గర్భిణులకు వరం తప్పనున్న ఆర్థికభారం
సర్కారు దవాఖానాల్లో వైద్య సేవలు మెరుగవుతున్నాయి. కేసీఆర్ కిట్ పథకం అమలుతో ప్రభుత్వ ఆసుపత్రుల్లోనే ప్రసవాలు చేసుకునేందుకు మొగ్గు చూపుతున్నారు.
ఎంసీహెచ్కు టిఫా స్కానింగ్ యంత్రం
న్యూస్టుడే-మెదక్: సర్కారు దవాఖానాల్లో వైద్య సేవలు మెరుగవుతున్నాయి. కేసీఆర్ కిట్ పథకం అమలుతో ప్రభుత్వ ఆసుపత్రుల్లోనే ప్రసవాలు చేసుకునేందుకు మొగ్గు చూపుతున్నారు. అత్యాధునిక సౌకర్యాలు కల్పిస్తుండటంతో వాటి సంఖ్య పెరుగుతోంది. గర్భిణులు కడుపులో ఉన్న బిడ్డ కదలికలు తెలుసుకోవడానికి ఆతృత పడుతుంటారు. కాగా నిరుపేదలు స్కానింగ్ చేయించుకునేందుకు ఆర్థికభారం ఆటంకంగా మారుతోంది. ఈ క్రమంలో ప్రభుత్వం తాజాగా ప్రభుత్వాసుపత్రుల్లో గర్భిణులకు అవసరమైన టిఫా స్కానింగ్ యంత్రాలను అందుబాటులోకి తీసుకొచ్చింది. జిల్లాలో మెదక్లోని మాతా శిశుసంరక్షణ కేంద్రం(ఎంసీహెచ్)కు కేటాయించారు. ఈ మేరకు శనివారం వైద్య ఆరోగ్యశాఖ మంత్రి హరీష్రావు వర్చువల్ పద్ధతిలో సేవలను ప్రారంభించారు.
టిఫా యంత్రం
పేదలకు మరింత ప్రయోజనం
ప్రస్తుతం మారుతున్న ఆహార అలవాట్లలో భాగంగా ప్రతి గర్భిణికి టిఫా స్కానింగ్ అనేది అతి ముఖ్యమైనది. గర్భం దాల్చిన 18 నుంచి 22 వారాల మధ్య తప్పనిసరిగా ఈ స్కానింగ్ చేయించాలి. తల్లీబిడ్డల సంరక్షణ గురించి అతి ముఖ్యమైన విషయాలు తెలుస్తాయి. ఆయా ఆసుపత్రుల్లో టిఫా స్కానింగ్ యంత్రం లేకపోవడంతో బయట చేయించేవారు. ఒక్కో స్కానింగ్కు కనీసం రూ.2వేలకు వెచ్చించాల్సి రావడంతో ఆర్థికభారం పడుతోంది. దీనిని దృష్టిలో ఉంచుకొని రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ ఆసుపత్రులకు టిఫా యంత్రాలను కేటాయించింది. రాష్ట్ర వ్యాప్తంగా మంజూరు చేసిన ఈ స్కానింగ్ యంత్రాన్ని జిల్లా కేంద్రం మెదక్లోని ఎంసీహెచ్ ఆసుపత్రికి ఇటీవల వచ్చింది. దీంతో ఆర్థికభారం తగ్గడంతో పాటు సమయం ఆదా అవుతుంది. ఈ సేవలతో పేదలకు మరింత ప్రయోజనం చేకూరుతుంది.
తల్లీబిడ్డల సంరక్షణపై..
టీఫా స్కానింగ్ యంత్రంతో గర్భస్థ దశలోని శిశువు అవయవాల ఎదుగుదల, లోపాలను గుర్తించవచ్చని ప్రభుత్వ ఆసుపత్రుల జిల్లా సమన్వయకర్త పి.చంద్రశేఖర్ అన్నారు. నేటినుంచి సేవలు అందుబాటులోకి వస్తాయని తెలిపారు. ఈ స్కానింగ్ చేయడానికి 20 నిమిషాల సమయం పడుతుంది. లోపల శిశువు అవయవాలన్నీ ఒక్కొక్కటిగా పరిశీలించి, పరీక్షించి వైద్యుడు నివేదిక ఇస్తారు. పుట్టే బిడ్డలో అంగవైకల్యం తదితర లోపాలు బయటపడతాయి. స్కానింగ్లో కనిపించిన సమస్య చిన్నదైతే దానిని తగ్గించడానికి కృషి చేస్తారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అభివృద్ధికి భరోసా.. గెలుపునకు దిశానిర్దేశం
[ 27-04-2024]
మెదక్ జిల్లా పెద్దశంకరంపేటలో నిర్వహించిన కాంగ్రెస్ జనజాతర సభలో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి నారాయణఖేడ్ నియోజకవర్గ అభివృద్ధికి భరోసా కల్పించారు. రానున్న లోకసభ ఎన్నికల్లో జహీరాబాద్ ఎంపీగా సురేష్షెట్కార్ను లక్ష మెజారిటీతో గెలిపించేందుకు అనుసరించాల్సిన వ్యూహంపై కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. -
రెండో విడత ర్యాండమైజేషన్ పూర్తి
[ 27-04-2024]
లోక్సభ ఎన్నికల పోలింగ్ సిబ్బంది రెండో విడత ర్యాండమైజేషన్ పూర్తి చేసినట్లు ఎన్నికల రిటర్నింగ్ అధికారి రాహుల్ రాజ్ తెలిపారు. శుక్రవారం స్థానిక కలెక్టరేట్లో మెదక్ పార్లమెంట్ ఎన్నికల సాధారణ పరిశీలకులు సమీర్ మాధవ్ కుర్కోటి పర్యవేక్షణలో ఈ ప్రక్రియ నిర్వహించారు. -
‘రాజీనామాలతో కొత్త నాటకం’
[ 27-04-2024]
రాజీనామాల పేరుతో మాజీ మంత్రి హరీశ్రావు, ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి కొత్త నాటకానికి తెరలేపారని భాజపా ఎంపీ అభ్యర్థి రఘునందన్ రావు అన్నారు. ఇద్దరూ రాజీనామాలు చేసేవారు కాదు, పనిచేసే వారు కాదని విమర్శించారు. -
సగం కట్టి.. వదిలిపెట్టి
[ 27-04-2024]
నియోజకవర్గ, డివిజన్ కేంద్రమైన నర్సాపూర్ పురపాలికలో సమీకృత మార్కెట్ నిర్మాణ పనులు ఏడాదిగా అసంపూర్తిగా దర్శనమిస్తున్నాయి. ప్రజలకు కనీస మౌలిక వసతులు కల్పించడమే లక్ష్యంగా పురపాలికల్లో సమీకృత మార్కెట్ల నిర్మాణానికి గత ప్రభుత్వం పూనుకుంది. -
విధుల్లో నిర్లక్ష్యం తగదు
[ 27-04-2024]
విధుల నిర్వహణలో సిబ్బంది నిర్లక్ష్యం తగదని జిల్లా వైద్యాధికారి శ్రీరామ్ అన్నారు. శుక్రవారం ఆయన పెద్దశంకరంపేట పీహెచ్సీని సందర్శించారు. ఆస్పత్రి నిర్వహణ తీరు, ప్రసూతి వివరాలను పరిశీలించారు. -
విద్యార్థి అధ్యయనం.. విజ్ఞాన కౌశలం
[ 27-04-2024]
విద్యార్థిలో దాగిన విజ్ఞాన తృష్ణను వెలికితీసి.. నూతన ఆవిష్కరణలకు కళాశాల విద్యా శాఖ కృషి చేస్తోంది. వారి కృషి ఫలితంగా ఏటా నిర్వహిస్తున్న ‘జిజ్ఞాస’ పోటీల్లో పలువురు ప్రతిభ చాటుతున్నారు. -
పరిశీలిస్తారు.. నివేదిస్తారు..
[ 27-04-2024]
ప్రజాస్వామ్యంలో ఓటుకు ఉన్న ప్రాధాన్యం మనందరికీ తెలిసిందే. ఎవరికీ ఎక్కువ ఓట్లు పడితే వారే పాలకపక్షాలుగా గద్దెనెక్కవచ్చు. నిర్ణీత వ్యవధిలో నిర్వహించే ఎన్నికల ప్రక్రియ సాఫీగా సాగాలి. -
ఇంటింటికీ ఓటరు చీటీలు
[ 27-04-2024]
పార్లమెంట్ ఎన్నికల నిర్వహణకు అధికార యంత్రాంగం సర్వం సిద్ధం చేస్తోంది. స్వేచ్ఛాయుతంగా ఓటు వేసేందుకు సకల సౌకర్యాలు కల్పించిన ఎన్నికల సంఘం.. ఓటర్లకు పోల్ చీటీలు పంపిణీ చేస్తోంది. -
ఉల్లంఘనులకు ముకుతాడు
[ 27-04-2024]
లోక్సభ ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించేందుకు జిల్లా అధికారులు పక్కా ప్రణాళికతో ముందుకు సాగుతున్నారు. అభ్యర్థుల నామపత్రాల స్వీకరణ గడువు ముగిసింది. ప్రచారాలు ఊపందుకుంటున్నాయి. -
భారాస అక్రమాలు బయటపడుతున్నాయి
[ 27-04-2024]
బీసీ బిడ్డ నీలం మధుకు సీఎం రేవంత్రెడ్డి టిక్కెట్ ఇచ్చారని.. ఇక గెలిపించుకోవాలని మంత్రి కొండా సురేఖ కోరారు. సిద్దిపేటలో కాంగ్రెస్ ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ, పార్టీ కార్యాలయంలో సమావేశం శుక్రవారం జరిగాయి. -
రాజీనామా పత్రం రాసి పెట్టుకో హరీశ్రావు: పొన్నం
[ 27-04-2024]
వచ్చే ఆగస్టు 15 నాటికి తమ పార్టీ రైతులకు రూ.2 లక్షల రుణమాఫీ చేసి తీరుతుందని, మాజీ ఆర్థిక మంత్రి తన్నీరు హరీశ్రావు ముందుగానే స్పీకర్ ఫార్మాట్లో రాజీనామా పత్రం రాసి పెట్టుకోవాలని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్గౌడ్ అన్నారు. -
53 ఆమోదం.. ఒకటి తిరస్కరణ
[ 27-04-2024]
మెదక్ లోక్సభ స్థానానికి దాఖలైన నామినేషన్లలో ఒక అభ్యర్థి నామపత్రాన్ని రిటర్నింగ్ అధికారి తిరస్కరించారు. మొత్తం 54 మంది అభ్యర్థులు 90 సెట్ల నామినేషన్లు దాఖలు చేశారు.
తాజా వార్తలు (Latest News)
-
ఈ చిట్టితల్లికి కష్టమొచ్చింది!
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (27/04/24)
-
విరాట్ - హార్దిక్కు నో ఛాన్స్.. ఈ లఖ్నవూ స్టార్కు ప్లేస్: భారత మాజీ క్రికెటర్
-
ఏడాదికి ‘రెండు సార్లు’ సీబీఎస్ఈ బోర్డు పరీక్షలు.. 2025 నుంచే!
-
అనుపమ ‘పరదా’.. అదితి ఆన్డ్యూటీ.. భూమీ భలే డ్రెస్సు!
-
బిగ్ సేవింగ్ డేస్ సేల్కు సిద్ధమైన ఫ్లిప్కార్ట్.. ఎప్పటినుంచంటే?