ఈ పాపం ఇసుకాసురులదే !
ఇసుకాసురులు సహజ వనరులను దోచుకుని పర్యావరణానికి హాని తలపెట్టడమే కాకుండా ప్రజల ప్రాణాలు కూడా బలి తీసుకుంటున్నారు. ఇదే నెల 11న హన్వాడ మండలం చిర్మల్కుచ్చతండాలో ఫిల్టర్ ఇసుక తయారీకి తవ్విన నీటిగుంతలో పడి శివ, గణేశ్ అనే ఇద్దరు గిరిజన చిన్నారులు మృతిచెందారు.
మొన్న చిర్మల్కుచ్చతండాలో చిన్నారులు.. నిన్న కొండేడులో ఇద్దరు యువతుల మృత్యువాత
అనూష(పాత), స్వాతి చిన్ననాటి చిత్రం
న్యూస్టుడే, జడ్చర్ల గ్రామీణం: ఇసుకాసురులు సహజ వనరులను దోచుకుని పర్యావరణానికి హాని తలపెట్టడమే కాకుండా ప్రజల ప్రాణాలు కూడా బలి తీసుకుంటున్నారు. ఇదే నెల 11న హన్వాడ మండలం చిర్మల్కుచ్చతండాలో ఫిల్టర్ ఇసుక తయారీకి తవ్విన నీటిగుంతలో పడి శివ, గణేశ్ అనే ఇద్దరు గిరిజన చిన్నారులు మృతిచెందారు. ఆ ఘటన మరవక ముందే మరో విషాదం చోటు చేసుకుంది. జడ్చర్ల మండలం కొండేడు గ్రామంలో ఇసుక కోసం తవ్విన గుంతలో పడి నీట మునిగి ఇద్దరు యువతులు అనూష(19), స్వాతి(17) ప్రాణాలు కోల్పోయారు. కొండేడు గ్రామస్థులు తమ పొలాలకు ఊకవాగు(కొండేడు వాగు)లోని బండల మీదుగా వెళ్తుంటారు. వాగు ఉద్ధృతంగా ప్రవహిస్తే మరో వైపు నుంచి చుట్టూ తిరిగి పొలాలకు వెళ్తారు. మంగళవారం ప్రవాహం తక్కువగా ఉండటంతో బండ మీదుగా అనూష, స్వాతి దాటే ప్రయత్నం చేశారు. బండపై నాచు వల్ల జారి నీటిలోపడ్డారు. అక్కడే అక్రమ రవాణాదారులు ఇసుక కోసం భారీ గుంత తవ్వారు. గుంత 15 అడుగుల లోతు ఉండటంతో నీట మునిగి మృత్యువాత పడ్డారు. లేదంటే నీటిలో పడినా మళ్లీ లేచి ముందుకు వెళ్లేవారని గ్రామస్థులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు.
ఇద్దరు యువతులు వాగు దాటుతూ జారి పడింది ఇక్కడే
కలిసొచ్చే బిడ్డలు కానరాని లోకాలకు..
అనూష, స్వాతి మృతదేహాల వద్ద రోదిస్తున్న కుటుంబీకులు
కొండేడుకు చెందిన పడకంటి మల్లయ్య, యాదమ్మ దంపతులకు ముగ్గురు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. అనూష రెండో కుమార్తె. పెద్ద ఆదిరాల పాఠశాలలో పదో తరగతి పూర్తిచేసిన ఆమె చదువు మానేసింది. తల్లిదండ్రులకు ఆసరాగా ఇంటి పనులు, వ్యవసాయ పనులు చేస్తోంది. వారి దాయాదులు పడకంటి కేశవులు, నాగమ్మ దంపతులకు ముగ్గురు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. రెండో సంతానమైన స్వాతి జడ్చర్లలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్ రెండో సంవత్సరం చదువుతోంది. ఐదు రోజులుగా స్వాతి వాళ్ల పొలంలో అనూష పనిచేసింది. ఇందుకు బదులుగా మంగళవారం నుంచి అనూష వాళ్ల పొలంలో స్వాతి ఐదు రోజులు పని చేయాల్సి ఉంది. ఇందుకోసం ఇద్దరు కలిసి పొలానికి బయలుదేరారు. అనూష తల్లిదండ్రులు కూలీలను తీసుకొచ్చేందుకు ఇంటి వద్ద ఆగారు. కొంత సమయానికి తండ్రి అనూషకు ఫోన్ చేయగా కలవలేదు. అతడికి అనుమానం వచ్చి వెతకగా మార్గమధ్యంలోని ఊకవాగులో రాయిపై పడి ఉన్న భోజనం డబ్బాలు, చెప్పులు కనిపించాయి. నీటిలో గాలించగా 100 మీటర్ల దూరంలో వాగులో ఇద్దరి మృతదేహాలు లభ్యమయ్యాయి. యువతుల మృతితో రెండు కుటుంబాలు శోకసంద్రంగా మారాయి. తల్లిదండ్రులు, తోబుట్టువులు విలపించిన తీరు గ్రామస్థులను కంటతడి పెట్టించింది. కేసు నమోదు చేసి పోస్టుమార్టం తర్వాత మృతదేహాలను కుటుంబ సభ్యులకు అప్పగించామని సీఐ రమేశ్బాబు తెలిపారు. ఘటనా స్థలాన్ని ఎస్పీ కె.నరసింహ పరిశీలించారు. వర్షాకాలంలో వాగులు దాటేటప్పుడు అక్కడి పరిస్థితిని అంచనా వేయాలని, ఈతరాని వాళ్లు నీటిలోకి వెళ్లవద్దని, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఎస్పీ కోరారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఆత్మలొచ్చి.. అమ్ముతున్నాయ్..!
[ 17-05-2024]
ఒక్కటే రోజు మొత్తం 40కుపైగా రిజిస్ట్రేషన్లు.. ఇవన్నీ గ్రామ పంచాయతీ లేఅవుట్లు.. తెర వెనుక ఓ పార్టీ నేత. సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం కేంద్రంగా సాగిన ఈ దందాలో పెద్ద ఎత్తున డబ్బులు చేతులు మారాయి. -
పశువైద్యంలో కొత్త పోకడలు
[ 17-05-2024]
తక్కువ ఖర్చుతో, దుష్ప్రభావాలు లేకుండా వ్యాధులు నయం చేసే హోమియో మందులను యూరోపియన్ దేశాల్లో వైద్యులు పశువైద్యంలోనూ వాడుతున్నారు. ఆంధ్రప్రదేశ్, కేరళ, తమిళనాడు రాష్ట్రాల్లో పశువైద్యులు కూడా ఈ విధానాన్ని అమలు చేస్తున్నారు. -
అభిమాని రక్తంతో ముఖ్యమంత్రి చిత్రం
[ 17-05-2024]
నారాయణపేట జిల్లా మద్దూరుకు చెందిన ఓ అభిమాని తన రక్తంతో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి చిత్రాన్ని గీయించి అభిమానం చాటుకున్నారు. -
గద్వాల కేంద్రంగా.. రేషన్ బియ్యం దందా
[ 17-05-2024]
శాంతినగర్లో గత నెల 27వ తేదీ 114 క్వింటాళ్ల పీడీఎస్ బియ్యాన్ని పోలీసులు పట్టుకున్నారు. కొయిలదిన్నెరోడ్డు పక్కన ఉన్న పిండిగిర్ని నడిపే ఓ ఇంట్లో బియ్యం నిల్వ ఉన్నట్లు సమాచారం రావడంతో దాడులు నిర్వహించి పట్టుకున్నారు. -
ఓట్ల లెక్కింపు కేంద్రాలు ఎక్కడంటే...!
[ 17-05-2024]
రాష్ట్రంలోని లోక్సభ నియోజకవర్గాల ఓట్ల లెక్కింపు కేంద్రాలను ఎన్నికల సంఘం ఖరారు చేసింది. 17 స్థానాలకు సోమవారం పోలింగ్ జరిగిన విషయం తెలిసిందే. -
నల్లమలలో పెరిగిన ఓటింగ్
[ 17-05-2024]
నల్లమల లోతట్టు అటవీ ప్రాంతంలో కనీస సౌకర్యాలు లేకపోయినా ఎన్నికల సిబ్బంది చెంచు పెంటలకు వెళ్లి రాత్రి అక్కడే బస చేసి పోలింగ్ను విజయవంతం చేశారు. నల్లమలలోని ఆగర్లపెంటకు రెండు కి.మీ. దూరం కాలినడకన అటవీ ప్రాంతంలో ప్రయాణించి అక్కడే బస చేసి భయం గుప్పిట్లో కాలం గడిపారు. -
చిన్నారిపై అత్యాచారయత్నం.. నిందితుడికి మూడేళ్ల జైలు
[ 17-05-2024]
ఏడేళ్ల బాలికపై అత్యాచారానికి యత్నించిన నిందితుడికి న్యాయస్థానం మూడేళ్ల కఠిన కారాగార శిక్ష, రూ.10,000 జరిమానా విధించింది. ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్ సునీత కథనం ప్రకారం.. -
అమ్మ కడుపు చల్లగా..
