మెతుకుసీమ గులాబీ జెండా అడ్డా...
మెతుకుసీమ గులాబీ జెండాకు అడ్డా అని... ఈ ఎన్నికల్లోనూ మరోసారి జెండా ఎగరవేస్తామని మాజీ మంత్రి తన్నీరు హరీశ్రావు ధీమా వ్యక్తం చేశారు.
మాజీ మంత్రి హరీశ్రావు
హరీశ్రావుతో కలిసి నామినేషన్ వేస్తున్న వెంకట్రామిరెడ్డి
మెదక్, న్యూస్టుడే: మెతుకుసీమ గులాబీ జెండాకు అడ్డా అని... ఈ ఎన్నికల్లోనూ మరోసారి జెండా ఎగరవేస్తామని మాజీ మంత్రి తన్నీరు హరీశ్రావు ధీమా వ్యక్తం చేశారు. భారాస ఎంపీ అభ్యర్థి వెంకట్రామిరెడ్డి గురువారం హరీశ్రావుతో కలిసి మరో సెట్ నామినేషన్ దాఖలు చేశారు. అంతకుముందు స్థానిక బోధన్ చౌరస్తా నుంచి రాందాస్ చౌరస్తా వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. వాహనంలో హరీశ్రావు, ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి, ఎంపీ అభ్యర్థి వెంకట్రామిరెడ్డి, మాజీ ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి దారి వెంట ప్రజలకు అభివాదం చేస్తూ ముందుకు కదిలారు. రాందాస్ చౌరస్తాలో కార్నర్ మీటింగ్ నిర్వహించారు. హరీశ్రావు మాట్లాడుతూ.. పదేళ్లలో ఏం అభివృద్ధి చేశారని సీఎం రేవంత్రెడ్డి ప్రశ్నించారని.. మెదక్ పట్టణాన్ని జిల్లా కేంద్రంగా ఏర్పాటు చేసి ప్రజల ఆకాంక్షను నెరవేర్చామని, ఎంపీ అభ్యర్థికి నామినేషన్ వేసేందుకు ఆయనను మెదక్కు రప్పించిన ఘనత గులాబీ జెండాదని పేర్కొన్నారు. భెల్ 1952లో ఏర్పాటైతే... ఇందిరాగాంధీ హయాంలో ఏర్పాటైందని సీఎం అబద్ధాలు మాట్లాడారని.. సీఎం కుర్చీ గౌరవాన్ని కాపాడాలని సూచించారు. భారాస హయాంలో ఉమ్మడి మెదక్ను మూడు జిల్లాలుగా చేసి, వైద్య కళాశాలలను మంజూరు చేశామని, రూ.100 కోట్లతో రైలు తీసుకువచ్చామని గుర్తుచేశారు. హల్దీ, మంజీరా నదిపై చెక్డ్యాంలను నిర్మించి.. వేసవిలో కాళేశ్వరం జలాలను అందించామని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం గ్యాస్, డీజిల్, పెట్రోల్ ధరలను, జీఎస్టీ పేరుతో ఉప్పు, పప్పుల ధరలను పెంచిందని.. అలాంటి భాజపాకు ఎందుకు ఓటు వేయాలని ప్రశ్నించారు. ఇంటింటికి ఎడ్లు, నిరుద్యోగభృతి, రైల్వేలైన్, దవాఖానాను ఇస్తామని చెప్పి రఘునందన్రావు మోసం చేశారని విమర్శించారు. కార్యకర్తలకు అండగా ఉంటానని.. కాంగ్రెస్ వాళ్లు భయపెట్టినా ఆందోళన చెందవద్దన్నారు.
వాహనం తనిఖీ: నర్సాపూర్లో చెక్పోస్ట్ వద్ద ఎమ్మెల్యే హరీశ్రావు వాహనాన్ని ఎన్నికల సిబ్బంది తనిఖీ చేశారు. ఆయన వాహనం దిగి వారికి సహకరించారు.
కార్నర్ మీటింగ్లో పాల్గొన్న కార్యకర్తలు, ప్రజలు
రూ.100 కోట్లతో ట్రస్టు
అభ్యర్థుల గుణగణాలను చూసి ఓటు వేయాలని అభ్యర్థి వెంకట్రామిరెడ్డి విజ్ఞప్తి చేశారు. రూ.100 కోట్లతో ట్రస్టు ఏర్పాటు చేసి పేదలకు సాయం చేస్తానన్నారు. ఎమ్మెల్యే సునీత మాట్లాడుతూ.. గత పదేళ్లలో ఒక్క ఎకరా పంట ఎండలేదని, నేడు 20 లక్షల ఎకరాల వరకు పొలాలు ఎండిపోయాయని, అకాల వర్షాలకు ఐదు వేల ఎకరాల్లో నష్టం జరిగిందన్నారు. దుబ్బాక ఎమ్మెల్యే ప్రభాకర్రెడ్డి మాట్లాడుతూ.. కాంగ్రెస్ అభ్యర్థి నీలం మధును బలిచేశారని పేర్కొన్నారు. మాజీ ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి మాట్లాడుతూ.. ఇచ్చిన హామీలను కాంగ్రెస్ అమలు చేయకపోవడంతో.. ప్రజలు మాజీ సీఎం కేసీఆర్ వెంట ఉన్నారని అన్నారు.
