సలేశ్వరం జాతరకు ఏర్పాట్లు
ఏటా చైత్ర పూర్ణిమ నుంచి మూడు రోజుల పాటు నల్లమల కొండల్లో కొలువైన సలేశ్వరం జాతరకు అటవీ పరిసరాల్లో ఏర్పాట్లు చేస్తున్నారు.
22 నుంచి నల్లమల కొండల్లో ఉత్సవాలు
సలేశ్వర క్షేత్రంలో కొలువుదీరిన లింగమయ్య
అచ్చంపేట న్యూటౌన్, న్యూస్టుడే : ఏటా చైత్ర పూర్ణిమ నుంచి మూడు రోజుల పాటు నల్లమల కొండల్లో కొలువైన సలేశ్వరం జాతరకు అటవీ పరిసరాల్లో ఏర్పాట్లు చేస్తున్నారు. అమ్రాబాద్ అభయారణ్యంలోని ఎత్తైన కొండల నడుమ వెయ్యి అడుగుల లోయలో కొలువైన పురాతన సలేశ్వర క్షేత్ర దర్శనానికి భక్తులు పోటెత్తుతుంటారు. కృష్ణానది నుంచి జాలువారే జలపాతాల అలల మధ్య అటవీ జంతువులు కనువిందు చేస్తూ భక్తులను మరింతగా పరవశింపజేస్తాయి.
ఈ నెల 22 నుంచి 24 వరకు నిర్వహించనున్న సలేశ్వర లింగమయ్య దర్శన ఘట్టం 200 అడుగుల ఎత్తైన కొండల్లో రాళ్లపై నుంచి కొనసాగుతుంది. ఫర్హాబాద్ నుంచి పుల్లయపల్లి చెంచు పెంటల మీదుగా సుమారుగా 30 కిలోమీటర్లు వాహనాల్లో ప్రయాణం సాగించాలి. అక్కడ నుంచి కొండలు, రాళ్ల దారిలో 4 కిలోమీటర్లు నడిచి వెళ్తే క్షేత్రానికి చేరుకుంటారు. సలేశ్వర క్షేత్రానికి ఎదురుగా ఉన్న ఎత్తైన కొండపై జలధారలు పడుతుంటాయి. అనాదిగా ఈ ఆలయంలో చెంచు పెద్దలే పూజారులుగా వ్యవహరిస్తుండటం విశేషం. ఉత్సవాలకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కర్నూలు, మహబూబ్నగర్, హైదరాబాద్, రంగారెడ్డి, నల్గొండ, జోగులాంబ గద్వాల, వనపర్తి తదితర ప్రాంతాల నుంచి పర్యాటకులు లక్షలాదిగా తరలి వస్తుంటారు.
భక్తుల సౌకర్యార్థం ఉమ్మడి మహబూబ్నగర్, హైదరాబాద్ ప్రాంతాలకు చెందిన స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు ఎండలో అలసిన భక్తులకు అన్నదానం, ఆర్డబ్ల్యూఎస్ శాఖ అధికారులు తాగునీటి వసతి ఏర్పాటు చేస్తారు. క్షేత్రానికి అచ్చంపేట ఆర్టీసీ డిపో నుంచి ప్రత్యేక బస్సులను నడపనున్నారు.
కొండపై నుంచి జాలువారుతున్న జలపాతం (పాత)
ఆద్యంతం అటవీ మార్గంలోనే..
వాహనాల్లో వెళ్లే పర్యాటకులు హైదరాబాద్-శ్రీశైలం ప్రధాన రహదారి అమ్రాబాద్ మండలంలోని మన్ననూర్ నుంచి 15 కిలోమీటర్లు ప్రయాణిస్తే ఫర్హాబాద్ కూడలి వద్ద అటవీశాఖ అధికారుల అనుమతులతో అడవిలోకి వెళ్లాల్సి ఉంటుంది. క్షేత్రానికి 4 కిలోమీటర్ల దూరంలో వాహనాలను నిలిపేసి రాళ్లు, ప్రమాదకరమైన లోయ ప్రాంతం నుంచి నడుచుకుంటూ వెళ్లాల్సి ఉంటుంది. నాగర్కర్నూల్ జిల్లాలోని బల్మూర్ మండలంలోని అంబగిరి, లింగాల మండలంలోని భక్తులు అప్పాయిపల్లి మీదుగా 30 కిలో మీటర్లు చేరుకుంటే అక్కడ గుండంలో తాగునీటి వసతి ఉంటుంది. అక్కడ కొంత సమయం సేద తీరి మరో 20 కిలో మీటర్లు అడవి దారిలో నడక మార్గంలో వెళ్తే సలేశ్వరం క్షేత్రానికి చేరుకుంటారు.
మూడు రోజులు మాత్రమే అనుమతి..
