ఆవిష్కరణల కేంద్రం... ఐఐటీ హైదరాబాద్ ప్రాంగణం!
ఎప్పటికప్పుడు విద్యా, పరిశోధన, ఆవిష్కరణ రంగాల్లో నాణ్యతను పెంచుకుంటూ ఐఐటీ హైదరాబాద్ దూసుకుపోతోంది. ఈనెల 5న నేషనల్ ఇన్స్టిట్యూషనల్ ర్యాంకింగ్ ఫ్రేమ్వర్క్(ఎన్ఐఆర్ఎఫ్) ప్రకటించిన ర్యాంకింగ్స్లో మరోసారి సత్తా చాటింది.
ఈనాడు, సంగారెడ్డి: ఎప్పటికప్పుడు విద్యా, పరిశోధన, ఆవిష్కరణ రంగాల్లో నాణ్యతను పెంచుకుంటూ ఐఐటీ హైదరాబాద్ దూసుకుపోతోంది. ఈనెల 5న నేషనల్ ఇన్స్టిట్యూషనల్ ర్యాంకింగ్ ఫ్రేమ్వర్క్(ఎన్ఐఆర్ఎఫ్) ప్రకటించిన ర్యాంకింగ్స్లో మరోసారి సత్తా చాటింది. ఇంజినీరింగ్ విద్యలో జాతీయ స్థాయిలో ఎనిమిదో స్థానంలో నిలిచింది. గతేడాది తొమ్మిదో స్థానంలో ఉంది. అన్ని విభాగాల్లో కలిపి 14వ స్థానంలో కొనసాగుతోంది. ఆవిష్కరణల రంగానికి సంబంధించి ఏకంగా మూడో ర్యాంకును దక్కించుకుంది. 2021లో అటల్ ర్యాంకింగ్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ ఆన్ ఇన్నోవేషన్ ఆచీవ్మెంట్స్లో ఐఐటీ హైదరాబాద్ 7వ స్థానంలో నిలిచింది. ఈసారి ఎన్ఐఆర్ఎఫ్ ప్రకటించిన ర్యాంకింగ్స్లో మూడో స్థానానికి చేరడం గమనార్హం. జాతీయ స్థాయిలో విద్యా, పరిశోధన సంస్థల్లో ప్రమాణాలను పెంచేలా కేంద్ర విద్యామంత్రిత్వశాఖ ర్యాంకులను ప్రకటిస్తోంది. తాజాగా ప్రకటించిన ర్యాంకుల్లో ఐఐటీ హైదరాబాద్ మెరుగైన స్థానాల్లో నిలిచిందని ఈ మేరకు ఐఐటీ వర్గాలు సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నాయి. పరిశోధన విభాగానికి సంబంధించి ఐఐటీ హైదరాబాద్ గతేడాది 12వస్థానంలో ఉండగా.. ఈసారి 14వస్థానంతో సరిపెట్టుకుంది. ప్రతిభావంతులైన విద్యార్థులు, ఫ్యాకల్టీని ఆకర్షిస్తూ తమ విద్యాసంస్థ వారందరికీ కలల గమ్యంగా మారిందని ఐఐటీ హైదరాబాద్ డైరెక్టర్ ఆచార్య బీఎస్మూర్తి ఈ సందర్భంగా అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. మానవాళికి మరిన్ని మెరుగైన సేవలు అందేలా చూసేందుకు ఇక్కడ ఆవిష్కరణలు సాగుతున్నాయన్నారు. భవిష్యత్తులోనూ మరిన్ని కొత్త లక్ష్యాలను నిర్దేశించుకొని.. వాటిని సాధించేందుకు కృషి చేస్తామన్నారు. ఆలోచనలకు ఆవిష్కరణల రూపం ఇవ్వడం నుంచి ఉత్పత్తులుగా వాటిని మార్కెట్లోకి తెచ్చేందుకు అవసరమైన అన్ని సదుపాయాలు ఇక్కడ ఉన్నాయని ఇన్నోవేషన్స్ విభాగం డీన్ ఆచార్య ఎస్.సూర్యకుమార్ తెలిపారు. ఆవిష్కరణల విభాగంలో మూడో స్థానంలో నిలవడం చాలా సంతోషంగా ఉందన్నారు. ఫ్యాకల్టీ-విద్యార్థుల నిష్పత్తి, ఆర్థిక వనరుల సద్వినియోగం, పేటెంట్స్.. ఈ అంశాలన్నీ దేశంలోనే తొలి పది ఇంజినీరింగ్ విద్యాసంస్థల్లో ఐఐటీ హైదరాబాద్ను ఒకటిగా నిలిపేందుకు తోడ్పడ్డాయని డాక్టర్ సంతోష్కుమార్ రావి అన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అభివృద్ధికి భరోసా.. గెలుపునకు దిశానిర్దేశం
