బీసీ బిడ్డను ఆశీర్వదించండి
అన్ని వర్గాలను కలుపు కొనిపోయే బీసీ బిడ్డగా తనను ఆశీర్వదించాలని మెదక్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి నీలం మధు కోరారు. గురువారం కౌడిపల్లి, కంచన్పల్లి, పాంపల్లి, వెల్దుర్తి, మాసాయిపేటలో రోడ్డుషో, సభ నిర్వహించారు.
కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి నీలం మధు
వెల్దుర్తిలో మాట్లాడుతున్న నీలం మధు, వేదికపై మదన్రెడ్డి, ఆవుల రాజిరెడ్డి, ఆంజనేయులుగౌడ్ తదితరులు
కౌడిపల్లి, వెల్దుర్తి, న్యూస్టుడే: అన్ని వర్గాలను కలుపు కొనిపోయే బీసీ బిడ్డగా తనను ఆశీర్వదించాలని మెదక్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి నీలం మధు కోరారు. గురువారం కౌడిపల్లి, కంచన్పల్లి, పాంపల్లి, వెల్దుర్తి, మాసాయిపేటలో రోడ్డుషో, సభ నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇచ్చిన విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తించాలని ఆయన కోరారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనే ప్రజలకు ఎన్నో సంక్షేమ పథకాలను అమలు చేసిందని గుర్తుచేశారు. ప్రజా ప్రభుత్వం ఏర్పడిందని, సీఎం రేవంత్రెడ్డి నాయకత్వంలో ఐదు గ్యారంటీలను అమలు చేసిందని తెలిపారు. బలహీన వర్గాలకు చెందిన పేద బిడ్డను, కష్టపడి ఈ స్థాయికి వచ్చానన్నారు. మాజీ ఎమ్మెల్యే మదన్రెడ్డి మాట్లాడుతూ.. తాను కాంగ్రెస్ పార్టీలో చేరింది సంపాదన కోసం కాదని.. పెండింగ్ సమస్యలను తీర్చడానికని అన్నారు. గతంలో భారాసలో 80 మంది ఎమ్మెల్యేలు ఉండగానే మరో 20 మంది ఎమ్మెల్యేలను కొనుగోలు చేశారని ఆరోపించారు. టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆవుల రాజిరెడ్డి మాట్లాడుతూ.. నీలం మధుకు గ్రామగ్రామాన మంచి ఆదరణ ఉందని గుర్తుచేశారు. డీసీసీ అధ్యక్షుడు ఆంజనేయులుగౌడ్, రాష్ట్ర నాయకురాలు సుహాసినిరెడ్డి, పార్టీ మండల అధ్యక్షులు శ్రీనివాస్రావు, నాయకులు శేషసాయిరెడ్డి, రవీందర్రెడ్డి, నర్సింహారెడ్డి, చిన్నంరెడ్డి తదితరులు పాల్గొన్నారు. రామంతాపూర్ దర్గాలో నీలం మధు ప్రార్థనలు చేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఎన్నికలకు సమాయత్తం
[ 05-05-2024]
బరిలో నిలిచే అభ్యర్థులు తేలిపోవడంతో ఎన్నికల నిర్వహణకు అధికార యంత్రాంగం సన్నద్ధమవుతోంది. ఇప్పటికే ఈవీఎంలు ఆయా జిల్లాలకు చేరుకోగా, అభ్యర్థులు భారీ సంఖ్యలో పోటీ చేస్తుండటంతో అదనంగా మరిన్ని ఈవీఎంలను తెప్పించారు. -
దుబ్బాకలో లోకల్ దారి
[ 05-05-2024]
నియోజకవర్గంలోని ఓటర్లందరినీ ఒకేరకమైన హామీతో ప్రసన్నం చేసుకోవాలనుకుంటే కొంత ఇబ్బందే. ఒక్కోచోట ఒక్కో సమస్య ప్రభావితం చేస్తుంది. -
హ్యాట్రిక్ విజయం ఖాయం: హరీశ్రావు
[ 05-05-2024]
అబద్ధపు పునాదుల మీద స్వార్థ రాజకీయాలకు పాల్పడుతున్న కాంగ్రెస్, భాజపాలకు తగిన గుణపాఠం చెప్పే సమయం ఆసన్నమైందని మాజీ మంత్రి హరీశ్రావు పేర్కొన్నారు. -
ఎన్డీయేతోనే సుపరిపాలన: తమిళిసై
[ 05-05-2024]
దేశం అభివృద్ధి చెందాలన్న.. సురక్షితంగా ఉండాలన్నా... సుపరిపాలన కోసం, పేదరికాన్ని నిర్మూలించాలంటే నరేంద్ర మోదీ ప్రధాని కావాలని రాష్ట్ర మాజీ గవర్నర్ తమిళిసై అన్నారు. -
దేవుళ్లతో రాజకీయం చేయడం సరికాదు
[ 05-05-2024]
దేవుళ్లతో భాజపా రాజకీయం చేయడం సరికాదని మంత్రి కొండా సురేఖ అన్నారు. శనివారం రాత్రి మెదక్లో నిర్వహించిన కార్యకర్తల సమావేశంలో ఆమె మాట్లాడారు. -