[ 17-05-2024]
వైద్య ఆరోగ్య శాఖ ఉన్నతాధికారుల పర్యవేక్షణతో ప్రభుత్వాస్పత్రుల్లో ప్రసవాలు పెరుగుతున్నాయి. అమ్మ కడుపు చల్లగా ఉండాలని అధికారులు సాధారణ ప్రసవాలకు చొరవ తీసుకుంటున్నారు. -
జూరాలకు కృష్ణా జలాలు
[ 17-05-2024]
జూరాల జలాశయంలోకి గురువారం ఉదయం నుంచి 2,510 క్యూసెక్కుల ప్రవాహం వచ్చి చేరుతోంది. జలాశయంలో తీసుకోదని నీటినిల్వ 0.244 టీఎంసీల మేర ఉంది. -
ప్రవేశాల పెంపే లక్ష్యం
[ 17-05-2024]
ప్రభుత్వ కళాశాలల్లో మెరుగైన విద్య అందిస్తున్నామని చెబుతూ ప్రిన్సిపల్స్, అధ్యాపకులు ప్రచారం చేస్తున్నారు. అందులో భాగంగానే ఇంటర్మీడియట్లో 2024-25 విద్యా సంవత్సరానికిగాను తొలివిడత ప్రక్రియ ప్రారంభమైంది. -
2021లో మంజూరు.. పూర్తయ్యేదెన్నడో?
[ 17-05-2024]
దేశాభివృద్ధికి పల్లెలే పట్టుగొమ్మలు.. మారుమూల గ్రామాలకు ఇప్పటికీ పూర్తి స్థాయిలో సరైన రోడ్లు లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పల్లెలు పట్టణాలుగా మారుతున్నప్పటికీ వాటిదశ మారకపోవడం విచారకరం. -
బాధ్యత మరచి.. కుటుంబానికి దూరమై
[ 17-05-2024]
ద్విచక్ర వాహన చోదకులు శిరస్త్రాణం ధరించక ప్రమాదాలబారిన పడినప్పుడు ప్రాణాలు కోల్పోవాల్సి వస్తోంది. జిల్లాలో ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదాల్లో శిరస్త్రాణం ధరించకపోవడం వల్ల పలువురు ప్రాణాలు కోల్పోయిన సంఘటనలున్నాయి. ప్రమాదాల నుంచి పాఠం నేర్చుకోవాల్సిన వాహనదారులు భద్రతను గాలికొదిలేస్తున్నారు. -
అయిజ విండో ఆదర్శం
[ 17-05-2024]
అయిజ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాన్ని ఉమ్మడి జిల్లాలోని ఇతర విండోలు ఆదర్శంగా తీసుకోవాలని నాబార్డ్ ఉమ్మడి జిల్లా డీడీఎంలు షణ్ముఖచారి, మనోహర్రెడ్డి కోరారు.
తాజా వార్తలు (Latest News)
-
వరల్డ్ కప్ జట్టులో హార్దిక్.. విమర్శలపై క్లారిటీ ఇచ్చిన జై షా
-
అటల్ సేతుపై రష్మిక వీడియో.. స్పందించిన మోదీ
-
అతడు నన్ను కాలితో తన్నాడు.. కడుపుపై కొట్టాడు: దాడి ఘటనపై స్వాతి మాలీవాల్
-
ఆ రూమర్స్కు చెక్ పెట్టిన నిర్మాణ సంస్థ.. ‘SSMB29’పై క్లారిటీ
-
నష్టాల్లో దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు.. నిఫ్టీ @ 22,365
-
తెదేపాకు ఓటేశాడని.. కొడవలితో చెవి కోసేశాడు