బదిలీలతో మూత... ఏదీ చేయూత
ప్రభుత్వ బదిలీల్లో భాగంగా ఉన్న కొద్దిపాటి సిబ్బంది వేరే ప్రాంతానికి వెళ్లిపోవడంతో చివరకు ఆసుపత్రినే మూసి వేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీంతో వ్యాధి నిర్ధరణ పరీక్షలు ఆగిపోయే పరిస్థితి రాగా రోగులకు ఇక్కట్లు తప్పడంలేదు. ఇందుకు
బోదకాల వ్యాధి నిర్ధరణ ప్రశ్నార్థకం
న్యూస్టుడే, కొడంగల్, వికారాబాద్ మున్సిపాలిటీ
కొడంగల్ పైలేరియా కేంద్రం
ప్రభుత్వ బదిలీల్లో భాగంగా ఉన్న కొద్దిపాటి సిబ్బంది వేరే ప్రాంతానికి వెళ్లిపోవడంతో చివరకు ఆసుపత్రినే మూసి వేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీంతో వ్యాధి నిర్ధరణ పరీక్షలు ఆగిపోయే పరిస్థితి రాగా రోగులకు ఇక్కట్లు తప్పడంలేదు. ఇందుకు నిదర్శనంగా కొడంగల్లోని పైలేరియా (బోదకాల) వ్యాధి నిర్ధరణ, పరీక్షల నిర్వహణ కేంద్రంలో నెలకొంది. దీనికి సంబంధించి ‘న్యూస్టుడే’ కథనం.
జిల్లా వ్యాప్తంగా ఇదొక్కటే కేంద్రం
వికారాబాద్ జిల్లా వ్యాప్తంగా ఒకే ఒక బోదకాల వ్యాధి నిర్ధరణ కేంద్రం కొడంగల్ ప్రభుత్వ ఆసుపత్రి ప్రాంగణంలో ఉంది. దీన్ని 1986లో మాజీ ఎమ్మెల్యే దివంగత నందారం వెంకటయ్య కొడంగల్కు తీసుకొచ్చారు. ఆప్పట్లో ఒక ఇంట్లో అద్దెగదిలో ఏర్పాటు చేశారు. నాటి నుంచి నేటి వరకు సొంత భవనం లేకుండానే కొనసాగినా చివరకు బదిలీల దెబ్బకు మూత పడాల్సి వచ్చింది. ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఈ ప్రాంతంలోనే బోదకాల బాధితులు ఎక్కుగా ఉండటంతో కొడంగల్తో పాటు గోకపస్లాబాద్లో ఏర్పాట చేశారు. జిల్లాలో ఎక్కడ పైలేరియా కేసులు వచ్చినా కొడంగల్కు వచ్చి చికిత్స తీసుకోవాల్సిందే.
అసలే అరకొర..
కొడంగల్ బోదకాల కేంద్రంలో మొత్తం 13 మంది సిబ్బందికిగాను 6 మంది మాత్రమే విధులు నిర్వహించే వారు. ఇందులో 5 మంది ఫీల్డ్ వర్కర్లు. వీరిపైన ఒక సుపీరియర్ ఫీల్డ్ వర్కర్ ఉండేవారు. ఈ 5 మంది గద్వాల్, నారాయణపేట, మహబూబ్నగర్, నాగర్కర్నూల్ బదిలీ కావడంతో ఒక్కరు కూడా లేక మూతపడింది. దాదాపు 15 సంవత్సరాలుగా కనీసం ఒక్క పోస్టు కూడా భర్తీ చేయక పోవడంతో నేడు ఖాళీ కావాల్సి వచ్చింది.
ఉన్నతాధికారులకు నివేదిస్తాం: డాక్టర్ రవీందర్ యాదవ్, క్షయ, బోదకాల వ్యాధి నివారణ జిల్లా అధికారి, వికారాబాద్
ఇటీవల 317 ఉత్తర్వుల ప్రకారం సిబ్బందిని ఇతర జిల్లాలకు కేటాయించారు. జిల్లాలో బోదకాల వ్యాధి నిర్ధరణ కేంద్రం కొడంగల్, గోకపస్లావాద్లోని ఉపకేంద్రం రెండూ సిబ్బంది బదిలీ కారణంగానే మూత పడేదశకు చేరాయి. సమస్యను ఉన్నతాధికారులు నివేదిస్తాం. కొడంగల్లో ప్రభుత్వ ఆసుపత్రిలోనే ఈ కేంద్రం కూడా ఉంది. జిల్లా వ్యాప్తంగా మొత్తంగా 1800 మంది బోదకాల బాధితులున్నారు. అయితే అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో బోధవ్యాధి నివారణకు మందులు ఉన్నాయి. వీటిని ఉచితంగా పంపిణీ చేస్తారు. రోగులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు.
ఇక్కడే ఎందుకంటే...: దాసప్పయాదవ్, విశ్రాంత వైద్యులు, కొడంగల్
1974లో బోద వ్యాధి గ్రస్థులపై సర్వే చేసినప్పుడు నారాయణపేట, మద్దూరు, కోస్గి, కొడంగల్, అంగడిరైచూర్ ప్రాంతాల్లో ఎక్కువగా కేసులు వచ్చాయి. ఇందుకు ప్రధాన కారణం కర్ణాటకలోని ముదేళ్లిలో బోదకాల వ్యాధి బాధితులు అధికంగా ఉన్నారు. ఈ ప్రాంతానికి చెందిన వారు కొడంగల్ ఇతర ప్రాంతాలకు వెళ్లడం, బంధువుల ఇళ్లకు రాకపోకలు సాగించేవారు. వారి బోదకాలుపై కుట్టిన క్యూలెక్స్ దోమ నీటిలో, మురుగు కాలువలో చేరి గుడ్లు పెట్టివాటి సంతతిని పెంచింది. ఈ దోమలు కుట్టడంతో ఇక్కడా ఆ వ్యాధి బారిన పడి బాధికులు అధికంగా పెరిగారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అమితానందం.. షా ఆగమనం
[ 26-04-2024]
భాజపా అగ్రనేత, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్షా ఆగమనంతో సిద్దిపేట కమలనాథుల్లో నూతనోత్సాహం వెల్లివిరిసింది. లోక్సభ ఎన్నికల వేళ కాషాయ దళంలో నయాజోష్ కనిపించింది. -
కనుల ముందుకు కలల లోకం
[ 26-04-2024]
ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న వేసవి సెలవులు రానే వచ్చాయి.. వస్తూ వస్తూ ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీలో వినోదాల వేడుకలను తీసుకువచ్చాయి. -
మెతుకుసీమ గులాబీ జెండా అడ్డా...
[ 26-04-2024]
మెతుకుసీమ గులాబీ జెండాకు అడ్డా అని... ఈ ఎన్నికల్లోనూ మరోసారి జెండా ఎగరవేస్తామని మాజీ మంత్రి తన్నీరు హరీశ్రావు ధీమా వ్యక్తం చేశారు. -
వెల్లువెత్తిన నామపత్రాలు
[ 26-04-2024]
మెదక్ లోక్సభ స్థానానికి వెల్లువలా నామపత్రాలు దాఖలయ్యాయి. మొత్తం 54 మంది అభ్యర్థులు 90 సెట్ల నామినేషన్లు సమర్పించారు. -
బీసీ బిడ్డను ఆశీర్వదించండి
[ 26-04-2024]
అన్ని వర్గాలను కలుపు కొనిపోయే బీసీ బిడ్డగా తనను ఆశీర్వదించాలని మెదక్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి నీలం మధు కోరారు. గురువారం కౌడిపల్లి, కంచన్పల్లి, పాంపల్లి, వెల్దుర్తి, మాసాయిపేటలో రోడ్డుషో, సభ నిర్వహించారు. -
ఫలితం లేదు..
[ 26-04-2024]
జిల్లాలో ఇంటర్మీడియట్ ఫలితాలు కొంతమేర ఊరటనిచ్చినప్పటికీ ఆశించిన స్థాయిలో రాలేదు. గత నాలుగేళ్ల నుంచి ఫలితాల్లో జిల్లా చివరి స్థానంలో నిలుస్తుండగా.. -
నిఘా నీడ.. పక్కా పర్యవేక్షణ
[ 26-04-2024]
సార్వత్రిక సమరంలో ప్రవర్తనా నియమావళిని పకడ్బందీగా అమలు చేసేందుకు కేంద్ర ఎన్నికల సంఘం నిఘా వ్యవస్థను పటిష్ఠం చేసింది. -
పంచాయతీ నుంచి లోక్సభకు..
[ 26-04-2024]
ఎం.బాగారెడ్డి.. మెతుకుసీమ రాజకీయాల్లో చెరగని ముద్ర వేశారు. నాలుగున్నర దశాబ్దాల పాటు సుదీర్ఘ రాజకీయ ప్రస్థానంలో అపజయం ఎరుగని నాయకుడిగా గుర్తింపు పొందారు. -
ఈతకు వెళ్లి బాలుడి మృత్యువాత
[ 26-04-2024]
ఈత కొట్టేందుకు చెరువులోకి దిగిన బాలుడు మృతి చెందిన సంఘటన సిద్దిపేట జిల్లా దౌల్తాబాద్ మండలం కోనాయిపల్లిలో జరిగింది. -
జహీరాబాద్కు 69.. మెదక్కు 90
[ 26-04-2024]
లోక్సభ ఎన్నికల ప్రక్రియలో భాగంగా నామపత్రాల స్వీకరణ ఘట్టం గురువారంతో ముగిసింది. జహీరాబాద్ పార్లమెంట్ స్థానానికి 40 మంది అభ్యర్థులు 69 నామినేషన్లు దాఖలు చేశారు. -
రోడ్షోలు.. సభలు
[ 26-04-2024]
లోక్సభ ఎన్నికల ప్రచారం ఊపందుకుంది. ప్రధాన పార్టీల అభ్యర్థులు కోలాహలం మధ్య నామినేషన్లు సమర్పించారు. -
నాయకుల ఉత్సాహం.. వలసలకు ప్రోత్సాహం
[ 26-04-2024]
ఎన్నికల్లో పైచేయి సాధించాలని ప్రధాన పార్టీలు చేరికలపై దృష్టి పెట్టాయి. ప్రజల్లో పరపతి ఉన్న నియోజకవర్గం, మండల స్థాయి నేతలపై ప్రత్యేకంగా ఫోకస్ చేస్తున్నారు. -
ప్రైవేటు రుణాలతో ఆర్థిక ఇబ్బందులు
[ 26-04-2024]
హుస్నాబాద్ ప్రాంతంలో ప్రైవేటుగా సూక్ష్మ రుణాలు (మైక్రో ఫైనాన్స్) మళ్లీ మొదలయ్యాయి. పేదల అవసరాలను ఆసరా చేసుకుని రుణాలు ఇస్తూ ఇబ్బందులకు గురి చేస్తున్నారు. -
సామాజిక మాధ్యమంలో బయటపడిన వరుడి గుట్టు.. ఒకరోజు ముందు ఆగిన పెళ్లి
[ 26-04-2024]
పెళ్లి నిశ్చయమైన యువకుడికి మరో మహిళతో సంబంధం ఉందని తెలుసుకున్న వధువు బంధువులు పెళ్లికి ఒకరోజు ముందు వరుడిని నిలదీసిన ఘటన శివ్వంపేట మండలంలోని ఓ గ్రామంలో చోటుచేసుకుంది.
తాజా వార్తలు (Latest News)
-
100% వీవీప్యాట్ స్లిప్ల లెక్కింపు కుదరదు: పిటిషన్లు కొట్టేసిన సుప్రీం
-
17 వేల ఐసీఐసీఐ క్రెడిట్ కార్డులు బ్లాక్.. కారణమిదే!
-
అప్పుడు పరుగులు చేసింది కోహ్లీ ఒక్కడే: డుప్లెసిస్
-
శ్రీశైలంలో వైభవంగా భ్రమరాంబాదేవి కుంభోత్సవం
-
పెళ్లి గౌనును రీమోడల్ చేయించిన సమంత.. ఫొటోలు వైరల్
-
బొగ్గు ఓడను విశాఖ పోర్టుకు మళ్లించండి.. అదానీ గంగవరం పోర్టు యాజమాన్యానికి హైకోర్టు ఆదేశం