నాయకుల ఉత్సాహం.. వలసలకు ప్రోత్సాహం
ఎన్నికల్లో పైచేయి సాధించాలని ప్రధాన పార్టీలు చేరికలపై దృష్టి పెట్టాయి. ప్రజల్లో పరపతి ఉన్న నియోజకవర్గం, మండల స్థాయి నేతలపై ప్రత్యేకంగా ఫోకస్ చేస్తున్నారు.
అధికార పార్టీ జోరు
గజ్వేల్లో బడా నేతలపై కాంగ్రెస్ ఫోకస్
న్యూస్టుడే, గజ్వేల్: ఎన్నికల్లో పైచేయి సాధించాలని ప్రధాన పార్టీలు చేరికలపై దృష్టి పెట్టాయి. ప్రజల్లో పరపతి ఉన్న నియోజకవర్గం, మండల స్థాయి నేతలపై ప్రత్యేకంగా ఫోకస్ చేస్తున్నారు. అవతలి పార్టీ మానసిక స్థైర్యాన్ని దెబ్బతీసేలా చేరికలను నాయకులు ప్రోత్సహిస్తున్నారు. రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ నేతలు స్థానికంగా పెద్ద నేతలను చేర్చుకోవాలని ప్రయత్నాలు గట్టిగా చేస్తున్నారు. వారితో పాటు ఇతర ఛోటా నాయకులు, అనుచరులూ వస్తారనేది పార్టీ పెద్దల నమ్మకం.
ప్రభావం చూపనుందా?
పార్లమెంట్ ఎన్నికల్లో మెదక్ అసెంబ్లీ నియోజకవర్గ పరిధి ఇన్ఛార్జిగా వ్యవహరిస్తున్న ఉమ్మడి మెదక్ జిల్లా డీసీసీబీ ఛైర్మన్ చిట్టి దేవేందర్రెడ్డి తన అనుచరగణం, ఎనిమిది మంది డైరెక్టర్లు, మాజీ సర్పంచులతో ఇటీవల భారాసను వీడటం సంచలనంగా మారింది. తూప్రాన్కు చెందిన డీసీసీబీ మాజీ ఛైర్మన్, భారాస సీనియర్ నేత గంగుమల్ల ఎలక్షన్రెడ్డి సైతం కాంగ్రెస్లో చేరారు. మండల స్థాయిలోని మాజీ ప్రజాప్రతినిధులు ఒక్కొక్కరుగా కారు దిగిపోతున్నారు. గ్రామాల్లో, మండలాల్లో ప్రచారం ముమ్మరం కావాల్సిన ఈ సమయంలో ప్రభావం చూపనుందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. చిట్టి దేవేందర్రెడ్డితోపాటు ఆయన సతీమణి మాధురికి సిద్దిపేట జిల్లాలో పట్టుంది. గతంలో కాంగ్రెస్లో ఉండగా డీసీసీబీ ఛైర్మన్ పదవి దక్కించుకున్న ఆయన భారాసలో చేరి మళ్లీ అదే పదవిని చేపట్టి కొనసాగుతున్నారు. దంపతులు ఇద్దరూ భారాస పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొని ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేసి విజయం సాధించారు. ఆమె జడ్పీటీసీ సభ్యురాలిగా, సర్పంచిగా చేశారు.