[ 27-04-2024]
మెదక్ జిల్లా పెద్దశంకరంపేటలో నిర్వహించిన కాంగ్రెస్ జనజాతర సభలో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి నారాయణఖేడ్ నియోజకవర్గ అభివృద్ధికి భరోసా కల్పించారు. రానున్న లోకసభ ఎన్నికల్లో జహీరాబాద్ ఎంపీగా సురేష్షెట్కార్ను లక్ష మెజారిటీతో గెలిపించేందుకు అనుసరించాల్సిన వ్యూహంపై కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. -
రెండో విడత ర్యాండమైజేషన్ పూర్తి
[ 27-04-2024]
లోక్సభ ఎన్నికల పోలింగ్ సిబ్బంది రెండో విడత ర్యాండమైజేషన్ పూర్తి చేసినట్లు ఎన్నికల రిటర్నింగ్ అధికారి రాహుల్ రాజ్ తెలిపారు. శుక్రవారం స్థానిక కలెక్టరేట్లో మెదక్ పార్లమెంట్ ఎన్నికల సాధారణ పరిశీలకులు సమీర్ మాధవ్ కుర్కోటి పర్యవేక్షణలో ఈ ప్రక్రియ నిర్వహించారు. -
‘రాజీనామాలతో కొత్త నాటకం’
[ 27-04-2024]
రాజీనామాల పేరుతో మాజీ మంత్రి హరీశ్రావు, ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి కొత్త నాటకానికి తెరలేపారని భాజపా ఎంపీ అభ్యర్థి రఘునందన్ రావు అన్నారు. ఇద్దరూ రాజీనామాలు చేసేవారు కాదు, పనిచేసే వారు కాదని విమర్శించారు. -
సగం కట్టి.. వదిలిపెట్టి
[ 27-04-2024]
నియోజకవర్గ, డివిజన్ కేంద్రమైన నర్సాపూర్ పురపాలికలో సమీకృత మార్కెట్ నిర్మాణ పనులు ఏడాదిగా అసంపూర్తిగా దర్శనమిస్తున్నాయి. ప్రజలకు కనీస మౌలిక వసతులు కల్పించడమే లక్ష్యంగా పురపాలికల్లో సమీకృత మార్కెట్ల నిర్మాణానికి గత ప్రభుత్వం పూనుకుంది. -
విధుల్లో నిర్లక్ష్యం తగదు
[ 27-04-2024]
విధుల నిర్వహణలో సిబ్బంది నిర్లక్ష్యం తగదని జిల్లా వైద్యాధికారి శ్రీరామ్ అన్నారు. శుక్రవారం ఆయన పెద్దశంకరంపేట పీహెచ్సీని సందర్శించారు. ఆస్పత్రి నిర్వహణ తీరు, ప్రసూతి వివరాలను పరిశీలించారు. -
విద్యార్థి అధ్యయనం.. విజ్ఞాన కౌశలం
[ 27-04-2024]
విద్యార్థిలో దాగిన విజ్ఞాన తృష్ణను వెలికితీసి.. నూతన ఆవిష్కరణలకు కళాశాల విద్యా శాఖ కృషి చేస్తోంది. వారి కృషి ఫలితంగా ఏటా నిర్వహిస్తున్న ‘జిజ్ఞాస’ పోటీల్లో పలువురు ప్రతిభ చాటుతున్నారు. -
పరిశీలిస్తారు.. నివేదిస్తారు..