పూత రాలి.. తెగుళ్లు పెరిగి
[ 05-05-2024]
మామిడికి ఏటా తెగుళ్ల బెడద పట్టిపీడిస్తోంది. నవంబర్, డిసెంబర్లో చలి తీవ్రత, తేనె మంచు, బూడిద, నల్లతామర తెగుళ్ల సమస్య ఉంటోంది. -
సంతోషాల సవ్వడి.. ఐదు వసంతాల ఒరవడి
[ 05-05-2024]
‘నవ్వడం ఒక భోగం.. నవ్వించడం ఒక యోగం.. నవ్వలేకపోవడం ఒక రోగం’ అన్నాడో కవి. జీవితం సాఫీగా.. -
రెండో పెళ్లి వ్యామోహంతో భార్య హత్య
[ 05-05-2024]
తన కుమార్తెను హత్య చేసి కాగ్నా నదిలో పడేశారని అనుమానం వ్యక్తం చేస్తూ, హతురాలి తండ్రి ఫిర్యాదుతో పోలీసులు కేసు దర్యాప్తు చేసి శనివారం హత్యోందంతాన్ని ఛేదించారు. -
వాడిన విరులూ.. ఆదాయపు సిరులే
[ 05-05-2024]
అందివచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటే సత్ఫలితం ఖాయం. ఈ కోవకే చెందుతారు మెదక్ జిల్లా శివ్వంపేట మండలం ఎదుల్లాపూర్ గ్రామానికి చెందిన మహిళలు. -
‘కుబేరులను పోషించిన మోదీ ప్రభుత్వం’
[ 05-05-2024]
పదేళ్లుగా ప్రధాని నరేంద్రమోదీ ప్రభుత్వం కుబేరులను పెంచి పోషిస్తూ పేదలపై ఆర్థిక భారాన్ని మోపిందని ప్రజా సంఘాల ఐకాస రాష్ట్ర ఛైర్మన్ ఆచార్య కూరపాటి వెంకటనారాయణ అన్నారు. -
మన భవితను నిర్ణయిస్తుంది
[ 05-05-2024]
మనం వేసే ఓటు ఐదేళ్ల భవిష్యత్తుకు సంబంధించినది. మన భవితను నిర్ణయిస్తుంది. నోటు, మద్యం వంటి ప్రలోభాలకు లొంగొద్దు. లేదంటే మనల్ని మనం అమ్ముకున్నట్లే. ఓటు విషయంలో కులం, మతం, బంధుప్రీతిని అనుసరించొద్దు. -
గ్రామీణులపైనే ఆశలు
[ 05-05-2024]
లోక్సభ ఎన్నికలకు గడువు సమీపిస్తుండడంతో ప్రధాన పార్టీలన్నీ ప్రచారంలో వేగం పెంచాయి. భారాస, కాంగ్రెస్, భాజపా అభ్యర్థులు ఎక్కువగా గ్రామీణ ప్రాంతాల ఓటర్ల మద్దతు కూడగట్టేందుకే ప్రాధాన్యమిస్తున్నారు. -
హామీలన్నీ నెరవేరుస్తాం: మంత్రి సురేఖ
[ 05-05-2024]
కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తుందని మంత్రి కొండా సురేఖ పేర్కొన్నారు. శనివారం స్థానిక పీఎస్ఆర్ గార్డెన్లో మెదక్ పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థి నీలం మధుకు మద్దతుగా సీపీఎం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన విస్తృత స్థాయి సమావేశంలో ఆమె పాల్గొని మాట్లాడారు. -
మతం బలహీనత కావొద్దు: మంత్రి
[ 05-05-2024]
మతం బలహీనత కారాదని, అది సమాజంలో అసమానతలు, అసహనాన్ని పెంచేలా ఉండొద్దని వైద్యారోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ అన్నారు. -
సాంకేతికత వినియోగం పారదర్శకతకు దోహదం
[ 05-05-2024]
ప్రజాస్వామ్యంలో ఎన్నికలే కీలకం. ఇవి పారదర్శకంగా జరగాలి. ఓటు హక్కు ఉన్న వారంతా వినియోగించుకోవాలి. -
గజ్వేల్లో 25 వేల ఓట్ల ఆధిక్యం తేవాలి: జగ్గారెడ్డి
[ 05-05-2024]
రాహుల్గాంధీని ప్రధానిని చేయటమే లక్ష్యంగా మెదక్ పార్లమెంటు కాంగ్రెస్ అభ్యర్థి నీలం మధును భారీ ఓట్ల ఆధిక్యంతో గెలిపించాలని టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు జగ్గారెడ్డి అన్నారు. -
ఎట్టకేలకు కేజీబీవీ నిర్మాణం ప్రారంభం
[ 05-05-2024]
ఎట్టకేలకు అక్కన్నపేట కేజీబీవీ భవన నిర్మాణ పనులు మళ్లీ ప్రారంభమయ్యాయి. రెండున్నరేళ్ల క్రితం ప్రారంభించిన ఈ భవన నిర్మాణ పనులు ఏడాది క్రితం వివిధ కారణాలతో అర్దంతరంగా ఆగిపోయాయి.