సలేశ్వరం జాతర నేపథ్యంలో ఈ నెల 22 ఉదయం నుంచి 24 సాయంత్రం వరకు మూడు రోజులు మాత్రమే అడవిలోకి వాహనాలకు అనుమతులు ఉంటాయి. అడవిలో మంటలు ఏర్పాటు చేయడం, ప్లాస్టిక్, మత్తు పదార్థాలు పూర్తిగా నిషేధం. అడవిలోకి వెళ్లే భక్తులు, పర్యాటకులు నిబంధనలు ఉల్లంఘిస్తే చట్టపరమైన చర్యలు ఉంటాయని గుర్తించుకోవాలి. రానున్న రోజుల్లో 9 నెలలపాటు ఆంక్షలతో కూడిన సలేశ్వర దర్శనం కల్పించేందుకు చర్యలు చేపడుతున్నాం.
రోహిత్ గోపిడి, డీఎఫ్వో నాగర్కర్నూల్
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
గద్వాలలో భాజపా బహిరంగ సభ
[ 02-05-2024]
లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా భాజపా ఈ నెల 4న గద్వాల పట్టణంలో నిర్వహించే భారీ బహిరంగ సభను విజయవంతం చేయాలని పార్టీ జిల్లా అధ్యక్షుడు రామచంద్రారెడ్డి పిలుపునిచ్చారు. -
కేంద్రంలో అధికారంలోకి వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వమే
[ 02-05-2024]
పదేళ్ల భాజపా ప్రభుత్వాన్ని చూసిన ప్రజలు విసిగిపోయారని, రానున్న లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అత్యధిక సీట్లు గెలిచి కేంద్రంలో అధికారంలోకి వస్తుందని నాగర్ కర్నూల్ పార్లమెంట్ అభ్యర్థి మల్లు రవి, జడ్పీ ఛైర్ పర్సన్ సరిత అన్నారు. -
వంతెన పనులు పూర్తి చేయాలి
[ 02-05-2024]
అయిజ పట్టణంలోని పెద్దవాగుపై రెండేళ్లుగా నిర్మిస్తున్న వంతెన నిర్మాణ పనులు వెంటనే పూర్తి చేసి అందుబాటులోకి తేవాలని అఖిల పక్షం నాయకులు డిమాండ్ చేశారు. -
కందనూలు.. మొగ్గు ఎటు వైపో..
[ 02-05-2024]
నాగర్కర్నూల్ లోక్సభ నియోజకవర్గంలో ఓటర్లు విలక్షణ తీర్పు ఇస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికలతో పోల్చుకుంటే లోక్సభ ఎన్నికల్లో ఓటర్లు ఇచ్చే తీర్పులో మార్పు కనిపిస్తోంది. -
ఉన్నత విద్యావంతులు కొందరే
[ 02-05-2024]
మహబూబ్నగర్ లోక్సభ నియోజకవర్గంలో పోటీ చేస్తున్న ప్రధాన పార్టీల అభ్యర్థులు ఇంటర్లోపే విద్యార్హత ఉండటం విశేషం. -
అభ్యర్థికి టాటా.. పెరుగుతోంది నోటా
[ 02-05-2024]
ఎన్నికల్లో ప్రతి ఓటూ కీలకమే. అభ్యర్థుల గెలుపోటములు నిర్దేశించడంతో పాటు ప్రభుత్వాల ఏర్పాటుకు దోహదపడుతుంది. లోక్సభ ఎన్నికలైనా సరే.. గట్టిపోటీ ఉన్న చోట రెండు, మూడు వేల ఓట్లే కీలకంగా మారే పరిస్థితి ఉంటుంది. -
సూర్యప్రతాపం.. తగ్గిన ప్రచారం
[ 02-05-2024]
ఓ వైపు సూర్యప్రతాపం రోజురోజుకూ అధికం అవుతోంది. మరోవైపు ప్రచార గడువు దగ్గరకు వస్తోంది... ఈ వేడి వాతావరణంలో రాజకీయ పార్టీల ప్రచార సరళి మారిపోయింది. గతంలో ఉన్నంత జోష్ కనిపించడం లేదు. మంది ఉన్నచోట మాట్లాడి వెళ్లిపోతున్నారు. ఇంటింటి ప్రచారం పలచబడింది. -
రైల్వే లైన్ సాధనకు కృషి
[ 02-05-2024]
లోక్సభ ఎన్నికల్లో ఆశీర్వదిస్తే వనపర్తి ప్రజల చిరకాల వాంఛ అయిన రైల్వే లైన్ సాధనకు కృషి చేస్తానని నాగర్కర్నూల్ భాజపా ఎంపీ అభ్యర్థి భరత్ప్రసాద్ పేర్కొన్నారు. -
కమనీయం శ్రీనివాసుడి కల్యాణం
[ 02-05-2024]
అఖిలాండ కోటి బ్రహ్మండ నాయకుడు.. ఆపద మొక్కులవాడైన శ్రీవేంకటేశ్వరస్వామి నామస్మరణతో ఆ ప్రాంతమంతా మార్మోగింది. -
న్యాయవాదులు ఆలోచించి ఓటేయాలి : డీకే అరుణ
[ 02-05-2024]
మేధావి వర్గమైన న్యాయవాదులు లోక్సభ ఎన్నికల్లో ఆలోచించి ఓటు వేయాలని భాజపా లోక్సభ అభ్యర్థి డీకే అరుణ కోరారు. -
సైబర్ నేరాలపై అవగాహన అవసరం
[ 02-05-2024]
సైబర్ నేరాల పట్లపై అవగాహన పెంపొందించుకోవాల్సిన అవసరం ఉందని జిల్లా సైబర్ సెక్యూరిటీ విభాగం డీఎస్పీ సత్తయ్య పేర్కొన్నారు. -
నాలుగు ప్రాంతాల్లో రెడ్జోన్
[ 02-05-2024]
జోగులాంబ గద్వాల జిల్లాలో గతంలో ఎన్నడూ లేనంతగా గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. జిల్లాలోని నాలుగు ప్రాంతాలు రెడ్జోన్ పరిధిలోకి వెళ్లాయి. -
పొరుగుసేవల దరఖాస్తులపై అనుమానాలెన్నో !
