ఎన్నికల సంఘం వాట్సాప్ ఛానల్
లోక్సభ ఎన్నికల నిర్వహణలో భారత ఎన్నికల సంఘం సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తోంది. సాంకేతిక రంగంలో వస్తున్న మార్పులను అందిపుచ్చుకోవడంపై ప్రత్యేక దృష్టి సారించింది.
భారత ఎన్నికల సంఘం వాట్సాప్ ఛానల్ ముఖ చిత్రం
న్యూస్టుడే, అచ్చంపేట: లోక్సభ ఎన్నికల నిర్వహణలో భారత ఎన్నికల సంఘం సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తోంది. సాంకేతిక రంగంలో వస్తున్న మార్పులను అందిపుచ్చుకోవడంపై ప్రత్యేక దృష్టి సారించింది. ప్రతి ఐదేళ్లకోసారి సార్వత్రిక ఎన్నికలు నిర్వహిస్తున్నారు. ఎన్నికలు నిర్వహించినప్పుడల్లా ఏదో ఒక మార్పు కనిపించేలా ఎన్నికల సంఘం చర్యలు తీసుకుంటోంది. ఇప్పటికే సామాజిక మాధ్యమాల్లో ఎన్నికల ప్రచారం హోరెత్తుతోంది. ప్రస్తుతం జరుగుతున్న లోక్సభ ఎన్నికల్లో అధికారులు సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకోవడంపై ప్రత్యేక దృష్టి సారించారు. ప్రజలు అత్యధికంగా వినియోగిస్తున్న వాట్సాప్ను ఉపయోగించుకోవాలని ఎన్నికల సంఘం నిర్ణయించింది. ఈ వాట్సాప్ ఛానల్ ద్వారా ఎన్నికలకు సంబంధించిన వివిధ రకాల సమాచారాన్ని ఓటర్లకు అందించేందుకు శ్రద్ధ తీసుకుంటున్నారు. ఓటరు చైతన్య కార్యక్రమాలు, ఓటు హక్కు వినియోగంపై అవగాహన కల్పించే చిత్రాలు, వీడియోలు, వివిధ యాప్ల వివరాలను దీనిలో పొందుపరచారు. సీ-విజిల్, సువిధ, సాక్ష్యం, కేవైసీ తదితర యాప్లు, ఎన్నికలకు సంబంధించిన సమగ్ర వివరాలను సులభంగా తెలుసుకునేలా ఏర్పాట్లు చేశారు. ఎన్నికల సంఘం క్యూఆర్ కోడ్ను స్కాన్ చేసి ఎన్నికలకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని తెలుసుకునే వెసులుబాటు కల్పించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
చినుకు పడాలి.. చింత తీరాలి!
[ 19-05-2024]
ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో వరుణుడు ముఖం చాటేస్తున్నాడు. గత వానాకాలం నుంచి ఇప్పటి వరకు పరిస్థితిని గమనిస్తే ఈ విషయం తేటతెల్లమవుతుంది. సగటున 608.88 మి.మీటర్ల సాధారణ వర్షపాతానికిగాను 520.7 మి.మీ వర్షపాతమే నమోదయ్యింది. -
లక్ష్య సాధకులు
[ 19-05-2024]
ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన ఈఏపీ సెట్ ఫలితాల్లో ఉమ్మడి పాలమూరు జిల్లా విద్యార్థులు ప్రతిభ చాటారు. నిత్య సాధనతో అత్యుత్తమ ర్యాంకులు సాధించి తమ కలలు సాకారం చేసుకునే దిశగా ముందడుగు వేశారు. వారి వివరాలు ఇలా ఉన్నాయి. -
రూ.8.40 కోట్ల నగదు.. 33వేల లీటర్ల మద్యం
[ 19-05-2024]
లోక్సభ ఎన్నికల వేళ పోలీసుల తనిఖీల్లో భారీగా నగదు, మద్యం పట్టుబడ్డాయి. మార్చి 13న కేంద్ర ఎన్నికల సంఘం లోక్సభ ఎన్నికల ప్రకటన విడుదల చేసింది. వెంటనే మహబూబ్నగర్, నాగర్కర్నూల్ లోక్సభ నియోజకవర్గాల పరిధిలోని 14 అసెంబ్లీ సెగ్మెంట్లలో 34 సరిహద్దు తనిఖీ కేంద్రాలు ఏర్పాటు చేశారు. -