బోనాలు, డప్పుచప్పుళ్లు
భారీ ర్యాలీలో బోనాల ఊరేగింపు.. కళాకారుల డప్పుచప్పుళ్లతో సందడి చేశారు. రాందాస్ చౌరస్తా వద్ద భారీ గజమాలతో సత్కరించారు. సిద్దిపేట భాజపా సభలో కార్యకర్తలకు ఏసీ, కూలర్లు పెట్టి కూర్చోబెట్టారని, అదే ఎండలో ర్యాలీ చేపట్టడం భారాస కార్యకర్తల పట్టుదల అని హరీశ్రావు అన్నారు. ఉద్యమకారులు ఎండకు భయపడరని అన్నారు. కార్యక్రమంలో సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్, ఎమ్మెల్సీలు శేరిసుభాష్రెడ్డి, యాదవ్రెడ్డి, జడ్పీ అధ్యక్షురాలు హేమలతగౌడ్, ఉపాధ్యక్షురాలు లావణ్యరెడ్డి, నర్సాపూర్ మున్సిపల్ ఛైర్మన్ అశోక్గౌడ్, మెదక్ మున్సిపల్ వైస్ఛైర్మన్ మల్లికార్జున్గౌడ్, నాయకులు ఎర్రోళ్ల శ్రీనివాస్, దేవేందర్రెడ్డి, మాదాసు శ్రీనివాస్, పట్నం మాణిక్యం, కాసుల బుచ్చిరెడ్డి, రాజనర్సు, వేణుగోపాల్, భట్టిజగపతి, చంద్రాగౌడ్ పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఎన్నికలకు సమాయత్తం
[ 05-05-2024]
బరిలో నిలిచే అభ్యర్థులు తేలిపోవడంతో ఎన్నికల నిర్వహణకు అధికార యంత్రాంగం సన్నద్ధమవుతోంది. ఇప్పటికే ఈవీఎంలు ఆయా జిల్లాలకు చేరుకోగా, అభ్యర్థులు భారీ సంఖ్యలో పోటీ చేస్తుండటంతో అదనంగా మరిన్ని ఈవీఎంలను తెప్పించారు. -
దుబ్బాకలో లోకల్ దారి
[ 05-05-2024]
నియోజకవర్గంలోని ఓటర్లందరినీ ఒకేరకమైన హామీతో ప్రసన్నం చేసుకోవాలనుకుంటే కొంత ఇబ్బందే. ఒక్కోచోట ఒక్కో సమస్య ప్రభావితం చేస్తుంది. -
హ్యాట్రిక్ విజయం ఖాయం: హరీశ్రావు
[ 05-05-2024]
అబద్ధపు పునాదుల మీద స్వార్థ రాజకీయాలకు పాల్పడుతున్న కాంగ్రెస్, భాజపాలకు తగిన గుణపాఠం చెప్పే సమయం ఆసన్నమైందని మాజీ మంత్రి హరీశ్రావు పేర్కొన్నారు. -
ఎన్డీయేతోనే సుపరిపాలన: తమిళిసై
[ 05-05-2024]
దేశం అభివృద్ధి చెందాలన్న.. సురక్షితంగా ఉండాలన్నా... సుపరిపాలన కోసం, పేదరికాన్ని నిర్మూలించాలంటే నరేంద్ర మోదీ ప్రధాని కావాలని రాష్ట్ర మాజీ గవర్నర్ తమిళిసై అన్నారు. -
దేవుళ్లతో రాజకీయం చేయడం సరికాదు
[ 05-05-2024]
దేవుళ్లతో భాజపా రాజకీయం చేయడం సరికాదని మంత్రి కొండా సురేఖ అన్నారు. శనివారం రాత్రి మెదక్లో నిర్వహించిన కార్యకర్తల సమావేశంలో ఆమె మాట్లాడారు. -
పూత రాలి.. తెగుళ్లు పెరిగి
[ 05-05-2024]
మామిడికి ఏటా తెగుళ్ల బెడద పట్టిపీడిస్తోంది. నవంబర్, డిసెంబర్లో చలి తీవ్రత, తేనె మంచు, బూడిద, నల్లతామర తెగుళ్ల సమస్య ఉంటోంది. -
సంతోషాల సవ్వడి.. ఐదు వసంతాల ఒరవడి
[ 05-05-2024]
‘నవ్వడం ఒక భోగం.. నవ్వించడం ఒక యోగం.. నవ్వలేకపోవడం ఒక రోగం’ అన్నాడో కవి. జీవితం సాఫీగా.. -
రెండో పెళ్లి వ్యామోహంతో భార్య హత్య
[ 05-05-2024]
తన కుమార్తెను హత్య చేసి కాగ్నా నదిలో పడేశారని అనుమానం వ్యక్తం చేస్తూ, హతురాలి తండ్రి ఫిర్యాదుతో పోలీసులు కేసు దర్యాప్తు చేసి శనివారం హత్యోందంతాన్ని ఛేదించారు. -
వాడిన విరులూ.. ఆదాయపు సిరులే
[ 05-05-2024]
అందివచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటే సత్ఫలితం ఖాయం. ఈ కోవకే చెందుతారు మెదక్ జిల్లా శివ్వంపేట మండలం ఎదుల్లాపూర్ గ్రామానికి చెందిన మహిళలు. -
‘కుబేరులను పోషించిన మోదీ ప్రభుత్వం’
[ 05-05-2024]
పదేళ్లుగా ప్రధాని నరేంద్రమోదీ ప్రభుత్వం కుబేరులను పెంచి పోషిస్తూ పేదలపై ఆర్థిక భారాన్ని మోపిందని ప్రజా సంఘాల ఐకాస రాష్ట్ర ఛైర్మన్ ఆచార్య కూరపాటి వెంకటనారాయణ అన్నారు. -
మన భవితను నిర్ణయిస్తుంది
[ 05-05-2024]
మనం వేసే ఓటు ఐదేళ్ల భవిష్యత్తుకు సంబంధించినది. మన భవితను నిర్ణయిస్తుంది. నోటు, మద్యం వంటి ప్రలోభాలకు లొంగొద్దు. లేదంటే మనల్ని మనం అమ్ముకున్నట్లే. ఓటు విషయంలో కులం, మతం, బంధుప్రీతిని అనుసరించొద్దు. -
గ్రామీణులపైనే ఆశలు
[ 05-05-2024]
లోక్సభ ఎన్నికలకు గడువు సమీపిస్తుండడంతో ప్రధాన పార్టీలన్నీ ప్రచారంలో వేగం పెంచాయి. భారాస, కాంగ్రెస్, భాజపా అభ్యర్థులు ఎక్కువగా గ్రామీణ ప్రాంతాల ఓటర్ల మద్దతు కూడగట్టేందుకే ప్రాధాన్యమిస్తున్నారు. -
హామీలన్నీ నెరవేరుస్తాం: మంత్రి సురేఖ
[ 05-05-2024]
కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తుందని మంత్రి కొండా సురేఖ పేర్కొన్నారు. శనివారం స్థానిక పీఎస్ఆర్ గార్డెన్లో మెదక్ పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థి నీలం మధుకు మద్దతుగా సీపీఎం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన విస్తృత స్థాయి సమావేశంలో ఆమె పాల్గొని మాట్లాడారు. -
మతం బలహీనత కావొద్దు: మంత్రి
[ 05-05-2024]
మతం బలహీనత కారాదని, అది సమాజంలో అసమానతలు, అసహనాన్ని పెంచేలా ఉండొద్దని వైద్యారోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ అన్నారు. -
సాంకేతికత వినియోగం పారదర్శకతకు దోహదం
[ 05-05-2024]
ప్రజాస్వామ్యంలో ఎన్నికలే కీలకం. ఇవి పారదర్శకంగా జరగాలి. ఓటు హక్కు ఉన్న వారంతా వినియోగించుకోవాలి. -
గజ్వేల్లో 25 వేల ఓట్ల ఆధిక్యం తేవాలి: జగ్గారెడ్డి
[ 05-05-2024]
రాహుల్గాంధీని ప్రధానిని చేయటమే లక్ష్యంగా మెదక్ పార్లమెంటు కాంగ్రెస్ అభ్యర్థి నీలం మధును భారీ ఓట్ల ఆధిక్యంతో గెలిపించాలని టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు జగ్గారెడ్డి అన్నారు. -
ఎట్టకేలకు కేజీబీవీ నిర్మాణం ప్రారంభం
[ 05-05-2024]
ఎట్టకేలకు అక్కన్నపేట కేజీబీవీ భవన నిర్మాణ పనులు మళ్లీ ప్రారంభమయ్యాయి. రెండున్నరేళ్ల క్రితం ప్రారంభించిన ఈ భవన నిర్మాణ పనులు ఏడాది క్రితం వివిధ కారణాలతో అర్దంతరంగా ఆగిపోయాయి.
తాజా వార్తలు (Latest News)
-
ఆ బెత్తం దెబ్బలు ఎప్పటికీ మర్చిపోలేను: సీజేఐ జస్టిస్ చంద్రచూడ్
-
ఎన్టీఆర్కు అర్జున్పై నమ్మకం.. నేను రీషూట్ చేయలేదు: సుకుమార్
-
డోపింగ్ శాంపిల్కు బజరంగ్ నిరాకరణ.. సస్పెన్షన్ వేటు!
-
మృణాల్ అవుట్ఫిట్కు నెటిజన్లు ఫిదా.. డిజైనింగ్కు 1400 గంటలు
-
కొద్ది రోజులుగా అనారోగ్యంతో ఉన్నా.. ఆడతానని అనుకోలేదు: సిరాజ్
-
ఒకే సమయంలో వచ్చే ఏడాది ఐపీఎల్ - పీఎస్ఎల్..! కారణమిదేనా?