పూత రాలి.. తెగుళ్లు పెరిగి
మామిడికి ఏటా తెగుళ్ల బెడద పట్టిపీడిస్తోంది. నవంబర్, డిసెంబర్లో చలి తీవ్రత, తేనె మంచు, బూడిద, నల్లతామర తెగుళ్ల సమస్య ఉంటోంది.
తగ్గిన మామిడి దిగుబడి
మెదక్ మండల పరిధిలో కాపులేని మామిడి తోట
మెదక్ టౌన్, న్యూస్టుడే: మామిడికి ఏటా తెగుళ్ల బెడద పట్టిపీడిస్తోంది. నవంబర్, డిసెంబర్లో చలి తీవ్రత, తేనె మంచు, బూడిద, నల్లతామర తెగుళ్ల సమస్య ఉంటోంది. దీంతో ఈసారి మామిడి దిగుబడి గణనీయంగా తగ్గిపోయింది. దీనికి తోడు దళారుల బెడద రైతులను వేధిస్తోంది. అందువల్ల సాగు రైతులతో పాటు కౌలుదారులు రూ.లక్షల్లో నష్టపోతున్నారు. మొదటిదశ పూతకు సంబంధించిన కాయలు తెంపడం కొనసాగుతోంది. మలి విడత కాయలను మరో పక్షం రోజుల్లో కోయనున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వపరంగా మామిడి కొనుగోలు చేపట్టి దళారుల నుంచి నష్టం రాకుండా చూడాలని రైతులు సంబంధిత అధికారులను, ప్రభుత్వాన్ని కోరుతున్నారు.
జిల్లా వ్యాప్తంగా 2500-3000 ఎకరాల్లో మామిడి తోటలు సాగవుతున్నాయి. సాగులో మొదటి దశలో వివిధ తెగుళ్లతో కొంతమేర పూత, పిందెలు రాలిపోయాయి. వాతావరణ పరిస్థితులను తట్టుకొని నిలిచిన పూతకు సంబంధించి రైతులు ముందు జాగ్రత్తలు తీసుకోవడంతో కొంతమేర దిగుబడులు వచ్చాయి. మొదటిదశ పూత ద్వారా కాసిన కాయలు ప్రస్తుతం తెంపుతున్నారు. ఇంకో వారం, పది రోజుల్లో ఇవి పూర్తికానున్నాయి. రెండో దశ పూతలో తెగుళ్లు తట్టుకొని దాదాపు 60 శాతం నిలవడంతో ప్రస్తుతం వాటి కాయలు ఉన్నాయి. ఇవికూడా మరో 15 రోజుల్లో తెంపనున్నారు.
దళారుల ఇష్టారాజ్యం
ప్రస్తుతం మార్కెట్లో మామిడి కిలోకు రూ.80-90 పలుకుతోంది. జిల్లాలో తక్కువ విస్తీర్ణంలో సాగవుతున్న పంట కావడంతో ఏటా హైదరాబాద్తో పాటు ఇతర రాష్ట్రాల నుంచి దిగుమతి చేసుకుంటారు. కానీ ఈ ఏడాది కర్ణాటక, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో సైతం దిగుబడులు తక్కువగా ఉండడంతో ఇప్పట్లో ధరలు తగ్గే అవకాశం లేదు. మరోవైపు మామిడి రైతులకు దళారుల బెడద తప్పడం లేదు. వీరు నిర్ణయించిన ధరకే విక్రయించాలి. లేకపోతే కొనుగోలు చేసేవారు లేకుండా పోతారని రైతులు వాపోతున్నారు.
రూ.20 లక్షల పెట్టుబడి పెట్టాం
- సాయిలు, కౌలు రైతు, వ్యాపారి
గత 15 ఏళ్ల నుంచి పండ్ల వ్యాపారం చేస్తున్నాను. రెండేళ్ల నుంచి పలు రకాల తెగుళ్ల కారణంగా మామిడి దిగుబడి తగ్గింది. ఈ ఏడాది అయినా ఆశించిన స్థాయిలో దిగుబడి వస్తుందని మెదక్-కామారెడ్డి జిల్లాలో రూ.20 లక్షలు పెట్టుబడి పెట్టి 40 ఎకరాల మామిడి తోటలను కౌలుకు తీసుకున్నాం. కానీ తేనె మంచు తెగుళ్ల వల్ల పూత రాలిపోయి కాత తగ్గింది. ఇప్పుడే కోతలు ప్రారంభించగా, ఆశించిన స్థాయిలో దిగుబడి రావడం లేదు. ఈ ఏడాది సైతం నష్టపోయే అవకాశాలు ఉన్నాయి.
అవగాహన కల్పించాం
- నర్సయ్య, జిల్లా ఉద్యానశాఖ అధికారి
తెగుళ్లు పూతను తినేస్తున్న విషయం తెలియగానే పలు మామిడి తోటలను సందర్శించి రైతులకు తగు సూచనలు చేశాం. పూత దశలో వచ్చే తెగుళ్ల నివారణకు ఉద్యానశాఖ అధికారులు చెప్పే సూచనలు పాటించాలి. సాధారణంగా పూసిన పూతలో 90శాతం రాలిపోగా మిగిలిన 10శాతమే కాయలు కాస్తాయి. కానీ ఈ ఏడాది కేవలం 2శాతం పూత మాత్రమే మిగలడంతో దిగుబడి తగ్గింది. జిల్లా వ్యాప్తంగా 90 వేల టన్నుల దిగుబడి వచ్చే అవకాశం ఉంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఇక స్థానిక సమరం
[ 18-05-2024]
మరో ఎన్నికల సందడి రానుంది. పార్లమెంట్ ఎన్నికలు పూర్తికావడంతో పరిపాలనపై దృష్టి సారించనున్న రాష్ట్ర ప్రభుత్వం.. స్థానిక సంస్థలకు ఎన్నికలు నిర్వహించేందుకు మొగ్గుచూపుతోంది. -
కొనుగోళ్లలో జాప్యంపై కర్షకుల కన్నెర్ర
[ 18-05-2024]
ధాన్యం కొనుగోలులో జాప్యాన్ని నిరసిస్తూ మండల పరిధిలోని మిన్పూర్ గ్రామ రైతులు శుక్రవారం మెదక్-బోడ్మట్పల్లి రహదారిపై ఆందోళనకు దిగారు. -
సొంతింటి కల..నెరవేరేనా?
[ 18-05-2024]
నియోజకవర్గ, డివిజన్ కేంద్రంలో నిర్మించిన కొన్ని ఇళ్ల పనులు కొసరు పనులతో నిలిచిపోగా, మరికొన్ని వివిధ దశల్లో ఉన్నాయి. -
భారాస అభ్యర్థి వెంకట్రామిరెడ్డిని అనర్హుడిగా ప్రకటించండి
[ 18-05-2024]
మెదక్ లోక్సభ నియోజకవర్గం భారాస అభ్యర్థి పి.వెంకట్రామిరెడ్డిని అనర్హుడిగా ప్రకటించాలని భాజపా మెదక్ అభ్యర్థి ఎం.రఘునందన్రావు శుక్రవారం రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి వికాస్రాజ్కు ఫిర్యాదు చేశారు. -
ఉపాధి కూలీలకు ఊరట
[ 18-05-2024]
ఈ ఏడాది వేసవిలో ఎండలు మండిపోతున్నాయి. గతంలో ఎన్నడూ లేనంతగా ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. -
ఒక్క రూపాయైనా జమ కాలేదు
[ 18-05-2024]
జిల్లావ్యాప్తంగా యాసంగిలో రైతులు ఉత్సాహంగా జొన్న పంట సాగు చేశారు. దిగుబడులు చేతికొస్తున్నాయి. -
శిథిల భవనాలు.. కానరాని చర్యలు
[ 18-05-2024]
ప్రభుత్వ శాఖల మధ్య సమన్వయలోపం జనం ప్రాణాలను బలిగొంటోంది. -
పల్లెల్లో మొదలైన సందడి
[ 18-05-2024]
లోక్సభ ఎన్నికలు ముగిశాయి. ఇక గ్రామ పంచాయతీ ఎన్నికలు నిర్వహించనున్నారా..? అనే ప్రశ్నకు అవుననే సంకేతాలు వస్తున్నాయి. -
గుర్తించని జోన్లు.. ట్రాఫిక్ ఇక్కట్లు
[ 18-05-2024]
పట్టణాల్లో వ్యాపార జోన్లు అటకెక్కాయి. వ్యాపారాలు రహదారుల వెంట కాకుండా.. పురపాలక సంఘాలు ఏర్పాటు చేసిన జోన్లలో నిర్వహించుకునేలా ప్రణాళికలు రూపొంచడంలో యంత్రాంగం విఫలమయిందనే విమర్శలొస్తున్నాయి. -
కౌంటింగ్ కేంద్రాల్లో మూడంచెల భద్రత
[ 18-05-2024]
కౌంటింగ్ కేంద్రాల్లో మూడంచెల భద్రత ఏర్పాటు చేశామని రాష్ట్ర అదనపు ఎన్నికల కమిషనర్ లోకేష్కుమార్ అన్నారు. -
వాన రాకతో ధాన్యం ఆరక..
[ 18-05-2024]
వేసవికాలంలో జిల్లాలో వాతావరణంలో విభిన్న పరిస్థితులు నెలకొన్నాయి. -
నచ్చిన కోర్సు ఎంచుకోండి దోస్త్
[ 18-05-2024]
ఇంటర్ పూర్తిచేసిన విద్యార్థులకు ఎన్నో అవకాశాలు ఉంటాయి. డిగ్రీ కోర్సుల వైపు చూసే వారే ఎక్కువ మందే ఉంటారు. -
నిర్లక్ష్యం.. ప్రాణాంతకం
[ 18-05-2024]
ప్రజాప్రయోజనంతో చేపట్టే అభివృద్ధి పనుల పర్యవేక్షణ లోపించి ప్రాణాంతకంగా మారుతున్నాయి. -
నాన్నను కొట్టి.. పశ్చాత్తాపం చెంది..
[ 18-05-2024]
ఆవేశంలో అకారణంగా నాన్నను కొట్టి.. అనంతరం తండ్రి తప్పేమీ లేదని తెలుసుకున్న కుమారుడు పశ్చాత్తాపంతో ఆవేదనకు గురై ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
తాజా వార్తలు (Latest News)
-
కియా కార్లు అద్దెకూ తీసుకోవచ్చు.. హైదరాబాద్ సహా 6 నగరాల్లో
-
చివరి మ్యాచ్లో ముంబయిపై లఖ్నవూ గెలుపు.. టోర్నీ నుంచి నిష్క్రమించిన ఇరు జట్లు
-
హైదరాబాద్ మెట్రో రైలు సమయం పొడిగింపు
-
మరో 30 ఏళ్లకు మనం అంగారకుడి సిటీలో: ఎలాన్ మస్క్ ఆసక్తికర పోస్ట్
-
గాల్లో ఉండగా విమానం ‘ఏసీ’లో మంటలు.. అత్యవసర ల్యాండింగ్!
-
48 గంటల్లో పోలింగ్ శాతాలపై.. ఈసీ స్పందన కోరిన సుప్రీంకోర్టు