జల వృద్ధికి జయహో..
నీటివనరుల పునరుద్ధరణకు కేంద్ర ప్రభుత్వం ‘అమృత్ సరోవర్’ పథకానికి శ్రీకారం చుట్టింది. తద్వారా భూగర్భ జలాల వృద్ధితోపాటు సాగు విస్తీర్ణం పెంచే లక్ష్యంగా ముందుకు సాగుతోంది. జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో కార్యాచరణ చేపట్టారు.
‘అమృత సరోవర్’ పథకం అమలు
న్యూస్టుడే, సంగారెడ్డి అర్బన్
హత్నూరలో పూడికతీత పనులు
నీటివనరుల పునరుద్ధరణకు కేంద్ర ప్రభుత్వం ‘అమృత్ సరోవర్’ పథకానికి శ్రీకారం చుట్టింది. తద్వారా భూగర్భ జలాల వృద్ధితోపాటు సాగు విస్తీర్ణం పెంచే లక్ష్యంగా ముందుకు సాగుతోంది. జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో కార్యాచరణ చేపట్టారు. ఉపాధి హామీ పథకం నిధుల ద్వారా జిల్లాలో ఇటీవల పనులు ప్రారంభించారు. ప్రభుత్వ స్థలాలు, అటవీ ప్రాంతంలోనూ చెరువులు అందుబాటులో లేని ప్రాంతాల్లో ఒకటిన్నర ఎకరంలో తవ్వించేందుకు ప్రణాళిక రూపొందించిన నేపథ్యంలో కథనం.
చెరువులు, కుంటల పూర్వవైభవానికి రాష్ట్ర ప్రభుత్వం ‘మిషన్ కాకతీయ’ నాలుగు విడతలుగా చేపట్టిన విషయం తెలిసిందే. అయితే చాలా ప్రాంతాల్లో వీటి నిర్వహణ కొరవడి అస్తవ్యస్తంగా మారాయి. పూడిక తీయక కొన్ని, ముళ్ల పొదలు నిండి మరికొన్ని ఆనవాళ్లు కోల్పోయాయి. దీనివ వల్ల నీరు నిలువ ఉండటంలేదు. అదే విధంగా భూగర్భ జలాలు అడుగంటుతున్నాయి. ఈ పరిస్థితిని గమనించి కేంద్ర ప్రభుత్వం ఈ పథకాన్ని అమలు చేస్తోంది. ఇందులో భాగంగా జిల్లా వ్యాప్తంగా 101 చెరువులను ఎంపిక చేశారు. వీటిల్లో పూడికతీత, కట్ట బలోపేతం, ముళ్ల పొదలు తొలగించడం వంటి పనులు కొనసాగుతున్నాయి. అవసరం ఉన్న చోట తూముల మరమ్మతులకు మెటిరీయల్ కాంపొనెంట్ కింద పంచాయతీలు, నీటిపారుదల శాఖ భరించాల్సి ఉంటుంది. గుర్తించిన వాటిల్లో 10వేల క్యూబిక్ మీటర్ల లోతు తవ్వాలని నిబంధనలు విధించింది. ఇటీవల హత్నూర, కొండాపూర్, న్యాల్కల్ మండలాల్లో పూడికతీత, కట్టల బలోపేతం పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. శిఖంలో తవ్విన మట్టిని కట్టకు పోస్తున్నారు. మిగిలి ఉంటే రైతులు తమ పొలాలకు తరలిస్తున్నారు. కూలీలకు ఒక్కో చెరువుకు 300 నుంచి 500 వరకు పని దినాలు కల్పించేలా లక్ష్యంగా చేయిస్తున్నారు.
ఈ ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి: హత్నూర, న్యాల్కల్, నారాయణఖేడ్, జహీరాబాద్, నాగల్గిద్ద, కంగ్టి ప్రాంతాలపై పథకంలో ప్రత్యేక దృష్టి సారించారు. చెరువులు, కుంటలు తక్కువగా ఉండటం వల్ల ఆయా మండలాల్లో రైతులు సాగునీటికి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. భూగర్భ జలాలు లోతుకు పడిపోతున్నాయి. ఈ పరిస్థితి నుంచి బయట పడేందుకు కొత్తగా చెరువులు, కుంటలను తవ్వనున్నారు. దీంతో అదనంగా ఆయకట్టు సాగు చేసే వీలుంటుంది. బోరుబావుల్లో నీటి సమస్య ఉండదు.
