శిథిల భవనాలు.. భయం గుప్పిట చిన్నారులు
దామరగిద్ద మండలంలోని బాపన్పల్లిలో ఎప్పుడో నిర్మించిన అంగన్వాడీ కేంద్రం భవనం పూర్తి శిథిలావస్థకు చేరింది. పదిహేను సంవత్సరాలుగా అది వినియోగానికి పనికి రాకున్నా అధికారులు పట్టించుకోలేదు.
మరమ్మతులకు నోచుకోని అంగన్వాడీ కేంద్రాలు
అద్దె గదుల్లో అరకొర వసతులు
న్యూస్టుడే, నారాయణపేట
దామరగిద్ద మండలం బాపన్పల్లిలో నిరుపయోగంగా మారిన అంగన్వాడీ కేంద్ర భవనం
దామరగిద్ద మండలంలోని బాపన్పల్లిలో ఎప్పుడో నిర్మించిన అంగన్వాడీ కేంద్రం భవనం పూర్తి శిథిలావస్థకు చేరింది. పదిహేను సంవత్సరాలుగా అది వినియోగానికి పనికి రాకున్నా అధికారులు పట్టించుకోలేదు. మరో భవనం నిర్మించక పోవడంతో అరకొర వసతులు ఉన్న అద్దె గదిలో కేంద్రం నిర్వహిస్తూ.. చిన్నారులకు పూర్వ ప్రాథమిక విద్యను అందిస్తున్నారు. పిల్లలకు, గర్భిణులు, బాలింతలకు పౌష్టికాహారం అందించడం, చిన్నారులకు ఆటపాటలతో చదువు చెప్పడానికి అంగన్వాడీ టీచర్లు అవస్థ పడుతున్నారు. ఒక్కపూట సంపూర్ణ భోజనం వండి పెట్టడానికి ఆయాలు సైతం ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
జిల్లాలో చిన్నారులకు పూర్వ ప్రాథమిక విద్యనందించాల్సిన అంగన్వాడీ కేంద్రాలు నిర్లక్ష్యానికి గురవుతున్నాయి. భవనాలు శిథిలావస్థకు చేరినా కనీస మరమ్మతులు చేపట్టే దిక్కులేదు. చిన్నారులతో పాటు బాలింతలు, గర్భిణులకు రోజూ పౌష్టికాహారం అందించడానికి కూడా కొన్నిచోట్ల ఇబ్బందులు ఎదురవుతున్నాయి. పైకప్పులు పెచ్చులూడి పడుతుండటంతో చిన్నారులకు ప్రమాదం పొంచిఉంది. అద్దె భవనాల్లో ఇబ్బందులు తప్పడం లేదు. విద్యుత్తు సదుపాయం, ఫ్యాన్లు లేక కొన్నిచోట్ల వేసవిలో ఉక్కపోత సమస్య ఉంటోంది. కొన్ని కేంద్రాల్లో తాగునీటి వసతి, మరుగుదొడ్లు కూడా లేవు. జిల్లాలోని అంగన్వాడీ కేంద్రాల పరిస్థితి ఇది.
జిల్లాలో ఇదీ పరిస్థితి...
జిల్లాలో నారాయణపేట, మక్తల్, మద్దూరు ఐసీˆడీఎస్ ప్రాజెక్టులు ఉన్నాయి. వీటి పరిధిలో 704 అంగన్వాడీ కేంద్రాలు ఉన్నాయి. సుమారు 14వేల మందికిపైగా చిన్నారులకు పూర్వ ప్రాథమిక విద్యనందిస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా 121 కేంద్రాలకు మాత్రమే సొంత భవనాలు ఉన్నాయి. 288 కేంద్రాలు అద్దె భవనాల్లో, 295 కేంద్రాలు కమ్యూనిటీ హాళ్లు, పాఠశాల గదుల్లో నిర్వహిస్తున్నారు. సొంత భవనాలు లేనిచోట అరకొర వసతులతో అంగన్వాడీ కేంద్రాల నిర్వహణకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. కొన్ని గ్రామాల్లో సొంత భవనాలు ఉన్నా ప్రహరీల్లేక చిన్నారులకు రక్షణ కొరవడింది.
శిథిలావస్థలో 146 కేంద్రాలు..
జిల్లాలోని మూడు ప్రాజెక్టుల పరిధిలో సుమారు 144 భవనాలు శిథిలావస్థల్లో ఉన్నాయి. కేంద్రాల్లో చాలా చోట్ల సరైన వసతుల్లేక పోయినా అలాగే నెట్టుకొస్తున్నారు. సంబంధిత శాఖ అధికారులు సైతం సొంత భవనాల నిర్మాణంపై శ్రద్ధ చూపకపోవడంతో ప్రభుత్వ పాఠశాలలు, కమ్యూనిటీ హాళ్లు, అద్దె భవనాల్లో కొనసాగించాల్సిన పరిస్థితి నెలకొంది. ఆయా కేంద్రాల్లోనూ భవనాలకు కిటికీలు, తలుపులు సక్రమంగా లేకపోవడం, కూర్చోవడానికి సైతం సక్రమంగా ఫ్లోరింగ్లేక చిన్నారులు అవస్థలు పడుతున్నారు.
రూ.2.62 కోట్లతో ప్రతిపాదనలు..
- వేణుగోపాల్, జిల్లా శిశుసంక్షేమశాఖ అధికారి
జిల్లాలో సొంత భవనాల నిర్మాణం, శిథిలావస్థకు చేరిన భవనాల మరమ్మతుల గురించి కలెక్టర్ శ్రీహర్ష దృష్టికి తీసుకెళ్లాం. ఆయన ఆదేశాల మేరకు 144 కేంద్రాలకు మరమ్మతులు, వసతుల కల్పన కోసం రూ.2.62 కోట్లతో ప్రతిపాదనలు పంపించాం. నిధులు మంజూరైతే పనులు చేపడతాం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పోరుబాటతో గులాబీ శ్రేణుల్లో జోష్
[ 27-04-2024]
భారాస అధినేత, మాజీ సీఎం కేసీఆర్ ‘పోరుబాట’ బస్సుయాత్ర శుక్రవారం మహబూబ్నగర్లో విజయవంతం కావడంతో గులాబీ శ్రేణుల్లో ఉత్సాహం నెలకొంది. పాలమూరులో రెండు రోజులపాటు కొనసాగే ఈ కార్యక్రమానికి మొదటి రోజు పార్టీ శ్రేణులు, ప్రజలు పెద్దఎత్తున తరలివచ్చారు. -
తుది జాబితాపై కసరత్తు పూర్తి
[ 27-04-2024]
పాలమూరులో ఓటర్ల తుది జాబితాపై కసరత్తు పూర్తయ్యింది. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఎస్ఎస్ఆర్-2024కు అదనంగా కొత్త ఓటర్లను జత చేసి తుది జాబితాను ఒకటి, రెండు రోజుల్లో ప్రకటించనున్నారు. -
గంజాయి దందా.. యువతే నిండా
[ 27-04-2024]
పాలమూరు పట్టణంలో గంజాయి వ్యాపారం చాప కింద నీరులా విస్తరిస్తోంది. ఎక్సైజ్, పోలీసు శాఖలు నిఘా పెట్టినా.. వారి కళ్లు గప్పి గంజాయిని విక్రయిస్తూనే ఉన్నారు. ఈ కేసులో అరెస్టయి జైలుకు వెళ్లిన వాళ్లు కూడా బయటకు వచ్చాక మళ్లీ అదే దందా చేస్తున్నారు. -
పాలమూరు సిబ్బందికి పరీక్ష!
[ 27-04-2024]
రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా పాలమూరు విశ్వవిద్యాలయం (పీయూ)లో పనిచేస్తున్న బోధనేతర సిబ్బందికి అధికారులు ‘పరీక్ష’ నిర్వహించేందుకు సన్నాహాలు చేయటం దుమారం రేపుతోంది. -
35 నామపత్రాల ఆమోదం.. ఏడు తిరస్కరణ
[ 27-04-2024]
మహబూబ్నగర్ లోక్సభ నియోజకవర్గానికి దాఖలైన నామపత్రాలను అధికారులు నిశితంగా పరిశీలించారు. శుక్రవారం కలెక్టరేట్లో ఎన్నికల సాధారణ పరిశీలకుడు షెవాంగ్ గ్యాచో భూటియా, రిటర్నింగ్ అధికారి, కలెక్టర్ జి.రవి నాయక్ ఆధ్వర్యంలో ఈ ప్రక్రియ చేపట్టారు. -
గుంభనంగా ద్వితీయ శ్రేణి
[ 27-04-2024]
అసెంబ్లీ ఎన్నికలకు, లోక్సభ ఎన్నికలకు ప్రచారంలో తేడా ఉంది. అగ్రనాయకుల హడావుడి తప్పా కింది స్థాయి నాయకుల్లో ఇంకా ఎన్నికల ఉత్సాహం కనిపించడం లేదు. నామినేషన్ల ప్రక్రియ మొదలైనప్పటికీ కార్యకర్తల్లో ఉత్తేజం కనిపించడం లేదు. అసెంబ్లీ ఎన్నికల తర్వాత వెంటనే ఈ ఎన్నికలు రావడంతో అంతటా స్తబ్ధత నెలకొంది. -
అరచేతిలో సకల సమాచారం
[ 27-04-2024]
లోక్సభ ఎన్నికలు పారదర్శకంగా నిర్వహించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం పక్కాగా ఏర్పాట్లు చేసింది. డిజిటల్ సాంకేతికత వినియోగించుకుంటూ ఎన్నికల ప్రక్రియ సజావుగా నిర్వహించేందుకు అడుగులు వేస్తోంది. -
పెళ్లిళ్లు, శుభకార్యాలకు విరామం
[ 27-04-2024]
పెళ్లిళ్లు, శుభకార్యాలకు శనివారం నుంచి బ్రేక్ పడనుంది. మూఢం వచ్చేసింది. గ్రహాల స్థితి సరిగా లేని సమయాన్ని మూఢంగా జ్యోతిష్యులు చెబుతారు. గురుగ్రహం సూర్యుడికి దగ్గరగా వచ్చినపుడు గురుమౌఢ్యంగా, శుక్రగ్రహం సూర్యగ్రహనికి దగ్గర వచ్చినప్పుడు శుక్ర మౌఢ్యంగా పిలుస్తారు. -
కాంగ్రెస్ అభ్యర్థి గెలవరనే ఆందోళనలో సీఎం
[ 27-04-2024]
మహబూబ్నగర్లో కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి గెలిచే పరిస్థితి లేకపోవటంతో తన పదవి ఊడుతుందని సీఎం రేవంత్రెడ్డి భయపడుతున్నారని, అందుకే మహబూబ్నగర్లో తరచూ పర్యటిస్తూ భాజపా అభ్యర్థి డీకే అరుణపై నోరు పారేసుకుంటున్నారని భాజపా రాష్ట్ర అధికార ప్రతినిధి రాణి రుద్రమ విమర్శించారు. -
బీ ఫాం ఉన్న వారికే పార్టీ గుర్తు
[ 27-04-2024]
గ్రామ పంచాయతీ ఎన్నికలు మినహా మిగతా అన్ని ఎన్నికల్లో అభ్యర్థులు రాజకీయ పార్టీ అభ్యర్థులుగా పోటీ చేస్తే బీ ఫారం అందజేయాల్సి ఉంటుంది. ఒక రాజకీయ పార్టీ తరపున ఏ అభ్యర్థి అయితే బీ ఫారం అందజేస్తారో ఆ అభ్యర్థికే పార్టీ గుర్తు కేటాయిస్తారు. -
ప్రతి ఓటరుకు స్లిప్పు అందేలా చర్యలు: కలెక్టర్
[ 27-04-2024]
ప్రతి ఓటరుకు ఓటరు స్లిప్పు అందేలా చర్యలు తీసుకుంటున్నట్లు జిల్లా కలెక్టర్ ఉదయ్కుమార్ తెలిపారు. శుక్రవారం కలెక్టరేట్లో రాజకీయ పార్టీల ప్రతినిధులతో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు. -
తెల్లజొన్నలకు పచ్చరంగు
[ 27-04-2024]
పచ్చజొన్నలకు మార్కెట్లో విపరీతంగా డిమాండ్ ఉండటంతో జోరుగా కల్తీ జరుగుతోంది. ఆరోగ్య సమస్యల దృష్ట్యా మధుమేహం, రక్తపోటు తదితర సమస్యలతో బాధపడుతున్న వారు బియ్యంనకు బదులు పచ్చజొన్నలపై ఆసక్తి కనబరుస్తున్నారు. -
తనిఖీలు చేపట్టి చర్యలు తీసుకుంటాం..
[ 27-04-2024]
నిత్యవసర సరకులు, తినుబండారాలను కల్తీ చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటాం. సహజ సిద్ధంగా పండిన జొన్నలను కల్తీ చేస్తున్నట్లు సమాచారం ఉంది. -
లక్ష్యం బారెడు... సేకరణ మూరెడు
[ 27-04-2024]
జిల్లాలో యాసంగి ధాన్యం సేకరణ లక్ష్యం సుదూరంగా కనిపిస్తోంది. పౌరసరఫరాలశాఖ కొనుగోలు కేంద్రాలు ప్రారంభించి 27 రోజులు కావస్తున్నా ఇంతవరకు అనుకున్న లక్ష్యంలో కనీసం ఒకశాతం కూడా సేకరించలేదు. -
సేవల సౌలభ్యానికి అంగన్వాడీల సర్వే
[ 27-04-2024]
అయిజ పట్టణంలోని భరత్నగర్ కాలనీకి చెందిన శాంతమ్మ టీచర్స్ కాలనీలో ఉన్న అంగన్వాడీ కేంద్రం పరిధిలో ఉంది. సుమారు అర కిలోమీటర్ దూరంలో ఉంటుంది. రోజూ వెళ్లి రావాలంటే ఇబ్బంది. చిన్నారులను కేంద్రానికి పంపాలన్నా ఇబ్బందే.