[ 27-04-2024]
ప్రజాస్వామ్యంలో ఓటుకు ఉన్న ప్రాధాన్యం మనందరికీ తెలిసిందే. ఎవరికీ ఎక్కువ ఓట్లు పడితే వారే పాలకపక్షాలుగా గద్దెనెక్కవచ్చు. నిర్ణీత వ్యవధిలో నిర్వహించే ఎన్నికల ప్రక్రియ సాఫీగా సాగాలి. -
ఇంటింటికీ ఓటరు చీటీలు
[ 27-04-2024]
పార్లమెంట్ ఎన్నికల నిర్వహణకు అధికార యంత్రాంగం సర్వం సిద్ధం చేస్తోంది. స్వేచ్ఛాయుతంగా ఓటు వేసేందుకు సకల సౌకర్యాలు కల్పించిన ఎన్నికల సంఘం.. ఓటర్లకు పోల్ చీటీలు పంపిణీ చేస్తోంది. -
ఉల్లంఘనులకు ముకుతాడు
[ 27-04-2024]
లోక్సభ ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించేందుకు జిల్లా అధికారులు పక్కా ప్రణాళికతో ముందుకు సాగుతున్నారు. అభ్యర్థుల నామపత్రాల స్వీకరణ గడువు ముగిసింది. ప్రచారాలు ఊపందుకుంటున్నాయి. -
భారాస అక్రమాలు బయటపడుతున్నాయి
[ 27-04-2024]
బీసీ బిడ్డ నీలం మధుకు సీఎం రేవంత్రెడ్డి టిక్కెట్ ఇచ్చారని.. ఇక గెలిపించుకోవాలని మంత్రి కొండా సురేఖ కోరారు. సిద్దిపేటలో కాంగ్రెస్ ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ, పార్టీ కార్యాలయంలో సమావేశం శుక్రవారం జరిగాయి. -
రాజీనామా పత్రం రాసి పెట్టుకో హరీశ్రావు: పొన్నం
[ 27-04-2024]
వచ్చే ఆగస్టు 15 నాటికి తమ పార్టీ రైతులకు రూ.2 లక్షల రుణమాఫీ చేసి తీరుతుందని, మాజీ ఆర్థిక మంత్రి తన్నీరు హరీశ్రావు ముందుగానే స్పీకర్ ఫార్మాట్లో రాజీనామా పత్రం రాసి పెట్టుకోవాలని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్గౌడ్ అన్నారు. -
53 ఆమోదం.. ఒకటి తిరస్కరణ
[ 27-04-2024]
మెదక్ లోక్సభ స్థానానికి దాఖలైన నామినేషన్లలో ఒక అభ్యర్థి నామపత్రాన్ని రిటర్నింగ్ అధికారి తిరస్కరించారు. మొత్తం 54 మంది అభ్యర్థులు 90 సెట్ల నామినేషన్లు దాఖలు చేశారు.
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (27/04/24)
-
విరాట్ - హార్దిక్కు నో ఛాన్స్.. ఈ లఖ్నవూ స్టార్కు ప్లేస్: భారత మాజీ క్రికెటర్
-
ఏడాదికి ‘రెండు సార్లు’ సీబీఎస్ఈ బోర్డు పరీక్షలు.. 2025 నుంచే!
-
అనుపమ ‘పరదా’.. అదితి ఆన్డ్యూటీ.. భూమీ భలే డ్రెస్సు!
-
బిగ్ సేవింగ్ డేస్ సేల్కు సిద్ధమైన ఫ్లిప్కార్ట్.. ఎప్పటినుంచంటే?
-
‘పుష్ప’ కేశవ రోల్కు సుహాస్ని అనుకున్నాం.. కానీ!: సుకుమార్