గజ్వేల్-ప్రజ్ఞాపూర్ బల్దియా మాజీ ఛైర్మన్ గాడిపల్లి భాస్కర్, జగదేవపూర్, ములుగు, గజ్వేల్ మండలాలకు చెందిన పలువురు నాయకులు హస్తం పార్టీలోకి చేరిపోయారు. అధికంగా అధికార పార్టీవైపు వెళుతుండటంతో భారాస అధినేత చేతిలో ఉన్న గజ్వేల్ నియోజకవర్గంపై ఆశలు పెట్టుకోగా వలసలు రాజకీయంగా ఇబ్బంది పెడుతున్నాయి. గజ్వేల్ నియోజకవర్గంలో మాజీ మంత్రి హరీశ్రావు, స్థానికంగా ఎఫ్డీసీ మాజీ ఛైర్మన్ ప్రతాప్రెడ్డి ఆధ్వర్యంలో ప్రచారం కొనసాగుతోంది. భాజపా తరఫున మండల స్థాయి నేతలు ప్రచారం చేస్తున్నారు. కాంగ్రెస్ నుంచి డీసీసీ అధ్యక్షుడు, గజ్వేల్ మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డి జోరుగా చేరికలను ప్రోత్సహిస్తున్నారు. భారాసపై పైచేయి సాధించి కాంగ్రెస్ అధిష్ఠానం వద్ద పేరు తెచ్చుకుంటేనే రాజకీయ భవిష్యత్తు ఉండనుండటంతో ఆయన దూరదృష్టితో వ్యూహం అమలు చేస్తున్నట్లు విశ్లేషకులు భావిస్తున్నారు. గజ్వేల్ నియోజకవర్గంలో మొత్తం 2,74,654 మంది ఓటర్లున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో భారాసకు 1,11,684 ఓట్లు రాగా భాజపాకు 66,653 వచ్చాయి. కాంగ్రెస్కు 32,568 ఓట్లు వచ్చాయి. అసెంబ్లీ ఎన్నికల్లో సాధించిన ఓట్ల కంటే మరిన్ని ఎక్కువగా సాధించాలని భారాస నాయకులు వ్యూహం రూపొందిస్తున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఎన్నికలకు సమాయత్తం
[ 05-05-2024]
బరిలో నిలిచే అభ్యర్థులు తేలిపోవడంతో ఎన్నికల నిర్వహణకు అధికార యంత్రాంగం సన్నద్ధమవుతోంది. ఇప్పటికే ఈవీఎంలు ఆయా జిల్లాలకు చేరుకోగా, అభ్యర్థులు భారీ సంఖ్యలో పోటీ చేస్తుండటంతో అదనంగా మరిన్ని ఈవీఎంలను తెప్పించారు. -
దుబ్బాకలో లోకల్ దారి
[ 05-05-2024]
నియోజకవర్గంలోని ఓటర్లందరినీ ఒకేరకమైన హామీతో ప్రసన్నం చేసుకోవాలనుకుంటే కొంత ఇబ్బందే. ఒక్కోచోట ఒక్కో సమస్య ప్రభావితం చేస్తుంది. -
హ్యాట్రిక్ విజయం ఖాయం: హరీశ్రావు
[ 05-05-2024]
అబద్ధపు పునాదుల మీద స్వార్థ రాజకీయాలకు పాల్పడుతున్న కాంగ్రెస్, భాజపాలకు తగిన గుణపాఠం చెప్పే సమయం ఆసన్నమైందని మాజీ మంత్రి హరీశ్రావు పేర్కొన్నారు. -
ఎన్డీయేతోనే సుపరిపాలన: తమిళిసై
[ 05-05-2024]
దేశం అభివృద్ధి చెందాలన్న.. సురక్షితంగా ఉండాలన్నా... సుపరిపాలన కోసం, పేదరికాన్ని నిర్మూలించాలంటే నరేంద్ర మోదీ ప్రధాని కావాలని రాష్ట్ర మాజీ గవర్నర్ తమిళిసై అన్నారు. -
దేవుళ్లతో రాజకీయం చేయడం సరికాదు
[ 05-05-2024]
దేవుళ్లతో భాజపా రాజకీయం చేయడం సరికాదని మంత్రి కొండా సురేఖ అన్నారు. శనివారం రాత్రి మెదక్లో నిర్వహించిన కార్యకర్తల సమావేశంలో ఆమె మాట్లాడారు. -
పూత రాలి.. తెగుళ్లు పెరిగి
[ 05-05-2024]
మామిడికి ఏటా తెగుళ్ల బెడద పట్టిపీడిస్తోంది. నవంబర్, డిసెంబర్లో చలి తీవ్రత, తేనె మంచు, బూడిద, నల్లతామర తెగుళ్ల సమస్య ఉంటోంది. -
సంతోషాల సవ్వడి.. ఐదు వసంతాల ఒరవడి
[ 05-05-2024]
‘నవ్వడం ఒక భోగం.. నవ్వించడం ఒక యోగం.. నవ్వలేకపోవడం ఒక రోగం’ అన్నాడో కవి. జీవితం సాఫీగా.. -
రెండో పెళ్లి వ్యామోహంతో భార్య హత్య
[ 05-05-2024]
తన కుమార్తెను హత్య చేసి కాగ్నా నదిలో పడేశారని అనుమానం వ్యక్తం చేస్తూ, హతురాలి తండ్రి ఫిర్యాదుతో పోలీసులు కేసు దర్యాప్తు చేసి శనివారం హత్యోందంతాన్ని ఛేదించారు. -
వాడిన విరులూ.. ఆదాయపు సిరులే
[ 05-05-2024]
అందివచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటే సత్ఫలితం ఖాయం. ఈ కోవకే చెందుతారు మెదక్ జిల్లా శివ్వంపేట మండలం ఎదుల్లాపూర్ గ్రామానికి చెందిన మహిళలు. -
‘కుబేరులను పోషించిన మోదీ ప్రభుత్వం’
[ 05-05-2024]
పదేళ్లుగా ప్రధాని నరేంద్రమోదీ ప్రభుత్వం కుబేరులను పెంచి పోషిస్తూ పేదలపై ఆర్థిక భారాన్ని మోపిందని ప్రజా సంఘాల ఐకాస రాష్ట్ర ఛైర్మన్ ఆచార్య కూరపాటి వెంకటనారాయణ అన్నారు. -
మన భవితను నిర్ణయిస్తుంది
[ 05-05-2024]
మనం వేసే ఓటు ఐదేళ్ల భవిష్యత్తుకు సంబంధించినది. మన భవితను నిర్ణయిస్తుంది. నోటు, మద్యం వంటి ప్రలోభాలకు లొంగొద్దు. లేదంటే మనల్ని మనం అమ్ముకున్నట్లే. ఓటు విషయంలో కులం, మతం, బంధుప్రీతిని అనుసరించొద్దు. -
గ్రామీణులపైనే ఆశలు
[ 05-05-2024]
లోక్సభ ఎన్నికలకు గడువు సమీపిస్తుండడంతో ప్రధాన పార్టీలన్నీ ప్రచారంలో వేగం పెంచాయి. భారాస, కాంగ్రెస్, భాజపా అభ్యర్థులు ఎక్కువగా గ్రామీణ ప్రాంతాల ఓటర్ల మద్దతు కూడగట్టేందుకే ప్రాధాన్యమిస్తున్నారు. -
హామీలన్నీ నెరవేరుస్తాం: మంత్రి సురేఖ
[ 05-05-2024]
కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తుందని మంత్రి కొండా సురేఖ పేర్కొన్నారు. శనివారం స్థానిక పీఎస్ఆర్ గార్డెన్లో మెదక్ పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థి నీలం మధుకు మద్దతుగా సీపీఎం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన విస్తృత స్థాయి సమావేశంలో ఆమె పాల్గొని మాట్లాడారు. -
మతం బలహీనత కావొద్దు: మంత్రి
[ 05-05-2024]
మతం బలహీనత కారాదని, అది సమాజంలో అసమానతలు, అసహనాన్ని పెంచేలా ఉండొద్దని వైద్యారోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ అన్నారు. -
సాంకేతికత వినియోగం పారదర్శకతకు దోహదం
[ 05-05-2024]
ప్రజాస్వామ్యంలో ఎన్నికలే కీలకం. ఇవి పారదర్శకంగా జరగాలి. ఓటు హక్కు ఉన్న వారంతా వినియోగించుకోవాలి. -
గజ్వేల్లో 25 వేల ఓట్ల ఆధిక్యం తేవాలి: జగ్గారెడ్డి
[ 05-05-2024]
రాహుల్గాంధీని ప్రధానిని చేయటమే లక్ష్యంగా మెదక్ పార్లమెంటు కాంగ్రెస్ అభ్యర్థి నీలం మధును భారీ ఓట్ల ఆధిక్యంతో గెలిపించాలని టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు జగ్గారెడ్డి అన్నారు. -
ఎట్టకేలకు కేజీబీవీ నిర్మాణం ప్రారంభం
[ 05-05-2024]
ఎట్టకేలకు అక్కన్నపేట కేజీబీవీ భవన నిర్మాణ పనులు మళ్లీ ప్రారంభమయ్యాయి. రెండున్నరేళ్ల క్రితం ప్రారంభించిన ఈ భవన నిర్మాణ పనులు ఏడాది క్రితం వివిధ కారణాలతో అర్దంతరంగా ఆగిపోయాయి.
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (05/05/24)
-
శ్రీలీల సమ్మర్ షో.. అరియానా హాట్ ‘గ్లో’
-
టీచర్ను కొట్టిన ప్రిన్సిపల్.. వీడియో వైరల్
-
ఫ్రీగా ఇస్తాం.. ఈ విల్లా తీసుకోండి..!
-
నిద్రపోయిన స్టేషన్ మాస్టర్.. నిలిచిపోయిన ఎక్స్ప్రెస్ రైలు!
-
కొనసాగుతున్న లేఆఫ్లు.. 4 నెలల్లో 80 వేల మంది ఉద్యోగులపై వేటు