ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టాలి
మెదక్ పార్లమెంట్ స్థానంలో భారాస అభ్యర్థి గెలుపునకు ప్రతి కార్యకర్త కృషి చేయాలని పార్టీ జిల్లా అధ్యక్షురాలు, మాజీ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి అన్నారు.
పాపన్నపేట, న్యూస్టుడే: మెదక్ పార్లమెంట్ స్థానంలో భారాస అభ్యర్థి గెలుపునకు ప్రతి కార్యకర్త కృషి చేయాలని పార్టీ జిల్లా అధ్యక్షురాలు, మాజీ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి అన్నారు. సోమవారం యూసుఫ్పేటలో జరిగిన పార్టీ బూత్ స్థాయి ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆమె మాట్లాడారు. కాంగ్రెస్ పాలనా వైఫల్యాలను ప్రజలకు తెలిసేలా ఎండగట్టాలన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామీల్లో నెరవేర్చని వాటిని ప్రజలకు అర్థమయ్యేలా వివరించాలన్నారు. ప్రతి కార్యకర్త సైనికుడిలా పనిచేసి పార్టీ అభ్యర్థి గెలుపునకు కృషి చేయాలన్నారు. ప్రజాశ్రేయస్సు కోసం రాజకీయాల్లోకి వచ్చిన వెంకట్రామిరెడ్డిని గెలిపించాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. మాజీ ఎమ్మెల్యే శశిధర్ రెడ్డి, పార్టీ మండలాధ్యక్షుడు విష్ణువర్ధన్ రెడ్డి, నాయకులు జగన్, శ్రీనివాస్ రెడ్డి, మల్లేశం, శ్రీనాథ్ రావు, సాయిలు, అనిల్ తదితరులున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.