాపారులు, కొనుగోలు దారులను ఇబ్బందులు తప్పడం లేదు.
అమలుకు నోచుకోని హామీ..
ప్రతి ఆదివారం పట్టణంలో రోడ్డుపైనే సంత నిర్వహిస్తున్నారు. వేసవిలో ఎండకు, వానాకాలం వర్షాలకు ఇబ్బందులు పడుతున్నామని వ్యాపారులు, కొనుగోలు దారులు పలుమార్లు అధికారులు, పాలకుల దృష్టికి తీసుకెళ్లారు. వారాంతపు సంతకు పట్టణంలోని శివాజీ కూడలి సమీపంలో ఉన్న దేవాదాయ స్థలం లీజుకు తీసుకొని, అందులో దుకాణాలు ఏర్పాటు చేస్తామని పలు సమావేశాల్లో ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డి హామీ ఇచ్చారు. ఇప్పటి వరకు ఆ దిశగా చర్యలు మాత్రం లేవు. ప్రస్తుతం ఎడతెరిపి లేని వర్షాల్లోనే సంత నిర్వహిస్తూ.. జనం, వ్యాపారులు అవస్థ పడుతూనే ఉన్నారు. దీంతో పాటు తాగునీటి సౌకర్యం, మూత్రశాలలు, మరుగుదొడ్ల సదుపాయం లేకపోవడంతో వ్యాపారులు, ఇతర గ్రామాల నుంచి వచ్చే కొనుగోలుదారులు పడుతున్న ఇబ్బందులు అంతాఇంతా కాదు.
పశువుల విక్రయాలకూ అవస్థలే..
పట్టణంలో కొనసాగే పశువుల సంతకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. సుదూర ప్రాంతాల నుంచి రైతులు పశువులను అమ్మడానికి, కొనడానికి వస్తుంటారు. ప్రతి వారం రూ.కోటికి పైగా వ్యాపారం ఉంటుంది. రెండు నెలల కిందటి వరకు బీసీ కాలనీలోని ప్రభుత్వ స్థలంలో పశువుల సంత నిర్వహించే వారు. అయితే పురపాలికలో సమీకృత మార్కెట్ సముదాయ నిర్మాణం కోసం ఈ స్థలాన్ని కేటాయించడంతో.. పశువుల సంతను పట్టణ శివారులోని ఓ ప్రైవేటు స్థలంలోకి మార్చారు. ఇక్కడ కనీస సదుపాయాల్లేక రైతులు ఇబ్బందులు పడుతున్నారు. పశువులకు కనీసం తాగునీరు కూడా లభించడం లేదు. అధికారులు స్పందించి వారాంతపు సంతకు ప్రత్యేక స్థలం కేటాయించాలని, పశువుల సంతలో మౌలిక వసతులు కల్పించాలని వ్యాపారులు, కొనుగోలుదారులు కోరుతున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పోరుబాటతో గులాబీ శ్రేణుల్లో జోష్
[ 27-04-2024]
భారాస అధినేత, మాజీ సీఎం కేసీఆర్ ‘పోరుబాట’ బస్సుయాత్ర శుక్రవారం మహబూబ్నగర్లో విజయవంతం కావడంతో గులాబీ శ్రేణుల్లో ఉత్సాహం నెలకొంది. పాలమూరులో రెండు రోజులపాటు కొనసాగే ఈ కార్యక్రమానికి మొదటి రోజు పార్టీ శ్రేణులు, ప్రజలు పెద్దఎత్తున తరలివచ్చారు. -
తుది జాబితాపై కసరత్తు పూర్తి
[ 27-04-2024]
పాలమూరులో ఓటర్ల తుది జాబితాపై కసరత్తు పూర్తయ్యింది. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఎస్ఎస్ఆర్-2024కు అదనంగా కొత్త ఓటర్లను జత చేసి తుది జాబితాను ఒకటి, రెండు రోజుల్లో ప్రకటించనున్నారు. -
గంజాయి దందా.. యువతే నిండా
[ 27-04-2024]
పాలమూరు పట్టణంలో గంజాయి వ్యాపారం చాప కింద నీరులా విస్తరిస్తోంది. ఎక్సైజ్, పోలీసు శాఖలు నిఘా పెట్టినా.. వారి కళ్లు గప్పి గంజాయిని విక్రయిస్తూనే ఉన్నారు. ఈ కేసులో అరెస్టయి జైలుకు వెళ్లిన వాళ్లు కూడా బయటకు వచ్చాక మళ్లీ అదే దందా చేస్తున్నారు. -
పాలమూరు సిబ్బందికి పరీక్ష!
[ 27-04-2024]
రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా పాలమూరు విశ్వవిద్యాలయం (పీయూ)లో పనిచేస్తున్న బోధనేతర సిబ్బందికి అధికారులు ‘పరీక్ష’ నిర్వహించేందుకు సన్నాహాలు చేయటం దుమారం రేపుతోంది. -
35 నామపత్రాల ఆమోదం.. ఏడు తిరస్కరణ
[ 27-04-2024]
మహబూబ్నగర్ లోక్సభ నియోజకవర్గానికి దాఖలైన నామపత్రాలను అధికారులు నిశితంగా పరిశీలించారు. శుక్రవారం కలెక్టరేట్లో ఎన్నికల సాధారణ పరిశీలకుడు షెవాంగ్ గ్యాచో భూటియా, రిటర్నింగ్ అధికారి, కలెక్టర్ జి.రవి నాయక్ ఆధ్వర్యంలో ఈ ప్రక్రియ చేపట్టారు. -
గుంభనంగా ద్వితీయ శ్రేణి
[ 27-04-2024]
అసెంబ్లీ ఎన్నికలకు, లోక్సభ ఎన్నికలకు ప్రచారంలో తేడా ఉంది. అగ్రనాయకుల హడావుడి తప్పా కింది స్థాయి నాయకుల్లో ఇంకా ఎన్నికల ఉత్సాహం కనిపించడం లేదు. నామినేషన్ల ప్రక్రియ మొదలైనప్పటికీ కార్యకర్తల్లో ఉత్తేజం కనిపించడం లేదు. అసెంబ్లీ ఎన్నికల తర్వాత వెంటనే ఈ ఎన్నికలు రావడంతో అంతటా స్తబ్ధత నెలకొంది. -
అరచేతిలో సకల సమాచారం
[ 27-04-2024]
లోక్సభ ఎన్నికలు పారదర్శకంగా నిర్వహించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం పక్కాగా ఏర్పాట్లు చేసింది. డిజిటల్ సాంకేతికత వినియోగించుకుంటూ ఎన్నికల ప్రక్రియ సజావుగా నిర్వహించేందుకు అడుగులు వేస్తోంది. -
పెళ్లిళ్లు, శుభకార్యాలకు విరామం
[ 27-04-2024]
పెళ్లిళ్లు, శుభకార్యాలకు శనివారం నుంచి బ్రేక్ పడనుంది. మూఢం వచ్చేసింది. గ్రహాల స్థితి సరిగా లేని సమయాన్ని మూఢంగా జ్యోతిష్యులు చెబుతారు. గురుగ్రహం సూర్యుడికి దగ్గరగా వచ్చినపుడు గురుమౌఢ్యంగా, శుక్రగ్రహం సూర్యగ్రహనికి దగ్గర వచ్చినప్పుడు శుక్ర మౌఢ్యంగా పిలుస్తారు. -
కాంగ్రెస్ అభ్యర్థి గెలవరనే ఆందోళనలో సీఎం
[ 27-04-2024]
మహబూబ్నగర్లో కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి గెలిచే పరిస్థితి లేకపోవటంతో తన పదవి ఊడుతుందని సీఎం రేవంత్రెడ్డి భయపడుతున్నారని, అందుకే మహబూబ్నగర్లో తరచూ పర్యటిస్తూ భాజపా అభ్యర్థి డీకే అరుణపై నోరు పారేసుకుంటున్నారని భాజపా రాష్ట్ర అధికార ప్రతినిధి రాణి రుద్రమ విమర్శించారు. -
బీ ఫాం ఉన్న వారికే పార్టీ గుర్తు
[ 27-04-2024]
గ్రామ పంచాయతీ ఎన్నికలు మినహా మిగతా అన్ని ఎన్నికల్లో అభ్యర్థులు రాజకీయ పార్టీ అభ్యర్థులుగా పోటీ చేస్తే బీ ఫారం అందజేయాల్సి ఉంటుంది. ఒక రాజకీయ పార్టీ తరపున ఏ అభ్యర్థి అయితే బీ ఫారం అందజేస్తారో ఆ అభ్యర్థికే పార్టీ గుర్తు కేటాయిస్తారు. -
ప్రతి ఓటరుకు స్లిప్పు అందేలా చర్యలు: కలెక్టర్
[ 27-04-2024]
ప్రతి ఓటరుకు ఓటరు స్లిప్పు అందేలా చర్యలు తీసుకుంటున్నట్లు జిల్లా కలెక్టర్ ఉదయ్కుమార్ తెలిపారు. శుక్రవారం కలెక్టరేట్లో రాజకీయ పార్టీల ప్రతినిధులతో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు. -
తెల్లజొన్నలకు పచ్చరంగు
[ 27-04-2024]
పచ్చజొన్నలకు మార్కెట్లో విపరీతంగా డిమాండ్ ఉండటంతో జోరుగా కల్తీ జరుగుతోంది. ఆరోగ్య సమస్యల దృష్ట్యా మధుమేహం, రక్తపోటు తదితర సమస్యలతో బాధపడుతున్న వారు బియ్యంనకు బదులు పచ్చజొన్నలపై ఆసక్తి కనబరుస్తున్నారు. -
తనిఖీలు చేపట్టి చర్యలు తీసుకుంటాం..
[ 27-04-2024]
నిత్యవసర సరకులు, తినుబండారాలను కల్తీ చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటాం. సహజ సిద్ధంగా పండిన జొన్నలను కల్తీ చేస్తున్నట్లు సమాచారం ఉంది. -
లక్ష్యం బారెడు... సేకరణ మూరెడు
[ 27-04-2024]
జిల్లాలో యాసంగి ధాన్యం సేకరణ లక్ష్యం సుదూరంగా కనిపిస్తోంది. పౌరసరఫరాలశాఖ కొనుగోలు కేంద్రాలు ప్రారంభించి 27 రోజులు కావస్తున్నా ఇంతవరకు అనుకున్న లక్ష్యంలో కనీసం ఒకశాతం కూడా సేకరించలేదు. -
సేవల సౌలభ్యానికి అంగన్వాడీల సర్వే
[ 27-04-2024]
అయిజ పట్టణంలోని భరత్నగర్ కాలనీకి చెందిన శాంతమ్మ టీచర్స్ కాలనీలో ఉన్న అంగన్వాడీ కేంద్రం పరిధిలో ఉంది. సుమారు అర కిలోమీటర్ దూరంలో ఉంటుంది. రోజూ వెళ్లి రావాలంటే ఇబ్బంది. చిన్నారులను కేంద్రానికి పంపాలన్నా ఇబ్బందే.