ఆగస్టు 15 నాటికి పూర్తి చేసేలా..
ఎంపిక చేసిన నీటి వనరుల పనులు వచ్చే ఆగస్టు 15 నాటికి పూర్తి చేయాలని కేంద్ర ప్రభుత్వం లక్ష్యం నిర్దేశించింది. . అదే రోజు గ్రామస్థుల సమక్షంలోనే పూర్తయిన చెరువు, కుంటలపై ఆగస్టు 15న జాతీయ జెండాను ఎగురవేయాలని ఆదేశాలు ఇచ్చినట్లుగా ఆశాఖ వర్గాలు ప్రకటించాయి.
కంది మండలం చిద్రుప్పల్లోని పెద్దచెరువు
విడతల వారీగా చేపడతాం: శ్రీనివాస్రావు, డీఆర్డీఓ, సంగారెడ్డి
వారం రోజుల నుంచి ఈ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తోంది. ఇప్పటికే చెరువులు, కుంటల బలోపేతానికి శ్రీకారం చుట్టాం. విడతల వారీగా పనులు చేపట్టి పూర్తి చేస్తాం. ఉపాధి హామీ కూలీల ద్వారా పూడికతీత పనులు ఇటీవల ప్రారంభించాం. భూగర్భ జలాలు పెంచడమే ప్రధానం లక్ష్యం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అభివృద్ధికి భరోసా.. గెలుపునకు దిశానిర్దేశం
[ 27-04-2024]
మెదక్ జిల్లా పెద్దశంకరంపేటలో నిర్వహించిన కాంగ్రెస్ జనజాతర సభలో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి నారాయణఖేడ్ నియోజకవర్గ అభివృద్ధికి భరోసా కల్పించారు. రానున్న లోకసభ ఎన్నికల్లో జహీరాబాద్ ఎంపీగా సురేష్షెట్కార్ను లక్ష మెజారిటీతో గెలిపించేందుకు అనుసరించాల్సిన వ్యూహంపై కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. -
రెండో విడత ర్యాండమైజేషన్ పూర్తి
[ 27-04-2024]
లోక్సభ ఎన్నికల పోలింగ్ సిబ్బంది రెండో విడత ర్యాండమైజేషన్ పూర్తి చేసినట్లు ఎన్నికల రిటర్నింగ్ అధికారి రాహుల్ రాజ్ తెలిపారు. శుక్రవారం స్థానిక కలెక్టరేట్లో మెదక్ పార్లమెంట్ ఎన్నికల సాధారణ పరిశీలకులు సమీర్ మాధవ్ కుర్కోటి పర్యవేక్షణలో ఈ ప్రక్రియ నిర్వహించారు. -
‘రాజీనామాలతో కొత్త నాటకం’
[ 27-04-2024]
రాజీనామాల పేరుతో మాజీ మంత్రి హరీశ్రావు, ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి కొత్త నాటకానికి తెరలేపారని భాజపా ఎంపీ అభ్యర్థి రఘునందన్ రావు అన్నారు. ఇద్దరూ రాజీనామాలు చేసేవారు కాదు, పనిచేసే వారు కాదని విమర్శించారు. -
సగం కట్టి.. వదిలిపెట్టి
[ 27-04-2024]
నియోజకవర్గ, డివిజన్ కేంద్రమైన నర్సాపూర్ పురపాలికలో సమీకృత మార్కెట్ నిర్మాణ పనులు ఏడాదిగా అసంపూర్తిగా దర్శనమిస్తున్నాయి. ప్రజలకు కనీస మౌలిక వసతులు కల్పించడమే లక్ష్యంగా పురపాలికల్లో సమీకృత మార్కెట్ల నిర్మాణానికి గత ప్రభుత్వం పూనుకుంది. -
విధుల్లో నిర్లక్ష్యం తగదు
[ 27-04-2024]
విధుల నిర్వహణలో సిబ్బంది నిర్లక్ష్యం తగదని జిల్లా వైద్యాధికారి శ్రీరామ్ అన్నారు. శుక్రవారం ఆయన పెద్దశంకరంపేట పీహెచ్సీని సందర్శించారు. ఆస్పత్రి నిర్వహణ తీరు, ప్రసూతి వివరాలను పరిశీలించారు. -
విద్యార్థి అధ్యయనం.. విజ్ఞాన కౌశలం
[ 27-04-2024]
విద్యార్థిలో దాగిన విజ్ఞాన తృష్ణను వెలికితీసి.. నూతన ఆవిష్కరణలకు కళాశాల విద్యా శాఖ కృషి చేస్తోంది. వారి కృషి ఫలితంగా ఏటా నిర్వహిస్తున్న ‘జిజ్ఞాస’ పోటీల్లో పలువురు ప్రతిభ చాటుతున్నారు. -
పరిశీలిస్తారు.. నివేదిస్తారు..
[ 27-04-2024]
ప్రజాస్వామ్యంలో ఓటుకు ఉన్న ప్రాధాన్యం మనందరికీ తెలిసిందే. ఎవరికీ ఎక్కువ ఓట్లు పడితే వారే పాలకపక్షాలుగా గద్దెనెక్కవచ్చు. నిర్ణీత వ్యవధిలో నిర్వహించే ఎన్నికల ప్రక్రియ సాఫీగా సాగాలి. -
ఇంటింటికీ ఓటరు చీటీలు
[ 27-04-2024]
పార్లమెంట్ ఎన్నికల నిర్వహణకు అధికార యంత్రాంగం సర్వం సిద్ధం చేస్తోంది. స్వేచ్ఛాయుతంగా ఓటు వేసేందుకు సకల సౌకర్యాలు కల్పించిన ఎన్నికల సంఘం.. ఓటర్లకు పోల్ చీటీలు పంపిణీ చేస్తోంది. -
ఉల్లంఘనులకు ముకుతాడు
[ 27-04-2024]
లోక్సభ ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించేందుకు జిల్లా అధికారులు పక్కా ప్రణాళికతో ముందుకు సాగుతున్నారు. అభ్యర్థుల నామపత్రాల స్వీకరణ గడువు ముగిసింది. ప్రచారాలు ఊపందుకుంటున్నాయి. -
భారాస అక్రమాలు బయటపడుతున్నాయి
[ 27-04-2024]
బీసీ బిడ్డ నీలం మధుకు సీఎం రేవంత్రెడ్డి టిక్కెట్ ఇచ్చారని.. ఇక గెలిపించుకోవాలని మంత్రి కొండా సురేఖ కోరారు. సిద్దిపేటలో కాంగ్రెస్ ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ, పార్టీ కార్యాలయంలో సమావేశం శుక్రవారం జరిగాయి. -
రాజీనామా పత్రం రాసి పెట్టుకో హరీశ్రావు: పొన్నం
[ 27-04-2024]
వచ్చే ఆగస్టు 15 నాటికి తమ పార్టీ రైతులకు రూ.2 లక్షల రుణమాఫీ చేసి తీరుతుందని, మాజీ ఆర్థిక మంత్రి తన్నీరు హరీశ్రావు ముందుగానే స్పీకర్ ఫార్మాట్లో రాజీనామా పత్రం రాసి పెట్టుకోవాలని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్గౌడ్ అన్నారు. -
53 ఆమోదం.. ఒకటి తిరస్కరణ
[ 27-04-2024]
మెదక్ లోక్సభ స్థానానికి దాఖలైన నామినేషన్లలో ఒక అభ్యర్థి నామపత్రాన్ని రిటర్నింగ్ అధికారి తిరస్కరించారు. మొత్తం 54 మంది అభ్యర్థులు 90 సెట్ల నామినేషన్లు దాఖలు చేశారు.
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (27/04/24)
-
విరాట్ - హార్దిక్కు నో ఛాన్స్.. ఈ లఖ్నవూ స్టార్కు ప్లేస్: భారత మాజీ క్రికెటర్
-
ఏడాదికి ‘రెండు సార్లు’ సీబీఎస్ఈ బోర్డు పరీక్షలు.. 2025 నుంచే!
-
అనుపమ ‘పరదా’.. అదితి ఆన్డ్యూటీ.. భూమీ భలే డ్రెస్సు!
-
బిగ్ సేవింగ్ డేస్ సేల్కు సిద్ధమైన ఫ్లిప్కార్ట్.. ఎప్పటినుంచంటే?
-
‘పుష్ప’ కేశవ రోల్కు సుహాస్ని అనుకున్నాం.. కానీ!: సుకుమార్