logo

కాంగ్రెస్ పార్టీకి అండగా నిలుద్దాం

ఎన్నికల నేపథ్యంలో భాజపా, భారాస చెప్పే మాయమాటలు నమ్మొద్దని, ఉపాధి హామీ పథకాన్ని తీసుకొచ్చిన కాంగ్రెస్ పార్టీకే ఓటు వేసి గెలిపిద్దామని జడ్పీ ఛైర్‌ పర్సన్ సరిత అన్నారు.

Updated : 07 May 2024 17:06 IST

రాజోలి: ఎన్నికల నేపథ్యంలో భాజపా, భారాస చెప్పే మాయమాటలు నమ్మొద్దని, ఉపాధి హామీ పథకాన్ని తీసుకొచ్చిన కాంగ్రెస్ పార్టీకే ఓటు వేసి గెలిపిద్దామని జడ్పీ ఛైర్‌ పర్సన్ సరిత అన్నారు. ఆమె నాగర్‌కర్నూల్ పార్లమెంటు ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళవారం కేటిదొడ్డి మండలంలో నందిన్నె, కేటిదొడ్డి, కోండపురం, మైలగడ్డ గ్రామాలలో పర్యటించి ఉపాధి కూలీలతో మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే అమలు చేయు సంక్షేమ పథకాల గురించి వివరించారు. పార్లమెంట్ అభ్యర్థి మల్లు రవికి ఓటు వేసి గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, మధుసూదన్ బాబు, వెంకట్రామిరెడ్డి, పాతపాలెం ఆనంద్ గౌడ్, పద్మరెడ్డి, సింగిల్ విండో డైరెక్టర్ సురేష్, ఎంపీటీసీ మహేష్ తదితరులున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని