మేమున్నామని.. శిక్షణ తోడుందని..
పోలీసు కొలువు దక్కించుకునేందుకు ఆసక్తి కలిగిన యువత నిరంతరం తపిస్తుంది. అవకాశాన్ని అందిపుచ్చుకునేందుకు కఠోరంగా శ్రమిస్తుంది. అలాంటి వారికి పోలీసు శాఖ వెన్నుదన్నుగా నిలుస్తోంది.
సిద్దిపేటలో కొనసాగుతున్న పోలీసు మెయిన్స్ తరగతులు
తరగతి గదిలో శిక్షకుడు, అభ్యర్థులు
న్యూస్టుడే, సిద్దిపేట: పోలీసు కొలువు దక్కించుకునేందుకు ఆసక్తి కలిగిన యువత నిరంతరం తపిస్తుంది. అవకాశాన్ని అందిపుచ్చుకునేందుకు కఠోరంగా శ్రమిస్తుంది. అలాంటి వారికి పోలీసు శాఖ వెన్నుదన్నుగా నిలుస్తోంది. పోలీసు నియామకాలకు సంబంధించి ఎప్పుడు ప్రకటనలు వెలువడినా.. మేమున్నామంటూ అండగా ఉంటోంది. ఈ తరుణంలోనే రాష్ట్ర మంత్రి హరీశ్రావు సహకారంతో పోలీసు శాఖ నేతృత్వంలో ఎస్ఐ, కానిస్టేబుల్ ఉద్యోగార్థులకు ప్రాథమిక రాత, దేహదారుఢ్య పరీక్షలకు ఉచిత శిక్షణలు అందించారు. ఆయా వాటిల్లో అర్హత సాధించిన వారితో పాటు ఆసక్తి కలిగిన జిల్లాలోని యువతకు సిద్దిపేట బీజేఆర్ భవన్ కేంద్రంగా మెయిన్స్కు సన్నద్ధం చేస్తున్నారు. గత నెల 25న ప్రారంభమైన తరగతులు.. కొనసాగుతున్నాయి.
గతేడాది నుంచి ప్రారంభం
జిల్లాలో గత ఏడాది ఏప్రిల్ నుంచి శిక్షణలు మొదలయ్యాయి. అప్పట్లో 70 రోజుల పాటు ఎస్ఐ, కానిస్టేబుల్ ఉద్యోగార్థులకు సిద్దిపేట, రాజగోపాలపేట, గజ్వేల్లో ప్రిలిమినరీ (ప్రాథమిక రాత పరీక్ష)కి 1034 మందికి తర్ఫీదు ఇచ్చారు. అందులో దాదాపు 500 మంది అర్హత సాధించి.. రెండో దశదేహదారుఢ్య పరీక్షకు చేరారు. గత నవంబరులో సిద్దిపేట, గజ్వేల్, దుబ్బాక, చేర్యాల పట్టణాల్లో దేహ దారుఢ్య శిక్షణ అందించారు. 532 మంది సద్వినియోగం చేసుకున్నారు. వ్యాయామోపాధ్యాయుల సహకారం సైతం తీసుకుంది. పోలీసు కమిషనర్ శ్వేత సహా వివిధ స్థాయిల్లో పోలీసు అధికారులు పర్యవేక్షించారు. ప్రస్తుతం మెయిన్స్కు మొత్తం 45 రోజుల పాటు తరగతులు కొనసాగనున్నాయి. జిల్లాకు చెందిన అభ్యర్థులు 200 మంది హాజరవుతున్నారు. అందులో 45 శాతం మహిళలు ఉండటం విశేషం. ఉదయం 9 నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఉన్నాయి. మధ్యాహ్నం భోజనం, అధ్యయన సామగ్రి అందించనున్నారు.
నిపుణులతో బోధన
ఎస్ఐ, కానిస్టేబుళ్ల స్థాయి తుది రాత పరీక్ష (మెయిన్స్)కు సిద్ధం చేస్తూ.. రోజువారీగా స్లిప్టెస్టులు, వారానికోమారు గ్రాండ్ టెస్టు నిర్వహణకు ప్రణాళికలు రూపొందించారు. తెలుగు, ఆంగ్లం, ఆర్థమేటిక్-రీజనింగ్, తెలంగాణ, భారతదేశ చరిత్ర, సంస్కృతి, తెలంగాణ ఉద్యమం, రాజనీతి, భౌగోళిక, అర్థశాస్త్రం, కరెంట్ అఫైర్స్, గణితం, ఎథిక్స్, తదితర అంశాలపై బోధిస్తున్నారు. భాగ్యకిరణ్ ఇన్స్టిట్యూట్కు చెందిన విషయ నిపుణులతో బోధన అందిస్తున్నారు. ఎస్ఐ ఉద్యోగార్థులు 59 మందికి సోమవారం నుంచి అదనపు సమయాన్ని కేటాయించనున్నారు.