[ 02-05-2024]
గద్వాల మెడికల్ కళాశాలలో ఔట్సోర్సింగ్ పద్ధతిలో వివిధ విభాగాలలో పనిచేయడానికి సిబ్బంది నియామకానికి అర్హత గల వ్యక్తుల నుంచి దరఖాస్తులు స్వీకరించారు. ఇందులో స్థానిక అభ్యర్థులకు మాత్రమే అవకాశం కల్పించారు. -
సామాజిక మాధ్యమాలపై నిఘా
[ 02-05-2024]
లోక్సభ ఎన్నికల ప్రక్రియలో భాగంగా అభ్యర్థుల నామపత్రాల దాఖలు గడువు పూర్తి కావడంతో ఎన్నికల బరిలో నిలిచిన ప్రధాన పార్టీల అభ్యర్థులు గెలుపే లక్ష్యంగా ప్రచారాన్ని ముమ్మరం చేశారు. -
తెలుగులోనూ తప్పారు!
[ 02-05-2024]
పదోతరగతి వార్షిక ఫలితాల్లో రాష్ట్ర స్థాయిలో నాగర్కర్నూల్ జిల్లా 21వ స్థానంలో నిలువడం నిరాశ కలిగించింది. విద్యార్థులు వార్షిక పరీక్షల్లో మెరుగైన ఫలితాలు సాధించడానికి జిల్లా విద్యాశాఖాధికారులు చొరవ చూపలేదన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. -
భాజపాతోనే ఎస్సీ వర్గీకరణ సాధ్యం
[ 02-05-2024]
కేంద్రంలో భాజపా మూడోసారి అధికారం చేపడితేనే ఎస్సీ వర్గీకరణ సాధ్యమవుతుందని కేంద్ర ప్రసార, సమాచారశాఖ సహాయమంత్రి మురుగన్ అన్నారు. -
మత్తు పదార్థాలకు దూరంగా ఉండండి : ఎస్పీ
[ 02-05-2024]
యువత గంజాయికి బానిసలుగా మారి తమ భవిష్యత్తు నాశనం చేసుకోవద్దని, మత్తుపదార్థాలకు దూరంగా ఉండాలని ఎస్పీ యోగేశ్గౌతం అన్నారు. -
సార్వత్రిక పరీక్షలకు 804 మంది హాజరు
[ 02-05-2024]
సార్వత్రిక పదో తరగతి, ఇంటర్ పరీక్షలకు 804 మంది విద్యార్థులు హాజరైనట్లు టాస్ కో ఆర్డినేటర్ శ్రీనివాస్ తెలిపారు. -
పెండింగ్ కేసుల దర్యాప్తు వేగవంతం చేయండి
[ 02-05-2024]
పెండింగ్లో ఉన్న కేసుల దర్యాప్తు వేగవంతం చేయాలని ఎస్పీ రక్షితకృష్ణమూర్తి ఆదేశించారు. వనపర్తి సర్కిల్ పరిధిలో వనపర్తి పట్టణం, గ్రామీణం, రేవల్లి, వీపనగండ్ల పోలీస్స్టేషన్లకు సంబంధించి పెండింగ్ కేసులపై బుధవారం ఎస్సైలతో ఎస్పీ సమీక్ష సమావేశం నిర్వహించారు.
తాజా వార్తలు (Latest News)
-
TS ఇంటర్ సప్లిమెంటరీ ఫీజు గడువు పెంపు
-
8న ఆధార్ హౌసింగ్ ఫైనాన్స్ ఐపీఓ.. ధరల శ్రేణి ఇదే..
-
డిప్లొమాటిక్ పాస్పోర్ట్తో జర్మనీకి ప్రజ్వల్.. విదేశాంగ శాఖ వెల్లడి
-
ఫొటోషూట్లో హొయలు.. వావ్ అనిపించేలా జాన్వీ.. కట్టిపడేసిన హెబ్బా
-
హార్దిక్ అందుబాటులో ఉన్నంతకాలం జట్టులో ఉండాలి: అజిత్ అగార్కర్
-
ధోనీ రనౌట్.. నెట్టింట జితేశ్ శర్మపై ట్రోలింగ్