యువకుడి హత్య కేసులో 8 మందికి రిమాండ్
[ 19-05-2024]
మహబూబ్నగర్ పట్టణం బండమీదిపల్లిలోని మద్యం దుకాణం వద్ద గత నెలలో దాడి చేయగా యువకుడు మరణించిన కేసులో నిందితులను పోలీసులు రిమాండ్కు తరలించారు. మహబూబ్నగర్ గ్రామీణ ఠాణా సీఐ గాంధీనాయక్ కథనం ప్రకారం. -
గ్రూప్-1 ప్రిలిమినరీకి పకడ్బందీ ఏర్పాట్లు
[ 19-05-2024]
జూన్ 9న నిర్వహించే గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్షకు జిల్లాల్లో అధికారులు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని టీఎస్పీఎస్సీ ఛైర్మన్ మహేందర్ రెడ్డి ఆదేశించారు. శనివారం హైదరాబాద్ నుంచి వీసీలో జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలతో సమీక్షించారు. -
లోక్ అదాలత్ సద్వినియోగం చేసుకోండి
[ 19-05-2024]
వచ్చే నెల 8వ తేదీన నిర్వహించే జాతీయ లోక్ అదాలత్ను సద్వినియోగం చేసుకోవాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి బి.పాపిరెడ్డి తెలిపారు. శనివారం మహబూబ్నగర్లోని కోర్టు ప్రాంగణంలో జాతీయ లోక్ అదాలత్ను పురస్కరించుకొని కలెక్టర్ రవినాయక్, -
రోడ్లకు మహర్దశ ఎప్పుడో..?
[ 19-05-2024]
గ్రామీణ ప్రాంతాలకు రహదారులు నిర్మించి రవాణా సౌకర్యం మెరుగుపర్చాలన్న ప్రభుత్వ లక్ష్యం నెరవేరడం లేదు. మట్టి, కంకర తేలిన రోడ్లపై ప్రయాణాలు చేయలేక ప్రజలు నరకయాతన పడుతున్నారు. -
పారిశుద్ధ్య చర్యలేవీ?
[ 19-05-2024]
జిల్లాలోని నాలుగు పట్టణాల్లో రెండు రోజులుగా చిన్నపాటి ముసురు వర్షాలు పడుతున్నాయి. జూన్ మొదటి వారంలో వర్షాలు అధికంగా పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేస్తున్నా.. -
గుట్టుగా మట్టి తరలింపు
[ 19-05-2024]
జిల్లాలో అనుమతులు లేకుండానే పుట్టుకొస్తున్న ఇటుక బట్టీలలో అక్రమాలు మాత్రం దండిగా కనిపిస్తున్నాయి. బట్టీల ఏర్పాటు నుంచి ఇటుక తరలింపు వరకు వివిధ స్థాయిల్లో సంబంధిత అధికారుల అనుమతులు తీసుకోకుండానే వ్యాపారాలు కొనసాగిస్తున్నారు. -
రూ.కోట్లు ఖర్చు.. వైద్యం దైవాధీనం
[ 19-05-2024]
సామాజిక ఆరోగ్య కేంద్రాలలో సరిపడా సిబ్బంది లేక రోగులకు వైద్యం అందటం లేదు. కోట్లాది రూపాయల వ్యయంతో అసుపత్రి భవనాలను నిర్మించినా ఉపయోగం లేకుండా పోతోంది. అత్యవసర పరిస్థితుల్లో రోగులను జిల్లా కేంద్రాలకు తరలిస్తున్నారు. -
తెగ తాగారు
[ 19-05-2024]
వేసవితాపం నుంచి ఉపశమనం పొందేందుకు జిల్లాలో మందుబాబులు తెగ తాగేశారు. వేసవితో పాటు ఎన్నికల సందర్భంగా మార్చి, ఏప్రిల్, మే నెలలో మద్యం విక్రయాలు భారీగా పెరిగాయి. -
40 ఎకరాలకు పాకిన మంటలు
[ 19-05-2024]
యాసంగిలో వరి పంటను యంత్రాలతో కోయించిన కొందరు రైతులు కొయ్యలకు నిప్పంటించడం వల్ల మంటలు గాలివాటానికి సమీప పొలాలకు వ్యాపించి నష్టాన్ని కలిగిస్తున్నాయి.