logo

కాంగ్రెస్‌ మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చింది: ఎమ్మెల్యే

ఆరు గ్యారంటీల పేరుతో మాయ మాటలు చెప్పి కాంగ్రెస్  అధికారంలోకి వచ్చిందని గద్వాల  ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి అన్నారు.

Published : 06 May 2024 11:07 IST

రాజోలి : ఆరు గ్యారంటీల పేరుతో మాయ మాటలు చెప్పి కాంగ్రెస్  అధికారంలోకి వచ్చిందని గద్వాల  ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి అన్నారు. సోమవారం ఆయన గద్వాల పట్టణంలోని 32 , 33 వార్డుల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. నాగర్ కర్నూల్ పార్లమెంటు అభ్యర్థి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్‌కు ఓటు వేసి గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు. అభివృద్ధి, సంక్షేమమే భారాస  లక్ష్యమన్నారు.  భారాసను గెలిపించి భవిష్యత్తులో గద్వాలను మరింత అభివృద్ధి చేసుకుందామని పిలుపునిచ్చారు. ఆయన వెంట జిల్లా భారాస పార్టీ సీనియర్ నేత గడ్డం కృష్ణారెడ్డి, మున్సిపల్ వైస్‌ఛైర్మన్ బాబర్,  కౌన్సిలర్స్ నరహరి శ్రీనివాసులు, నాగిరెడ్డి తదితరులున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని