బాలికలకు భరోసా
ప్రస్తుత సమాజంలో బాలికలు, యువతులు, అభం శుభం తెలియని చిన్నారులపై అఘాయిత్యాలు పెరిగిపోతున్నాయి. వీటికి పాల్పడే వారిపై ఫిర్యాదుకు వెనుకాడుతుండటంతో బాధితులకు సరైన న్యాయం జరగడంలేదు. చట్టాలు ఎన్ని ఉన్నా.. ఆశించిన
వేధింపులపై ఫిర్యాదుకు ప్రత్యేక యాప్
న్యూస్టుడే, వికారాబాద్
జాతీయ బాలల సంరక్షణ యాప్
ప్రస్తుత సమాజంలో బాలికలు, యువతులు, అభం శుభం తెలియని చిన్నారులపై అఘాయిత్యాలు పెరిగిపోతున్నాయి. వీటికి పాల్పడే వారిపై ఫిర్యాదుకు వెనుకాడుతుండటంతో బాధితులకు సరైన న్యాయం జరగడంలేదు. చట్టాలు ఎన్ని ఉన్నా.. ఆశించిన మార్పు రావడం లేదు. చాలా మంది నేరం చేసిన వారికి భయపడి ఫిర్యాదులు చేయడం లేదు. మరి కొందరు తమ పరువు పోతుందని మిన్నకుంటున్నారు. ఇంకొందరు ధైర్యంగా ముందుకు వచ్చి ఫిర్యాదు చేసినా వేధింపులకు గురవుతున్నారు. దీంతో చాలా మంది బాధితులకు న్యాయం జరగడం లేదు. ఈ నేపథ్యంలో ఇటు వంటి వారికి అడ్డుకట్ట వేసేందుకు నేరగాళ్లను శిక్షించడంతో పాటు, ఫిర్యాదు చేసిన వారి వివరాలు గోప్యంగా ఉంచేందుకు ప్రత్యేక యాప్ను రూపొందించింది. దీనిని వినియోగించి చేసిన ఫిర్యాదుకు కఠిన చర్యలు తీసుకుంటారు.
ఇదీ విధానం...
గూగుల్ ప్లేస్టోర్లో పీఓసీఎస్ఓ ఈబీఓఎక్స్ (ఫొక్సో ఈబాక్స్) అని టైప్ చేస్తే యాప్ కనిపిస్తుంది. దీన్ని ఇన్స్టాల్ చేసుకొని తెరవాలి. లేదా డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ.ఎన్సీపీసీఆర్.జీవోవీ.ఇన్ అనే వెబ్సైట్లోనూ ఫిర్యాదు చేయొచ్చు. యాప్ తెరవగానే వృత్తంలో పోక్సో ఈబాక్స్ అని వృత్తాకారంలో కనిపిస్తుంది. ఫిర్యాదు చేయాలంటే దాన్ని క్లిక్ చేయాలి. సాధారణంగా చిన్నారులకు ఎదురయ్యే ఆరు రకాల హింసలకు సంబంధించిన చిత్రాలు కనిపిస్తాయి. చిన్నారులపై జరిగిన అఘాయిత్యం, జరిగేందుకు ఆస్కారమున్న ఆరు ప్రాంతాలు ఆట స్థలం, దుకాణం, రహదారి మీద, పాఠశాల లేదా పాఠశాలకు వాహనాల్లో వెళ్లేటప్పుడు, బహిరంగ ప్రదేశాల్లో బాలికలతో అనుచిత ప్రవర్తన, శరీర భాగాలను చిత్రీకరించడం వంటి వాటిని చిత్రాల రూపంలో పెట్టారు. హింస స్వభావాన్ని గమనించి ఆ చిత్రంపై క్లిక్ చేయాలి. అనంతరం ఫిర్యాదు పత్రంలో బాధితుల వివరాలు, జరిగిన సంఘటనకు సంబంధించిన వివరాలను పత్రంలో పొందుపర్చి సబ్మిట్ కొట్టాలి.
దిల్లీ కేంద్రంగా చర్యలు..