నమ్మకంతో సాధిస్తా
-రజిత, మర్పడ్గ (కొండపాక)
2018లో పీజీ పూర్తయింది. ప్రసుత్తం ఎస్ఐ, కానిస్టేబుల్ ఉద్యోగాలకు సిద్ధమవుతున్నా. మొదటి నుంచి ఉచిత శిక్షణకు హాజరవుతున్నా. గతంలో కానిస్టేబుల్ ఉద్యోగానికి ప్రయత్నం చేసి విఫలమయ్యా. ఈసారి కచ్చితంగా సాధిస్తాననే నమ్మకం ఉంది. తరగతులు ఆసక్తిగా సాగుతున్నాయి. ఈ స్థాయి లో శిక్షణ పొందాలంటే రూ.40 వేల వరకు ఖర్చయ్యేది. ఇక్కడ ఉచితంగా అందిస్తున్నందుకు కృతజ్ఞతలు.
ప్రణాళికతో సిద్ధమవుతున్నా
- తిరుపతి, సిద్దిపేట
మాది పట్టణ పరిధి గాడిచెర్లపల్లి ప్రాంతం. ఇంటర్ పూర్తయింది. 2018 సంవత్సరంలోనూ ఒకసారి ప్రయత్నం చేశా. పరీక్షల సమయంలో ఆరోగ్యం సరిగా లేక సాధించలేకపోయా. తరువాత పార్ట్టైం ఉద్యోగాలు చేశా. గత ఏడాది మొదలైన ఉచిత శిక్షణలకు మొదటి నుంచి హాజరవుతున్నా. తప్పక ఉద్యోగం సాధిస్తాననే నమ్మకం ఉంది. ప్రణాళికతో సిద్ధమవుతున్నా.
క్రమశిక్షణాయుతంగా తరగతులు
- శ్వేత, పోలీసు కమిషనర్
క్రమశిక్షణాయుత వాతావరణంలో తరగతులు కొనసాగుతున్నాయి. ఎస్ఐ శిక్షణార్థులకు మరింత అదనపు సమయం కేటాయిస్తాం. అభ్యర్థులందరికీ పోలీసు ఉద్యోగంతో పాటు గ్రూప్స్నకు ఉపయోగపడేలా తర్ఫీదు అందిస్తున్నాం. ఇప్పటికే ఎంతో మందిని అధిగమిస్తూ రెండు మెట్లు ఎక్కిన యువతీ, యువకులు.. తుది మెట్టు ఎక్కాలనే సంకల్పంతో శ్రమించాలి. చక్కటి అవకాశంగా భావిస్తూ సిద్ధం కావాలి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అభివృద్ధికి భరోసా.. గెలుపునకు దిశానిర్దేశం
[ 27-04-2024]
మెదక్ జిల్లా పెద్దశంకరంపేటలో నిర్వహించిన కాంగ్రెస్ జనజాతర సభలో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి నారాయణఖేడ్ నియోజకవర్గ అభివృద్ధికి భరోసా కల్పించారు. రానున్న లోకసభ ఎన్నికల్లో జహీరాబాద్ ఎంపీగా సురేష్షెట్కార్ను లక్ష మెజారిటీతో గెలిపించేందుకు అనుసరించాల్సిన వ్యూహంపై కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. -
రెండో విడత ర్యాండమైజేషన్ పూర్తి
[ 27-04-2024]
లోక్సభ ఎన్నికల పోలింగ్ సిబ్బంది రెండో విడత ర్యాండమైజేషన్ పూర్తి చేసినట్లు ఎన్నికల రిటర్నింగ్ అధికారి రాహుల్ రాజ్ తెలిపారు. శుక్రవారం స్థానిక కలెక్టరేట్లో మెదక్ పార్లమెంట్ ఎన్నికల సాధారణ పరిశీలకులు సమీర్ మాధవ్ కుర్కోటి పర్యవేక్షణలో ఈ ప్రక్రియ నిర్వహించారు. -
‘రాజీనామాలతో కొత్త నాటకం’
[ 27-04-2024]
రాజీనామాల పేరుతో మాజీ మంత్రి హరీశ్రావు, ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి కొత్త నాటకానికి తెరలేపారని భాజపా ఎంపీ అభ్యర్థి రఘునందన్ రావు అన్నారు. ఇద్దరూ రాజీనామాలు చేసేవారు కాదు, పనిచేసే వారు కాదని విమర్శించారు. -
సగం కట్టి.. వదిలిపెట్టి
[ 27-04-2024]
నియోజకవర్గ, డివిజన్ కేంద్రమైన నర్సాపూర్ పురపాలికలో సమీకృత మార్కెట్ నిర్మాణ పనులు ఏడాదిగా అసంపూర్తిగా దర్శనమిస్తున్నాయి. ప్రజలకు కనీస మౌలిక వసతులు కల్పించడమే లక్ష్యంగా పురపాలికల్లో సమీకృత మార్కెట్ల నిర్మాణానికి గత ప్రభుత్వం పూనుకుంది. -
విధుల్లో నిర్లక్ష్యం తగదు
[ 27-04-2024]
విధుల నిర్వహణలో సిబ్బంది నిర్లక్ష్యం తగదని జిల్లా వైద్యాధికారి శ్రీరామ్ అన్నారు. శుక్రవారం ఆయన పెద్దశంకరంపేట పీహెచ్సీని సందర్శించారు. ఆస్పత్రి నిర్వహణ తీరు, ప్రసూతి వివరాలను పరిశీలించారు. -
విద్యార్థి అధ్యయనం.. విజ్ఞాన కౌశలం
[ 27-04-2024]
విద్యార్థిలో దాగిన విజ్ఞాన తృష్ణను వెలికితీసి.. నూతన ఆవిష్కరణలకు కళాశాల విద్యా శాఖ కృషి చేస్తోంది. వారి కృషి ఫలితంగా ఏటా నిర్వహిస్తున్న ‘జిజ్ఞాస’ పోటీల్లో పలువురు ప్రతిభ చాటుతున్నారు. -
పరిశీలిస్తారు.. నివేదిస్తారు..
[ 27-04-2024]
ప్రజాస్వామ్యంలో ఓటుకు ఉన్న ప్రాధాన్యం మనందరికీ తెలిసిందే. ఎవరికీ ఎక్కువ ఓట్లు పడితే వారే పాలకపక్షాలుగా గద్దెనెక్కవచ్చు. నిర్ణీత వ్యవధిలో నిర్వహించే ఎన్నికల ప్రక్రియ సాఫీగా సాగాలి. -
ఇంటింటికీ ఓటరు చీటీలు
[ 27-04-2024]
పార్లమెంట్ ఎన్నికల నిర్వహణకు అధికార యంత్రాంగం సర్వం సిద్ధం చేస్తోంది. స్వేచ్ఛాయుతంగా ఓటు వేసేందుకు సకల సౌకర్యాలు కల్పించిన ఎన్నికల సంఘం.. ఓటర్లకు పోల్ చీటీలు పంపిణీ చేస్తోంది. -
ఉల్లంఘనులకు ముకుతాడు
[ 27-04-2024]
లోక్సభ ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించేందుకు జిల్లా అధికారులు పక్కా ప్రణాళికతో ముందుకు సాగుతున్నారు. అభ్యర్థుల నామపత్రాల స్వీకరణ గడువు ముగిసింది. ప్రచారాలు ఊపందుకుంటున్నాయి. -
భారాస అక్రమాలు బయటపడుతున్నాయి
[ 27-04-2024]
బీసీ బిడ్డ నీలం మధుకు సీఎం రేవంత్రెడ్డి టిక్కెట్ ఇచ్చారని.. ఇక గెలిపించుకోవాలని మంత్రి కొండా సురేఖ కోరారు. సిద్దిపేటలో కాంగ్రెస్ ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ, పార్టీ కార్యాలయంలో సమావేశం శుక్రవారం జరిగాయి. -
రాజీనామా పత్రం రాసి పెట్టుకో హరీశ్రావు: పొన్నం
[ 27-04-2024]
వచ్చే ఆగస్టు 15 నాటికి తమ పార్టీ రైతులకు రూ.2 లక్షల రుణమాఫీ చేసి తీరుతుందని, మాజీ ఆర్థిక మంత్రి తన్నీరు హరీశ్రావు ముందుగానే స్పీకర్ ఫార్మాట్లో రాజీనామా పత్రం రాసి పెట్టుకోవాలని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్గౌడ్ అన్నారు. -
53 ఆమోదం.. ఒకటి తిరస్కరణ
[ 27-04-2024]
మెదక్ లోక్సభ స్థానానికి దాఖలైన నామినేషన్లలో ఒక అభ్యర్థి నామపత్రాన్ని రిటర్నింగ్ అధికారి తిరస్కరించారు. మొత్తం 54 మంది అభ్యర్థులు 90 సెట్ల నామినేషన్లు దాఖలు చేశారు.
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (27/04/24)
-
విరాట్ - హార్దిక్కు నో ఛాన్స్.. ఈ లఖ్నవూ స్టార్కు ప్లేస్: భారత మాజీ క్రికెటర్
-
ఏడాదికి ‘రెండు సార్లు’ సీబీఎస్ఈ బోర్డు పరీక్షలు.. 2025 నుంచే!
-
అనుపమ ‘పరదా’.. అదితి ఆన్డ్యూటీ.. భూమీ భలే డ్రెస్సు!
-
బిగ్ సేవింగ్ డేస్ సేల్కు సిద్ధమైన ఫ్లిప్కార్ట్.. ఎప్పటినుంచంటే?
-
‘పుష్ప’ కేశవ రోల్కు సుహాస్ని అనుకున్నాం.. కానీ!: సుకుమార్