ధాన్యం విక్రయాలకు నానాపాట్లు
అక్కన్నపేట మండలం గుడాటిపల్లి వద్ద గౌరవెల్లి జలాశయాన్ని నిర్మిస్తున్నారు. అందులో గుడాటిపల్లితో పాటు అనుబంధ గ్రామాలు ముంపునకు గురవుతున్నాయి. జలాశయం పనులు ఇంకా పూర్తికాక పోవడంతో భూములు ఇచ్చిన రైతులు పంటలసాగు
ఆన్లైన్లో నమోదు లేదని కొనుగోలుకు నిరాకరణ
గౌరవెల్లి నిర్వాసిత రైతుల గోస
అక్కన్నపేట మండలం గుడాటిపల్లి వద్ద గౌరవెల్లి జలాశయాన్ని నిర్మిస్తున్నారు. అందులో గుడాటిపల్లితో పాటు అనుబంధ గ్రామాలు ముంపునకు గురవుతున్నాయి. జలాశయం పనులు ఇంకా పూర్తికాక పోవడంతో భూములు ఇచ్చిన రైతులు పంటలసాగు కొనసాగిస్తున్నారు. కొందరు ఆ భూముల్లో సాగు చేస్తున్నారు. మరికొందరు ఇతర గ్రామాల్లో కొనుగోలు చేసిన భూముల్లో పంటలు పండిస్తున్నారు. ఇప్పట్లో పనులు పూర్తయ్యే అవకాశం లేదని భావించిన పలువురు యాసంగిలో వరి వేశారు. గతంలో గ్రామంలో ప్రభుత్వ కేంద్రం ఏర్పాటు చేయగా సుమారు 14 వేల క్వింటాళ్లు విక్రయించారు. ఈ సంవత్సరం కూడా ఏర్పాటు చేస్తారనే ఆశతో అప్పటి కేంద్రం వద్దకు వడ్లు తెచ్చారు. అన్ని గ్రామాల్లో కేంద్రాలను ప్రారంభించిన అధికారులు గుడాటిపల్లిలో మాత్రం ఏర్పాటు చేయలేదు. దీంతో అక్కడ ధాన్యం నిల్వలు అలాగే ఉండిపోయాయి. ఈక్రమంలో కొందరు ప్రత్యామ్నాయ మార్గాల్లో విక్రయించారు.
తక్కువ ధర ఇస్తామంటున్నారు..
ప్రస్తుతం గ్రామంలో సుమారు 50 మందికి పైగా రైతుల వడ్లు ఉన్నాయి. వేరే గ్రామంలోని ప్రభుత్వ కేంద్రంలో విక్రయిద్దామంటే ఆన్లైన్లో నమోదు లేదని కొనుగోలు చేయడం లేదు. ఉన్నచోట ఎకరాకు 70 బస్తాలకు మించి కొనడం లేదని రైతులు అంటున్నారు. ఇప్పుడు తాము ఏం చేయాలి.. ఎక్కడ విక్రయించాలి. ప్రైవేటు వ్యాపారులను అడిగితే క్వింటాలుకు రూ.1600 మాత్రమే ఇస్తామంటున్నారు. వర్షం పడితే మా పరిస్థితి ఏంటని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రాజెక్టు నిర్మాణానికి సర్వం త్యాగం చేసిన తమను ఇబ్బంది పెట్టడం సరైంది కాదంటున్నారు. ముందే చెబితే ధాన్యాన్ని అక్కడికి తీసుకువెళ్లకుండా ప్రత్యామ్నాయ ఏర్పాటు చేసుకునేవారమన్నారు.
గతంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రంలో సద్దితింటున్న రైతు పేరు వంకుడోతు చంద్రు. అక్కన్నపేట మండలం గుడాటిపల్లి పరిధి బొంద్యానాయక్ తండా. నాలుగు ఎకరాల్లో వరిసాగు చేసి 5 ట్రాక్టర్ల ధాన్యం పండించారు. 25 రోజులు గడుస్తున్నా కొనుగోలు చేయలేదని ఆవేదన వ్యక్తం చేశారు. రోజూ సద్దితో పాత కొనుగోలు కేంద్రానికి వెళ్లి పగలంతా ధాన్యాన్ని ఆరబెట్టి, రాత్రి కవర్లు కప్పి ఇంటికి వెళ్తున్నారు. పూర్తిగా ఎండినా ధాన్యాన్ని కొనుగోలు చేయడం లేదు. అధికారులను అడిగితే మీ భూములు గౌరవెల్లి ప్రాజెక్టుకు ఇచ్చారు. ధరణి పోర్టల్తో పాటు పంటల సాగు వివరాలు ఆన్లైన్లో చూపడం లేదు. మీ పేరిట భూమి లేనందున కొనుగోలు చేయమని చెబుతుండటంతో దిక్కుతోచని స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు. ఏం చేయాలో తెలియక అయోమయానికి గురవుతున్నారు. ఇది చంద్రు ఒక్కడి సమస్యే కాదు. ప్రాజెక్టుకు భూమి ఇచ్చిన వందలాది మంది సమస్య.
- అక్కన్నపేట (హుస్నాబాద్ గ్రామీణం), న్యూస్టుడే
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అభివృద్ధికి భరోసా.. గెలుపునకు దిశానిర్దేశం
[ 27-04-2024]
మెదక్ జిల్లా పెద్దశంకరంపేటలో నిర్వహించిన కాంగ్రెస్ జనజాతర సభలో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి నారాయణఖేడ్ నియోజకవర్గ అభివృద్ధికి భరోసా కల్పించారు. రానున్న లోకసభ ఎన్నికల్లో జహీరాబాద్ ఎంపీగా సురేష్షెట్కార్ను లక్ష మెజారిటీతో గెలిపించేందుకు అనుసరించాల్సిన వ్యూహంపై కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. -
రెండో విడత ర్యాండమైజేషన్ పూర్తి
[ 27-04-2024]
లోక్సభ ఎన్నికల పోలింగ్ సిబ్బంది రెండో విడత ర్యాండమైజేషన్ పూర్తి చేసినట్లు ఎన్నికల రిటర్నింగ్ అధికారి రాహుల్ రాజ్ తెలిపారు. శుక్రవారం స్థానిక కలెక్టరేట్లో మెదక్ పార్లమెంట్ ఎన్నికల సాధారణ పరిశీలకులు సమీర్ మాధవ్ కుర్కోటి పర్యవేక్షణలో ఈ ప్రక్రియ నిర్వహించారు. -
‘రాజీనామాలతో కొత్త నాటకం’
[ 27-04-2024]
రాజీనామాల పేరుతో మాజీ మంత్రి హరీశ్రావు, ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి కొత్త నాటకానికి తెరలేపారని భాజపా ఎంపీ అభ్యర్థి రఘునందన్ రావు అన్నారు. ఇద్దరూ రాజీనామాలు చేసేవారు కాదు, పనిచేసే వారు కాదని విమర్శించారు. -
సగం కట్టి.. వదిలిపెట్టి
[ 27-04-2024]
నియోజకవర్గ, డివిజన్ కేంద్రమైన నర్సాపూర్ పురపాలికలో సమీకృత మార్కెట్ నిర్మాణ పనులు ఏడాదిగా అసంపూర్తిగా దర్శనమిస్తున్నాయి. ప్రజలకు కనీస మౌలిక వసతులు కల్పించడమే లక్ష్యంగా పురపాలికల్లో సమీకృత మార్కెట్ల నిర్మాణానికి గత ప్రభుత్వం పూనుకుంది. -
విధుల్లో నిర్లక్ష్యం తగదు
[ 27-04-2024]
విధుల నిర్వహణలో సిబ్బంది నిర్లక్ష్యం తగదని జిల్లా వైద్యాధికారి శ్రీరామ్ అన్నారు. శుక్రవారం ఆయన పెద్దశంకరంపేట పీహెచ్సీని సందర్శించారు. ఆస్పత్రి నిర్వహణ తీరు, ప్రసూతి వివరాలను పరిశీలించారు. -
విద్యార్థి అధ్యయనం.. విజ్ఞాన కౌశలం
[ 27-04-2024]
విద్యార్థిలో దాగిన విజ్ఞాన తృష్ణను వెలికితీసి.. నూతన ఆవిష్కరణలకు కళాశాల విద్యా శాఖ కృషి చేస్తోంది. వారి కృషి ఫలితంగా ఏటా నిర్వహిస్తున్న ‘జిజ్ఞాస’ పోటీల్లో పలువురు ప్రతిభ చాటుతున్నారు. -
పరిశీలిస్తారు.. నివేదిస్తారు..
