logo

వంతెన నిర్మాణ పనులు పూర్తి చేయాలని వినతి

అయిజ పట్టణంలో ఏళ్లుగా నిర్మిస్తున్న పెద్ద వాగు వంతెన పనులు పూర్తిచేసి అందుబాటులోకి తీసుకురావాలని పట్టణానికి చెందిన ప్రజా సంఘాల ఐక్య వేదిక నాయకులు సోమవారం ఏవో భద్రతకు వినతిపత్రం అందజేశారు.

Updated : 06 May 2024 15:55 IST

రాజోలి: అయిజ పట్టణంలో ఏళ్లుగా నిర్మిస్తున్న పెద్ద వాగు వంతెన పనులు పూర్తిచేసి అందుబాటులోకి తీసుకురావాలని పట్టణానికి చెందిన ప్రజా సంఘాల ఐక్య వేదిక నాయకులు సోమవారం ఏవో భద్రతకు వినతిపత్రం అందజేశారు. ఈ మేరకు గద్వాల్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో వివిధ పార్టీల నాయకులు, ప్రజా సంఘాల నాయకులు కలిసి సమస్యను జిల్లా అధికారులకు వివరించారు. వంతెన నిర్మాణం పూర్తి చేయడంతో పాటు, పులికల్ రోడ్డు పనులు త్వరగా మొదలు పెట్టి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని వినతిపత్రం సమర్పించారు. కార్యక్రమంలో మున్సిపల్ ఛైర్మన్ దేవన్న, ఆయా పార్టీల నాయకులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని