ఆసరా ఆశలు
ఆసరా పథకం ద్వారా అందిస్తున్న పింఛను అభాగ్యుల పాలిట వరంలా మారింది. ఎక్కువ మందికి సాయం అందించాలన్న ఉద్దేశంతో ఆసరా పింఛనుకు అర్హత వయస్సును కుదిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే.
జిల్లాలో 29,695 దరఖాస్తులు
న్యూస్టుడే, సంగారెడ్డి టౌన్
ఆసరా పథకం ద్వారా అందిస్తున్న పింఛను అభాగ్యుల పాలిట వరంలా మారింది. ఎక్కువ మందికి సాయం అందించాలన్న ఉద్దేశంతో ఆసరా పింఛనుకు అర్హత వయస్సును కుదిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఇందుకోసం అర్హులైన వారి నుంచి మీ సేవా కేంద్రాల ద్వారా దరఖాస్తులు సైతం స్వీకరించారు. తమకు ఎప్పుడు మంజూరు చేస్తారోనని అర్హులు ఎదురుచూస్తున్నారు. ముఖ్యమంత్రి తాజాగా చేసిన ప్రకటనతో వారి నిరీక్షణ త్వరలో ఫలించనున్న నేపథ్యంలో కథనం.
జహీరాబాద్ మండలంలో అత్యధికం
యాభై ఏడు ఏళ్లకు పైబడిన వారు ఆసరా పింఛనుకు జిల్లా నుంచి 29,695 మంది దరఖాస్తు చేసుకున్నారు. అత్యధికంగా జహీరాబాద్ మండలానికి చెందిన 2,544 మంది దరఖాస్తు చేసుకోగా.. అత్యల్పంగా చౌటకూరు మండలం నుంచి 418 దరఖాస్తులు వచ్చాయి. దరఖాస్తుల పరిశీలన తర్వాతే అర్హులను ఎంపిక చేయనున్నారు. ప్రభుత్వం నుంచి మార్గదర్శకాలు అందితేనే అధికారులు ఎంపిక ప్రక్రియ చేపట్టేందుకు వీలుంటుంది.
ఎంపికైతే.. నెలకు రూ.2,016
ఆసరా పథకం కింద ప్రతినెలా పింఛను పొందుతున్న లబ్ధిదారులు జిల్లాలో 1.32 లక్షల మంది ఉన్నారు. దివ్యాంగులకు నెలకు రూ.3,016 చెల్లిస్తుండగా మిగతా వారికి రూ.2,016 చొప్పున అందజేస్తున్నారు. ఇలా ప్రతినెలా రూ.30కోట్లకు పైగా జిల్లాకు విడుదల అవుతోంది. 57ఏళ్ల వయస్సు పైబడిన వారికీ పింఛను మంజూరు కానుండటంతో లబ్ధిదారుల సంఖ్య మరింత పెరగనుంది. ఎంపికైన వారికి నెలకు రూ.2,016 చొప్పున అందనుంది.
పెండింగ్ అర్జీలకూ మోక్షం
జిల్లాలో 57-64ఏళ్ల వారితో పాటు సాధారణ పించన్లకు సంబంధించిన దరఖాస్తులు 14,421 పెండింగ్లో ఉన్నాయి. ఇందులో వృద్ధులు, వితంతు, ఒంటిరి మహిళలు ఎక్కువ మంది ఉన్నారు. సదరం ధ్రువపత్రాలు పొందిన వారిలో అర్హులైన దివ్యాంగులకు పింఛను కోసం ఎదురు చూస్తున్నారు. వీరితో పాటు గతంలో అనర్హుల పేరుతో పింఛన్లు రద్దయినవారిలో అర్హులను గుర్తించి పునరుద్ధరణకు ప్రతిపాదనలు పంపారు. 624 మంది పింఛన్లు పునరుద్ధరణకు 8 నెలల కిందట ప్రతిపాదనలు పంపగా ఇప్పటి వరకు మంజూరు చేయకపోడం గమనార్హం. తమకు కూడా 64ఏళ్లలోపు వారితో పాటే పింఛను మంజూరు చేయాలని ఆయా కేటగిరీవారు కోరుతున్నారు.
ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం..: రంగాచార్యులు, ఏపీవో, పింఛన్లు
57-64 ఏళ్ల వయస్సు వారి నుంచి పింఛన్ల మంజూరుపై ప్రభుత్వం నుంచి మార్గదర్శకాలు అందాల్సి ఉంది. ఆ తర్వాత ద]రఖాస్తులు పరిశీలించి అర్హుల ఎంపిక ప్రక్రియను చేపడతాం. అర్హులందరికీ ఆసరా పింఛను అందేలా చూస్తాం. సాధారణ పింఛన్ల దరఖాస్తులు, రద్దయిన వాటిలో అర్హుల పింఛన్ల పునరుద్ధణపై ప్రభుత్వం ఆదేశాలుకు అనుగుణంగా ముందుకు సాగుతాం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అమితానందం.. షా ఆగమనం
[ 26-04-2024]
భాజపా అగ్రనేత, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్షా ఆగమనంతో సిద్దిపేట కమలనాథుల్లో నూతనోత్సాహం వెల్లివిరిసింది. లోక్సభ ఎన్నికల వేళ కాషాయ దళంలో నయాజోష్ కనిపించింది. -
కనుల ముందుకు కలల లోకం
[ 26-04-2024]
ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న వేసవి సెలవులు రానే వచ్చాయి.. వస్తూ వస్తూ ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీలో వినోదాల వేడుకలను తీసుకువచ్చాయి. -
మెతుకుసీమ గులాబీ జెండా అడ్డా...
[ 26-04-2024]
మెతుకుసీమ గులాబీ జెండాకు అడ్డా అని... ఈ ఎన్నికల్లోనూ మరోసారి జెండా ఎగరవేస్తామని మాజీ మంత్రి తన్నీరు హరీశ్రావు ధీమా వ్యక్తం చేశారు. -
వెల్లువెత్తిన నామపత్రాలు
[ 26-04-2024]
మెదక్ లోక్సభ స్థానానికి వెల్లువలా నామపత్రాలు దాఖలయ్యాయి. మొత్తం 54 మంది అభ్యర్థులు 90 సెట్ల నామినేషన్లు సమర్పించారు. -
బీసీ బిడ్డను ఆశీర్వదించండి
[ 26-04-2024]
అన్ని వర్గాలను కలుపు కొనిపోయే బీసీ బిడ్డగా తనను ఆశీర్వదించాలని మెదక్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి నీలం మధు కోరారు. గురువారం కౌడిపల్లి, కంచన్పల్లి, పాంపల్లి, వెల్దుర్తి, మాసాయిపేటలో రోడ్డుషో, సభ నిర్వహించారు. -
ఫలితం లేదు..
[ 26-04-2024]
జిల్లాలో ఇంటర్మీడియట్ ఫలితాలు కొంతమేర ఊరటనిచ్చినప్పటికీ ఆశించిన స్థాయిలో రాలేదు. గత నాలుగేళ్ల నుంచి ఫలితాల్లో జిల్లా చివరి స్థానంలో నిలుస్తుండగా.. -
నిఘా నీడ.. పక్కా పర్యవేక్షణ
[ 26-04-2024]
సార్వత్రిక సమరంలో ప్రవర్తనా నియమావళిని పకడ్బందీగా అమలు చేసేందుకు కేంద్ర ఎన్నికల సంఘం నిఘా వ్యవస్థను పటిష్ఠం చేసింది. -
పంచాయతీ నుంచి లోక్సభకు..
[ 26-04-2024]
ఎం.బాగారెడ్డి.. మెతుకుసీమ రాజకీయాల్లో చెరగని ముద్ర వేశారు. నాలుగున్నర దశాబ్దాల పాటు సుదీర్ఘ రాజకీయ ప్రస్థానంలో అపజయం ఎరుగని నాయకుడిగా గుర్తింపు పొందారు. -
ఈతకు వెళ్లి బాలుడి మృత్యువాత
[ 26-04-2024]
ఈత కొట్టేందుకు చెరువులోకి దిగిన బాలుడు మృతి చెందిన సంఘటన సిద్దిపేట జిల్లా దౌల్తాబాద్ మండలం కోనాయిపల్లిలో జరిగింది. -
జహీరాబాద్కు 69.. మెదక్కు 90
[ 26-04-2024]
లోక్సభ ఎన్నికల ప్రక్రియలో భాగంగా నామపత్రాల స్వీకరణ ఘట్టం గురువారంతో ముగిసింది. జహీరాబాద్ పార్లమెంట్ స్థానానికి 40 మంది అభ్యర్థులు 69 నామినేషన్లు దాఖలు చేశారు. -
రోడ్షోలు.. సభలు
[ 26-04-2024]
లోక్సభ ఎన్నికల ప్రచారం ఊపందుకుంది. ప్రధాన పార్టీల అభ్యర్థులు కోలాహలం మధ్య నామినేషన్లు సమర్పించారు. -
నాయకుల ఉత్సాహం.. వలసలకు ప్రోత్సాహం
[ 26-04-2024]
ఎన్నికల్లో పైచేయి సాధించాలని ప్రధాన పార్టీలు చేరికలపై దృష్టి పెట్టాయి. ప్రజల్లో పరపతి ఉన్న నియోజకవర్గం, మండల స్థాయి నేతలపై ప్రత్యేకంగా ఫోకస్ చేస్తున్నారు. -
ప్రైవేటు రుణాలతో ఆర్థిక ఇబ్బందులు
[ 26-04-2024]
హుస్నాబాద్ ప్రాంతంలో ప్రైవేటుగా సూక్ష్మ రుణాలు (మైక్రో ఫైనాన్స్) మళ్లీ మొదలయ్యాయి. పేదల అవసరాలను ఆసరా చేసుకుని రుణాలు ఇస్తూ ఇబ్బందులకు గురి చేస్తున్నారు. -
సామాజిక మాధ్యమంలో బయటపడిన వరుడి గుట్టు.. ఒకరోజు ముందు ఆగిన పెళ్లి
[ 26-04-2024]
పెళ్లి నిశ్చయమైన యువకుడికి మరో మహిళతో సంబంధం ఉందని తెలుసుకున్న వధువు బంధువులు పెళ్లికి ఒకరోజు ముందు వరుడిని నిలదీసిన ఘటన శివ్వంపేట మండలంలోని ఓ గ్రామంలో చోటుచేసుకుంది.
తాజా వార్తలు (Latest News)
-
100% వీవీప్యాట్ స్లిప్ల లెక్కింపు కుదరదు: పిటిషన్లు కొట్టేసిన సుప్రీం
-
17 వేల ఐసీఐసీఐ క్రెడిట్ కార్డులు బ్లాక్.. కారణమిదే!
-
అప్పుడు పరుగులు చేసింది కోహ్లీ ఒక్కడే: డుప్లెసిస్
-
శ్రీశైలంలో వైభవంగా భ్రమరాంబాదేవి కుంభోత్సవం
-
పెళ్లి గౌనును రీమోడల్ చేయించిన సమంత.. ఫొటోలు వైరల్
-
బొగ్గు ఓడను విశాఖ పోర్టుకు మళ్లించండి.. అదానీ గంగవరం పోర్టు యాజమాన్యానికి హైకోర్టు ఆదేశం