[ 27-04-2024]
ప్రజాస్వామ్యంలో ఓటుకు ఉన్న ప్రాధాన్యం మనందరికీ తెలిసిందే. ఎవరికీ ఎక్కువ ఓట్లు పడితే వారే పాలకపక్షాలుగా గద్దెనెక్కవచ్చు. నిర్ణీత వ్యవధిలో నిర్వహించే ఎన్నికల ప్రక్రియ సాఫీగా సాగాలి. -
ఇంటింటికీ ఓటరు చీటీలు
[ 27-04-2024]
పార్లమెంట్ ఎన్నికల నిర్వహణకు అధికార యంత్రాంగం సర్వం సిద్ధం చేస్తోంది. స్వేచ్ఛాయుతంగా ఓటు వేసేందుకు సకల సౌకర్యాలు కల్పించిన ఎన్నికల సంఘం.. ఓటర్లకు పోల్ చీటీలు పంపిణీ చేస్తోంది. -
ఉల్లంఘనులకు ముకుతాడు
[ 27-04-2024]
లోక్సభ ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించేందుకు జిల్లా అధికారులు పక్కా ప్రణాళికతో ముందుకు సాగుతున్నారు. అభ్యర్థుల నామపత్రాల స్వీకరణ గడువు ముగిసింది. ప్రచారాలు ఊపందుకుంటున్నాయి. -
భారాస అక్రమాలు బయటపడుతున్నాయి
[ 27-04-2024]
బీసీ బిడ్డ నీలం మధుకు సీఎం రేవంత్రెడ్డి టిక్కెట్ ఇచ్చారని.. ఇక గెలిపించుకోవాలని మంత్రి కొండా సురేఖ కోరారు. సిద్దిపేటలో కాంగ్రెస్ ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ, పార్టీ కార్యాలయంలో సమావేశం శుక్రవారం జరిగాయి. -
రాజీనామా పత్రం రాసి పెట్టుకో హరీశ్రావు: పొన్నం
[ 27-04-2024]
వచ్చే ఆగస్టు 15 నాటికి తమ పార్టీ రైతులకు రూ.2 లక్షల రుణమాఫీ చేసి తీరుతుందని, మాజీ ఆర్థిక మంత్రి తన్నీరు హరీశ్రావు ముందుగానే స్పీకర్ ఫార్మాట్లో రాజీనామా పత్రం రాసి పెట్టుకోవాలని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్గౌడ్ అన్నారు. -
53 ఆమోదం.. ఒకటి తిరస్కరణ
[ 27-04-2024]
మెదక్ లోక్సభ స్థానానికి దాఖలైన నామినేషన్లలో ఒక అభ్యర్థి నామపత్రాన్ని రిటర్నింగ్ అధికారి తిరస్కరించారు. మొత్తం 54 మంది అభ్యర్థులు 90 సెట్ల నామినేషన్లు దాఖలు చేశారు.
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (27/04/24)
-
విరాట్ - హార్దిక్కు నో ఛాన్స్.. ఈ లఖ్నవూ స్టార్కు ప్లేస్: భారత మాజీ క్రికెటర్
-
ఏడాదికి ‘రెండు సార్లు’ సీబీఎస్ఈ బోర్డు పరీక్షలు.. 2025 నుంచే!
-
అనుపమ ‘పరదా’.. అదితి ఆన్డ్యూటీ.. భూమీ భలే డ్రెస్సు!
-
బిగ్ సేవింగ్ డేస్ సేల్కు సిద్ధమైన ఫ్లిప్కార్ట్.. ఎప్పటినుంచంటే?
-
‘పుష్ప’ కేశవ రోల్కు సుహాస్ని అనుకున్నాం.. కానీ!: సుకుమార్