కేంద్ర ప్రభుత్వం బాలికలకు భరోసాను కల్పించేందుకు దేశ రాజధాని కేంద్రంగా చర్యలు ప్రారంభించింది. బాధితులు చేసిన ఫిర్యాదులను దిల్లీలో కేంద్ర ప్రత్యేక బృందం పర్యవేక్షణలో కొనసాగుతాయి. ఈ యాప్ ద్వారా వచ్చిన ఫిర్యాదులను సంబంధిత అధికారులు స్త్రీ, శిశు సంక్షేమాధికారి రాష్ట్ర కార్యాలయానికి, జిల్లా కేంద్రానికి సమాచారమిస్తారు. బాలల సంరక్షణ అధికార సిబ్బంది కూడా సహకరించి వెంటనే విచారణ చేపడతారు. క్షేత్రస్థాయిలో విచారణ జరిపే అధికారులకు ఫిర్యాదు ఎవరు చేశారన్న సమాచారం కూడా తెలియదు. దీంతో వంద శాతం పారదర్శకతతో విచారణ జరిపి పోలీసుల సహకారంతో కేసును నమోదు చేస్తారు. ఎప్పటికప్పుడు విచారణ కేసుకు సంబంధించిన పురోగతి వివరాలను పంపించాల్సి ఉంటుంది. ఫిర్యాదుదారులకు రక్షణ, నేరానికి పాల్పడిన వారికి శిక్ష పడేలా యంత్రాంగం తోడ్పాటునిస్తుంది. దీంతో బాధితులకు న్యాయం జరుగుతుంది.
ప్రతి ఒక్కరూ అవగాహన పెంచుకోవాలి
- ప్రమీల, సీఐ, మహిళా పోలీస్ఠాణా, వికారాబాద్
కేంద్ర ప్రభుత్వం అందుబాటులోకి తీసుకువచ్చిన యాప్తో నేరాలకు అడ్డుకట్ట వేయవచ్చు. యాప్పై ప్రతి ఒక్కరూ అవగాహన పెంచుకోవాలి. దేశ పౌరులుగా జరుగుతున్న అన్యాయాలను వెంటనే చిత్రీకరించి యాప్ ద్వారా అప్లోడ్ చేసి బాధితులకు న్యాయం చేసేలా చొరవ తీసుకోవాలి. ప్రభుత్వం యాప్ ద్వారా వచ్చిన ఫిర్యాదులను పోలీసుశాఖకు వివరాలను పంపుతుంది. వీటి ఆధారంగా కేసులను నమోదు చేసి నిందితుల ఆటకట్టిస్తాం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అభివృద్ధికి భరోసా.. గెలుపునకు దిశానిర్దేశం
[ 27-04-2024]
మెదక్ జిల్లా పెద్దశంకరంపేటలో నిర్వహించిన కాంగ్రెస్ జనజాతర సభలో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి నారాయణఖేడ్ నియోజకవర్గ అభివృద్ధికి భరోసా కల్పించారు. రానున్న లోకసభ ఎన్నికల్లో జహీరాబాద్ ఎంపీగా సురేష్షెట్కార్ను లక్ష మెజారిటీతో గెలిపించేందుకు అనుసరించాల్సిన వ్యూహంపై కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. -
రెండో విడత ర్యాండమైజేషన్ పూర్తి
[ 27-04-2024]
లోక్సభ ఎన్నికల పోలింగ్ సిబ్బంది రెండో విడత ర్యాండమైజేషన్ పూర్తి చేసినట్లు ఎన్నికల రిటర్నింగ్ అధికారి రాహుల్ రాజ్ తెలిపారు. శుక్రవారం స్థానిక కలెక్టరేట్లో మెదక్ పార్లమెంట్ ఎన్నికల సాధారణ పరిశీలకులు సమీర్ మాధవ్ కుర్కోటి పర్యవేక్షణలో ఈ ప్రక్రియ నిర్వహించారు. -
‘రాజీనామాలతో కొత్త నాటకం’
[ 27-04-2024]
రాజీనామాల పేరుతో మాజీ మంత్రి హరీశ్రావు, ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి కొత్త నాటకానికి తెరలేపారని భాజపా ఎంపీ అభ్యర్థి రఘునందన్ రావు అన్నారు. ఇద్దరూ రాజీనామాలు చేసేవారు కాదు, పనిచేసే వారు కాదని విమర్శించారు. -
సగం కట్టి.. వదిలిపెట్టి
[ 27-04-2024]
నియోజకవర్గ, డివిజన్ కేంద్రమైన నర్సాపూర్ పురపాలికలో సమీకృత మార్కెట్ నిర్మాణ పనులు ఏడాదిగా అసంపూర్తిగా దర్శనమిస్తున్నాయి. ప్రజలకు కనీస మౌలిక వసతులు కల్పించడమే లక్ష్యంగా పురపాలికల్లో సమీకృత మార్కెట్ల నిర్మాణానికి గత ప్రభుత్వం పూనుకుంది. -
విధుల్లో నిర్లక్ష్యం తగదు
[ 27-04-2024]
విధుల నిర్వహణలో సిబ్బంది నిర్లక్ష్యం తగదని జిల్లా వైద్యాధికారి శ్రీరామ్ అన్నారు. శుక్రవారం ఆయన పెద్దశంకరంపేట పీహెచ్సీని సందర్శించారు. ఆస్పత్రి నిర్వహణ తీరు, ప్రసూతి వివరాలను పరిశీలించారు. -
విద్యార్థి అధ్యయనం.. విజ్ఞాన కౌశలం
[ 27-04-2024]
విద్యార్థిలో దాగిన విజ్ఞాన తృష్ణను వెలికితీసి.. నూతన ఆవిష్కరణలకు కళాశాల విద్యా శాఖ కృషి చేస్తోంది. వారి కృషి ఫలితంగా ఏటా నిర్వహిస్తున్న ‘జిజ్ఞాస’ పోటీల్లో పలువురు ప్రతిభ చాటుతున్నారు. -
పరిశీలిస్తారు.. నివేదిస్తారు..
[ 27-04-2024]
ప్రజాస్వామ్యంలో ఓటుకు ఉన్న ప్రాధాన్యం మనందరికీ తెలిసిందే. ఎవరికీ ఎక్కువ ఓట్లు పడితే వారే పాలకపక్షాలుగా గద్దెనెక్కవచ్చు. నిర్ణీత వ్యవధిలో నిర్వహించే ఎన్నికల ప్రక్రియ సాఫీగా సాగాలి. -
ఇంటింటికీ ఓటరు చీటీలు
[ 27-04-2024]
పార్లమెంట్ ఎన్నికల నిర్వహణకు అధికార యంత్రాంగం సర్వం సిద్ధం చేస్తోంది. స్వేచ్ఛాయుతంగా ఓటు వేసేందుకు సకల సౌకర్యాలు కల్పించిన ఎన్నికల సంఘం.. ఓటర్లకు పోల్ చీటీలు పంపిణీ చేస్తోంది. -
ఉల్లంఘనులకు ముకుతాడు
[ 27-04-2024]
లోక్సభ ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించేందుకు జిల్లా అధికారులు పక్కా ప్రణాళికతో ముందుకు సాగుతున్నారు. అభ్యర్థుల నామపత్రాల స్వీకరణ గడువు ముగిసింది. ప్రచారాలు ఊపందుకుంటున్నాయి. -
భారాస అక్రమాలు బయటపడుతున్నాయి
[ 27-04-2024]
బీసీ బిడ్డ నీలం మధుకు సీఎం రేవంత్రెడ్డి టిక్కెట్ ఇచ్చారని.. ఇక గెలిపించుకోవాలని మంత్రి కొండా సురేఖ కోరారు. సిద్దిపేటలో కాంగ్రెస్ ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ, పార్టీ కార్యాలయంలో సమావేశం శుక్రవారం జరిగాయి. -
రాజీనామా పత్రం రాసి పెట్టుకో హరీశ్రావు: పొన్నం
[ 27-04-2024]
వచ్చే ఆగస్టు 15 నాటికి తమ పార్టీ రైతులకు రూ.2 లక్షల రుణమాఫీ చేసి తీరుతుందని, మాజీ ఆర్థిక మంత్రి తన్నీరు హరీశ్రావు ముందుగానే స్పీకర్ ఫార్మాట్లో రాజీనామా పత్రం రాసి పెట్టుకోవాలని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్గౌడ్ అన్నారు. -
53 ఆమోదం.. ఒకటి తిరస్కరణ
[ 27-04-2024]
మెదక్ లోక్సభ స్థానానికి దాఖలైన నామినేషన్లలో ఒక అభ్యర్థి నామపత్రాన్ని రిటర్నింగ్ అధికారి తిరస్కరించారు. మొత్తం 54 మంది అభ్యర్థులు 90 సెట్ల నామినేషన్లు దాఖలు చేశారు.
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (27/04/24)
-
విరాట్ - హార్దిక్కు నో ఛాన్స్.. ఈ లఖ్నవూ స్టార్కు ప్లేస్: భారత మాజీ క్రికెటర్
-
ఏడాదికి ‘రెండు సార్లు’ సీబీఎస్ఈ బోర్డు పరీక్షలు.. 2025 నుంచే!
-
అనుపమ ‘పరదా’.. అదితి ఆన్డ్యూటీ.. భూమీ భలే డ్రెస్సు!
-
బిగ్ సేవింగ్ డేస్ సేల్కు సిద్ధమైన ఫ్లిప్కార్ట్.. ఎప్పటినుంచంటే?
-
‘పుష్ప’ కేశవ రోల్కు సుహాస్ని అనుకున్నాం.. కానీ!: సుకుమార్