logo

చికిత్స పొందుతూ వ్యక్తి మృతి

మండలంలోని పచ్చర్ల గ్రామంలో పురుగుల మందు తాగిన వ్యక్తి చికిత్స పొందుతూ మృతి చెందిన సంఘటనపై శనివారం కేసు నమోదు చేసినట్లుగా ఎస్ఐ జగదీశ్వర్ తెలిపారు.

Published : 04 May 2024 16:23 IST

రాజోలి: మండలంలోని పచ్చర్ల గ్రామంలో పురుగుల మందు తాగిన వ్యక్తి చికిత్స పొందుతూ మృతి చెందిన సంఘటనపై శనివారం కేసు నమోదు చేసినట్లుగా ఎస్ఐ జగదీశ్వర్ తెలిపారు. గ్రామానికి చెందిన అల్లావుద్దీన్(50) గత కొంత కాలంగా తాగుడుకు బానిసయ్యాడు. ఇంటి వద్ద ఎలాంటి పని చేసే వాడు కాదు. అయిదు రోజుల క్రితం భార్య అసేన్బీ చెల్లెలు పెళ్లి జరగ్గా, ఇంట్లో బంధువులున్నారు. అయినప్పటికీ అల్లావుద్దీన్ తాగి వస్తుండటంతో భార్య మందలించింది. దీంతో మనస్తాపానికి గురైన అల్లావుద్దీన్ శుక్రవారం మద్యం తాగి వచ్చి అందరినీ ఇంట్లో నుంచి బటయటకు పంపించి తాళం వేశాడు. ఈ క్రమంలోనే తన వెంట తెచ్చుకున్న గడ్డి నివారణ మందును తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కుటుంబసభ్యులు గమనించి గద్వాల ఆసుపత్రికి తరలించగా, అక్కడ చికిత్స పొందుతూ మరణించాడు. భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లుగా ఎస్ఐ పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని