logo

మద్యం మత్తులో భర్తపై గొడ్డలితో దాడి

మద్యం మత్తులో భర్తపై గొడ్డలితో దాడిచేసి హతమార్చిన సంఘటన సోమవారం చోటు చేసుకుంది. మమ్మాయిపల్లి గ్రామానికి చెందిన భార్య, భర్తలు లక్ష్మి, నాగయ్య వ్యవసాయ కూలీ పనులు చేస్తూ జీవనం సాగిస్తున్నారు.

Published : 07 May 2024 03:09 IST

బిజినేపల్లి, న్యూస్‌టుడే : మద్యం మత్తులో భర్తపై గొడ్డలితో దాడిచేసి హతమార్చిన సంఘటన సోమవారం చోటు చేసుకుంది. మమ్మాయిపల్లి గ్రామానికి చెందిన భార్య, భర్తలు లక్ష్మి, నాగయ్య వ్యవసాయ కూలీ పనులు చేస్తూ జీవనం సాగిస్తున్నారు. దంపతులిద్దరూ మద్యానికి బానిసయ్యారు. మత్తులో నిత్యం గొడవపడుతుండేవారు. సోమవారం కూలీ పనులకు వెళ్లి మధ్యాహ్నం మద్యం తాగి దంపతులు రోజూ మాదిరిగానే ఇంటికి వచ్చి గొడవపడ్డారు. భర్త నిద్రలోకి జారుకున్నాక.. ఇదే అదునుగా భావించిన నిందితురాలు లక్ష్మి ఆగ్రహంతో నాగయ్య మెడపై గొడ్డలితో నరికింది. నాగయ్య తీవ్రంగా గాయపడగా స్థానికులు 108 వాహనంలో నాగర్‌కర్నూల్‌ జనరల్‌ ఆసుపత్రికి తరలించారు. వైద్యుల సిఫారసు మేరకు హైదరాబాద్‌ తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందాడు. సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై నాగశేఖర్‌రెడ్డి తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని